అమ్మోనియం గ్యాస్ లీకై నలుగురికి అస్వస్థత
ఒంగోలు: ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం మున్నంగి సీఫుడ్స్లో బుధవారం తెల్లవారుజామున అమ్మోనియం గ్యాస్ లీకు అయింది. ఈ నేపథ్యంలో నలుగురు సిబ్బంది తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. దీంతో సహచర సిబ్బంది వెంటనే అప్రమత్తమై... వారిని ఒంగోలు నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.