ట్రావెల్స్ బస్సు బోల్తా: ఇద్దరికి గాయాలు
హైదరాబాద్: శంషాబాద్లో మదనపల్లి సమీపంలోని బెంగుళూరు వెళ్లే జాతీయరహదారిపై మురళీకృష్ణ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. ట్రావెల్స్ బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు.
చిత్తూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. బస్సు నంబర్ ఏపీ 28డీ 4844 గా పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.