సూచీ కోసం కొత్త పోస్టు సృష్టి
నేపిడా: ప్రజాస్వామ్య ఉద్యమకారిణి ఆంగ్సాన్ సూచీ కోసం కొత్త పోస్టును సృష్టించింది మయన్మార్ పార్లమెంటు. ఆమెను ప్రభుత్వ సలహాదారుగా నియమించేందుకు ఉద్దేశించిన బిల్లును ఆ దేశ దిగువ సభ మంగళవారం ఆమోదించింది. ఈ బిల్లును గత వారం ఎగువసభ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ బిల్లు ద్వారా వివిధ మంత్రిత్వ శాఖలు, వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థలు, వ్యక్తులను సలహాదారుగా సూచీ కలవవచ్చు.