breaking news
Nation growth
-
సమస్యల్ని పరిష్కరించా విజయాలెన్నో సాధించా
న్యూయార్క్/వాషింగ్టన్: జో బైడెన్ ప్రభుత్వం వారసత్వంగా తనకు ఇచ్చిన సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించి దేశాన్ని అభివృద్ధిపథంలో ఉరకలెత్తిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. 2025 ఏడాది మరో రెండు వారాల్లో ముగుస్తున్న నేపథ్యంలో తన 11 నెలల పాలనపై ట్రంప్ 19 నిమిషాలపాటు గురువారం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తన విజయాల పరంపర ఇదేనంటూ పలు అంశాలను ప్రస్తావించారు. ‘‘ బైడెన్ తన పాలనలో ప్రపంచంలోనే అమెరికా సరిహద్దును అత్యంత దుర్భలంగా మార్చారు. నేను దుర్భేద్యంగా పటిష్టపరిచా. ఇలాంటి ఎన్నో సమస్యలతో అధ్వానస్థితిలో అమెరికా పరిపాలనా పగ్గాలను ఆయన నాకు వారసత్వంగా ఇచ్చారు. ఆ సమస్య లను నేను సమర్థవంతంగా సరిదిద్దు తున్నా. అమెరికాకు పూర్వవైభవం తీసుకొచ్చా. 10 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 8 ప్రధానమైన యుద్ధాలను నిలువరించా. ఇరాన్ నుంచి పొంచి ఉన్న అణుఉపద్రవాన్ని అడ్డుకున్నా. 3,000 సంవత్సరాల్లో సాధ్యంకాని పశ్చిమా సియాలో శాంతిని స్థాపించా. హమాస్–ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపేసి గాజాలో శాంతి కపోతాలను ఎగరేశా. భారత్–పాకిస్తాన్, థాయిలాండ్–కాంబోడియా, అర్మేనియా–అజర్బైజాన్, కొసొవో, సెర్బియా, ఇజ్రాయెల్, ఇరాన్, ఈజిప్ట్, ఇథియో పియా, రువాండా, కాంగోల మధ్య సమరాలు సమసిపో యేలా చేశా. బైడెన్ హయాంలోనే అమెరికాలోకి లక్షలాదిగా అక్రమ చొరబాట్లు ఎక్కువయ్యాయి. వీళ్ల కోసం బైడెన్ సర్కార్ అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్మును అనవసరంగా ఖర్చుచేసింది’’ అని ట్రంప్ ఆరోపించారు.వీళ్ల కారణంగానే ఇళ్ల అద్దెలు పెరిగాయి‘‘విదేశీ వలసదారులు పోటెత్తడంతోనే ఇళ్ల అద్దెలు పెరిగాయి. రెంటల్ మార్కెట్ 60 శాతం పెరగడానికి బైడెన్ ప్రభుత్వ తప్పుడు విధానాలే కారణం. టారిఫ్ అనే పదం నాకెంతో ఇష్టం. టారిఫ్ల బెత్తం చూపించి అమెరికాలోకి మళ్లీ కర్మాగారాలు క్యూ కట్టేలా చేశా. అమెరికాకు 18 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు రప్పించా. దీంతో ఉద్యోగాలు, జీతభత్యాల పెంపు, ఆర్థికాభివృద్ధి, కొత్త ఫ్యాక్టరీల ఆరంభాలు, పటిష్టమైన జాతీయ భద్రతను సాకారంచేశా. ఉత్పత్తకేంద్రాలను అమెరికాలో నెలకొల్పితే టారిఫ్లు ఉండబోవని కంపెనీలకు ఇప్పుడు అర్థమైంది. డ్రగ్స్ భూతాన్ని దూరంగా తరమికొట్టా. అందుకే భూ, సముద్రమార్గాల ద్వారా అమెరికాలోకి విదేశీ మత్తుపదార్థాల రాక 94 శాతం తగ్గింది. గత అర్థశతాబ్దకాలంలో తొలిసారిగా దేశం నుంచి అక్రమవలసదారులు తిరిగి వెళ్లిపోతున్నారు. వాళ్లు వదిలేసిన ఇళ్లు, ఉద్యోగాలు అమెరికన్లకు దక్కుతున్నాయి ’’ అని ట్రంప్ చెప్పుకొచ్చారు. -
బకాయిల పంచాయతీ!
కర్నూలు(రాజ్విహార్) : దేశాభివృద్ధికి గ్రామాలు పట్టుగొమ్మలు. అయితే ప్రస్తుతం పల్లెల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. విద్యుత్ బిల్లులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. బకాయిలు చెల్లించకపోవడంతో విద్యుత్ శాఖ షాక్ ఇస్తోంది. బకాయి అధికంగా ఉన్న గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. బిల్లులు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పైసా కూడా విదల్చడంలేదు. పైగా పంచాయతీల్లో విద్యుత్ బిల్లులు 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి చెల్లించుకోవాలని సూచించడం కొత్త సమస్యకు దారితీస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 13వ ఆర్థిక సంఘం నిధులను కరెంటు బిల్లులకు ఉపయోగించబోమని, బిల్లులకు రాష్ట్ర ప్రభుత్వమే నిధులు ఇవ్వాలని గ్రామ సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం, సర్పంచుల మధ్య నలుగుతున్న ఈ సమస్య కారణంగా బకాయిలు రూ. 92.49 కోట్లకు చేరాయి. ఇందులో రూ.6.70 కోట్లు ఆర్డబ్ల్యూఎస్ శాఖకు చెందినవి కాగా మిగిలినవి మేజర్, మైనర్ పంచాయతీలవి ఉన్నాయి. జిల్లాలోని 918 గ్రామాలకు విద్యుత్ సరఫరా జరుగుతోంది. వీటిలో ఏర్పాటు చేసిన వీధి దీపాలు (స్ట్రీల్ లైట్స్), వాటర్ వర్క్ (మంచినీటి సరఫరా)కు ఇచ్చిన కనెక్షన్లకు సంబంధించిన బిల్లులను పంచాయతీలే చెల్లించాలి. అయితే వీటికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు. కాని కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి కోసం విడుదల చేసే 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి బిల్లులు కట్టాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో సర్పంచులు ఎదురుతిరిగారు. ఆ నిధులు గ్రామాల అభివృద్ధికే ఉపయోగించుకుంటామని, కరెంటు బిల్లులకు సంబంధించి నిధులను రాష్ట్ర ప్రభుత్వమే విడుదల చేయాలని రాష్ట్ర సర్పంచుల సంఘం డిమాండ్ చేస్తోంది. నెలల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో పేరుకుపోతున్నాయి. బకాయిలపై విద్యుత్ శాఖ ఎనర్జీ సెక్రటరీ అజయ్జైన్ ఇటీవల నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో గ్రామ పంచాయతీల బకాయిలను తీవ్రంగా పరిగణించారు. బిల్లులు చెల్లించకపోతే సరఫరా నిలిపివేయాలని కింది స్థాయి అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా అత్యధిక బకాయిలు ఉన్న పంచాయతీలపై దృష్టి సారించారు. ఇప్పటికే కోడుమూరు మేజర్ గ్రామ పంచాయతీతోపాటు శ్రీశైలం, సున్నిపెంట, ఆదోని, నంద్యాల, డోన్ డివిజన్లలోని మరిన్ని గ్రామాల్లో వీధి దీపాలకు సరఫరా నిలిపివేశారు. -
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
ప్యారిస్, న్యూస్లైన్: కాంగ్రెస్తోనే దేశాభివృద్ధి, భద్రత సాధ్యమని ఉత్తర చెన్నై పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి బీజుచాకో అన్నారు. స్థానిక కొరుక్కుపేట కేఎన్ఎస్ డిపో మైదానంలో శుక్రవారం రాత్రి జరిగిన కాంగ్రెస్ అభ్యర్థి పరిచయ కార్యక్రమం ఉత్తర చెన్నై జిల్లా వ్యాపార సంఘం ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమానికి 41వ వార్డు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం.రాజా నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఉత్తర చెన్నై జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆర్కేనగర్ ఈసెల్వం అధ్యక్షత వహించా రు. ఈ సందర్భంగా ఉత్తర చెన్నై పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి బీజుచాకోను కార్యకర్తలకు పరిచయం చేశా రు. కాంగ్రెస్ అభ్యర్థి బీజుచాకో మాట్లాడుతూ పదేళ్ల యూపీఏ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, పేద వర్గాల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. మహిళల రక్షణ కోసం నిర్భయ చట్టాన్ని ఏర్పాటు చేసి, దాని అమలుకు ఎంతో చిత్తశుద్ధితో కృషి చేసిందని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు యూపీఏ ప్రభుత్వ విజయాలని వివరించారు. మాజీ ఎమ్మెల్యే ఈ.బలరామన్, ఎస్. వేణుగోపాల్, ఎర్నెస్ పాల్, ఎం.ఎస్. ద్రవ్యం, జిల్లా నిర్వాహకులు ఎస్.ఆర్.రాజేంద్రన్, ఎస్.కె. వీరారెడ్డి, కె.రాజేంద్రన్, ఎన్.ఆనందన్, ఎం.రామలింగం, కె.కన్నియప్పన్ పాల్గొన్నారు.


