National Cinema Day
-
మోసం చేస్తున్న మల్టీప్లెక్స్లు.. అంతా మాయ!
రూ.99కే సినిమా చూసే ఛాన్స్. దేశవ్యాప్తంగా ఏకంగా 4000 స్క్రీన్స్లో ఈ ఆఫర్ వర్తింపు. కొత్త సినిమాల్ని కూడా తక్కువ ధరలోనే మల్టీప్లెక్స్లో చూసేయొచ్చు. మూడు రోజుల క్రితం మల్టీప్లెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పెద్దగా ప్రచారం చేసుకుంది. మిగతా చోట్ల రూ.99 అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో రూ.112 అని చెప్పుకొచ్చింది. తీరా చూస్తే అది కూడా లేదు. పైకి చెబుతున్నది ఒకటి రియాలిటీలో జరుగుతున్నది మరొకటి అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 22 సినిమాలు)ఆఫర్ కొన్నిచోట్లేనేషనల్ సినిమా డే అని ఘనంగా ప్రకటించారు. దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్ సహా చాలా థియేటర్లలో తక్కువ రేటు టికెట్ అని ఊరించారు. కానీ నిజంగా అలా చేయట్లేదు. ఈ శుక్రవారం రెండు మూడు తెలుగు సినిమాలు రిలీజయ్యాయి. వాటికి అరకొరా థియేటర్లు దొరికాయి. అందులో కొన్నింటిలోనే రూ.112 ఆఫర్ ఉంది.మోసం చేస్తున్నారా?ఆఫర్ అన్నప్పుడు ప్రస్తుతం ఏ సినిమాలు అయితే ప్రదర్శితమవుతున్నాయో అన్నింటికి అప్లై అవుతుందేమో? కానీ తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం 'మత్తువదలరా 2', 'సరిపోదా శనివారం', '35 ఇది చిన్న కథ కాదు' చిత్రాలు కూడా థియేటర్లలో ఉన్నాయి. కానీ వీటిని ఆఫర్లో పెట్టలేదు. మళ్లీ హైదరాబాద్లో పలు మల్టీప్లెక్స్లో రిలీజైన హిందీ సినిమాలకు పెట్టారు. అంటే తెలుగు ప్రేక్షకులంటే మల్టీప్లెక్స్ అసోసియేషన్కి చిన్నచూపా లేదంటే ఆఫర్ చెప్పి మోసం చేయాలని చూస్తున్నారా?(ఇదీ చదవండి: 27 ఏళ్లకే ప్రముఖ సింగర్ మృతి.. కారణమేంటి?)ఇలా చేస్తే ఎలా?ఇప్పుడంతా ఓటీటీ ట్రెండ్ నడుస్తోంది. థియేటర్లకు జనాలు వెళ్లడం గతంతో పోలిస్తే తగ్గింది. సినిమా డే నాడు ఆఫర్స్ అని చెప్పినప్పుడు పూర్తిగా పాటిస్తేనే కదా ఆసక్తి లేకపోయినప్పటికీ టికెట్ డబ్బులు తక్కువే కాబట్టి ప్రేక్షకుడు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఇలా పైకి ఒకటి చెప్పి లోపల మరొకటి చేస్తే ఉన్న క్రెడిబులిటీ కూడా పోతుందేమో? ఈ విషయం మల్టీప్లెక్స్లు ఆలోచిస్తే బెటర్.. లేదంటే సినిమా డే-ఆఫర్ అని చెప్పేటప్పుడు కేవలం ఉత్తరాదికి మాత్రమే చెప్పుకొంటే బెటర్!రీ రిలీజ్ సినిమాలకు కూడాకొత్త సినిమాలకు ఆఫర్ పెట్టలేదంటే నిర్మాత కోట్లు ఖర్చు పెట్టాడు అనుకోవచ్చు. 'బొమ్మరిల్లు' లాంటి రీ రిలీజ్ సినిమాకు కూడా రూ.250, రూ.300 టికెట్ రేటు పెట్టున్నారు. కనీసం వీటినైనా సరే సినిమా డే ఆఫర్ కిందకు తీసుకొస్తే జనాలు థియేటర్లకు వస్తారేమో?(ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన నటుడు అమితాబ్ బచ్చన్)National Cinema Day returns for its 3rd edition on September 20th! Enjoy movies at over 4,000 screens across India for just Rs. 99. Don’t miss this perfect opportunity to catch your favorite films with your friends and family. #NationalCinemaDay2024 #20September pic.twitter.com/hEduoRbGtZ— Multiplex Association Of India (@MAofIndia) September 17, 2024 -
సినీ ప్రియులకు బంపరాఫర్.. కేవలం రూ.99 కే టికెట్!
సినీ ప్రియులకు అదిరిపోయే శుభవార్త. ఈనెల 13న జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బంపరాఫర్ ప్రకటించింది. ఆ ఒక్క రోజు దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్ల్లో కేవలం రూ.99 కే టికెట్స్ బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ సందర్భంగా తమ ఫ్యామిలీతో కలిసి ఇష్టమైన సినిమాను ఆస్వాదించవచ్చని వెల్లడించింది. అయితే ఈ ఆఫర్ కేవలం ఎంపిక చేసిన నగరాలు, థియేటర్లలో మాత్రమే వర్తిస్తుందని ప్రకటించింది. ఈ మేరకు ఎంఏఐ(MAI) ట్వీట్ చేసింది. అక్టోబర్ 13న శుక్రవారం కావడంతో చాలా సినిమాలు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. జాతీయ సినిమా దినోత్సవాన్ని పురస్కరించుకుని దాదాపు 4 వేల కంటే ఎక్కువ స్క్రీన్లలో ఈ అవకాశం కల్పించారు. ఇప్పటికే రిలీజైన సినిమాలతో పాటు శుక్రవారం రిలీజయ్యే చిత్రాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. తక్కువ ధరకే సినిమా చూసే ఒక్కరోజు మాత్రమే. ఈ ఆఫర్ ప్రముఖ థియేటర్లు అయిన పీవీఆర్, ఐనాక్స్, సినీ పోలీస్, మిరాజ్, సిటీప్రైడ్, ఏషియన్, ముక్తా ఏ2, మూవీ టైమ్, వేవ్, ఎం2కే, డిలైట్లో రూ.99 కే అందుబాటులో ఉంటాయని తెలిపింది. అయితే ఈ ఆఫర్ కేవలం ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్న వారికే వర్తిస్తుందని పేర్కొంది. కాగా.. 2022లో మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మొదటిసారిగా జాతీయ సినిమా దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించింది. అంతకుముందు సెప్టెంబర్ 16వ తేదీని వేడుకల రోజుగా ప్రతిపాదించగా.. ఆ తర్వాత అది సెప్టెంబర్ 23కి మారింది. గతేడాది జాతీయ సినిమా దినోత్సవం రోజున 6.5 మిలియన్ల మంది ప్రజలు థియేటర్లకు వెళ్లి సినిమా చూశారని వెల్లడించింది. భారతీయ సినీ పరిశ్రమకు ఆ ఏడాదిలో అత్యధికంగా ప్రేక్షకులు హాజరైన రోజుగా నిలిచిందని ప్రెసిడెంట్ కమల్ జియాన్చందానీ తెలిపారు. National Cinema Day is back on October 13th. Join us at over 4000+ screens across India for an incredible cinematic experience, with movie tickets priced at just Rs. 99. It's the perfect day to enjoy your favorite films with friends and family. #NationalCinemaDay2023 #13October pic.twitter.com/Pe02t9F8rg — Multiplex Association Of India (@MAofIndia) September 21, 2023 -
నేషనల్ సినిమా డే.. 112 రూపాయలకే ఆ సినిమా!
సందీప్ కుమార్, దీప్తి వర్మ జంటగా నటించిన సినిమా 'ద్రోహి'. విజయ్ పెందుర్తి దర్శకుడు. గుడ్ ఫెలో మీడియా సఫైరస్ మీడియా, వెడ్నెస్ డే ఎంటర్టైనమెంట్ పతాకాలపై విజయ్ పెందుర్తి, శ్రీకాంతరెడ్డి నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 13న థియేటర్లలోకి రానుంది. ఆ రోజు నేషనల్ సినిమా డే సందర్భంగా చిత్ర బృందం సినీ ప్రియులకు ఓ ప్రత్యేక ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. (ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఈ తెలుగు సినిమా!) అక్టోబర్ 13న మల్టీపెక్స్ల్లో రూ.112లకే ఈ సినిమా టికెట్ దొరుకుతుందని చిత్రబృందం పేర్కొంది. హీరో త్రిగుణ్.. ఆదివారం జరిగిన ఈవెంట్లో ట్రైలర్ విడుదల చేశారు. ఇది ఆసక్తికరంగా ఉందని, దర్శకుడి పనితీరు ట్రైలర్లో కనిపించిందని అన్నాడు. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్ముతున్నానని అభిప్రాయం వ్యక్తం చేశాడు. (ఇదీ చదవండి: ఫారెన్ టూర్లో విజయ్-రష్మిక.. అది నిజమేనా?) -
National Cinema Day: మల్టీఫ్లెక్సుల్లో రూ.75కే టికెట్!
ముంబై: ఓటీటీల కాలంలో.. కరోనా తర్వాత సాధారణ థియేటర్లతో పోలిస్తే మల్టీఫ్లెక్స్లకే ప్రేక్షకుల తాకిడి పెరుగుతోంది. ఈ క్రమంలో.. తాజాగా మల్టీ ఫ్లెక్స్ అసోసియేషన్ ఆసక్తికర నిర్ణయం ఒకటి తీసుకుంది. వంద రూపాయలలోపు టికెట్ రేటుతో ప్రేక్షకుడికి సినిమా అనుభూతిని అందించాలని నిర్ణయించుకుంది. అయితే ఇక్కడో విషయం ఉందండోయ్. సెప్టెంబర్ 16న నేషనల్ సినిమా డే. ఈ సందర్భంగా.. ప్రేక్షకులకి ఈ బంపరాఫర్ ప్రకటించింది మల్టీఫ్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(MAI). కరోనా లాక్డౌన్ తర్వాత ఆదరిస్తున్న ప్రేక్షకుల గౌరవార్థం ఆ ఒక్కరోజు ఈ పని చేస్తున్నట్లు ప్రకటించింది ఎంఏఐ. పీవీఆర్, ఐనాక్స్, సినీపోలీస్, కార్నివాల్, మిరాజ్, ఏషియన్.. ఇలా పలు మల్టీఫ్లెక్స్ ఫ్రాంచైజీల్లో ఆరోజున కేవలం రూ.75కే సినిమా చూడొచ్చు. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 4000 స్క్రీన్స్లో సినిమా చూడొచ్చని మల్టీఫ్లెక్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనను ట్విటర్లో పోస్ట్ చేసింది. ఈ డిస్కౌంట్ ద్వారా అయిన ఆడియొన్స్ను ఆ ఒక్కరోజు రప్పించ వచ్చనే ఆలోచనలో ఉంది. అయితే ఇప్పటికే బాయ్కాట్ట్రెండ్ మోజులో ఉన్న ఆడియెన్స్.. ఈ బంపరాఫర్ను స్వీకరిస్తారా? తిరస్కరిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. అయితే.. మల్టీఫ్లెక్స్ ఫ్రాంచైజీలు మాత్రం ఫ్యామిలీ ఆడియొన్స్ రావొచ్చనే ఆశాభావం వ్యక్తం చేస్తోంది. Cinemas come together to celebrate ‘National Cinema Day’ on 16th Sep, to offer movies for just Rs.75. #NationalCinemaDay2022 #16thSep — Multiplex Association Of India (@MAofIndia) September 2, 2022 ఇదీ చదవండి: బీజేపీలో ఉంటూనే ‘ఆప్’ కోసం పని చేయండి