national roaming
-
వోడాఫోన్ దివాలీ ఆఫర్
ముంబై: ప్రముఖ ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో ఒకటైన వోడాఫోన్ దీపావళి ఆఫర్ ప్రకటించింది. ఈ దీపావళినుంచి నేషనల్ రోమింగ్ చార్జీలను ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపింది. తమ యూజర్లకు దేశవ్యాప్తంగా ఉచిత ఇన్కమింగ్ కాల్స్ అందించే ప్లాన్ ను ప్రకటించింది. రిలయన్స్ జియో ఎంట్రీ వార్లో భాగంగా వోడాఫోన్ శుక్రవారం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ దీపావళినుంచి వోడాఫోన్ వినియోగదారులు, దేశంలో ఎక్కడైనా రోమింగ్ చింతలేకుండా స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చని వోడాఫోన్ కమర్షియల్ డైరెక్టర్ సందీప్ కటారియా తెలిపారు. నేషనల్ అవుట్ గోయింగ్ చార్జీలు హోం చార్జీలతో సమానం ఉన్నప్పటికీ ఇన్ కమింగ్ చార్జీల భయం వినియోగదారులను పీడిస్తున్నట్టు తమ కన్జ్యూమర్ రీసెర్చ్ లో తేలిందన్నారు. అందుకే తమ యూజర్ల సౌలభ్యంకోసం ఈ నిరణయం తీసుకున్నామన్నారు. రెండు కోట్ల మందికి పైగా ఉన్న తమ వినియోగ దారులకు దీని వల్ల లబ్ది చేకూరనుందని కటారియా పేర్కొన్నారు. -
బీఎస్ఎన్ఎల్ రోమింగ్ ఫ్రీ
న్యూఢిల్లీ: ప్రైవేటు ఆపరేటర్ల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు ప్రభుత్వ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) మరో ఆఫర్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా జూన్ 15 నుంచి ఉచితంగా రోమింగ్ సేవలు అందించనున్నట్టు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. స్సెక్ట్రం షేరింగ్, ట్రేడింగ్ విధానాన్ని ఈనెలలోనే కేబినెట్ ముందుకు తీసుకెళ్లనున్నట్టు చెప్పారు. పోస్ట్ శాఖకు ఆర్ బీఐ జూలై లేదా ఆగస్టులో బ్యాంకు లైసెన్స్ లు ఇచ్చే అవకాశముందన్నారు. రోమింగ్ ఫ్రీతో బీఎస్ఎన్ఎల్ పుంజుకునే అవకాశముంది. మే 1 నుంచి ప్రవేశపెట్టిన 'ఉచిత కాల్స్' పథకం ల్యాండ్లైన్ కు ఊపిరిలూదింది. రాత్రి 9 నుంచి ఉదయం 7 గంటల వరకు బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ నుంచి ఏ నెట్ వర్క్ ల్యాండ్లైన్, సెల్ఫోన్ల అయినా ఉచితంగా కాల్స్ చేసుకునే వెసులుబాటు కల్పించడంతో ఈ పథకం సక్సెస్ అయింది.