Nehru colony
-
నవ వధువు అనుమానాస్పద మృతి
పార్వతీపురం (విజయనగరం జిల్లా) : పార్వతీపురం మండలకేంద్రంలోని నెహ్రూ కాలనీలో నివాసముంటున్న రాయల సరస్వతీ(23) అనే నవ వధువు గురువారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. కళ్లు తిరిగి పడిపోయి చనిపోయిందని అత్తింటి వారు చెప్పడంతో అనుమానం వచ్చి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సరస్వతికి గత ఏడాది నవంబర్లో సంతోష్ అనే యువకుడితో వివాహమయింది. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మృత్యుంజయుడు
పార్వతీపురం,న్యూస్లైన్: ఈ ఫొటోలో ఉన్న బాలు డు రెండున్నరేళ్ల అఖిల్. శుక్రవారం సాయంత్రం రెండంతస్తుల భవనం పైనుంచి పడిపోయాడు. స్వల్పగాయాలతో బయటపడి మృత్యుంజయుడయ్యాడు. పార్వతీపురం నెహ్రూ కాలనీలో రెండంతస్తుల భవనంపై గవర సత్యం, యశోద కుమారుడు అఖిల్ ఆడుకుంటున్నాడు. భవనం పిట్టగోడ చిన్నదిగా ఉండడంతో అఖిల్ దానిపైనుంచి రేకులపై.. అక్కడి నుంచి కిందకు పడ్డాడు. నేల కూడా మెత్తటి మట్టితో ఉండడంతో ప్రమాదం తప్పింది.