ఢిల్లీ - విశాఖకు సాయంత్రం విమాన సర్వీసు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి సాయంత్రం వేళల్లో విమాన సౌకర్యం విషయంలో విశాఖ వాసుల కల నెరవేరబోతోంది. అక్టోబర్ 28 నుంచి సాయంత్రం వేళల్లో ఢిల్లీ- విశాఖకు విమాన సర్వీసులను ప్రారంభిస్తామని ఇండిగో సంస్థ గురువారం ప్రకటించింది. ఢిల్లీ నుంచి ఇండిగో విమానం( ఫైలట్ నంబర్ జిఇ-337) సాయంత్రం 7.50 కు బయలుదేరి విశాఖపట్నం కు 10.10 కు చేరుకుంటుంది.