breaking news
Nitish Kumar resigns
-
నితీశ్ రెడ్డి కాదు!.. శార్దూల్ స్థానంలో అతడే సరైనోడు: భారత మాజీ క్రికెటర్
ఇంగ్లండ్తో రెండో టెస్టు నేపథ్యంలో భారత తుదిజట్టు ఎంపిక ఆసక్తికరంగా మారింది. ఎవరిపై వేటు వేస్తారు? ఎవరికి కొత్తగా అవకాశం ఇస్తారు?.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు?.. అన్న అంశాలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy)ని టీమిండియా పరాజయంతో మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా లీడ్స్లో జరిగిన తొలి మ్యాచ్లో గిల్ సేన ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. బ్యాటర్లు ఫర్వాలేదనిపించినా.. బౌలర్లు విఫలమయ్యారు. ఇక ఫీల్డింగ్లో అయితే టీమిండియా చెత్త ప్రదర్శన కనబరిచింది. ఏకంగా ఆరు క్యాచ్లు డ్రాప్ చేసి.. మూల్యం చెల్లించింది.శార్దూల్ విఫలం.. నితీశ్ రెడ్డికి అవకాశం?ఇక ఈ మ్యాచ్ సందర్భంగా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇటు లోయర్ ఆర్డర్లో.. అటు బౌలింగ్లో అతడు పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్లో కలిపి ఐదు పరుగులు చేసిన శార్దూల్.. మొత్తంగా రెండు వికెట్లు తీశాడు.ఆల్రౌండర్గా రాణిస్తాడనుకుంటే.. అతడి వల్ల ఉపయోగం లేకుండా పోయిందంటూ మాజీ క్రికెటర్లు సైతం శార్దూల్ను విమర్శించారు. ఈ నేపథ్యంలో రెండో టెస్టులో అతడిపై వేటు పడే అవకాశం ఉందని.. అతడి స్థానంలో ఆంధ్ర యువ సంచలనం నితీశ్ కుమార్ రెడ్డి జట్టులోకి వస్తాడని విశ్లేషకులు భావిస్తున్నారు.నితీశ్ కాదు!.. శార్దూల్ స్థానంలో అతడే కరెక్ట్!అయితే, టీమిండియా మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘రెండో టెస్టు నుంచి శార్దూల్ ఠాకూర్ను తప్పిస్తారనే అనిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే అతడి స్థానాన్ని బౌలర్తోనే భర్తీ చేయాలి.ప్రసిద్ కృష్ణ సంగతి పక్కనపెడితే.. వైవిధ్యం కోసం పేసర్ అర్ష్దీప్ సింగ్ను లేదంటే చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను తుదిజట్టులోకి తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. ఏదేమైనా పిచ్ స్వభావాన్ని బట్టే వీరిద్దరిలో ఒకరు ఫైనల్ అవుతారు’’ అని బద్రీనాథ్ అభిప్రాయపడ్డాడు. కుల్దీప్ యాదవ్ ఆడే అవకాశం ఎక్కువగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.కాగా తమిళనాడుకు చెందిన బద్రీనాథ్ 2008- 2011 మధ్య టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. రెండు టెస్టులు, ఏడు వన్డేలు, ఒక టీ20 ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆయా ఫార్మాట్లలో 63, 79, 43 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. భారత్- ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు (జూలై 2-6)కు బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియం వేదిక.ఇంగ్లండ్తో టెస్టులకు భారత జట్టు:యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, అభిమన్యు ఈశ్వరన్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, ధ్రువ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా.చదవండి: ఇప్పట్లో టీమిండియాలో అతడికి చోటు దక్కదు! -
మహాకూటమి కుదేలు!
-
మహాకూటమి కుదేలు!
బిహార్లో రాజకీయం మలుపులు తిరుగుతోంది. మహాకూటమికి బీటలు వారటంతో.. సీఎం నితీశ్ కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు కనబడుతోంది. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో విభేదాలు చినికి చినికి గాలివానగా మారాయి. సంకీర్ణానికి బీటలు వారి పాతపొత్తులు మరోసారి కొత్తగా పొడిచేందుకు మార్గం సుగమమవుతోంది. పదేళ్లపాటు బీజేపీ–జేడీయూలు కలిసున్నప్పటికీ కొన్ని కారణాలతో విడిపోవటం.. ఆ తర్వాత కాంగ్రెస్ చొరవతో మహాకూటమిని ఏర్పాటు చేయటం చకచకా జరిగిపోయాయి. రెండేళ్లపాటు ఆనందంగా సాగిన కూటమికి ఇప్పుడు బీటలువారాయి. నెలరోజులుగా జరుగుతున్న పరిణామాలతో.. 2019లో మోదీకి వ్యతిరేకంగా మహాకూటమిని మరింత బలోపేతం చేయాలనుకున్న కాంగ్రెస్ సహా ఇతర విపక్షాల ఆశలు ఆడియాసలయ్యాయి. మహాకూటమి ఏర్పాటుకు ముందు... 2003లో జేడీయూ ఏర్పాటైనప్పటినుంచి బీజేపీతో సత్సంబంధాలున్నా యి. వాజ్పేయి ఎన్డీయే ప్రభుత్వంలోనూ ఈ పార్టీ క్రియాశీలకంగా వ్యవహరించింది. 2004లో యూపీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా బిహార్పై ఎన్డీయే పట్టు తగ్గలేదు. అయితే 2013లో మోదీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించటంతో.. నితీశ్ ఎన్డీయే నుంచి బయటకు వచ్చారు. 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ మహాకూటమిగా ఏర్పడ్డాయి. బిహార్లో అధికారం తమదేన ని నమ్మకంతో ఉన్న మోదీ, అమిత్షాలకు ఈ కొత్త కూటమి షాకిచ్చింది. 243 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 178 గెలిచి అధికారంలోకి వచ్చింది. కూటమిపై అల్ప సంతోషమే! మహాకూటమి బిహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. తనకెలాగూ ఆరేళ్ల పాటు రాజకీయాల్లో పోటీచేసే అవకాశం లేకపోవటంతో లాలూ.. ఓ కుమారుడికి ఉప ముఖ్యమంత్రి, మరో కుమారుడికి మంత్రి పదవి ఇప్పించుకున్నారు. నితీశ్–లాలూ కూడా తమ మధ్య వివాదాలన్నీ సమసిపోయాయని చెప్పే యత్నం చేశారు. కాంగ్రెస్ కూడా వీరిద్దరి మధ్య సత్సంబంధాలు కొనసాగేలా ప్రయత్నించింది. కానీ కూటమితో నితీశ్ అసంతృప్తిగానే ఫీలవుతున్నారు. అందుకే కొంతకాలంగా పాత నేస్తమైన బీజేపీవైపు చూస్తున్నారు. ప్రధానిగా తను వ్యతిరేకించిన మోదీనే కీలకమైన సందర్భాల్లో నితీశ్ బహిరంగంగానే ప్రశంసించారు. 2016 సెప్టెంబరులో భారత్ సైన్యం చేపట్టిన సర్జికల్ దాడులను విపక్షాలన్నీ విమర్శించినా నితీశ్ మాత్రం సమర్థించారు. పెద్దనోట్ల రద్దుపై విపక్షాలన్నీ విరుచుకుపడ్డా బిహార్ సీఎం సమర్థించారు. పట్నాలో గత జనవరిలో జరిగిన గురు గోవింద్ సింగ్ 350వ జయంతి సందర్భంలోనూ మోదీ, నితీశ్ పరస్పరం ప్రశంసించుకున్నారు. జనవరి 15న ‘దహి చురా’ను పురస్కరించుకొని జేడీయూ ఇచ్చిన విందుకు అనూహ్యంగా బీజేపీ నేతలకు ఆహ్వానాలు వెళ్లాయి. యూపీ ఎన్నికల్లో జేడీయూ పోటీ చేయకపోవటం, మహాకూటమి తరపున ప్రచారానికి నితీశ్ విముఖత వ్యక్తం చేయటంపై ఆర్జేడీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కారణాలతో కొంతకాలంగా బీజేపీ–జేడీయూ మధ్య దూరం తగ్గుతోందని.. మహాకూటమి పార్టీల మధ్య దూరం పెరుగుతోందనే సంకేతాలు సుస్పష్టమయ్యాయి. అన్నీ వెనువెంటనే... బిహార్ బీజేపీ నేతలు లాలూ కుటుంబ సభ్యులపై అక్రమాస్తుల ఆరోపణలు చేయడం..వెనువెంటనే సీబీఐ రంగంలోకి దిగడం, కేసులు, బినామీ ఆస్తుల జప్తు జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో లాలూకు మద్దతుగా నితీశ్ ఒక్కముక్క కూడా మాట్లాడలేదు. దీనికి తోడు తమపై వచ్చిన ఆరోపణలకు లాలూ కుమారులు ప్రజలకు వివరణ ఇవ్వాలని నితీశ్ కోరటంతో వివాదం మరింత ముదిరింది. ఇది నితీశ్ రాజీనామాకు తద్వారా కూటమి విచ్ఛిన్నానికి దారితీసింది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
బిహార్లో మరో మలుపు!
ఆర్జేడీతో నితీశ్ తెగదెంపులు ► బిహార్ సీఎంగా రాజీనామా ► బీజేపీతో మళ్లీ దోస్తీ.. కొత్తగా జేడీయూ– బీజేపీ ప్రభుత్వం! ► సీఎంగా నేడు మళ్లీ ప్రమాణ స్వీకారం పట్నా: నాటకీయ పరిణామాల మధ్య బిహార్ రాజకీయం బుధవారం ఒక్కసారిగా వేడెక్కింది. లాలు కుటుంబంపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో.. అధికార పక్ష భాగస్వాములు జేడీయూ, ఆర్జేడీల మధ్య నేడో, రేపో తెగతెంపులు ఖాయమనే వార్తలు.. సీఎం పదవికి రాజీనామా చేస్తున్నానంటూ నితీశ్ అకస్మాత్తుగా ప్రకటించడంతో నిజమయ్యాయి. రాజీనామా లేఖను గవర్నర్ కేఎన్ త్రిపాఠీకి అందజేసిన నితీశ్.. ఆ తరువాత ఆర్జేడీపై ఆరోపణలు గుప్పిస్తూ.. మహాకూటమిలో కొనసాగడం అసాధ్యమంటూ తేల్చిచెప్పారు. మరోవైపు, నితీశ్ నిర్ణయాన్ని ప్రధాని మోదీ సమర్ధిస్తూ.. ఆయనకు అభినందనలు తెలిపారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సుశీల్ మోదీ.. నితీశ్కు మద్దతు తెలుపుతూ గవర్నర్కు లేఖనందించారు. దీంతో నేటి సాయంత్రం ఐదు గంటలకు బిహార్ సీఎంగా జేడీయూ నేత నితీశ్ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. అయితే ఈ పరిణామాలన్నీ బీజేపీ కుట్రేనని ఆర్జేడీ చీఫ్ లాలూ యాదవ్ విమర్శించారు. ఆర్జేడీతో ఉప్పు నిప్పు బుధవారం సాయంత్రం నితీశ్ రాజీనామా పట్నాతోపాటుగా దేశవ్యాప్తంగా రాజకీయంగా కలకలం రేపింది. కూటమితో నితీశ్ అసంతృప్తిగా ఉన్నట్లు స్పష్టమవుతున్నా.. ఇలా హఠాత్తుగా రాజీనామా చేస్తారని ఎవరూ ఊహించలేదు. లాలూ కుటుంబంపై అవినీతి ఆరోపణలతో సీబీఐ, ఈడీ దాడుల నేపథ్యంలో.. ప్రజలకు వివరణ ఇవ్వాలని లాలూ కుమారులను నితీశ్ కొంతకాలం క్రితమే కోరారు. దీన్ని లాలూ కుటుంబం బాహా టంగానే ఖండించింది. బుధవారం మధ్యాహ్నం ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ మీడియా సమావేశం ఏర్పాటుచేసి మరీ తన కుమారులు రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఘంటాపథంగా చెప్పారు. దీంతో బిహార్ రాజకీయం వేడెక్కింది. తదనంతర పరిస్థితులతో సాయంత్రం ఇంచార్జ్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీని కలిసిని నితీశ్ రాజీనామా లేఖను అందజేశారు. కలిసి పనిచేయటం కష్టమే! రాజీనామా సమర్పించిన అనంతరం నితీశ్ మీడియాతో మాట్లాడారు. ‘బిహార్లో నెలకొన్న పరిస్థితులతో మహాకూటమితో కలిసి పనిచేయటం కష్టమే. కూటమిని కొనసాగించేందుకు నా సామర్థ్యాన్ని మించి ప్రయత్నించాను’ అని స్పష్టం చేశారు. ‘రాజీనామా చేయమని నేను ఎవరినీ కోరలేదు. తమపై వచ్చిన అవినీతి ఆరోపణలపై వివరణ ఇవ్వమని మాత్రమే అడిగాను. అయినా వారు (లాలూ కుమారులు) స్పందించలేదు. ప్రభుత్వాన్ని నడపటం కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో రాజీనామా చేయటం మినహా నాకు వేరే మార్గమేమీ కనిపించలేదు. నా అంతరాత్మ ప్రబోధం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని నితీశ్ పేర్కొన్నారు. నోట్లరద్దు నిర్ణయం, బినామీ చట్టాన్ని తను సమర్థించిన సందర్భాల్లో తనపై ఎన్నో ఆరోపణలు చేశారని.. అయినా తనేమీ పట్టించుకోకుండా పాలనపైనే దృష్టిపెట్టానని ఆయన చెప్పుకొచ్చారు. ‘తేజస్వీ యాదవ్పై వచ్చిన బినామీ ఆస్తుల ఆరోపణలను నేనెలా సమర్థించగలను?’ అని నితీశ్ ప్రశ్నించారు. రంగంలోకి బీజేపీ తాజా పరిణామాలు జరుగుతుండగానే బీజేపీ వేగంగా పావులు కదిపింది. ప్రధాని మోదీ నితీశ్ నిర్ణయాన్ని సమర్థిస్తూ.. అభినందిస్తూ ట్వీట్ చేశారు. ‘అవినీతి వ్యతిరేక పోరాటంలో చేరుతున్నందుకు నితీశ్ కుమార్కు అభినందనలు. నిజాయితీకి మద్దతుగా మీ నిర్ణయాన్ని 125 కోట్ల మంది స్వాగతిస్తున్నారు. బిహార్తోపాటుగా దేశాభివృద్ధి కోసం రాజకీయ వైరుధ్యాలను పక్కనపెట్టి ముందుకెళ్లాల్సిన తరుణమిది’ అని మోదీ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. అటు, బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సుశీల్ మోదీ తమ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమై.. నితీశ్కు మద్దతివ్వాలని నిర్ణయించారు. జేడీయూ ప్రభుత్వానికి మద్దతిస్తున్నట్లుగా బీజేపీ ఎమ్మెల్యేల సంతకాలతో గవర్నర్ త్రిపాఠీకి లేఖనందించారు. అటు, బీజేపీ–జేడీయూ ఎమ్మెల్యేలకు బుధవారం రాత్రి నితీశ్ విందు ఏర్పాటుచేశారు. కొత్త ప్రభుత్వంలో బీజేపీ చేరుతోందని సుశీల్ మోదీ స్పష్టం చేశారు. ఉపముఖ్యమంత్రి పదవిపై పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. బిహార్ రాజకీయాల్లో చాణక్యుడు బిహార్లో 2015 శాసనసభ ఎన్నికల సమయంలో ఏళ్లనాటి శత్రుత్వాన్ని పక్కనబెట్టి అనూహ్యంగా లాలూ ప్రసాద్తో చేతులు కలిపిన నితీశ్...అంతే అనూహ్యంగా తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. బిహర్ రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరుగాంచిన నితీశ్ పట్నాలోని ఎన్ఐటీలో ఎలక్ట్రికల్ విభాగంలో ఇంజినీరింగ్ చదివారు. మృదు స్వభావిగా, కార్యదక్షుడిగా పేరు తెచ్చుకున్న ఆయన చదువుకునే రోజుల నుంచే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు.1985లో తొలిసారి బిహార్ శాసనసభకు ఎన్నికయ్యారు. అనంతరం 1989, 91, 96, 98, 99ల్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ సత్తా చాటారు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ సహాయ మంత్రిగా, రైల్వే మంత్రిగా సేవలందించారు. 1999లో ఆయన రైల్వే మంత్రిగా ఉండగా పశ్చిమబెంగాల్లోని గైసల్ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో 300 మంది మరణించగా, నైతిక బాధ్యత వహిస్తూ నితీశ్ రాజీనామా చేశారు. మళ్లీ 2001లో రైల్వే మంత్రి అయ్యారు. 2002లో గోద్రా అల్లర్లకు కారణమైన రైలు దహన ఘటన సమయంలోనూ ఆయనే రైల్వే మంత్రి. ఇప్పటికి ఐదుసార్లు బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ పనిచేశారు. బీజేపీతో నితీశ్ కుమ్మక్కు: లాలూ 1991 నాటి ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నందునే నితీశ్ ఇప్పుడు బీజేపీతో లాలూచీ పడ్డారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ధ్వజమెత్తారు. ‘బీజేపీ–ఆరెస్సెస్ల ప్రోద్బలంతోనే నితీశ్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామా ప్రకటన చేసిన వెనువెంటనే ప్రధాని మోదీ అభినందనలు తెలపడం చూస్తే ఇది అర్థమవుతోంది. నితీశ్ బీజేపీతో చేతులు కలపడం నిజం కాకపోతే...కూటమి పార్టీల్లోని ఎమ్మెల్యేలందరినీ సమావేశపరిచి కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు ఆయన అంగీకరించాలి. రాష్ట్రంలో పెద్ద పార్టీ మాదే. మాకు ప్రజామోదం ఉంది కాబట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం మాకే ఇవ్వాలి’ అని లాలూ అన్నారు. ‘మేం సంబంధిత పత్రాలను సీబీఐకి ఇస్తాం. వాటిని అడగటానికి వారు (నితీశ్) ఎవరు? బిహార్ ఉప ముఖ్యమంత్రిగా తేజస్వీ ఏదైనా అవినీతికి పాల్పడ్డాడా? ఇదంతా మోదీ చేయిస్తున్నారు. బిహార్ ప్రజల నమ్మకాన్ని నితీశ్ నిలబెట్టలేక పోయారు’ అని పేర్కొన్నారు. నితీశ్కు ఒరిగేదేంటి? మహాకూటమిలో 80 స్థానాలతో ఆర్జేడీయే అతిపెద్ద పార్టీగా ఉంది. నితీశ్కు సీఎం పదవి ఇచ్చినా కూటమిలో పెద్ద పార్టీగా తమ మాట చెల్లుబాటు కావాలనే పంతంతో లాలూ వ్యవహరిస్తున్నారు. దీంతో నితీశ్ తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. మళ్లీ ఎన్డీయేలో చేరితే.. నితీశ్పై ఎలాంటి ఒత్తిడి ఉండదు. మరోవైపు, అవినీతి ఊబిలో ఉన్న లాలూ కుటుంబంతో అంటకాగితే.. నితీశ్ క్లీన్ ఇమేజ్కు ఇబ్బందులు తప్పవు. ఇది కూడా ఈయన కూటమి నుంచి తప్పుకునేందుకు ఓ కారణం. బిహార్ అభివృద్ధికి కేంద్రంతో సఖ్యతగా ఉండటమే మంచిది. యూపీలో బీజేపీ ఘన విజయం తర్వాత మోదీకి గట్టి ప్రత్యామ్నాయం కనుచూపు మేరల్లో కనపడని పరిస్థితి. అలాంటపుడు ఎన్డీయేకు దూరంగా ఉండటంలో అర్థం ఉండదని జేడీయూ భావిస్తోంది. బీజేపీకి లాభమేంటి? బీజేపికి ప్రత్యామ్నాయంగా 2019 కల్లా విపక్షాలతో కలిపి మహాకూటమిని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. దీని అవసరాన్ని కాంగ్రెస్కు చెప్పిందే నితీశ్. అలాంటి నితీశ్ను తమవైపు తిప్పుకుంటే మహాకూటమి ప్రయత్నాలకు ఆదిలోనే గండికొట్టినట్లవుతుంది. రాజ్యసభలో ఎన్డీయే బలపడుతోంది. ప్రస్తుతమున్న 74 మంది ఎన్డీయే ఎంపీలకు తోడు.. పది మంది జేడీయూ ఎంపీలు తోడైతే పెద్దలసభలో బీజేపీకి కొంత ఊరట. నితీశ్తో తెగదెంపులతో 2015 అసెంబ్లీ ఎన్నికల్లో బిహార్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. 2019 లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటే.. నితీశ్ కలుపుకుపోవడం బీజేపీకి అత్యంత అవసరం. మమ్మల్ని నిరాశకు గురిచేసింది: కాంగ్రెస్ నితీశ్ రాజీనామా తమను నిరుత్సాహానికి గురిచేసిందని కాంగ్రెస్ పేర్కొంది. మహాకూటమి లోని విభేదాలను పరిష్కరించేందుకు కృషి చేస్తామంది. కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా మాట్లాడుతూ ‘మహాకూటమి ఐదేళ్లు కొనసాగాలని ప్రజలు ఓటేశారు. బిహార్ గౌరవాన్ని తాకట్టు పెట్టిన బీజేపీని, ప్రధాని మోదీని వ్యతిరేకిస్తూ ప్రజలు ఇచ్చిన తీర్పు అది. దానిని గౌరవించేందుకు మేం పనిచేస్తాం’ అని అన్నారు. ‘కాంగ్రెస్ పార్టీకి, మరీ ప్రత్యేకంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు నితీశ్పై ఎంతో అభిమానం, గౌరవం ఉన్నాయి. ఆయన రాజీనామా చేయడం మమ్మల్ని అందరినీ ఎంతో నిరాశకు గురిచేసింది’ అని రణదీప్ చెప్పుకొచ్చారు.