breaking news
OTT
-
ఓటీటీలోకి మలయాళ హారర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
దెయ్యం సినిమాలు ఎప్పటికప్పుడు వస్తుంటాయి గానీ వాటిలో భయపెట్టేవి చాలా తక్కువ. రీసెంట్గా మలయాళంలో రిలీజైన ఓ మూవీ.. హారర్ చిత్రాలంటే ఇష్టపడే ప్రేక్షకుల్ని కూడా భయపెట్టింది. థియేటర్లలో ఆకట్టుకుని మంచి వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఓటీటీలోనూ వణికించేందుకు సిద్ధమైపోయింది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎందులో చూడొచ్చు?మలాయళ సూపర్స్టార్ మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ కూడా అడపాదడపా హీరోగా సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్ టైంలో 'డీయస్ ఈరే' అనే హారర్ చిత్రంలో నటించాడు. 'భూతకాలం', 'భ్రమయుగం' తదితర మూవీస్తో ప్రేక్షకుల్ని భయపెట్టిన రాహుల్ సదాశివన్.. ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అక్టోబరు 31న మలయాళంలో, నవంబరు 7న తెలుగు వెర్షన్.. థియేటర్లలో రిలీజైంది. ఓవరాల్గా రూ.80 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చిన 20 మూవీస్)థియేటర్లలో అలరించిన 'డీయస్ ఈరే' సినిమా.. ఇప్పుడు డిసెంబరు 05 నుంచి హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. మీరు హారర్ మూవీ లవర్స్ అయితే గనుక దీన్ని అస్సలు మిస్ చేయొద్దు. చిల్ మూమెంట్స్ ఇచ్చే సీన్స్ చాలానే ఉంటాయి.'డీయస్ ఈరే' విషయానికొస్తే.. రోహన్ (ప్రణవ్ మోహన్లాల్) ఓ ఆర్కిటెక్ట్. బాగా డబ్బున్న ఫ్యామిలీ కుర్రాడు. తల్లిదండ్రులు అమెరికాలో ఉంటారు. ఇతడేమో ఇక్కడ పెద్ద ఇంట్లో ఒంటరిగా ఉంటాడు. ఖాళీ టైంలో పార్టీలు, ఫ్రెండ్స్ అని ఎంజాయ్ చేస్తుంటాడు. ఓ రోజు రోహన్ క్లాస్మేట్ కని(సుస్మితా భట్) బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. దీంతో ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు రోహన్, అతడి ఫ్రెండ్.. కని ఇంటికి వెళ్లొస్తారు. అప్పటినుంచి రోహన్ ఇంట్లో రాత్రిపూట వింతైన శబ్దాలు వినిపిస్తుంటాయి. కని ఆత్మనే తనని వేధిస్తోందని రోహన్ భయపడుతుంటాడు. ఇంతకీ ఆ ఆత్మ ఎవరిది? రోహన్ వెంటే ఎందుకు పడుతోంది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: Dies Irae: సౌండ్తో భయపెట్టారు.. 'డీయస్ ఈరే' తెలుగు రివ్యూ)(ఇదీ చదవండి: తెలుగు కామెడీ థ్రిల్లర్.. వారం రోజులకే ఓటీటీలో స్ట్రీమింగ్)The Day of Wrath is here.Diés Iraé will be streaming from December 5 only on JioHotstar.@impranavlal @rahul_madking @StudiosYNot @chakdyn @sash041075 @allnightshifts @studiosynot #DiésIraé #DiésIraéOnHotstar #PranavMohanlal #Horror #Thriller #Suspense #JioHotstar… pic.twitter.com/AYBPyGwfsL— JioHotstar Malayalam (@JioHotstarMal) November 28, 2025 -
కామెడీ థ్రిల్లర్.. వారం రోజులకే ఓటీటీలోకి..
థియేటర్లో రిలీజైన సినిమాలు నాలుగైదు వారాల తర్వాత కానీ ఓటీటీలోకి రావు. కానీ ఓ తెలుగు మూవీ మాత్రం కేవలం వారానికే ఓటీటీలోకి వచ్చి షాకిచ్చింది. ఆ సినిమాయే పాంచ్ మినార్. రాజ్తరుణ్ హీరోగా, రాశీ సింగ్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ పాంచ్ మినార్. రామ్ కడుముల దర్శకత్వం వహించిన ఈ మూవీలో బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషించారు. గోవిందరాజు సమర్పణలో మాధవి, ఎంఎస్ఎం రెడ్డి నిర్మించారు. ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజ్ తరుణ్ గత సినిమాలకంటే ఈ మూవీకి మంచి టాక్ వచ్చింది. అయినప్పటికీ కేవలం వారం రోజుల్లోనే ఓటీటీలో రిలీజ్ చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో సడన్ సర్ప్రైజ్గా స్ట్రీమింగ్కు తీసుకొచ్చారు.కథేంటంటే..కిట్టు (రాజ్ తరుణ్) నిరుద్యోగి. ఉద్యోగం సంపాదించే క్రమంలో ఈజీగా డబ్బులు సంపాదించాలనుకుంటాడు. బిట్కాయిన్ స్కామ్ ఐదు లక్షలు పోగొట్టుకుంటాడు. ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు క్యాబ్ డ్రైవర్గా మారతాడు. ఒకసారి ఇద్దరు హంతకులు కిట్టు క్యాబ్ బుక్ చేసుకుని అతడి ముందే ఓ హత్య చేస్తారు. వాళ్ల ముందు చెవిటివాడిగా నటించి తప్పుకున్న కిట్టు తర్వాత ఏం చేశాడు? అదేరోజు కిట్టుకు కోట్ల రూపాయల డబ్బు ఎలా వచ్చింది? దాంతో ఏం చేశాడు? అన్నది ఓటీటీలో చూడాల్సిందే! చదవండి: బిగ్బాస్ హౌస్ చివరి కెప్టెన్ ఎవరంటే? -
'ప్రేమలో రెండోసారి' త్వరలో ఓటీటీలో విడుదల
సిద్ధా క్రియేషన్స్ బ్యానర్పై రమణ సాకే, వనితా గౌడ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'ప్రేమలో రెండోసారి'. సాకే రామయ్య సమర్పించిన ఈ చిత్రాన్ని సత్య మార్క దర్శకత్వం వహించారు. నీరజ లక్ష్మి నిర్మించారు. జబర్దస్త్ శ్రీను, బాబీ, దుర్గారావు, ఫణి, సతీష్ సారేపల్లి, చిరంజీవి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ యాక్షన్ రొమాంటిక్ లవ్ స్టోరీ నవంబర్ 21న థియేటర్లలో విడుదలైంది. రెస్పాన్స్ బాగుంది. ఈ క్రమంలో దర్శకనిర్మాతలు ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు.ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. చిన్న సినిమాగా విడుదలైన మా చిత్రానికి రోజూ థియేటర్లు పెరుగుతున్నాయి. అందుకు కారణం పాజిటివ్ టాకే. గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రం తీశాం. త్వరలోనే మా చిత్రం ఓ ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుంది. చిత్రాన్ని ఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు మా టీమ్ తరపున థ్యాంక్స్ చెప్పుకుంటున్నామని తెలిపారు. -
వీకెండ్ హంగామా.. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 20 మూవీస్
మరో వీకెండ్ వచ్చేసింది. ఈ రోజు థియేటర్లలో రామ్ 'ఆంధ్ర కింగ్ తాలుకా' రిలీజ్ కాగా.. మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. రేపు అనగా శుక్రవారం కూడా పలు డబ్బింగ్ చిత్రాలు రాబోతున్నాయి. వాటిపై పెద్దగా బజ్ లేదు. మరోవైపు ఓటీటీల్లో మాత్రం శుక్రవారం ఒక్కరోజే 20 వరకు మూవీస్-వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వాటిలో చూడదగ్గవి చాలానే ఉన్నాయి కూడా.స్ట్రేంజర్ థింగ్స్, సన్నీ సంస్కారి కీ తులసి కుమారి లాంటి సినిమాలు ఇప్పటికే గురువారం స్ట్రీమింగ్లోకి రాగా.. శుక్రవారం నాడు మాస్ జాతర, ఆర్యన్, ప్రేమిస్తున్నా, శశివదనే, ఆన్ పావమ్ పొల్లతత్తు తదితర తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ రాబోతున్నాయి. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందంటే?ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (నవంబరు 28)ఆహాప్రేమిస్తున్నా - తెలుగు సినిమాక్రిస్టినా కథిర్వేలన్ - తమిళ మూవీసన్ నెక్స్ట్శశివదనే- తెలుగు సినిమానెట్ఫ్లిక్స్మాస్ జాతర - తెలుగు సినిమాఆర్యన్ - తెలుగు డబ్బింగ్ మూవీలెఫ్ట్ హ్యాండెడ్ గర్ల్ - మాండరిన్ సినిమాస్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 1 - తెలుగు డబ్బిగ్ సిరీస్ (ప్రస్తుతం స్ట్రీమింగ్)సన్నీసంస్కారి కీ తులసి కుమారి - హిందీ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)హాట్స్టార్ఆన్ పావమ్ పొల్లతత్తు - తెలుగు డబ్బింగ్ చిత్రంబార్న్ హంగ్రీ - ఇంగ్లీష్ మూవీజీ5ద పెట్ డిటెక్టివ్ - తెలుగు డబ్బింగ్ సినిమారేగాయ్ - తమిళ సిరీస్రక్తబీజ్ - బెంగాలీ మూవీలయన్స్ గేట్ ప్లేప్రీమిటివ్ వార్ - తెలుగు డబ్బింగ్ సినిమారష్ - ఇంగ్లీష్ మూవీబుక్ మై షో40 ఏకర్స్ - ఇంగ్లీష్ సినిమాఎలివేషన్ - ఇంగ్లీష్ మూవీగ్యాబీ డాల్ హౌస్ - ఇంగ్లీష్ సినిమాహాచీ: ఏ డాగ్స్ టేల్ - ఇంగ్లీష్ మూవీవిన్నర్ - ఇంగ్లీష్ సినిమాఅమెజాన్ ప్రైమ్కాంతార 1 - హిందీ డబ్బింగ్ వెర్షన్షీ రైడ్స్ షాట్ గన్ - తెలుగు డబ్బింగ్ సినిమా -
ఓటీటీకి జాన్వీ కపూర్ రొమాంటిక్ కామెడీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఈ ఏడాది ఎడాపెడా సినిమాలు చేస్తోంది. తెలుగులో రామ్ చరణ్ సరసన పెద్దిలోనూ కనిపించనుంది. ఇక హిందీలో హిట్తో సంబంధం లేకుండా వరుస పెట్టి చిత్రాలతో అలరిస్తోంది. అలా ఈ ఏడాదిలో వచ్చిన మరో రొమాంటిక్ కామెడీ మూవీ సన్నీ సంస్కారి కీ తులసి కుమారి.ఈ చిత్రంలో వరుణ్ ధావన్ సరసన మెప్పించింది దేవర భామ. ఈ సినిమా దసరా కనుకగా థియేటర్లలో సందడి చేసింది. ఈ మూవీకి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 2 న థియేటర్లలోకి వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ.98.35 కోట్లు వసూలు చేసింది.దాదాపు నెలన్నర్ర రోజుల తర్వాత ఓటీటీకి వచ్చేస్తోంది సన్నీ సంస్కారీ కి తులసి కుమారి. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 27 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ఓటీటీ సంస్థ పోస్టర్ను రిలీజ్ చేసింది. కాగా.. ఈ చిత్రంలో సన్యా మల్హోత్రా, రోహిత్ సరాఫ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మించారు. Muhurat nikal gaya guys 🥳#SSKTKonNetflix pic.twitter.com/xU2N5bKcej— Netflix India (@NetflixIndia) November 26, 2025 -
ఓటీటీలోకి తమిళ కామెడీ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఒకప్పటి జనరేషన్తో పోలిస్తే ఇప్పటి పెళ్లి జీవితం చాలామందికి గందరగోళంగానే ఉంటోంది. సర్దుకుపోవడం అనేది అస్సలు కనిపించట్లేదు. అటు అబ్బాయి గానీ ఇటు అమ్మాయి గానీ ఎవరికి వాళ్లే తగ్గేదే లే అన్నట్లు ఉంటున్నారు. దీంతో లేనిపోని సమస్యలు వస్తున్నాయి. సరిగ్గా ఇదే కాన్సెప్ట్తో తీసిన తమిళ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా.. ఓటీటీలో నేరుగా రిలీజ్)రెండేళ్ల క్రితం 'జో' అనే డబ్బింగ్ మూవీ ఓటీటీలో రిలీజైంది. రియో రాజ్ అనే నటుడు.. ఈ చిత్రంలో హీరోగా నటించాడు. ఇతడి లేటెస్ట్ మూవీ 'ఆన్ పావమ్ పొల్లతత్తు'. అక్టోబరు 31న థియేటర్లలో రిలీజైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి వసూళ్లు రాబట్టుకుంది. ఇప్పుడు నెలలోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ శుక్రవారం(నవంబరు 28) నుంచి హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.ట్రైలర్ బట్టి చూస్తే ఇదో కామెడీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. శివ(రియో రాజ్), శక్తి (మాళవిక మనోజ్)ది పెద్దల కుదిర్చిన సంబంధం. పెళ్లయిన కొన్నిరోజులు బాగానే ఉంటుంది. కానీ తర్వాత నుంచి శక్తి.. చీటికిమాటికి అలగడం, ఇంట్లో పనులు చేయకపోవడం చేస్తుంది. దీంతో విడాకులు కోసం వీళ్లిద్దరూ కోర్టుని ఆశ్రయిస్తారు. తర్వాత ఏమైంది? చివరకు శివ-శక్తి పెళ్లి జీవితం గాడిన పడిందా? లేదా అనేది స్టోరీలా అనిపిస్తుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ చూపిస్తూనే ఎంటర్టైన్ చేసినట్లున్నారు. కుదిరితే ఓ లుక్కేయండి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ తెలుగు సినిమా) -
సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా.. ఓటీటీలో నేరుగా రిలీజ్
ఓటీటీల్లో ఎన్ని సినిమాలు, వెబ్ సిరీస్లు ఉండొచ్చు. కానీ ఎక్కువమంది చూసేది మాత్రం థ్రిల్లర్ జానరే. మర్డర్ మిస్టరీ, మిస్టరీ థ్రిల్లర్, కామెడీ థ్రిల్లర్.. ఇలా పలు భాషల్లో బోలెడన్ని చిత్రాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. అలా నేరుగా ఓటీటీలోనే ఓ తెలుగు డబ్బింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ రాబోతుంది. కొన్నిరోజుల క్రితం స్ట్రీమింగ్ డేట్ ప్రకటించగా.. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేసి మూవీ కాన్సెప్ట్ ఏంటనేది రివీల్ చేశారు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ తెలుగు సినిమా)గోమతి శంకర్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ 'స్టీఫెన్'. మిథున్ దర్శకత్వం వహించాడు. తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లోనూ ఇది వచ్చే నెల 5వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ట్రైలర్స్ రిలీజ్ చేశారు. ఇదైతే థ్రిల్లింగ్గానే ఉంది. కానీ ప్రేక్షకులని ఎంతవరకు ఆకట్టుకుంటుందనేది చూడాలి?ట్రైలర్ బట్టి చూస్తే.. స్టీఫెన్ జబ్రాజ్ అనే సైకో కిల్లర్ 6 నెలల్లో 9 మంది యువతులని చంపేస్తాడు. అది కూడా సినిమాలో ఛాన్స్ అని పిలిచి ఈ హత్యలు చేస్తాడు. కానీ ఊహించని విధంగా ఓ రోజు పోలీసుల దగ్గరకెళ్లి స్వయంగా ఇతడే లొంగిపోతాడు. పోలీసులు వెతకగా.. సదరు అమ్మాయిల వస్తువులు దొరుకుతాయి గానీ వాళ్ల బాడీలు మాత్రం ఎంతకీ కనిపించవు. స్టీఫెన్ నిజంగానే హత్యలు చేశాడా? ఇతడికి ఎవరైనా సాయం చేశారా?అనేది మిగతా స్టోరీలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: మహేశ్తో సినిమా ఫ్లాప్.. తొలిసారి ఆ విషయం అర్థమైంది: రకుల్) -
ఓటీటీలోకి అనుపమ పరమేశ్వరన్ కామెడీ థ్రిల్లర్
అనుపమ పరమేశ్వరన్ నటించిన తాజా మలయాళ కామెడీ థ్రిల్లర్ ‘ది పెట్ డిటెక్టివ్’. షరాఫుద్దీన్, వినాయకన్, శ్యామ్ మోహన్, జ్యోమన్ జ్యోతిర్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రణీష్ విజయన్ దర్శకత్వం వహిచారు. అక్టోబర్ 16న థియేటర్స్లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. దాదాపు ఐదు వారాల తర్వాత ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది. నవంబర్ 28 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ జీ5లో తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.ఈ సినిమా కథ విషయానికొస్తే.. జోస్ అలులా (షరాఫుద్దీన్) ఓ డిటెక్టివ్. అతనికి చెప్పుకోదగ్గక కేసులుండవు. అయితే తనను తాను నిరూపించుకోవాలని ఎదురు చూస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో కనిపించకుండా పోయిన ఓ పెంపుడు జంతువు కేసుని సాల్వ్ చేయటానికి ఒప్పుకుంటాడు. ఈ కేసుని శోధించే క్రమంలో ఏర్పడ్డ గందర గోళ పరిస్థితుల్లో ఇంటర్నేషనల్ స్మగ్లర్స్, కిడ్నాపర్స్, కనిపించకుండా పోయిన ఓ చిన్నారి, మెక్సికన్ మాఫియా డాన్, అరుదైన చేప, కనిపించకుండా పోయిన అమ్మాయిని వెతికే పోలీస్ ఇన్సెపెక్టర్ అందరూ ఈ కథలోకి ఎంట్రీ ఇస్తారు. కథలోని హాస్యం, విచిత్రమైన పాత్రలు, ఊహించని మలుపులు, ప్రియదర్శన్ శైలిని గుర్తు చేసే హై వోల్టేజ్ కామెడీ క్లైమాక్స్.. ఇవన్నీ కలిపి ‘ది పెట్ డిటెక్టివ్’ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్, కామెడీ మూవీ లవర్స్ సహా అందరినీ ఆకట్టుకుంటోంది. -
ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ తెలుగు సినిమా
రీసెంట్ టైంలో ప్రేమకథలతో సినిమాలు తీస్తున్నప్పటికీ బోల్డ్, రొమాంటిక్ కాన్సెప్ట్లు ఎక్కువగా తీస్తున్నారు. అలా ఈ నెల ప్రారంభంలో వచ్చిన మూవీ 'ప్రేమిస్తున్నా'. పలు హిట్ సినిమాల్లో బాలనటుడిగా చేసి గుర్తింపు తెచ్చుకున్న సాత్విక్.. ఈ చిత్రంలో హీరోగా నటించాడు. ప్రీతీ నేహా అనే అమ్మాయి హీరోయిన్గా చేసింది. ఇప్పుడీ ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. ఈ సినిమా సంగతేంటి? ఏ ఓటీటీలోకి రానుంది?(ఇదీ చదవండి: నీ ప్రేమ మళ్లీ కావాలి బాపూ.. తెలుగు దర్శకుడి ఇంట్లో విషాదం) సాత్విక్, ప్రీతీ నేహా జంటగా నటించిన ఈ రొమాంటిక్ బోల్డ్ సినిమాకు భాను దర్శకత్వం వహించారు. నవంబరు 7న థియేటర్లలోకి వచ్చింది. కంటెంట్ పరంగా బాగుందనే టాక్ తెచ్చుకున్నప్పటికీ స్టార్స్ లేకపోవడంతో ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. ఇప్పుడు మూడు వారాల్లోనే అంటే ఈ శుక్రవారం (నవంబరు 28) నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. రొమాంటిక్ బోల్డ్ లవ్ స్టోరీ సినిమాలంటే ఇష్టముంటే దీనిపై ఓ లుక్కేయండి.'ప్రేమిస్తున్నా' విషయానికొస్తే.. రైల్వేలో చిన్న ఉద్యోగం చేసే శారద, తన కొడుకుని (సాత్విక్ వర్మ) అల్లారుముద్దుగా పెంచుతుంది. బదిలీపై ఘట్కేసర్లోని రైల్వే కాలనీకి శారద కుటుంబం షిఫ్ట్ అవుతుంది. అదే కాలనీకి చెందిన అమ్మాయి (ప్రీతీ నేహా) వీళ్లకు సాయం చేయడానికి వస్తుంది. ఆమెతో తొలిచూపులోనే ప్రేమలో పడిన సాత్విక్.. 'నీతో రొమాన్స్ చేయాలని ఉంది' అని తొలి పరిచయంలోనే అడిగేస్తాడు. అమ్మాయి దీన్ని సిల్లీగా తీసుకుంటుంది. సాత్విక్ మాత్రం టైమ్ టేబుల్ వేసుకొని మరీ, ఆమెని ఫాలో అవుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో సాత్విక్తో అమ్మాయి రొమాన్స్కి ఒప్పుకొంటుంది. కానీ కండీషన్ పెడుతుంది. ఆ కండీషన్ ఏంటి? ప్రాణంగా ప్రేమించిన వాడిని ప్రీతీ ఎందుకు దూరం పెట్టింది? అమ్మాయి కోసం అతడు పిచ్చోడిలా ఎందుకు మారాల్సి వచ్చింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'మాస్ జాతర'తో పాటు ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు) -
ఓటీటీలోకి 'మాస్ జాతర'.. అధికారిక ప్రకటన
హీరో రవితేజ సినిమాలైతే చేస్తున్నాడు గానీ సరైన హిట్ పడట్లేదు. ఈ నెల ప్రారంభంలోనే 'మాస్ జాతర' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. గతంలో 'ధమాకా'తో హిట్ కొట్టడంతో ఇందులోనూ శ్రీలీలనే హీరోయిన్గా పెట్టుకున్నారు. కానీ కాంబో ఈసారి పనిచేయలేదు. థియేటర్లలో అంతంత మాత్రంగానే ఆడిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది.రవితేజ, శ్రీలీల కాంబోలో వచ్చిన 'మాస్ జాతర' చిత్రాన్ని కమర్షియల్ అంశాలతో తీశారు. కానీ కంటెంట్ మరీ తీసికట్టుగా ఉండటంతో థియేటర్లలో తొలి ఆట నుంచే ఈ మూవీ తేలిపోయింది. అయితే బాక్సాఫీస్ దగ్గర మరో మాస్ సినిమా లేకపోవడంతో జనాలు కాస్తోకూస్తో చూసేందుకు వచ్చారు. విడుదలకు ముందే డిజిటల్ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. థియేటర్లలోకి వచ్చిన నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చేలా డీల్ సెట్ చేసుకున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)అలా ఈ శుక్రవారం అంటే నవంబరు 28 నుంచి నెట్ఫ్లిక్స్లోకి 'మాస్ జాతర' రానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ సినిమా విషయానికొస్తే.. లక్ష్మణ్ భేరి (రవితేజ) నిజాయితీ గల రైల్వే పోలీస్. వరంగల్లో పనిచేసేటప్పుడు ఓ మంత్రి కొడుకుని కొడతాడు. దీంతో అల్లూరి జిల్లాలోని అడవివరం రైల్వే స్టేషన్కి ట్రాన్స్ఫర్ అవుతాడు. దీనికి సమీపంలో కొండల మధ్య ఉండే గిరిజన ప్రాంతాన్ని శివుడు (నవీన్ చంద్ర) శాసిస్తుంటాడు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని రైతులతో శీలావతి రకం గంజాయిని పండించి, దాన్ని కోల్కతాకు స్మగ్లింగ్ చేస్తుంటాడు.లక్ష్మణ్ ఆ ఊరిలోకి అడుగు పెట్టడంతోనే శివుడికి ఎదురెళ్లడం మొదలుపెడతాడు. జిల్లా ఎస్పీ నుంచి మొదలుకుని మొత్తం రాజకీయ వ్యవస్థ అండగా ఉన్న శివుడిని ఓ మామూలు రైల్వే ఎస్సై ఎలా అడ్డుకున్నాడు? అతడి గంజాయి సామ్రాజ్యాన్ని ఎలా కూలదోశాడు? ఇందులో తులసి (శ్రీలీల), హనుమాన్ (రాజేంద్ర ప్రసాద్)ల పాత్రల సంగతేంటి అనేది మిగిలిన స్టోరీ.(ఇదీ చదవండి: కాబోయే భార్యకు మర్చిపోలేని సర్ప్రైజ్ ఇచ్చిన రాహుల్) -
అమెజాన్ ఓటీటీపై ఘోరంగా ట్రోలింగ్.. ఏంటి విషయం?
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 'పైరసీ' అనే భూతంపై పెద్ద చర్చే నడుస్తోంది. ఎప్పటినుంచో దీని గురించి అందరికీ తెలుసు. కానీ 'ఐ బొమ్మ' సైట్ నిర్వహకుడు రవి అరెస్ట్ కావడంతో మరోసారి చర్చకు కారణమైంది. సామాన్యులు చాలామంది రవికే తమ సపోర్ట్ అని అంటున్నారు. దానికి కారణాలు బోలెడు. నిర్మాతలు ఇష్టమొచ్చినట్లు టికెట్ రేట్లు పెంచేస్తున్నారని, దానికి తోడు థియేటర్లలోనూ పార్కింగ్, తినుబండరాల ధరలు అధికంగా ఉన్నాయని అంటున్నారు. వీటికి తోడు ఇప్పుడు మరో సమస్య కూడా చేరినట్లు కనిపిస్తుంది.గత శుక్రవారం 'ద ఫ్యామిలీ మ్యాన్' అనే తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్, అమెజాన్ ప్రైమ్లో రిలీజైంది. తొలి రెండు సీజన్లతో పోలిస్తే ఈసారి ఓకే ఓకే అనిపించుకుంది. అయితే 50 నిమిషాలుండే ప్రతి ఎపిసోడ్లోనూ నాలుగైదు యాడ్స్ వస్తున్నాయని, దీంతో సిరీస్ చూడాలంటే చిరాకు వస్తుందని చాలామంది యూజర్స్.. సోషల్ మీడియాలో తన అసహనం బయటపెడుతున్నారు. యాడ్స్ భరిస్తూ కొందరు చూస్తున్నప్పటికీ.. మరికొందరు మాత్రం నిర్ధాక్షిణ్యంగా ఈ కారణం వల్లే పైరసీ సైట్లో సిరీస్ చూశానని, అందులో ఒక్క యాడ్ కూడా రాలేదని పోస్టులు పెడుతున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)కొన్నేళ్ల క్రితం జనాలు యూట్యూబ్లో వీడియోలు, సినిమాలు చూసేవారు. విపరీతమైన యాడ్స్ రావడంతో.. వాళ్లలో చాలామంది ఓటీటీలకు షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు అమెజాన్, హాట్స్టార్ లాంటి ఓటీటీల్లోనూ యాడ్స్ వస్తున్నాయి. దీంతో డబ్బులు కట్టి సబ్స్క్రిప్షన్ తీసుకున్నాసరే ఈ యాడ్స్ గోలేంట్రా బాబు అని చిరాకు పడుతున్నారు. మరీ 40-50 నిమిషాల ఎపిసోడ్కి 4-5 యాడ్స్ రావడం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇది ఇలానే జరిగితే ఓటీటీల్లోనూ జనాలు సినిమాలు చూడటం తగ్గించేయడం గ్యారంటీ. అప్పుడు కూడా నష్టపోయేది నిర్మాతలే.ఓటీటీలు వచ్చిన తర్వాత కొంతమేర పైరసీ తగ్గిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు డబ్బుల కోసం వాళ్లు కూడా యాడ్స్ వేస్తున్నారు. ఇలాంటి అత్యాశ.. మరిన్ని పైరసీ సైట్ల పెంచి పోషించేందుకు కారణమయ్యే అవకాశాలే ఎక్కువ. అమెజాన్ ప్రైమ్ వీడియోనే తీసుకుంటే.. కొన్ని సినిమాల్ని నేరుగా రిలీజ్ చేస్తారు. కొన్నింటిని మాత్రం రెంటల్ బేసిస్(అద్దె విధానం) అని చెప్పి మళ్లీ కొంత డబ్బు చెల్లిస్తేనే చూడటం కుదురుతుందని అంటారు. చాలా ఛానెల్స్ చూపిస్తారు. మళ్లీ వాటిల్లో సినిమాలు చూడాలి అంటే సెపరేట్గా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అంటారు. ఇవన్నీ గత కొన్నిరోజుల నుంచి ఉన్నప్పటికీ.. తాజాగా 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ వల్ల మరోసారి వెలుగులోకి వచ్చాయి. (ఇదీ చదవండి: మళ్లీ వచ్చేశాడు.. 'ద ఫ్యామిలీ మ్యాన్ 3' రివ్యూ) -
ఓటీటీలో హారర్ అడ్వెంచర్ సిరీస్.. కొత్త సీజన్ ట్రైలర్
ఓటీటీల్లో చాలామంది దాదాపుగా సినిమాలే చూస్తారు. ఇంకొందరు మాత్రం వెబ్ సిరీస్లు చూస్తుంటారు. తెలుగులో తక్కువే గానీ ఇంగ్లీష్ భాషలో మాత్రం లెక్కలేనన్ని సిరీస్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ల వరకు నచ్చిన వాటిలో నెట్ఫ్లిక్స్లో ఉన్న 'స్ట్రేంజర్ థింగ్స్' ఒకటి. ఇప్పుడు దీని నుంచి చివరి సీజన్ వచ్చేందుకు సిద్ధమైంది. కానీ దీన్ని మూడు భాగాలుగా రిలీజ్ చేస్తున్నాడు. తొలి పార్ట్ ఈ వారంలోనే రానుండగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)2016లో తొలి సీజన్ రాగా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందన వచ్చింది. 2017లో రెండో సీజన్, 2019లో మూడో సీజన్, 2022లో నాలుగో సీజన్ వచ్చాయి. ఇప్పుడు అంటే దాదాపు మూడేళ్ల తర్వాత చివరిదైన ఐదో సీజన్ రాకకు రంగం సిద్ధమైంది. ఒకేసారి కాకుండా మూడు భాగాలు రిలీజ్ చేస్తున్నారు. భారత కాలమానం ప్రకారం తొలి పార్ట్ ఈ గురువారం(నవంబరు 27) ఉదయం స్ట్రీమింగ్ కానుంది. దాని ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ చేశారు. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంటూ ఎపిసోడ్స్ ఎప్పుడొస్తాయా అనే ఆత్రుత పెంచుతోంది.గత సీజన్లలన్నీ తెలుగు డబ్బింగ్లోనూ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు రాబోయే ఐదో సీజన్ కూడా ఇంగ్లీష్తో పాటు తెలుగు, తమిళ, హిందీ వెర్షన్లోనూ స్ట్రీమింగ్ కానుంది. నాలుగు ఎపిసోడ్ల తొలి పార్ట్ నవంబరు 27న, మూడు ఎపిసోడ్ల రెండో పార్ట్ డిసెంబరు 25న, క్లైమాక్స్ ఎపిసోడ్ ఉండే చివరి పార్ట్ జనవరి 1న స్ట్రీమింగ్ కానుంది. హారర్ కామెడీ అడ్వెంచర్ కాన్సెప్ట్తో దీన్ని తీశారు. హాకిన్స్ అనే ఊరిలో నలుగురు పిల్లలు, వీళ్లకు తోడు మరికొందరు.. వీళ్లంతా కలిసి హంగామానే ఈ సిరీస్. కామెడీకి కామెడీ ఉంటూనే మైండ్ బ్లోయింగ్ స్టోరీ కూడా ఈ సిరీస్లో ఉంది.(ఇదీ చదవండి: మాజీమంత్రి ఎర్రబెల్లితో ఫొటో పంచాయితీ.. బ్రహ్మానందం క్లారిటీ) -
ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. ఈసారి రామ్ 'ఆంధ్ర కింగ్ తాలుకా', కీర్తి సురేశ్ 'రివాల్వర్ రీటా', ధనుష్ 'అమర కావ్యం' లాంటి పెద్ద సినిమాలతో పాటు అంధక, ఖైదు, స్కూల్ లైఫ్, మరువ తరమా! లాంటి తెలుగు చిన్న మూవీస్ థియేటర్లలోకి రానున్నాయి. ఉన్నంతలో రామ్ మూవీపై మాత్రమే కాస్తోకూస్తో హైప్ ఉంది. మరోవైపు ఓటీటీల్లోనూ 15 వరకు సినిమాలు-వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్ కానున్నాయి.(ఇదీ చదవండి: 23 ఏళ్ల ప్రేమ.. గుళ్లో పెళ్లి చేసుకున్న సీరియల్ జంట)ఓటీటీల్లో రిలీజయ్యే వాటిలో ఆర్యన్, శశివదనే చిత్రాలు కొద్దో గొప్పో చూసే లిస్టులో ఉండగా.. ఈ వీకెండ్లో రవితేజ 'మాస్ జాతర' కూడా స్ట్రీమింగ్ కానుందనే టాక్ వినిపిస్తుంది. ఇవి కాకుండా స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ ఐదో సీజన్, జాన్వీ కపూర్ 'సన్నీ సంస్కారీ కీ తులసి' కూడా ఉన్నాయి. కాకపోతే వీటికి సెపరేట్ ఆడియెన్స్ ఉన్నారు. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీస్ రాబోతున్నాయంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (నవంబరు 24 నుంచి 30వ తేదీ వరకు)నెట్ఫ్లిక్స్స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 పార్ట్ 1 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబరు 26జింగిల్ బెల్ హైస్ట్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 26సన్నీ సంస్కారి కీ తులసి కుమారి (హిందీ చిత్రం) - నవంబరు 27మాస్ జాతర (తెలుగు మూవీ) - నవంబరు 27 (రూమర్ డేట్)ఆర్యన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబరు 28లెఫ్ట్ హ్యాండెడ్ గర్ల్ (మాండరిన్ మూవీ) - నవంబరు 28హాట్స్టార్బార్న్ హంగ్రీ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 28అమెజాన్ ప్రైమ్వుయ్ ఆర్ గ్రీన్ లాండ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - నవంబరు 24 (రెంట్ విధానం)జీ5రేగాయ్ (తమిళ సిరీస్) - నవంబరు 28ద పెట్ డిటెక్టివ్ (మలయాల సినిమా) - నవంబరు 28రక్తబీజ్ (బెంగాలీ మూవీ) - నవంబరు 28సన్ నెక్స్ట్శశివదనే (తెలుగు సినిమా) - నవంబరు 28ఆపిల్ టీవీ ప్లస్ప్రీ హిస్టారిక్ ప్లానెట్: ఐస్ ఏజ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 26వండ్లా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 26లయన్స్ గేట్ ప్లేప్రీమిటివ్ వార్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 28(ఇదీ చదవండి: మాజీమంత్రి ఎర్రబెల్లితో ఫొటో పంచాయితీ.. బ్రహ్మానందం క్లారిటీ) -
బెస్ట్ హారర్ సినిమా.. ఎట్టకేలకు తెలుగులో స్ట్రీమింగ్
మీలో చాలామంది అమెజాన్ ప్రైమ్లో 'టాక్ టు మి' Talk to Me (2022) చిత్రాన్ని చూసే ఉంటారు. ఆస్ట్రేలియన్ హారర్ మూవీ సంచలన విజయం సాధించింది. దీనిని తెరకెక్కించిన దర్శకులు డానీ, మైఖేల్ ఫిలిప్పో మరోసారి అద్బుతమైన హారర్ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించారు. 'బ్రింగ్ హర్ బ్యాక్' (Bring Her Back) పేరుతో మరో హారర్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా ఆకట్టకున్నారు. ఈ ఏడాది మే నెలలో విడుదలైన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి తెలుగు వర్షన్ వచ్చేసింది. అయితే, ఇప్పటికే ఇంగ్లీష్ వర్షన్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.'బ్రింగ్ హర్ బ్యాక్' తాజాగా నెట్ఫ్లిక్స్ విడుదల చేసింది. తెలుగు వర్షన్తో పాటు తమిళ్, హిందీలో స్ట్రీమింగ్ అవుతుంది. సినిమా సూపర్నేచురల్ హారర్, బాడీ హారర్, సైకాలజికల్ హారర్ అంశాలతో నిండి ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ హారర్ చిత్రంగా కూడా ఎంపికైంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా అందుబాటులో ఉంది. కానీ, దీన్ని చూడటానికి రూ. 75 చెల్లించాలి. అంతేకాకుండా, తెలుగు వెర్షన్ అందుబాటులో లేదు. -
ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా తెలుగు మూవీస్ ప్రతివారం ఏదో ఒకదానిలో స్ట్రీమింగ్ అవుతూనే ఉంటుంది. రాబోయే వీకెండ్ కూడా అలా పలు చిత్రాలు స్ట్రీమింగ్కి సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు వీటితో పాటు ఓ తెలుగు రొమాంటిక్ లవ్ స్టోరీ కూడా రానుంది. ఈ మేరకు అధికారికంగా స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు.(ఇదీ చదవండి: తెలిసిన విషయాలే కానీ మనసుని మెలిపెట్టేలా.. ఓటీటీ రివ్యూ)రక్షిత్, కోమలి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'శశివదనే'. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ.. ఎట్టకేలకు గత నెలలో అంటే అక్టోబరు 10న థియేటర్లలో రిలీజైంది. కంటెంట్ అంతంత మాత్రమే ఉండేసరికి పెద్దగా జనాల్లోకి రీచ్ కాలేదు. వచ్చిన కొన్నిరోజులకే మాయమైపోయింది. దాదాపు నెలన్నర తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వస్తున్నట్లు ప్రకటించారు. నవంబరు 28 నుంచి సన్ నెక్స్ట్లోకి రానుంది.'శశివదనే' విషయానికొస్తే.. గోదావరి లంకల్లోని ఓ పల్లెటూరి కుర్రాడు రాఘవ(రక్షిత్ అట్లూరి). పీజీలో కెమిస్ట్రీ చేసేందుకు రెడీ అవుతుంటాడు. తల్లి లేకపోవడంతో తండ్రి (శ్రీమాన్) ఇతడిని పెంచి పెద్ద చేస్తాడు. తన తండ్రిలానే లవ్ మ్యారేజ్ చేసుకోవాలని రాఘవ అనుకుంటూ ఉంటాడు. ఓరోజు అనుకోకుండా శశి(కోమలి ప్రసాద్)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమ పొందేందుకు తెగ ప్రయత్నిస్తాడు. ఈ ప్రయాణంలో ఏం జరిగింది? ఈ ప్రేమకథలో తలెత్తిన సమస్యలేంటి? ప్రేమికుడైన రాఘవ జైలు పాలవ్వడానికి కారణమేంటి? అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా.. హీరోగా బాలనటుడు)One love. One promise. One unforgettable story. 💫 Sasivadane premieres Nov 28 — only on Sun NXT. He loved once… and forever. ❤️ #Sasivadane #SunNXT #LoveStory #OnePromiseForever #NewPremiere #TeluguCinema #RomanticTales… pic.twitter.com/OLZ6ptHrWM— SUN NXT (@sunnxt) November 23, 2025 -
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా.. హీరోగా బాలనటుడు
అప్పట్లో బాలనటుడిగా సినిమాలు చేసిన మాస్టర్ మహేంద్రన్ ఇప్పుడు హీరో అయిపోయాడు. ఇతడితో పాటు బ్రహ్మాజీ, శత్రు తదితరులు నటించిన కొత్త సినిమా 'కర్మణ్యే వాధికారస్తే'. అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఎందులో ఉంది? సినిమా సంగతేంటి అనేది చూద్దాం.(ఇదీ చదవండి: 'స్పిరిట్'లో రవితేజ, త్రివిక్రమ్ కొడుకులు.. ఫొటో వైరల్)అక్టోబరు 31న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. ఇప్పుడు మూడు వారాల్లోనే స్ట్రీమింగ్లోకి వచ్చేసింది. ప్రస్తుతం సన్ నెక్స్ట్ ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇక ఓటీటీ రిలీజ్ గురించి మాట్లాడిన దర్శకుడు.. థియేటర్లో చూడనివారు సన్ నెక్స్ట్ ఓటీటీలో చూసి మా మూవీని ఎంజాయ్ చేయండి అని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: గ్రాండ్గా నిర్మాత అశ్వనీదత్ మూడో కూతురి పెళ్లి) -
'ఆమె'పై అనుమానం.. ఓటీటీలో ఈ మలయాళ చిత్రం చూశారా?
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం అవిహితమ్ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. కల్యాణమొచ్చినా, కక్కొచ్చినా ఆగదంటారు అన్నది నాటి నానుడైతే అనుమానమొచ్చినా ఆనందమొచ్చినా ఆపుకోలేరన్నది నేటి మాట. అనుమానమొస్తే మాత్రం అది తెలుసుకునేంతవరకు నిద్రపట్టదు కొందరికి. తమకు సగమే తెలిసిన గోరంత విషయాన్ని కొండంత చేసి, అవతలి వాళ్ళలో అనుమానపు బీజాలు నాటే బడా బాబులు చాలామందే ఉంటారు. మరీ ముఖ్యంగా ఇలాంటివాళ్ళ వల్లే పల్లెటూళ్ళలో కొన్ని చోట్ల గాలివార్తలకు కొదవ లేకుండా పోతుంది. వాళ్ళను దృష్టిలో ఉంచుకుని రాసిన కథే ఈ ‘అవిహితమ్’. వైవిధ్యానికి పెద్ద పీట వేసుకుంటూ తమ ప్రేక్షక పరిధిని ఈ ఓటీటీ కాలంలో పెంచుకుంటూ పోతున్న మలయాళ సినీ పరిశ్రమ నుండి వచ్చిన మరో మణిమాణిక్యమే ఈ ‘అవిహితమ్’. ఇది నిజంగా హాస్యప్రియమ్ అని చెప్పాలి. చిన్న పాయింట్తో దాదాపు రెండు గంటలపాటు ప్రేక్షకుడిని కదలకుండా కట్టిపడేశారు ఈ సినిమా దర్శకుడు సెన్నా హెగ్డే. ఈ ‘అవిహితమ్’లో అంతలా ఏముందో ఓసారి చూద్దాం. అది ఓ మారుమూల పల్లెటూరు. ప్రకాశన్ అనే వ్యక్తి ఓ రోజు రాత్రి ఫ్రెండ్స్తో మందు పార్టీ ముగించుకుని తన ఇంటికి వెళ్ళబోతుండగా దొంగతనంగా సన్నిహితంగా ఉన్న ఓ జంటను వడ్రంగి మాధవన్ ఇంటి పరిసరాల్లో చూసి అవాక్కవుతాడు. ఆ జంట ప్రతి రోజూ ఓ సమయంలో కలవడంతో పాటు ఆ జంటలో మాధవన్ వదిన నిర్మల ఉందన్న విషయాన్ని గుర్తుపట్టి, ఇదే విషయాన్ని ఊళ్ళో కాస్త పెద్ద తరహాగా వ్యవహరించే టైలర్ వేణన్నకు చెబుతాడు ప్రకాశన్. మాధవన్కు ఈ విషయాన్ని ఆ వేణన్న చేరవేస్తాడు. మాధవన్ ఈ విషయాన్ని తన తండ్రికి, అలాగే తన సోదరుడు ముకుందన్కు చెబుతాడు. అలా మెల్లమెల్లగా ఊరంతా ఈ విషయం పాకి పోతుంది. ఆ జంటను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి ఊరంతా ఏకమై ఓ పెద్ద ఆపరేషనే చేపడతారు. మరి... ఈ ఆపరేషన్లో ఆ జంట దొరికిపోతుందా? దొరికిన తరువాత మాధవన్ కుటుంబంతో పాటు ఊరి ప్రతిస్పందన ఎలా ఉంటుందనే విషయాన్ని ‘అవిహితమ్’లోనే చూడాలి. ఈ సినిమా మొత్తం ఓ అనుమానంతో ప్రారంభమైతే చూసే ప్రేక్షకులకు కూడా ఆ అనుమానం నివృత్తి చేసుకోవాలనే తపన అంతకంతకూ పెరుగుతుంది. హాట్ స్టార్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా లభ్యమవుతోంది. ఈ ‘అవిహితమ్’ హాస్యప్రియమ్ కాబట్టి ఇది ప్రేక్షకప్రియమ్. మస్ట్ వాచ్ ఫర్ ది వీకెండ్. – హరికృష్ణ ఇంటూరు -
తెలిసిన విషయాలే కానీ మనసుని మెలిపెట్టేలా.. ఓటీటీ రివ్యూ
కమర్షియల్ సినిమాలు ఎప్పుడూ వచ్చేవే. కానీ రియలస్టిక్ చిత్రాలు మాత్రం అరుదుగా వస్తుంటాయి. అలా అని అవేదో గొప్ప మూవీస్ అని కాదు. మనకు తెలిసిన విషయాల్నే కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి. అలాంటి ఓ మూవీనే 'హౌమ్ బౌండ్'. మన దేశం తరఫున అధికారిక ఎంట్రీగా ఆస్కార్ బరిలో ఉంది. థియేటర్లలో రిలీజైనప్పుడు కొందరికే రీచ్ అయింది. ఇప్పుడు ఓటీటీలోకి రావడంతో దీని గురించి మూవీ లవర్స్ మాట్లాడుకుంటున్నారు. ఇషాన్ కట్టర్, విశాల్ జెత్వా, జాన్వీ కపూర్ నటించిన ఈ సినిమా సంగతేంటి? ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: బిగ్బాస్ 9: అనుకున్నట్లే ఈ వారం ఆమెనే ఎలిమినేట్!)కథేంటి?ఇది షోయబ్ అలీ (ఇషాన్ కట్టర్), చందన్ కుమార్ (విశాల్ జెత్వా) అనే ఇద్దరు స్నేహితుల కథ. ఓ పల్లెటూరిలో వీళ్లిద్దరూ బతుకుంటారు. తక్కువ కులాలకు చెందిన వాళ్లు కావడంతో ఎవరూ వీళ్లకు కనీస గౌరవం ఇవ్వరు. పోలీస్ కానిస్టేబుల్ అయితే ఊరిలో తమకు గౌరవం దక్కుతుందని అనుకుంటారు. కానీ పరిస్థితులు వీళ్లపై పగబడతాయి. ఇంతకీ ఏమైంది? అలీ, చందన్.. పోలీస్ ఉద్యోగాలు సాధించారా లేదా? కరోనా వల్ల వీళ్ల జీవితంలో ఏం జరిగిందనేది అసలు స్టోరీ.ఎలా ఉందంటే?'ఏ ఫ్రెండ్షిప్, ఏ పాండమిక్ అండ్ ఏ డెత్ బిసైడ్ ద హైవే' అనే ఆర్టికల్ ఆధారంగా తీసిన సినిమా ఇది. ఇందులో కొత్త విషయాలు అంటూ ఏం ఉండవు. మన చుట్టూ జరిగేవే ఇందులోనూ కనిపిస్తాయి. మరి ఏంటి ప్రత్యేకత అంటే.. వాటిని చూపించిన విధానం. చాలా సహజంగా ఉంటుంది. 2025 వచ్చినా సరే ఇప్పటికీ సమాజంలో కుల, మత వివక్ష అనేది ఎంత దారుణంగా ఉందనేది కళ్లకు కట్టినట్లు చూపించిన చిత్రమిది. మనం ఇలాంటి సమాజంలో బతుకుతున్నామా అని మనల్ని మనమే ప్రశ్నించుకునేలా చేసే మూవీ ఇది.ప్రభుత్వం లేదా సమాజం చర్యల వల్ల ఎప్పుడూ ప్రభావితమయ్యేది దిగువ మధ్యతరగతి కుటుంబాలే. అది నోట్ల రద్దు కావొచ్చు, లాక్ డౌన్ కావొచ్చు. అసలు సామాన్య ప్రజలు ఈ పరిస్థితుల్ని ఎలా తట్టుకోగలరు అనేది ప్రభుత్వం ఎప్పడైనా ఆలోచిస్తుందా అనే ప్రశ్న రేకెత్తించేలా చేసే సినిమా ఇది. కరోనా అనేది ఇప్పుడు బతుకుతున్న చాలామంది జీవితాల్ని తలకిందులు చేసింది. ఫ్యాక్టరీలు మూతపడ్డాయి, ఉద్యోగాలు పోయాయి. చాలామంది కార్మికులు వందల కిలోమీటర్లు నడిచి సొంతూళ్లకు వెళ్లారు. చాలామంది మధ్యలోనే ప్రాణాలు కూడా విడిచారు. అలాంటి ఓ కథే ఈ సినిమా.కరోనా ఒక్కటే కాదు ఇప్పటికీ కులం కారణంగా కొందరూ ఎలాంటి అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాల్లోనూ ఎలాంటి అణిచివేతకు గురవుతున్నారనే విషయాన్ని మనసుని మెలిపెట్టేలా చూపించిన మూవీ ఇది. ప్రతి సీన్ చాలా సహజంగా ఉంటుంది. యాక్టర్స్ ఎవరూ కూడా నటిస్తున్నట్లు అసలు అనిపించదు. అంత సహజంగా చేశారు. లీడ్ యాక్టర్స్ అయిన ఇషాన్ కట్టర్, విశాల్ జెత్వా ఫెర్ఫార్మెన్స్ కూడా అదే రేంజులో ఉంటుంది. ఇంటర్వెల్ ముందొచ్చే సీన్ కావొచ్చు క్లైమాక్స్లో తన స్నేహితుడు చనిపోయాడని తెలిసి బాధపడే సన్నివేశం గానీ మనల్ని కూడా ఏడిపించేస్తాయి.అలా అని ఈ సినిమా అందరికీ నచ్చుతుందా అంటే లేదు. రెండు గంటల మూవీలో చాలా డ్రామా ఉంటుంది. ఇందులో లీనమైతే తప్ప ఇది మీకు నచ్చదు. లేదు కమర్షియల్ అంశాలు కావాలనుకుంటే మాత్రం దీన్ని చూడొద్దు. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: 21న థియేటర్లలో 21 సినిమాలు రిలీజ్.. ఏది హిట్? ఏది ఫట్?) -
‘3 రోజెస్’ సీజన్ 2 టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఓటీటీలో లేటెస్ట్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమిళ హీరో విష్ణు విశాల్ (Vishnu Vishal) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆర్యన్ (Aaryan Movie). తెలుగమ్మాయి మానస చౌదరి హీరోయిన్గా నటించింది. శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్ర పోషించింది. ప్రవీణ్.కె దర్శకత్వం వహించిన ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ అక్టోబర్ 21న విడుదలైంది. ఈ చిత్రాన్ని హీరో నితిన్ తండ్రి, నిర్మాత సుధాకర్ రెడ్డి తెలుగులో రిలీజ్ చేశారు. ఓటీటీలో ఆర్యన్వారం ఆలస్యంగా నవంబర్ 7న తెలుగు రాష్ట్రాల్లో విడుదలైంది. సినిమాకు టాక్ బాగున్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం పెద్దగా రాలేదు. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వస్తోంది. నవంబర్ 28న ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో విడుదలవుతోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఆర్యన్ అందుబాటులోకి రానుంది. థియేటర్లలో మిస్ అయినవారు ఓటీటీలో ఎంచక్కా చూసేయొచ్చు!కథేంటంటే?ఆత్రేయ (సెల్వ రాఘవన్) అనే వ్యక్తి ఓ న్యూస్ ఛానెల్కి వెళ్తాడు. తాను ఫెయిల్యూర్ రచయితనని చెప్తూ రాబోయే ఐదు రోజుల్లో ఐదు హత్యలు చేస్తానని చెప్తాడు. అంతలోనే గన్తో కాల్చుకుని చనిపోతాడు. ఈ కేసును పోలీసు అధికారి నంది (విష్ణు విశాల్)కి అప్పగిస్తారు. ఆత్రేయ బతికి లేకపోయినా హత్యలు జరుగుతుంటాయి? అదెలా సాధ్యం? అన్నది తెలియాలంటే ఓటీటీలో ఆర్యన్ చూడాల్సిందే! #Aaryan - thrilling your NETFLIX screens from 28th November!@TheVishnuVishal @VVStudioz @adamworx @selvaraghavan @ShraddhaSrinath @Maanasa_chou @GhibranVaibodha @dop_harish @Sanlokesh @silvastunt @PC_stunts @jayachandran46 @itshravanthi @prathool @Netflix_INSouth @SreshthMovies… pic.twitter.com/I2JRhlRKve— Vishnu Vishal Studioz (@VVStudioz) November 22, 2025 చదవండి: నిన్ను ఒక్కసారి ముట్టుకోవచ్చా? -
ఓటీటీలోకి కితకితలు పెట్టించే సినిమా.. ‘జాలీ ఎల్ఎల్బి 3 ’ కథేంటి?
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం జాలీ ఎల్ఎల్బి 3 ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. పక్కవాడు బాగుంటే ఆనందపడేవాళ్ళు కొందరైతే... మనవాళ్ళైనా సరే బాగుపడుతుంటే చూసి ఈర్ష్య పడేవాళ్ళు మరికొందరు. ఆ మరికొందరిపై అల్లుకున్న కథే ఈ ‘జాలీ ఎల్ఎల్బి 3’ సినిమా. వాదన ప్రతివాదన అనేది నిత్యం ఎక్కువగా జరిగేది న్యాయవాదుల మధ్యనే కదా. అంటే... న్యాయస్థానాలు దాదాపుగా గంభీర వాతావరణంలో ఉంటాయి. కానీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న ఈ ‘జాలీ ఎల్ఎల్బి 3’ సినిమా చూస్తే మాత్రం మీకు కితకితలు ఖాయం. ‘జాలీ ఎల్ఎల్బి’ సిరీస్లో వచ్చిన మూడవ భాగమిది. మొదటి భాగం నుండి ఇప్పటివరకు ప్రతి సిరీస్లో కనిపించిన నటుడు అర్షద్ వార్సీ, ఇతని కాంబినేషన్లో అక్షయ కుమార్ నటించిన ఈ చిత్రానికి సిరీస్లో అన్ని చిత్రాలను తెరకెక్కించిన సుభాష్ కపూరే దర్శకత్వం వహించారు. నిజజీవిత ఆధారిత ఘటనల చుట్టూ కథలను అల్లుకొని రూపొందించిన ఈ ప్రతి సిరీస్లోని హ్యూమర్ స్క్రీన్ప్లే ప్రేక్షకులను అలరిస్తుంది. ఈసారి కూడా అలాంటి ప్రయత్నమే చేసి, ప్రేక్షకుల దగ్గర మార్కులు కొట్టేశారు ఈ జాలీ ఎల్ఎల్బి. ఇక ఈ సినిమా కథాంశానికొస్తే... దేశాన్ని కుదిపేసిన రైతుల ఉద్యమం చుట్టూ ఈ కథ నడుస్తుంది. రాజస్థాన్ రాష్ట్రంలోని రాజారాం సోలంకి అనే రైతుకి సంబంధించిన ఓ పొలం వివాదం పై కోర్టులో జానకి అనే ఆవిడ కేసు వేసి ఉంటుంది. బికనీర్ టు బోస్టన్ ప్రాజెక్టు కోసం పరసూల్ ప్రాంతంలో ఉన్న పొలాలన్నిటినీ కేతన్ అనే వ్యాపారవేత్త అక్రమంగా లాక్కుంటాడు. జానకితో పాటు చాలా మంది రైతులు ఇదే వివాదంపై కోర్టు మెట్లెక్కుతారు. ఢిల్లీ సెషన్స్ కోర్టు ప్రాంగణంలో మీరట్కు చెందిన జగదీష్ త్యాగి, కాన్పూర్కి చెందిన జగదీష్ మిశ్రా ‘లా’ ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇద్దరి పేర్లు దాదాపుగా ఒకటవడం వల్ల ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. ఇదే నేపథ్యంలో జానకి తన పిటిషన్తో వీళ్ళిద్దరి మధ్యకు చేరుతుంది. ఒకరంటే ఒకరికి పడని ఇద్దరు లాయర్లతో అవతల కోట్లకు పడగెత్తిన ప్రముఖ వ్యాపారవేత్తపై తాను చేస్తున్న ఈ న్యాయ పోరాటంలో జానకి గెలుస్తుందా? లేదా అన్నది ‘జాలీ ఎల్ఎల్బి 3’ సినిమాలోనే చూడాలి. చాలా సీరియస్ సబ్జెక్ట్ అయినా సరదా సరదాగా సాగిపోతుందీ సినిమా. ఓ పక్క మెయిన్ పాయింట్ నుండి పక్కకు వెళ్ళకుండా... అలా అని ప్రేక్షకుడిని మరీ సీరియస్ మోడ్లోకి తీసుకెళ్ళకుండా చాలా గ్రిప్పింగ్గా ఉంటుందీ సినిమా. మస్ట్ వాచ్. – హరికృష్ణ ఇంటూరు -
ఓటీటీలోకి లేటెస్ట్ కామెడీ హిట్ సినిమా
అన్నిసార్లు పెద్ద సినిమాలే కాదు అప్పుడప్పుడు చిన్న మూవీస్ కూడా అద్భుతాలు చేస్తుంటాయి. ప్రేక్షకుల్ని మనసారా నవ్విస్తాయి. అలాంటి ఓ చిత్రమే 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'. తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన ఈ సినిమాని ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కించారు. రాహుల్ శ్రీనివాస్ అనే కొత్త దర్శకుడు తీసినప్పటికీ తొలి ఆట నుంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది.ప్రీ వెడ్డింగ్ షూటింగ్ చేసిన మెమొరీ కార్డ్ పోతే.. ఓ ఫొటోగ్రాఫర్ ఎలాంటి తిప్పలు పడ్డాడు? దీని నుంచి వచ్చే కామెడీ అనే సింపుల్ పాయింట్తో తీసిన సినిమా ఇది. చెబుతుంటే స్టోరీ ఇంతేనా అనిపిస్తుంది గానీ చూస్తున్నప్పుడు మాత్రం మంచి కామెడీతో అలరిస్తుంది. నవంబరు 7న థియేటర్లలోకి రాగా పాజిటివ్ టాక్తో పాటు డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ చిత్రాన్ని డిసెంబరు 5 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. థియేటర్లో మిస్ అయినోళ్లు ఓటీటీలోకి వచ్చాక తప్పక చూడండి.(ఇదీ చదవండి: మళ్లీ వచ్చేశాడు.. 'ద ఫ్యామిలీ మ్యాన్ 3' రివ్యూ)'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' విషయానికొస్తే.. పల్లెటూరిలో ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడంలో ఆరితేరిన ఫొటోగ్రాఫర్ రమేశ్ (తిరువీర్). స్టూడియోకి ఎదురుగా ఉండే పంచాయతీ ఆఫీస్లో పనిచేసే హేమ(టీనా శ్రావ్య)ని ఇష్టపడుతంటాడు. ఆమెకీ రమేశ్ అంటే ఇష్టమే. కట్ చేస్తే రమేశ్ దగ్గరకు ప్రీ వెడ్డింగ్ షూట్ కోసమని ఆనంద్(నరేంద్ర రవి) వస్తాడు. రాజకీయ కుటుంబానికి చెందిన యువకుడు ఆనంద్. షూట్ అంతా అయ్యాక మెమరీ కార్డ్ తన దగ్గర పనిచేసే సహాయకుడు రాము(మాస్టర్ రోహన్) చేతికి రమేశ్ ఇస్తాడు.ఆ కుర్రాడేమో మెమొరీ చిప్ ఎక్కడో పడేస్తాడు. అప్పటినుంచి రమేశ్కి కష్టాలు మొదలవుతాయి. చిప్ లేదనే సంగతి ఆనంద్కి తెలిస్తే ఏమవుతుందోననే భయం ఓవైపు రమేశ్ని వెంటాడుతూ ఉంటుంది. మరోవైపు ఈ గండం నుంచి బయటపడాలి. ఈ విషయంలో రమేశ్కి హేమ ఏం సాయం చేసింది? చివరకు మెమొరీ చిప్ దొరికిందా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సారీ చెప్పిన 'రాజు వెడ్స్ రాంబాయి' డైరెక్టర్) -
మరో ఓటీటీలోకి వచ్చిన మెగా కోడలి సినిమా
హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. మెగా హీరో వరుణ్ తేజ్ని 2023లో పెళ్లి చేసుకున్న తర్వాత దాదాపుగా యాక్టింగ్కి దూరమైపోయింది. అయితే పెళ్లికి ముందు ఒప్పుకొన్న చిత్రాలు కొన్ని ఆలస్యంగా థియేటర్లలోకి వచ్చాయి. అలాంటి వాటిలో తమిళ థ్రిల్లర్ 'తనెల్'. తెలుగులో దీన్ని 'టన్నెల్' పేరుతో రిలీజ్ చేశారు. ఇప్పటికే ఓ ఓటీటీలోకి రాగా.. ఇప్పుడు మరో దానిలోనూ అందుబాటులోకి వచ్చేసింది.యంగ్ హీరో అధర్వ లేటెస్ట్ మూవీ 'టన్నెల్'. తమిళంలో సెప్టెంబరు 12న థియేటర్లలో రిలీజ్ కాగా వారం ఆలస్యంగా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలోకి వచ్చింది. డబ్బింగ్ మూవీ కావడంతో జనాలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ గత నెలలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. తెలుగు, తమిళ, హిందీ వెర్షన్స్ వచ్చాయి. ఇప్పుడు నెల గ్యాప్ తర్వాత లయన్స్ గేట్ ప్లే అనే మరో దానిలోనూ స్ట్రీమింగ్లోకి వచ్చింది.(ఇదీ చదవండి: మళ్లీ వచ్చేశాడు.. 'ద ఫ్యామిలీ మ్యాన్ 3' రివ్యూ)'టన్నెల్' విషయానికొస్తే.. కొందరు పోలీసులని విలన్ గ్యాంగ్ చంపేస్తుంది. మరోవైపు అను (లావణ్య త్రిపాఠి)ని అఖిల్ (అధర్వ) ప్రేమిస్తుంటాడు. ఉద్యోగం లేకుండా ఉన్న నీకు ఎలా కూతుర్ని ఇవ్వాలని అను తండ్రి అడుగుతాడు. దీంతో స్నేహితులతో కలిసి అఖిల్ కానిస్టేబుల్ ఉద్యోగం తెచ్చుకుంటాడు. అందరికీ ఒక్కచోటే పోస్టింగ్ వస్తుంది. కానీ జాయినింగ్ రోజే పెద్ద షాక్.కొత్తగా డ్యూటీలో జాయిన్ అయిన హీరో, అతడి ఫ్రెండ్స్ ఓ రాత్రి.. విలన్ గ్యాంగ్ ట్రాప్లో చిక్కుకుంటారు. అది ఓ స్లమ్ ఏరియా. మరి విలన్ నుంచి కొత్త కానిస్టేబుల్స్ తప్పించుకున్నారా? రాత్రి ఏం జరిగింది? టన్నెల్లో ఏముంది? ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: రాజాసాబ్: విజిల్స్ వేయించే సాంగ్ వస్తోంది!) -
మళ్లీ వచ్చేశాడు.. 'ద ఫ్యామిలీ మ్యాన్ 3' రివ్యూ
ఓటీటీలో ట్రెండ్ సెట్ చేసిన వెబ్ సిరీస్ల్లో 'ద ఫ్యామిలీ మ్యాన్' ఒకటి. దర్శకద్వయం రాజ్-డీకే తీసిన ఈ సిరీస్ తొలి సీజన్ 2019లో రిలీజై సూపర్ హిట్ కాగా 2021లో రెండో సీజన్ వచ్చింది. ఇందులో సమంత విలన్గా చేస్తే దీనికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు మూడో సీజన్ వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సీజన్ తొలి రెండు సీజన్లని మెప్పించేలా ఉందా? ఈసారి శ్రీకాంత్ తివారీ ఎలాంటి అడ్వెంచర్స్ చేశాడనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?ఈశాన్య భారతంలో 'ఆపరేషన్ సహకార్' పేరుతో ప్రధానమంత్రి బసు ఓ ప్రాజెక్ట్ చేపడతారు. అక్కడి లోకల్ రెబల్ గ్రూప్స్ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తుంటాయి. దీంతో వీళ్లతో సమావేశమయ్యేందుకు ఎన్ఐఏ ఛీప్ కులకర్ణి (దలీప్ తాహిల్), టాస్క్ ఆఫీసర్ శ్రీకాంత్ తివారీ (మనోజ్ బాజ్పాయ్) నాగాలాండ్ వెళ్తారు. కానీ అనుహ్య పరిస్థితుల్లో కులకర్ణిని బడా డ్రగ్ డీలర్ రుక్మా(జైదీప్ అహ్లవత్), అతడి రెబల్ గ్రూప్, దారిలో కాపుకాసి దారుణంగా చంపేస్తుంది. ఈ ప్రమాదం నుంచి శ్రీకాంత్ తివారీ తీవ్రగాయాలతో బయటపడతాడు. కానీ కులకర్ణి మృతికి ఇతడే ప్రధాన అనుమానితుడు అవుతాడు. ఇన్నాళ్లు పనిచేసిన వ్యక్తులే తనని టార్గెట్ చేయడంతో శ్రీకాంత్, ఫ్యామిలీతో పాటు తప్పించుకుని పారిపోతాడు. తర్వాత ఏమైంది? ఇంతకీ మీరా(నిమ్రత్ కౌర్) ఎవరు? ద్వారక్ అనే ఎన్నారైతో ప్రధానమంత్రి బసు చేసుకున్న ఆయుధాల డీల్కి, కులకర్ణి చావుకి సంబంధమేంటి? భారత్- మయన్మార్ సరిహద్దుల్లోని ఫీనిక్స్ గ్రామాల సంగతేంటి? అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ద ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ పేరు చెప్పగానే కామెడీ, క్రేజీ యాక్షన్ గుర్తొస్తుంది. తొలి సీజన్ ముంబై, ఢిల్లీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో జరగ్గా.. రెండో సీజన్ చెన్నై, శ్రీలంకలో జరిగింది. మూడో సీజన్కి వచ్చేసరికి మొత్తం సెటప్ మారిపోయింది. ఈశాన్య భారతంలో కథంతా నడిచింది. భారత్-మయన్మార్ సరిహద్దుల్లోని ఉద్రిక్త పరిస్థితులు, అక్కడ రెబల్ గ్రూప్స్తో కేంద్ర ప్రభుత్వానికి వస్తున్న ఇబ్బందులు, పాకిస్థాన్-మయన్మార్తో కలిసి భారత్పై చైనా చేస్తున్న కుట్రలు.. ఇలా ఒకటేమిటి చాలా విషయాల్ని మూడో సీజన్లో చూపించారు. ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిపోయారు.మూడో సీజన్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే బాగుంది. కాకపోతే ఏడు ఎపిసోడ్లలో చాలా విషయాలు చెప్పేందుకు ప్రయత్నించారు. ఈశాన్య భారతంలోని రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? రెబల్ గ్రూప్స్ని అడ్డుపెట్టుకుని చైనా ఎలాంటి రాజకీయాలు చేస్తోంది. ప్రధానమంత్రి పక్కనుండే వాళ్లు ఇచ్చే సలహాల వల్ల అటు ప్రజలు, ఇటు ఆర్మీ.. ఎలాంటి ప్రాణాంతక పరిస్థితుల్లో చిక్కుకుంది. దేశం కోసం పనిచేసే శ్రీకాంత్ తివారీనే హత్యానేరంలో అనుమానితుడిగా ఎలా కార్నర్ అయ్యాడు. ఇలా ఒక్కొక్కటి నిదానంగా చెబుతూ వెళ్లారు.గత రెండు సీజన్లలో శ్రీకాంత్ తివారీ చేసే అడ్వెంచర్స్, ఫ్యామిలీ డ్రామా, కొడుకు, కూతురు చేసే హంగామా, తోటి ఉద్యోగి జేకే చేసే కామెడీ ఇలా అన్ని బ్యాలెన్స్గా ఉండేవి. కానీ ఈ సీజన్లో మాత్రం శ్రీకాంత్ తివారీ పాత్ర నుంచి అవి మిస్ అయిపోయాయి. స్టోరీతో పాటు వెళ్లడం వల్ల శ్రీకాంత్ పాత్ర ఎలాంటి అడ్వెంచర్స్ చేయడానికి వీలుపడదు. మొత్తం ఏడు ఎపిసోడ్లు కలిపి దాదాపు 6 గంటల 14 నిమిషాల నిడివి. ఇందులో యాక్షన్ 20 శాతం ఉంటే డ్రామా 80 శాతం వరకు ఉంటుంది. యాక్షన్ కావాలనుకుని సిరీస్ చూస్తే డిసప్పాయింట్ అవుతారు. లేదు డ్రామా ఉన్నా పర్లేదు అనుకుంటే మాత్రం కొత్త విషయాలు తెలుసుకోవడంతో పాటు శ్రీకాంత్ తివారీ పాత్రతో ట్రావెల్ అవుతాం.ఎప్పటిలానే శ్రీకాంత్ తివారీగా మనోజ్ బాజ్పాయ్ ఆకట్టుకున్నాడు. ఈ సీజన్లో రుక్మా (జైదీప్ అహ్లవత్), మీరా(నిమ్రత్ కౌర్)తో బోలెడన్ని కొత్త పాత్రలు 'ద ఫ్యామిలీ మ్యాన్' ప్రపంచంలోకి ఎంటరయ్యాయి. ఎవరికి వాళ్లు అదరగొట్టేశారు. తొలి సీజన్లో కనిపించిన కల్నల్ విక్రమ్ (సందీప్ కిషన్), చెల్లం సార్, మేజర్ సమీర్ పాత్రలు ఈసారి కథలో కీలక మలుపులకు కారణమయ్యాయి. తెలుగు నటులు రవివర్మ, రాగ్ మయూర్ కాసేపు అలా కనిపిస్తారు. రాజ్-డీకే తీసిన 'ఫర్జీ' సిరీస్లోని మైకేల్ (విజయ్ సేతుపతి) పాత్ర.. కీలక సమయంలో శ్రీకాంత్ తివారీ పాత్రకు సహాయపడుతుంది. ఈసారి శ్రీకాంత్ భార్య సుచిత్రగా ప్రియమణికి నటించే స్కోప్ పెద్దగా దొరకలేదు. పిల్లలుగా చేసిన ఆశ్లేషా ఠాకుర్, వేదాంత్ సిన్హా ఓకే ఓకే.టెక్నికల్గా చూసుకుంటే మాత్రం స్టోరీ పరంగా చాలా విషయాలు చెప్పాలనుకున్నారు. ఆ విషయంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. సినిమాటోగ్రాఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరీ గొప్పగా ఏం లేవు గానీ డీసెంట్గా ఉన్నాయి. ఏడు ఎపిసోడ్ 'ఎండ్ గేమ్' అనేసరికి స్టోరీని పూర్తి చేస్తారేమో అనుకున్నాం. కానీ చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండానే ముగించారు. శ్రీకాంత్ తివారీ పాత్ర మయన్మార్లో ఉండిపోతుంది. విలన్ రుక్మా బుల్లెట్ గాయాలతో తప్పించుకుంటాడు. కథలో ప్రధానమైన ఆయుధాల డీల్ కూడా మధ్యలో ఆగిపోతుంది. ఇలా చాలా విషయాల్ని సస్పెన్స్లో పెట్టి సీజన్ ముగించారు. అంటే నాలుగో సీజన్ కూడా ఉంటుందని చెప్పకనే చెప్పేశారు. మరి అది ఎప్పుడొస్తుందో చూడాలి?-చందు డొంకాన -
ఫ్రైడే ఓటీటీ సినిమాల సందడి.. ఒక్క రోజే 15 చిత్రాలు స్ట్రీమింగ్!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఫ్రైడే వచ్చిందంటే చాలు సినీ ప్రియులకు ఇక పండగే. థియేటర్లతో పాటు ఓటీటీల్లో వరుసపెట్టి సినిమాలు సందడి చేస్తుంటాయి. ఇకపోతే ఈ శుక్రవారం పెద్ద సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. తెలుగులో అల్లరి నరేశ్ '12ఏ రైల్వేకాలనీ', ప్రియదర్శి 'ప్రేమంటే', రాజు వెడ్స్ రాంబాయి, ఇట్లు మీ ఎదవ, పాంచ్ మినార్, ప్రేమలో రెండోసారి, కలివనం అలరించేందుకు రెడీ అయిపోయాయి. వీటితో పాటు మఫ్టీ పోలీస్, ద ఫేస్ ఆఫ్ ద ఫేస్లెస్ అనే డబ్బింగ్ మూవీస్ కూడా వచ్చేస్తున్నాయి.ఇక ఓటీటీల విషయానికొస్తే పలు సూపర్ హిట్ చిత్రాలు స్ట్రీమింగ్కు రెడీగా ఉన్నాయి. వీటిలో ది బెంగాలీ ఫైల్స్ అనే కాంట్రవర్సీ సినిమా కూడా ఉంది. అంతేకాకుండా విక్రమ్ తనయుడు నటించిన బైసన్, 'ద ఫ్యామిలీ మ్యాన్ 3' సీజన్ కూడా సందడి చేయనుంది. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.ఈ ఫ్రైడే ఓటీటీ మూవీస్ ఇవే..నెట్ఫ్లిక్స్ బైసన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - నవంబరు 21 ట్రైన్ డ్రీమ్స్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 21 హౌమ్ బౌండ్ (హిందీ మూవీ) - నవంబరు 21 డైనింగ్ విత్ ద కపూర్స్ (హిందీ రియాలిటీ షో) - నవంబరు 21 వన్ షాట్ విత్ ఈడ్ షీరాన్(హాలీవుడ్ మూవీ)- నవంబరు 21అమెజాన్ ప్రైమ్ ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబరు 21జియో హాట్స్టార్ జిద్దీ ఇష్క్ (హిందీ సిరీస్) - నవంబరు 21 ది డెత్ ఆఫ్ బన్నీ మున్రో(కామెడీ సిరీస్)- నవంబర్ 21 ర్యాంబో ఇన్ లవ్(తెలుగు వెబ్ సిరీస్ న్యూ ఎపిసోడ్స్)- నవంబర్ 21 అజ్టెక్ బ్యాట్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 23సన్ నెక్స్ట్ ఉసిరు (కన్నడ సినిమా) - నవంబరు 21 కర్మణ్యే వాధికరస్తే(తెలుగు సినిమా)- నవంబరు 21 డీజిల్(తెలుగు సినిమా)- నవంబరు 21జీ5 ద బెంగాల్ ఫైల్స్ (హిందీ మూవీ) - నవంబరు 21మనోరమ మ్యాక్స్షేడ్స్ ఆఫ్ లైఫ్(మలయాళ సినిమా)- నవంబరు 21లయన్స్ గేట్ ప్లే..టన్నెల్(తమిళ సినిమా)- నవంబర్ 21 -
ఓటీటీలో టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఓటీటీ ప్రియులను అలరించేందుకు మరో సరికొత్త ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చేస్తోంది. టాలీవుడ్లో తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ధూల్పేట్ పోలీస్ స్టేషన్. ఈ వెబ్ సిరీస్కు జస్విని దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ రివీల్ చేశారు. ధూల్పేట్ పోలీస్ స్టేషన్ సిరీస్ వచ్చేనెల 5 నుంచి ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్ ప్రసారం కానుందని తెలిపారు. తెలుగుతో పాటు తమిళంలోనూ అందుబాటులో ఉండనుంది. కాగా.. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో అశ్విన్, శ్రీతు, గురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే ఫస్ట్ లుక్ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ చూస్తే ధూల్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే హత్యల నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. The investigation begins this December 🚨🚔#DhoolpetPoliceStation Premieres 5th Dec only on #ahaEvery Friday - New Episodes#DhoolpetOnaha pic.twitter.com/EUadfirmZm— ahavideoin (@ahavideoIN) November 20, 2025 -
నేరుగా ఓటీటీకి సీరియల్ కిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చాక సినిమాలు చూసే ధోరణి పూర్తిగా మారిపోయింది. కంటెంట్ ఉన్న చిత్రాలను ఆడియన్స్ విపరీతంగా ఆదరిస్తున్నారు. చిన్న సినిమాలైనా ఓటీటీల్లో దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా మలయాళ క్రైమ్, థ్రిల్లర్ జోనర్ చిత్రాలకు ఫుల్ డిమాండ్ ఉంటోంది. అందులో సస్పెన్స్ థ్రిల్లర్స్ ఎక్కువగా ఓటీటీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. అందుకు తగ్గట్టుగానే సరికొత్త సినిమాలతో ఓటీటీ ఫ్లాట్ఫామ్స్ సైతం ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి.తాజాగా ఓ సీరియల్ కిల్లర్ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తోంది. స్టీఫెన్ పేరుతో తెరకెక్కించిన ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో సందడి చేయనుంది. ఈ సరికొత్త సీరియల్ కిల్లర్ థ్రిల్లర్ మూవీ డిసెంబర్ 5నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ మేరకు పోస్టర్ను రిలీజ్ చేసింది.కాగా.. ఈ చిత్రంలో గోమతి శంకర్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని రివీల్ చేసింది. ఈ సినిమాకు మిథున్ దర్శకత్వం వహించగా.. జేఎం ప్రొడక్షన్ బ్యానర్లో తెరకెక్కించారు. If we have a serial killer on our hands, namma keka vendiya kelvi yaaru nu ah illa yen nu ah?Watch Stephen, out 5 December in Tamil, Telugu, Malayalam, Kannada and Hindi, only on Netflix! #StephenOnNetflix pic.twitter.com/KHUg70WCrS— Netflix India South (@Netflix_INSouth) November 20, 2025 -
అక్రమ సంబంధంపై డార్క్ కామెడీ సినిమా.. ఓటీటీ రివ్యూ
ఓటీటీల్లో మలయాళ సినిమాలనే ఎందుకు ఎక్కువగా చూస్తారు? అంటే సమాధానం చాలా సింపుల్. కథలు, పాత్రలు సహజంగా ఉంటాయి. మంచి థ్రిల్ ఇస్తాయి లేదంటే ఫుల్ కామెడీ అనిపిస్తాయి. కొన్నిసార్లయితే ఇలాంటి ఓ పాయింట్తోనూ సినిమా తీయొచ్చా అని ఆశ్చర్యపరుస్తాయి. అలా ఇప్పుడు 'అక్రమ సంబంధం' అనే సీరియస్ అంశంపై పూర్తి కామెడీగా ఓ మూవీ తీశారు. అదే 'అవిహితం'. రీసెంట్గా ఇది హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?ఓ పల్లెటూరు. ప్రకాశ్ అనే వ్యక్తి ఓ రోజు రాత్రి ఫ్రెండ్స్తో మందు పార్టీ చేసుకుని ఇంటికి తిరిగొస్తుంటాడు. ఓ చోట అలికిడి అయ్యేసరికి అటువెపు వెళ్తాడు. ఆ చీకటిలో వినోద్ అనే కుర్రాడు.. మరో యువతితో కలుసుకోవడం చూస్తాడు. పక్కనే నిర్మల ఇల్లు ఉండేసరికి చీకటిలో ఉన్నది ఆమెనే అనుకుంటాడు. తర్వాత ఈ విషయాన్ని వేణు అనే వ్యక్తికి చెబుతాడు. అలా ఒకరి నుంచి ఒకరికి చాలామందికి దీని గురించి తెలుస్తుంది. చివరకు ఈ సంగతి.. నిర్మల భర్త ముకుందన్ వరకు చేరుతుంది. ఇంతకీ చీకటిలో కనిపిస్తున్న యువతి ఎవరు? వినోద్-నిర్మల విషయంలో అందరి అనుమానం నిజమైందా? చివరకు అందరూ కలిసి ఏం చేశారనేదే స్టోరీ.ఎలా ఉందంటే?సిటీలో తక్కువ గానీ గ్రామాల్లో గాపిస్ కల్చర్ ఎక్కువే. ఏదైనా ఓ విషయం జరగ్గానే అమ్మలక్కలు చేరిపోయి ముచ్చట్లు పెడతారు. చేయాల్సిన పనులన్నీ గాలికొదిలేసి సదరు పుకార్ల గురించే తెగ మాట్లాడుకుంటారు. ఈ సినిమా కూడా సేమ్ అలాంటి ఓ పాయింట్తోనే తీశారు. రాత్రిపూట చీకటిలో ఓ యువతీ యువకుడు కలుసుకోవడం ముందు ఒకడు చూస్తాడు. అది ఇంకోకడికి చెబుతాడు. ఈ ఇద్దరు మరో ఇద్దరికి చెబుతారు. అలా ఇదో పెద్ద డిస్కషన్ అయిపోతుంది.సినిమా మొదలైన ఐదు నిమిషాల్లోనే 'అక్రమ సంబంధం' అనే అసలు పాయింట్ రివీల్ అవుతుంది. చీకటిలో కనిపించిన అమ్మాయి ఎవరో ఒక్కరికి కూడా తెలియదు. కానీ పక్కనోడు చెప్పాడని, పరిస్థితులు సింక్ అవుతున్నాయని 'ఆమె'నే అని అందరూ ఫిక్స్ అయిపోతారు. ఎలాగైనా సరే ఆమెని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని స్కెచ్ వేస్తారు. రాత్రయితే చాలు ఈ విషయం తెలిసిన ఒక్కడూ నిద్రపోడు. చీకటిలో వాళ్లిద్దరూ ఏం చేస్తున్నారా అని మాత్రమే ఆలోచిస్తుంటారు. క్లైమాక్స్లో ఊహించని ట్విస్ట్. దానికి తోడు ఓ మెసేజ్. సందేశం కదా అని స్పీచుల్లాంటివి ఉంటాయని అనుకోవద్దు. సింపుల్గా రెండు మూడు సీన్లతోనే చాలామంది భర్తలకు కళ్లు తెరిపించే మెసేజ్ ఇచ్చారు.డార్క్ కామెడీ జానర్ కావడంతో అడల్ట్ టచ్ జోక్స్ చాలానే ఉన్నాయి. అవన్నీ గీత దాటకుండా ఉంటాయి. ఇవి అర్థమైతే మాత్రం ఫుల్గా నవ్వుకుంటారు. చూస్తున్నంతసేపు మంచి టైమ్ పాస్ అవుతుంది. సినిమాకు ప్లస్ పాయింట్ ఏంటంటే పల్లె వాతావరణంలో చాలా సహజంగా ఉంటుంది. ఇదేదో మన ఊరిలో జరుగుతుందా అనిపిస్తుంది. యాక్టర్స్ ఎవరో గానీ పాత్రల్లో జీవించేశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, వన్ లైనర్స్ భలే పేలాయి. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. అయితే ఇలాంటి ఓ పాయింట్తోనూ సినిమాని తీయొచ్చు. ప్రేక్షకుల్ని అలరించొచ్చని ఇది చూశాకే అర్థమైంది.-చందు డొంకాన -
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు డబ్బింగ్ సినిమా
గత నెలలో దీపావళికి తెలుగులో పలు సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో 'కె ర్యాంప్' ఉన్నంతలో ఆకట్టుకుంది. ఇదే పండగకు తమిళంలో 'డ్యూడ్'తో పాటు బైసన్, డీజిల్ అనే మూవీస్ వచ్చాయి. వీటిలో మొదటి రెండు హిట్ కాగా 'డీజిల్' మాత్రం బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది. ఇప్పుడీ చిత్రమే ఎలాంటి ప్రకటన ఓటీటీలోకి వచ్చేసింది. కాకపోతే ఇక్కడే ఓ ట్విస్ట్.(ఇదీ చదవండి: రజనీ, చిరంజీవి యాక్టింగ్ గురువు కన్నుమూత)తెలుగులో నాని 'జెర్సీ'లో చిన్న పాత్రలో నటించిన హరీశ్ కల్యాణ్.. ప్రస్తుతం తమిళంలో హీరోగా సినిమాలు చేస్తున్నాడు. 'డీజిల్' ఇతడి లేటెస్ట్ మూవీ. క్రూడ్ ఆయిల్ స్మగ్లింగ్ అనే కాన్సెప్ట్తో తీసిన ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర జస్ట్ యావరేజ్ అనిపించుకుంది. థియేటర్లలో కేవలం తమిళంలో మాత్రమే రిలీజ్ కాగా.. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం యూకేలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వారమే మనదేశంలో కూడా రిలీజయ్యే అవకాశముంది. సడన్ స్ట్రీమింగ్ ఉండొచ్చు. మరోవైపు బయట దేశాల్లో సింప్లీ సౌత్ ఓటీటీలో ఈ శుక్రవారం (నవంబరు 21) రిలీజ్ కానుందని అధికారికంగా ప్రకటించారు.'డీజిల్' విషయానికొస్తే.. వాసు (హరీశ్ కల్యాణ్) తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోతారు. దీంతో మనోహర్ అనే క్రూడ్ ఆయిల్ స్మగ్లర్, వాసుని పెంచి పెద్ద చేస్తాడు. కొడుకులా చూసుకుని కెమికల్ ఇంజినీరింగ్ చదివిస్తాడు. వాసు పెద్దయిన తర్వాత మనోహర్కి సాయపడుతుంటాడు. క్రూడ్ ఆయిల్ని వైట్ పెట్రోల్గా మార్చి, వాటిని చేపల కోసం ఉపయోగించే ఐస్ గడ్డల్లా తయారు చేసి స్మగ్లింగ్ చేస్తుంటాడు. అయితే బాలమురుగన్ అనే వ్యక్తి, డీసీపీతో చేతులు కలిపి మనోహర్ క్రూడ్ ఆయిల్ సామ్రాజ్యాన్ని దోచుకుందామని అనుకుంటారు. దీనికి అడ్డంగా ఉన్న మనోహర్ని చంపేయాలని వీళ్లు ప్లాన్ వేస్తారు. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటి? దీన్ని వాసు ఎలా అడ్డుకున్నాడనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఒళ్లు జలదరించేలా 'ధురంధర్' ట్రైలర్) -
'ద ఫ్యామిలీ మ్యాన్ 3' రెడీ.. రెండు సీజన్లలో జరిగింది ఇదే
ఓటీటీ ప్రియులకు ఇష్టమైన స్వదేశీ సిరీస్ల్లో 'ద ఫ్యామిలీ మ్యాన్'. పేరుకే యాక్షన్ థ్రిల్లర్ జానర్ అయినప్పటికీ ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీని మిక్స్ చేసిన తీశారు. దీంతో ఈ సిరీస్ చాలామందికి ఫేవరెట్ అయిపోయింది. 2019లో తొలి సీజన్ రాగా, 2021లో రెండో సీజన్ ఓటీటీలోకి వచ్చింది. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత ఇన్నాళ్లకు మూడో సీజన్ స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఈ శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్లోకి రానుంది. (Family Man 3 In Which OTT) ఈ సందర్భంగా తొలి రెండు సీజన్లు ఏం జరిగిందో చూద్దాం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)ముంబైలో భార్య, కూతురు, కొడుకుతో ఉండే శ్రీకాంత్ తివారీ ఓ మధ్య తరగతి వ్యక్తి. ప్రభుత్వం కోసం రహస్యంగా సీక్రెట్ ఏజెంట్గా పనిచేస్తుంటాడు. ఓవైపు ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలు. మరోవైపు మధ్య తరగతి జీవితంలో కష్టాలు. తొలి సీజన్లో మూసా అనే ఉగ్రవాది వేసిన ప్లాన్ నుంచి ఢిల్లీ ప్రజల్ని ఎలా కాపాడాడు అనేది చూపించారు. రెండో సీజన్లో తమిళ రెబల్స్, శ్రీలంకలో ఎల్టీటీ అనే పోరాట గ్రూప్ గురించి అదిరిపోయే రేంజులో చూపించారు.రెండో సీజన్ చివరలోనే ఈసారి కరోనా కోసం చూపించబోతున్నట్లు హింట్ ఇచ్చారు. అందుకు తగ్గట్లే కొన్నిరోజుల క్రితం వదిలిన ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ఈ సీజన్ అంతా కూడా ఈశాన్య భారతంలో జరగనుంది. ఇప్పటివరకు ఉన్నవాళ్లతో పాటు జైదీప్ అహ్లవత్, నిమ్రత్ కౌర్ కొత్తగా వచ్చి చేరారు. వీళ్లిద్దరూ విలన్స్గా చేస్తున్నట్లు అనిపిస్తుంది. అయితే రెండు సీజన్లలో ఏమేం జరిగిందనేది యూట్యూబ్లో 5 నిమిషాల వీడియోగా రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: 'ఐ బొమ్మ' క్లోజ్.. మరి మిగతా వాటి సంగతి?) -
ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి బోలెడన్ని సినిమాలు రాబోతున్నాయి. వీటిలో అల్లరి నరేశ్ '12ఏ రైల్వేకాలనీ', ప్రియదర్శి 'ప్రేమంటే', రాజు వెడ్స్ రాంబాయి, ఇట్లు మీ ఎదవ, పాంచ్ మినార్, ప్రేమలో రెండోసారి, కలివనం అనే తెలుగు చిత్రాలతో పాటు మఫ్టీ పోలీస్, ద ఫేస్ ఆఫ్ ద ఫేస్లెస్ అనే డబ్బింగ్ మూవీస్ రానున్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ 15కి పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్ కానున్నాయి.(ఇదీ చదవండి: రీతూ గుండె ముక్కలు చేసిన పవన్.. ఊహించని నామినేషన్స్)ఓటీటీల్లో రిలీజయ్యే వాటిలో.. తమిళ హిట్ సినిమా 'బైసన్', కాంట్రవర్సీ చిత్రం 'ద బెంగాల్ ఫైల్స్' ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు 'ద ఫ్యామిలీ మ్యాన్ 3' సీజన్ కూడా ఇదే వీకెండ్ స్ట్రీమింగ్ కానుంది. ఈ మూడు కచ్చితంగా చూడాల్సినవి కాగా వీటితో పాటు మరికొన్ని కూడా ఉన్నాయి. ఈ వారంలో రవితేజ 'మాస్ జాతర' స్ట్రీమింగ్ అయ్యే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఇంతకీ ఏ ఓటీటీలో ఏయే చిత్రాలు స్ట్రీమింగ్ కానున్నాయంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (నవంబరు 17 నుంచి 23వ తేదీ వరకు)అమెజాన్ ప్రైమ్ద మైటీ నెన్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 19ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబరు 21నెట్ఫ్లిక్స్బ్లాక్ టూ బ్లాక్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 17బేబ్స్ (ఇంగ్లీష్ చిత్రం) - నవంబరు 17షాంపేన్ ప్రాబ్లమ్స్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 19బైసన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - నవంబరు 21హోమ్ బౌండ్ (హిందీ మూవీ) - నవంబరు 21ట్రైన్ డ్రీమ్స్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 21హౌమ్ బౌండ్ (హిందీ మూవీ) - నవంబరు 21డైనింగ్ విత్ ద కపూర్స్ (హిందీ రియాలిటీ షో) - నవంబరు 21హాట్స్టార్ల్యాండ్ మ్యాన్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 17నైట్ స్విమ్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 19ద రోజెస్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 20నాడు సెంటర్ (తమిళ సిరీస్) - నవంబరు 20జిద్దీ ఇష్క్ (హిందీ సిరీస్) - నవంబరు 21అజ్టెక్ బ్యాట్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 23సన్ నెక్స్ట్ఉసిరు (కన్నడ సినిమా) - నవంబరు 21జీ5ద బెంగాల్ ఫైల్స్ (హిందీ మూవీ) - నవంబరు 21(ఇదీ చదవండి: ఇండస్ట్రీకి నా అవసరం లేదు: హనీరోజ్ ఎమోషనల్) -
ఓటీటీలో హిట్ సినిమా 'బైసన్'.. స్ట్రీమింగ్కు రెడీ
విక్రమ్ కుమారుడు ధ్రువ్ నటించిన సూపర్ హిట్ సినిమా బైసన్(Bison) ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటించారు. అనుపమా పరమేశ్వరన్ జోడీగా నటించిన చిత్రం మొదట తమిళ్ ఆ తర్వాత అక్టోబర్ 24న తెలుగులో రిలీజ్ అయింది. దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ మూవీని పా.రంజిత్కు చెందిన నీలం ప్రొడక్షన్స్, అప్లాజ్ ఎంటర్టెయిన్మెంట్, శాంతి సినిమా సంస్థలు కలిసి నిర్మించాయి. ఈ సినిమాతో ధ్రువ్కు నేషనల్ స్థాయిలో అవార్డ్ రావచ్చని కూడా సోషల్మీడియాలో ప్రచారం జరుగుతుంది.బైసన్(Bison) సినిమా నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. నవంబర్ 21 నుంచి ఓటీటీలోకి రానున్నట్లు ఆ సంస్థ ఒక పోస్టర్తో ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, కన్నడ, హిందీలో స్ట్రీమింగ్ కానున్నట్లు పేర్కొన్నారు. సుమారు రూ. 30 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.70 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. ఇంతటి భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని ఈ వీకెండ్లో ఓటీటీలో చూసేయండి.కథేంటంటే?తమిళనాడుకు చెందిన కబడ్డీ క్రీడాకారుడైన మనతి గణేశన్ జీవితం ఆధారంగా బైసన్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ మొత్తం 1990 దశకం నేపథ్యంలో సాగుతుంది. వనతి కిట్టన్(ధ్రువ్ విక్రమ్) జపాన్లో జరుగుతున్న 12వ ఆసియా క్రీడలకు ఎంపికవుతాడు. ఎన్నోఏళ్లపాటు ఎదురుచూస్తున్న తన కల ఎట్టకేలకు నెరవేరిందని తన గ్రామం మొత్తం సంతోషంలో ఉంటారు. కానీ, పలు కారణాల వల్ల అతను మైదానంలోకి అడుగుపెట్టే అవకాశం దొరకదు. తనలో ప్రతిభ ఉన్నప్పటికీ ఎక్స్ట్రా ప్లేయర్గా బెంచ్కి పరిమితం అవుతాడు. ఈ క్రమంలోనే ఇండియా, పాక్ మధ్య జరుగుతున్న మ్యాచ్ రద్దవుతుంది. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొని అంతర్జాతీయ స్థాయి జట్టుకు ఎంపిక అయిన తర్వాత కూడా తనని బరిలోకి దింపకపోవడంతో నిరాశకు గురవుతాడు. అలాంటి సమయంలో కిట్టన్ ఏం చేశాడు.. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన కిట్టన్ పాక్ జట్టుతో పోటీకి దిగాడా.. అతన్ని అడ్డుకున్నది ఎవరు.. అనేది తెలియాలంటే బైసన్ చూడాల్సిందే. -
ఓటీటీలోకి జాన్వీ కపూర్ కొత్త సినిమా
వచ్చే ఏడాది ఆస్కార్ బరిలో ఉన్న ఇండియన్ సినిమా 'హౌమ్ బౌండ్'. ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో అఫీషియల్గా దీనికి ఎంట్రీ దొరికింది. థియేటర్లలోకి రావడానికి ముందే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రదర్శితమై ప్రశంసలు కూడా అందుకుంది. అలాంటిది ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ కానుంది.ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. కరోనా కష్టాలు, కులం కారణంగా ఎదురయ్యే అవమానాలు, ఉద్యోగాల్లో ఎదురయ్యే అణిచివేత, ఆర్థిక అసమానతలు తదితర అంశాలని తీసుకుని ఈ సినిమా తీశారు. పలు చిత్రోత్సవాల్లో ప్రశంసలు అందుకోగా.. సెప్టెంబరు 26న థియేటర్లలో రిలీజ్ చేశారు. యావరేజ్ టాక్ దగ్గరే అగిపోయింది. ఇప్పుడు ఈ చిత్రం నవంబరు 21 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది.(ఇదీ చదవండి: 'వారణాసి'లో శ్రీరాముడిగా మహేశ్.. రాజమౌళి కామెంట్)'హౌమ్ బౌండ్' విషయానికొస్తే.. మహమ్మద్ షోయబ్ అలీ(ఇషాన్ ఖట్టర్), చందన్ కుమార్ (విశాల్ జెత్వా) ఫ్రెండ్స్. వీళ్లిద్దరూ ముస్లిం, దళిత వర్గానికి చెందిన వాళ్లు కావడంతో సమాజంలో అవమానాలు, అణిచివేతకు గురవుతారు. దీంతో పోలీస్ కానిస్టేబుల్ అయితే తమకు గౌరవం లభిస్తుందని వీళ్లిద్దరూ భావిస్తారు. పరీక్ష రాస్తారు. ఫలితాలు రావడం ఆలస్యం కావడంతో కుటుంబ పరిస్థితుల కారణంగా ఓ కంపెనీలో అలీ ఉద్యోగానికి చేరతాడు. సుధ(జాన్వీ కపూర్) కోసం చందన్ కాలేజీలో చేరతాడు.మరి కలిసి ఉండే అలీ, చందన్ మధ్య గొడవలు ఎందుకొచ్చాయి? కాలేజీ మానేసిన చందన్.. ఆఫీస్ బాయ్ ఉద్యోగం వదిలేసిన షోయబ్.. సూరత్ వెళ్లి ఫ్యాక్టరీలో పనికి ఎందుకు చేరారు?వీరిద్దరి జీవితాల్లో కరోనా ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? అనేది మిగతా సినిమా. ఇద్దరు స్నేహితులుగా ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా అద్భుతంగా నటించారు. ఓ చిన్న పాత్రలో ఎలాంటి మేకప్ లేకుండా జాన్వీ కపూర్ ఆకట్టకుంది.(ఇదీ చదవండి: గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్.. ఒక్క సంఘటనతో రాజమౌళి ఫ్రస్టేషన్!) -
ఓటీటీలో డ్యూడ్.. రెండు రోజుల్లోనే నంబర్వన్గా!
లవ్ టుడే, డ్రాగన్ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్. ఇటీవలే 'డ్యూడ్' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దీపావళి సందర్భంగా గత థియేటర్లలోకి వచ్చిన డ్యూడ్ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈనెల 14 నుంచే తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ బాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. అయితే ఓటీటీకి వచ్చిన రెండు రోజుల్లోనే నంబర్వన్ స్థానంలో ట్రెండింగ్ అవుతోంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వెల్లడించింది. కాగా.. మమిత బైజు హీరోయిన్గా కనిపించగా.. శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. 'Supreme Star' @realsarathkumar's BTS from the sets of #DUDE ❤🔥#Dude TRENDING #1 on @NetflixIndia 🔥Now streaming in Tamil, Telugu, Kannada and Malayalam 🤩⭐ing 'The Sensational' @pradeeponelife🎬 Written and directed by @Keerthiswaran_Produced by @MythriOfficial… pic.twitter.com/xHrUBVxyU8— Mythri Movie Makers (@MythriOfficial) November 16, 2025 -
ఢిల్లీ క్రైమ్- 3 రివ్యూ.. బేబీ ఫలక్ కేసు గుర్తుందా?
ఓటీటీలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్లు ఎప్పటికీ మెప్పిస్తాయి. అయితే, వాస్తవ సంఘటన ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్కు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ ఫ్రాంచైజీలో భాగంగా సీజన్-3 వచ్చేసింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్(Netflix)లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం బాగుందని సోషల్మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దర్శకులు తనూజ్ చోప్రా తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్లో షెఫాలీ షా, హ్యుమా ఖురేషి, రసికా దుగ్గల్, రాజేష్ తైలాంగ్, యుక్తి తరేజా తదితరులు నటించారు. ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్ తొలి సీజన్ 2019 మార్చి, రెండో సీజన్ 2022 ఆగస్టులో విడుదలయ్యాయి. రెండూ భారీ విజయాన్ని దక్కించుకున్నాయి. సీజన్-3లో హ్యూమన్ ట్రాఫికింగ్కు పాల్పడే ఓ మహిళను డీసీపీ (షెఫాలీ) ఎలా పట్టుకున్నారో చూపించారు. ఒక్కో ఎపిసోడ్ నిడివి 45 -50 నిమిషాలు ఉన్నప్పటికీ బోర్ అనిపించదు. తెలుగులో కూడా అందుబాటులో ఉంది.కథేంటి..?అమ్మాయిలను అక్రమ రవాణా చేసే ఒక ముఠాకు వ్యతిరేకంగా డీసీపీ వర్తికా చతుర్వేది (షెఫాలీ), ఆమె బృందం చేసే పోరాటమే ఢిల్లీ క్రైమ్-3 కథ.. 2012లో జరిగిన బేబీ ఫలక్ కేసు నుండి ప్రేరణగా ఈ సిరీస్ను తెరకెక్కించారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి కథ మొదలౌతుంది. 2012లో 15 ఏళ్ల బాలిక అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరుతుంది. బాలికను వైద్యులు పరీక్షిస్తున్న సమయంలో ఆమె పుర్రె విరిగిపోయి, శరీరంపై మానవ కాటు గుర్తులు ఉన్నట్లు గుర్తించి షాక్ అవుతారు. తమ కెరీర్లో ఎప్పుడు కూడా ఇంతటి ఘోరమైన కేసును చూడలేదని డాక్టర్లు చెబుతారు. దీంతో బాలిక కేసు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారుతుంది. పోలీసుల ఎంట్రీతో కేసు అనేక మలుపులు తిరుగుతుంది. ఈ కేసును ఛేదించేందుకు డీసీపీ వర్తికా చతుర్వేది (షెఫాలీ) టీమ్ రంగంలోకి దిగుతుంది. ఇంతకు ఈ బాలికను ఆసుపత్రిలో చేర్పించింది ఎవరు అనే పాయింట్ నుంచి విచారణ ప్రారంభిస్తుంది. ఈ క్రమంలోనే అస్సాం నుండి ఒక ట్రక్లో కొన్ని వెపన్స్ వస్తున్నాయని ఆమెకు సమాచారం అందడంతో ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రక్ను ఆపుతుంది. అయితే, ఆ ట్రక్లో వెపన్స్ బదులు పదుల సంఖ్యలో ఆడపిల్లలు ఉండడంతో షాక్ అవుతుంది. హ్యూమన్ ట్రాఫికింగ్కు పాల్పడుతున్నట్లు వర్తికా గుర్తిస్తుంది. ఇక్కడి నుంచే ఆమె తీగలాగడం మొదలుపెడుతుంది. అమ్మాయిలను అక్రమంగా తరలిస్తుంది ఎవరు..? ఢిల్లీలో ఈ మూఠా వెనుకున్నది ఎవరు..? హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతున్న బాలికకు ఈ ముఠాతో ఉన్న లింక్ ఏంటి..? 15 ఏళ్ల బాలికన అంత ఘోరంగా చిత్రహింసలు చేయడానికి కారణం ఏంటి.. ఆ బాలిక తల్లిదండ్రులు ఎవరు..? ఫైనల్గా ఆ బాలిక బతికిందా..? వంటి అంశాలు తెలుసుకోవాలంటే డీసీపీ వర్తికా చతుర్వేది (షెఫాలీ) టీమ్ చేసిన ఢిల్లీ క్రైమ్-3 ఇన్విస్టిగేషన్ చూడాల్సిందే..ఎలా ఉందంటే..?క్రైమ్ ఇన్విస్టిగేషన్ సినిమాలు ఎప్పుడూ కూడా ఆసక్తిని కలిగించేలా ఉండాలి. ఈ విషయంలో దర్శకులు తనూజ్ చోప్రా విజయం సాధించారు. కేవలం 6 ఏపిసోడ్స్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దేశవ్యాప్తంగా అమ్మాయిల మిస్సింగ్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఎక్కువగా అనాథలు, పేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలే ఈ మూఠా ఎలా టార్గెట్ చేస్తుంది అనే పాయింట్ను చాలా చక్కగా చూపించారు. అమ్మాయిలను ఆశ చూపించి కొన్ని ముఠాలు ఎలా కోట్లు సంపాదిస్తున్నాయో కూడా తెరపై కళ్లకు కట్టినట్లు చూపారు. ఆయుధాల మాదిరిగానే అమ్మాయిలు కూడా పాలు, నీళ్ల ట్యాంకర్లతో పాటు కంటెయినర్లలో ఎలా తరలిస్తారనేది దర్శకుడు ఈ కథలో చక్కగా ఆవిష్కరించారు. ఇలాంటి కేసులను ఛేదించేందుకు పోలీసులు ఎంత రిస్క్ చేస్తారనేది అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా మెప్పిస్తుంది. అస్సాం, హర్యానా, మిజోరాం, సూరత్, రాజస్థాన్, ఢిల్లీ వంటి ప్రాంతాలను ప్రధానంగా టచ్ చేస్తూ ఈ కథను నడిపించిన తీరు సహజత్వానికి దగ్గరగా అనిపిస్తుంది. అమ్మాయిల జీవితాలను నాశనం చేసే ముఠాల నుంచి కాపాడటానికి ప్రాణాలకు తెగించే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారనే విషయాన్ని ఈ సిరీస్ క్లియర్గా చూపుతుంది.ఢిల్లీ క్రైమ్-3 రియల్ స్టోరీ. కథ చాలా బలంగానే ఉంటుంది. అయితే, స్క్రీన్ ప్లే ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఒక్కో ఎపిసోడ్ నిడివి 45 -50 నిమిషాలు ఉన్నప్పటికీ ఎక్కడా కూడా బోర్ అనిపించదు. ముఖ్యంగా క్లైమాక్స్ డిజైన్ చేసిన తీరు మెప్పిస్తుంది. డీసీపీ వర్తికా చతుర్వేది పాత్రలో షెఫాలీ మరోసారి దుమ్మురేపింది. హ్యుమా, యుక్తి తరేజా తప్ప మిగతా కీలకపాత్రధారులందరూ పాత సీజన్లలో కనిపించినవారే కావడంతో ప్రేక్షకులు త్వరగానే కనెక్ట్ అవుతారు. కె-ర్యాంప్తో హిట్ కొట్టిన యుక్తి తరేజా ఈ సిరీస్లో దూకుడు స్వభావం గల లేడీ పోలీస్ ఆఫీసర్గా మెప్పించింది. ఈ సిరీస్కి ఒన్నాఫ్ ది హైలైట్ పాత్ర ఆమెదే అని చెప్పొచ్చు. ఇలాంటి కథలు చాలా థ్రిల్లింగ్ డ్రామాలా కొనసాగితే ప్రేక్షకులకు ఇంకా బాగా నచ్చుతుంది. కానీ, ఈ విషయంలో కాస్త మైనస్ అని చెప్పాలి. కీలక సన్నివేశాల్లో తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకుడు బాగా అంచనా వేయడంతో గొప్పగా సస్పెన్స్లకు ఛాన్స్ ఉండదు. కానీ, ఫైనల్గా అందరికీ ఢిల్లీ క్రైమ్-3 నచ్చుతుంది. -
'బిగ్బాస్ 9' ఆయేషా ఓటీటీ సిరీస్.. సడన్గా తెలుగులో స్ట్రీమింగ్
బిగ్బాస్ ప్రస్తుత సీజన్ ఓ మాదిరిగా నడుస్తోంది. ఈసారి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్గా వచ్చినవాళ్లలో ఆయేషా జీనత్ ఒకరు. రావడం రావడమే ఫుల్ హడావుడి చేసిన ఈమె.. గతంలో తమిళ బిగ్బాస్లో పాల్గొని రచ్చ రచ్చ చేసింది. ఏకంగా 9 వారాల పాటు హౌసులో ఉంది. దీంతో తెలుగులోనూ ఆ రేంజ్ రచ్చ చేయడం గ్యారంటీ అనుకున్నారు. కానీ వచ్చిన రెండు వారాలకే హౌస్ నుంచి బయటకొచ్చేసింది. అలా అని ఈమె ఎలిమినేట్ కాలేదు. వైరల్ ఫీవర్ రావడంతో డాక్టర్స్ సలహా మేరకు బయటకొచ్చేసింది.ఆయేషా జీనత్ గురించి మళ్లీ ఇప్పుడు ఎందుకు డిస్కషన్ వచ్చిందా అంటే ఈమె నటించిన 'ఉప్పు పులి కారం' అనే సిరీస్.. గతేడాది మే నెలలో హాట్స్టార్లో రిలీజైంది. దాదాపు 128 ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ చేశారు. ఇప్పుడు దీన్ని ఎలాంటి హడావుడి లేకుండా తెలుగులోకి తీసుకొచ్చేశారు. ఈరోజు (నవంబరు 15) నుంచి హాట్స్టార్లోనే తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చినట్లు ప్రకటించారు.(ఇదీ చదవండి: 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్లో ఆ రెండు రిలీజ్.. రాజమౌళి క్లారిటీ)'ఉప్పు పులి కారం' అంటే తమిళంలో ఉప్పు-చేదు-కారం అని అర్థం. తెలుగులోనూ అదే టైటిల్ ఉంచేశారు. ఇందులో ఆయేషాతో పాటు పొన్నవన్, వనిత లాంటి సీనియర్ యాక్టర్స్.. అశ్విని ఆనందిత, దీపిక వెంకటాచలం తదితరులు నటించారు. అధునిక ప్రపంచంలోని ప్రేమ, రిలేషన్ తదితర అంశాల ఆధారంగా దీన్ని తీశారు. అయితే ఇది కొరియన్ సిరీస్ అయిన 'మై ఫాదర్ ఈజ్ స్ట్రేంజ్'కి అధికారిక రీమేక్.ఈ సిరీస్తో పాటు ఈ వారం చాలానే హిట్ సినిమాలు కూడా ఓటీటీల్లోకి వచ్చాయి. వీటిలో తెలుసు కదా, డ్యూడ్, కె ర్యాంప్ లాంటి హిట్ మూవీస్ ఉన్నాయి. అలానే అవిహితం, జూరాసిక్ వరల్డ్ రీబర్త్, జాలీ ఎల్ఎల్బీ 3, నిశాంచి 2, ఎక్క లాంటి చిత్రాలతో పాటు ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 సిరీస్ కూడా అందుబాటులోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన స్టార్ డైరెక్టర్ సినిమా)Every family hides a secret… but this one knocks on their door...🚪💥Witness drama, heart, and hilarity as a new “son” flips their world. 🙃#UppuPuliKaaram now in Telugu on JioHotstar! 💫#EmotionsRusified#AyeshaZeenath #AshwiniAanandita #DeepikaVenkatachalam #Krishna… pic.twitter.com/zZgvCg8UGn— JioHotstar Telugu (@JioHotstarTel_) November 15, 2025 -
సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన స్టార్ డైరెక్టర్ సినిమా
బాలీవుడ్ స్టార్ దర్శకుల్లో అనుగార్ కశ్యప్ ఒకడు. 'గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్' లాంటి క్రైమ్ థ్రిల్లర్ సినిమాలతో తనదైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. రీసెంట్ టైంలో నటుడిగా మారిపోయి దక్షిణాదిలో మూవీస్ చేస్తున్న ఈయన.. బాల్ ఠాక్రే మనవడిని హీరోగా పరిచయం చేస్తూ ఓ మూవీ తీశారు. తొలి భాగం థియేటర్లలో రిలీజ్ కాగా ఇప్పుడు రెండో భాగం ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: నా కొడుకు ఆ ఫోటోలు చూస్తే ఇంకేమైనా ఉందా?: గిరిజా ఓక్)బాల్ ఠాక్రే మనవడు ఐశ్వరీ ఠాక్రే హీరోగా నటించిన సినిమా నిశాంచి. ఇందులో ఐశ్వరీ ద్విపాత్రాభినయం చేశాడు. వేదిక పింటో హీరోయిన్గా చేసింది. సెప్టెంబరు 19న థియేటర్లలో 'నిశాంచి' రిలీజ్ కాగా డీసెంట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి ఆ మూవీ వచ్చింది. అయితే రెండో భాగం థియేటర్లలోకి వస్తుందనుకంటే నేరుగా ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ఈ రోజు(నవంబరు 14) నుంచి అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి వచ్చింది.'నిశాంచి' విషయానికొస్తే.. కాన్ఫూర్లో జబర్దస్త్ సింగ్ అనే బిల్డర్ ఉంటాడు. కుస్తీ పోటీల్లో పాల్గొనాలనేది ఇతడి కల. కానీ ఓ గొడవలో చిక్కుకోవడంతో ఇతడిని హత్య చేస్తారు. అతడి కొడుకులు ఇద్దరి కథే ఈ సినిమా. తండ్రిని హత్య చేయడంతో కొడుకులు ఇద్దరు ఏం చేశారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. క్రైమ్ డ్రామా మూవీస్ అంటే ఇష్టముంటే ఇది మీకు నచ్చేయొచ్చు. తొలి భాగంలో కాస్త సాగదీత సీన్స్ ఉన్నప్పటికీ.. మంచి ట్విస్ట్తో తొలి భాగాన్ని ముగించారు. మరి రెండో భాగం ఎలా ఉందో చూడాలి? ప్రస్తుతం ఈ రెండు సినిమాలు అమెజాన్ ప్రైమ్లో హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: నా యాక్టింగ్పై నాకే డౌట్: దుల్కర్) -
నిర్మాతగా 'పా రంజిత్'.. ఓటీటీలో హిట్ సినిమా
కోలీవుడ్లో భారీ విజయం అందుకున్న థ్రిల్లర్ సినిమా దండకారణ్యం (Thandakaranyam).. సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. కోలీవుడ్లో భారీ విజయం అందుకున్న ఈ చిత్రం ఐఎండీబీలో 7.1 రేటింగ్తో ఉంది. ఈ సినిమా గురించి తమిళ రివ్యూవర్లు కూడా గొప్పగానే చెప్పుకొచ్చారు. దర్శకుడు అతియన్ అతిరై తెరకెక్కించిన ఈ థ్రిల్లర్ మూవీని ప్రముఖ దర్శకుడు పా రంజిత్ నిర్మించడం విశేషం.ఇందులో వి ఆర్ దినేష్, కలైయరసన్ ప్రధాన పాత్రల్లో నటించగా, రిత్విక, విన్సు సామ్, షబీర్ కల్లారక్కల్, బాల శరవణన్ సహాయక పాత్రల్లో మెప్పించారు.సెప్టెంబర్ 19న దండకారణ్యం చిత్రం థియేటర్లలో విడుదలైంది. అటవీప్రాంతానికి చెందిన బిడ్డ ఎలాగైనా సరే ఇండియన్ ఆర్మీలో చేరాలనే తన కలను నేరవేర్చుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో ఈ చిత్రంలో చూపించారు. నవంబర్ 14 నుంచి సన్ నెక్స్ట్(Sun NXT) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదే విషయాన్ని తెలుపుతూ ఆ ఓటీటీ సంస్థ ఒక పోస్టర్ను విడుదల చేసింది. అయితే, ఈ మూవీ కేవలం తమిళ్ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది.ఓ ఆదివాసీ యువకుడిపై అణచివేత అడగడుగునా పడుతున్నా సరే ఇండియన్ ఆర్మీలో చేరాలన్న తన ప్రయాణాన్ని ఎలా కొనసాగించాడనేది ఈ మూవీలో అద్భుతంగా చూపించారు. తమ గ్రామ ప్రజల కోసం ఓ ఆదివాసీ యువకుడు చేసిన పోరాటం ఎలా ఉంటుందో దండకారణ్యంలో చూపించారు. -
ఓటీటీ ప్రియులకు మరో దీపావళి.. ఒక్క రోజే 20 సినిమాలు స్ట్రీమింగ్!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడే సందడి. ఈ వారంలో సినీ ప్రియులను అలరించేందుకు తెలుగు చిత్రాలతో పాటు పలు డబ్బింగ్ మూవీస్ కూడా రిలీజవుతున్నాయి. టాలీవుడ్ నుంచి సంతాన ప్రాప్తిరస్తు, జిగ్రిస్ వస్తుండగా.. దుల్కర్ సల్మాన్, రానా నటించిన డబ్బింగ్ మూవీ కాంత కూడా థియేటర్లలో సందడి చేయనుంది. వీటిలో కాంత, సంతాన ప్రాప్తిరస్తు సినిమాలపైనే ఓ రేంజ్లో హైప్ ఉంది.ఇక బాక్సాఫీస్ వద్ద సంగతి అటుంచితే ఓటీటీ ప్రియులకు ఈ వీకెండ్ పండగే అని చెప్పాలి. దీపావళి రిలీజైన చిత్రాలన్నీ ఓకేసారి మూకుమ్మడిగా ఓటీటీకి వచ్చేస్తున్నాయి. కిరణ్ అబ్బవరం కె- ర్యాంప్, సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా, ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ సినిమాలు రెండు రోజుల వ్యవధిలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో అక్షయ్ కుమార్ జాలీ ఎల్ఎల్బీ-3 కూడా ఓటీటీకి వచ్చేస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మరి.. మీకు నచ్చిన సినిమాలు ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్..తెలుసు కదా(తెలుగు సినిమా)- నవంబర్ 14డ్యూడ్ (తెలుగు సినిమా) - నవంబరు 14ఇన్ యువర్ డ్రీమ్స్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 14జాక్ పాల్ vs ట్యాంక్ డేవిస్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 14నోవెల్లే వాగ్ (ఫ్రెంచ్ మూవీ) - నవంబరు 14లెఫ్టర్- ది స్టోరీ ఆఫ్ ది ఆర్డినరీస్(హాలీవుడ్ మూవీ)- నవంబరు 14ది క్రిస్టల్ కుక్కు(స్పానిష్ థ్రిల్లర్ మూవీ)- నవంబరు 14జియో హాట్స్టార్ జాలీ ఎల్ఎల్బీ 3 (హిందీ మూవీ) - నవంబరు 14 అవిహితం (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబరు 14 జురాసిక్ వరల్డ్ రీబర్త్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 14అమెజాన్ ప్రైమ్నిశాంచి(హిందీ సినిమా) - నవంబర్ 14మాలిస్ సీజన్-1(హాలీవుడ్ సిరీస్)- నవంబర్ 14జీ5 దశావతార్ (మరాఠీ సినిమా) - నవంబరు 14 ఇన్స్పెక్షన్ బంగ్లా (మలయాళ సిరీస్) - నవంబరు 14ఆహా కె ర్యాంప్ (తెలుగు సినిమా) - నవంబరు 15సన్ నెక్ట్స్మారుతం(తమిళ సినిమా)- నవంబర్ 14దండకారణ్యం(తమిళ సినిమా)- నవంబర్ 14ఆపిల్ టీవీ ప్లస్ కమ్ సీ మీ ఇన్ ద గుడ్ లైట్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 14మనోరమ మ్యాక్స్ కప్లింగ్ (మలయాళ సిరీస్) - నవంబరు 14సింప్లీ సౌత్ పొయ్యమొళి (మలయాళ సినిమా) - నవంబరు 14 యోలో (తమిళ మూవీ) - నవంబరు 14 -
ఓటీటీలోకి లీగల్ కామెడీ మూవీ.. అధికారిక ప్రకటన
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వీకెండ్ కూడా అల తెలుసు కదా, కె ర్యాంప్, డ్యూడ్ లాంటి హిట్ చిత్రాలు రాబోతున్నాయి. వాటికి సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా వచ్చేశాయి. ఇప్పుడు లిస్టులో లేటెస్ట్ హిందీ మూవీ ఒకటి చేరింది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ లీగర్ కామెడీ చిత్రం ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందనే విషయాన్ని అనౌన్స్ చేశారు. ఇంతకీ ఎప్పటినుంచి ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: రజనీకాంత్ 173వ సినిమా.. వారంలోనే తప్పుకొన్న దర్శకుడు)గతంలో వచ్చిన జాలీ ఎల్ఎల్బీ, జాలీ ఎల్ఎల్బీ 2 సినిమాలకు కొనసాగింపుగా ఈ ఏడాదా సెప్టెంబరు 19న మూడో భాగం వచ్చింది. ఇందులో అక్షయ్ కుమార్, అర్షద్ వార్సి ప్రధాన పాత్రలు చేశారు. తొలి రెండు చిత్రాల్ని తీసిన సుభాష్ కపూర్.. దీన్ని కూడా డైరెక్ట్ చేశారు. 2011లో ఉత్తరప్రదేశ్లో జరిగిన ఓ నిజ జీవిత సంఘటన ఆధారంగా దీన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ వారం ప్రారంభంలోనే నవంబరు 14 నుంచి నెట్ఫ్లిక్స్లోకి రావొచ్చని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు అదే నిజమైంది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు. హిందీతో పాటు తెలుగు డబ్బింగ్ కూడా తీసుకొచ్చే అవకాశముంది.'జాలీ ఎల్ఎల్బీ 3' విషయానికొస్తే.. రాజస్థాన్లోని బికనీర్ గ్రామంలో ఓ ధనవంతుడైన పారిశ్రామికవేత్త హరి భాయ్ (గజరాజ్) చేసిన ఓ ప్రయత్నాన్ని ఊరిలోని వ్యవసాయదారులందరూ వ్యతిరేకిస్తారు. ప్రభుత్వాధికారులు తన చేతిలో ఉండేసరికి హరి భాయ్.. మతలబు చేసి రైతుల భూముల్ని తన సొంతం చేసుకుంటాడు. న్యాయం కోసం కోర్టుని ఆశ్రయించిన రైతులకు.. ఇద్దరు జాలీలు (అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీ) ఎలాంటి సాయం చేశారు? చివరకు ఏమైందనేదే ఈ సినిమా స్టోరీ. తొలిరోజు చిత్రాలతో పోలిస్తే ఇది ఓ మాదిరి స్పందన మాత్రమే అందుకుంది. పెద్దగా కలెక్షన్స్ కూడా రాలేదు.(ఇదీ చదవండి: ఎర్రకోట ఘటన.. 'పెద్ది' టీమ్ జస్ట్ మిస్!) -
విక్రమ్ తనయుడి బైసన్.. ఓటీటీకి వచ్చేది ఆ రోజే!
కోలీవుడ్ స్టార్ విక్రమ్ తనయుడు ధ్రువ్ హీరోగా నటించిన చిత్రం బైసన్. ఇటీవలే దీపావళి సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ మూవీని కబడ్డీ బ్యాక్ డ్రాప్లో మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమాను ఓ వారం రోజుల గ్యాప్ తర్వాత అక్టోబర్ 24న తెలుగులోనూ విడుదల చేశారు. ఇక్కడ కూడా పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది.దీంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ధ్రువ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ రిలీజ్పై సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ చిత్రం నవంబర్ 21 నుంచి డిజిటల్గా అందుబాటులోకి రానుందని టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ నెలలోనే నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కావొచ్చని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. కాగా.. ఈ చిత్రంలో హీరో అక్కగా రజిషా విజయన్, ఆయన తండ్రిగా పశుపతి, హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ నటించారు. వీరితో పాటు దర్శకుడు అమీర్, లాల్ ముఖ్యపాత్రలు పోషించారు. నివాస్ కే.ప్రసన్న సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని దర్శకుడు పా.రంజిత్కు చెందిన నీలం ప్రొడక్షన్న్స్, అప్లాజ్ ఎంటర్టెయిన్మెంట్, శాంతి సినిమా సంస్థలు కలిసి నిర్మించాయి. ఒక కుగ్రామానికి చెందిన పేద కుర్రాడు అత్యున్నత పురస్కారం అర్జున్ అవార్డును గెలుచుకునే స్థాయికి ఎలా ఎదిగాడు అనే ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రమే బైసన్. #BisonKaalamaadan is expected to be streaming on November 21 in #Netflix !#SaiSango #TAMILTVHouse #DhruvVikram #Pasupathy #AnupamaParameswaran #BisonKaalamaadanOnNetflix pic.twitter.com/QxFLAk6e7x— TAMIL TV House (@tamiltvhouse) November 10, 2025 -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 21 సినిమాలు
మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి దుల్కర్ సల్మాన్ 'కాంత'తో పాటు సంతాన ప్రాప్తిరస్తు, జిగ్రీస్, స్కూల్ లైఫ్, సీమంతం, ఆటకదరా శివ అనే తెలుగు సినిమాలు రాబోతున్నాయి. అలానే నాగ్ కల్ట్ క్లాసిక్ 'శివ' రీ రిలీజ్ కానుంది. 'గత వైభవం' అనే కన్నడ డబ్బింగ్ మూవీ కూడా ఇదే వీకెండ్లో థియేటర్లలోకి విడుదల కానుంది.(ఇదీ చదవండి: 'పర్ఫామెన్స్ తక్కువ, డ్రామా ఎక్కువ'.. నామినేషన్స్లో ఎవరంటే?)మరోవైపు ఓటీటీల్లో పలు తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ హిట్ చిత్రాలు ఇదే వారం స్ట్రీమింగ్ కానుండటం విశేషం. గత నెలలో దీపావళి రిలీజై ఆకట్టుకున్న డ్యూడ్, తెలుసు కదా, కె ర్యాంప్.. ఆయా ఓటీటీల్లో అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు అవిహితం, జూరాసిక్ రీ బర్త్ అనే డబ్బింగ్ మూవీస్, ఢిల్లీ క్రైమ్ మూడో సీజన్ కూడా ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తోంది. ఇంతకీ ఈ వారం ఏ ఓటీటీలో ఏ సినిమా రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (నవంబరు 10 నుంచి 16 వరకు)నెట్ఫ్లిక్స్మెరైన్స్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 10ఏ మేరీ లిటిల్ ఎక్స్-మస్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 12ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 (హిందీ సిరీస్) - నవంబరు 13తెలుసు కదా (తెలుగు మూవీ) - నవంబరు 14డ్యూడ్ (తెలుగు సినిమా) - నవంబరు 14ఇన్ యువర్ డ్రీమ్స్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 14జాక్ పాల్ vs ట్యాంక్ డేవిస్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 14నోవెల్లే వాగ్ (ఫ్రెంచ్ మూవీ) - నవంబరు 14 అమెజాన్ ప్రైమ్ప్లే డేట్ (ఇంగ్లీష్ చిత్రం) - నవంబరు 12హాట్స్టార్జాలీ ఎల్ఎల్బీ 3 (హిందీ మూవీ) - నవంబరు 14అవిహితం (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబరు 14జురాసిక్ వరల్డ్ రీబర్త్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 14జీ5దశావతార్ (మరాఠీ సినిమా) - నవంబరు 14ఇన్స్పెక్షన్ బంగ్లా (మలయాళ సిరీస్) - నవంబరు 14ఆహాకె ర్యాంప్ (తెలుగు సినిమా) - నవంబరు 15సన్ నెక్స్ట్ఎక్క (కన్నడ మూవీ) - నవంబరు 13ఆపిల్ టీవీ ప్లస్పాన్ రాయల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 12కమ్ సీ మీ ఇన్ ద గుడ్ లైట్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 14మనోరమ మ్యాక్స్కప్లింగ్ (మలయాళ సిరీస్) - నవంబరు 14సింప్లీ సౌత్పొయ్యమొళి (మలయాళ సినిమా) - నవంబరు 14యోలో (తమిళ మూవీ) - నవంబరు 14(ఇదీ చదవండి: అందువల్లే సాయి ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతంటే?) -
ఎట్టకేలకు ప్రకటించేశారు.. ఓటీటీలోకి వచ్చేస్తున్న డ్యూడ్
దీపావళికి రిలీజైన అన్ని సినిమాలు ఓటీటీ డేట్ ఇచ్చేశాయి. కిరణ్ అబ్బవరం 'కె-ర్యాంప్' నవంబర్ 15న ఆహాలో రిలీజ్ అవుతున్నట్లు ప్రకటించారు. సిద్ధు జొన్నలగడ్డ 'తెలుసు కదా' మూవీ నవంబర్ 14న నెట్ఫ్లిక్స్లో విడుదలవుతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఇక దీపావళి రేసులో బ్లాక్బస్టర్గా నిలిచిన 'డ్యూడ్' సినిమా ఓటీటీ డేట్ మాత్రం అనౌన్స్ చేయకుండా అభిమానులను సస్పెన్స్లో ఉంచారు.ఈ వారమే ఓటీటీలోఈ సస్పెన్స్కు తెర దించుతూ ఎట్టకేలకు డ్యూడ్ ఓటీటీ రిలీజ్ డేట్ (Dude Movie OTT Reelase Date) ప్రకటించారు. నవంబర్ 14న నెట్ఫ్లిక్స్లో రానుందంటూ ఎక్స్ వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో డ్యూడ్ అందుబాటులోకి రానుందని వెల్లడించారు. డ్యూడ్ విషయానికి వస్తే.. ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు ప్రధాన పాత్రలు పోషించారు. శరత్కుమార్ కీలక పాత్రలో నటించగా కీర్తి శ్వరన్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. ఈ సినిమా అక్టోబర్ 17న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాగా ఈజీగా రూ.100 కోట్లు రాబట్టింది.కథడ్యూడ్ కథేంటంటే.. గగన్ (ప్రదీప్ రంగనాథన్).. ఆముద (నేహా శెట్టి)ని ప్రేమిస్తాడు. కానీ మరొకరిని పెళ్లి చేసుకుంటుంది. గగన్ను అతడి మేనమామ (శరత్ కుమార్) కూతురు కుందన (మమిత బైజు) ప్రేమిస్తుంది. కానీ, ఆమె పెళ్లి ప్రపోజల్ను గగన్ రిజెక్ట్ చేస్తాడు. కొంతకాలానికి ఆమెనే పెళ్లాడాలనుకున్న టైమ్కు కుందన పార్దు (హృదయ్)తో ప్రేమలో ఉంటుంది. అయినప్పటికీ గగన్-కుందనకే పెళ్లి జరుగుతుంది. వీళ్ల పెళ్లికి కారణమేంటి? తర్వాత కలిసున్నారా? లేదా? అనేది ఓటీటీలో చూసేయండి.. Orey oru Dude, oraayiram problems, zero solutions 🤭😭 pic.twitter.com/ShfAo36IJz— Netflix India South (@Netflix_INSouth) November 10, 2025చదవండి: ముక్కోటి గొంతుకల్ని ఏకం చేసిన అందెశ్రీ.. పాటతోనే ప్రాణం -
ఓటీటీలో 'తెలుసు కదా' మూవీ.. అఫీషియల్ ప్రకటన
టాలీవుడ్ నటుడు సిద్ధు జొన్నలగడ్డ కొత్త సినిమా తెలుసు కదా ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. దర్శకులు నీరజ కోన తెరకెక్కించిన ఈ చిత్రం అక్టోబర్ 17న విడుదలైంది. అయితే, అనుకున్నంత రేంజ్లో ప్రేక్షకులను మెప్పించలేదు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్, కృతిప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీలో రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి , వైవా హర్ష నటించారు.ముక్కోణపు ప్రేమకథగా తెరకెక్కిన తెలుసు కదా చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. నవంబర్ 14 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని అప్కమింగ్ చిత్రాల జాబితాలో నెట్ఫ్లిక్స్(Netflix) పేర్కొంది. సినిమా విడుదలైన నెలరోజుల్లోనే ఓటీటీలోకి రావడం విశేషం. తెలుసు కదా మూవీని సుమారు రూ. 50 కోట్ల బడ్జెట్తో రూపొందించారని టాక్. అయితే, బాక్సాఫీస్ వద్ద రూ. 12 కోట్ల మేరకు రాబట్టినట్లు తెలుస్తోంది. కానీ, ఈ సినిమా ఓటీటీ రైట్స్ సుమారుగా 15 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లు వార్తలు వచ్చాయి. ఆపై శాటిలైట్ రైట్స్ రూ. 5 కోట్లతో పాటు మ్యూజిక్ రైట్స్ కోటి వరకు బిజినెస్ చేయడంతో కాస్త మేరకు నష్టాలు తగ్గినట్లు తెలుస్తోంది.కథేంటంటే..స్టార్ హోటల్ లో చీఫ్ చెఫ్గా పనిచేసే వరుణ్ కుమార్(సిద్దు) అనాథ. కాలేజీ డేస్లో లవ్ బ్రేకప్ అవ్వడంతో అమ్మాయిలను ఎంత వరకు ప్రేమించాలనే విషయంలో క్లారిటీతో ఉంటాడు. భార్య, పిల్లలతో కలిసి సంతోషంగా జీవించాలని కోరుకుంటాడు. మ్యాట్రిమొనీ ద్వారా అంజలి(రాశి ఖన్నా)ని పెళ్లి చేసుకుంటాడు. ఇద్దరికి పిల్లలు అంటే చాలా ఇష్టం. కానీ పెళ్లి తర్వాత అంజలికి పిల్లలు పుట్టరనే విషయం తెలుస్తుంది. కొన్నాళ్ల తర్వాత డాక్టర్ రాగా(శ్రీనిధి శెట్టి) ద్వారా సరోగసీతో తల్లి కావొచ్చనే విషయం అంజలికి తెలుస్తుంది. బిడ్డను మోసేందుకు డాక్టర్ రాగా ముందుకు వస్తుంది.కట్ చేస్తే.. కాలేజీ డేస్లో వరుణ్ ప్రేమించిన అమ్మాయినే డాక్టర్ రాగా. ఈ విషయం తెలిసి కూడా రాగా తన బిడ్డను మోసేందుకు ఒప్పుకుంటాడు వరుణ్. ఈ ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు రాగా-వరుణ్ బ్రేకప్కి కారణం ఏంటి? తనను వదిలేసి వెళ్లిపోయిన రాగా పట్ల ఎంతో కోపం పెంచుకున్న వరుణ్.. ఆమె తన బిడ్డను మోసేందుకు ఎందుకు ఒప్పుకున్నాడు? రాగా-వరుణ్ల విషయం అంజలికి తెలిసిందా లేదా? మాజీ ప్రేయసి ఒకవైపు.. కట్టుకున్న భార్య మరోవైపు.. ఇద్దరి మధ్య వరుణ్కి ఎదురైన సమస్యలు ఏంటి? వరుణ్ కోరుకున్నట్లుగా చివరకు తండ్రి అయ్యాడా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
40 ఏళ్లు వచ్చినా పెళ్లి కాకపోతే.. 'ఆప్ జైసా కోయి' చూసేయండి!
టైటిల్: ఆప్ జైసా కోయి(Aap Jaisa Koi)నటులు: ఆర్.మాధవన్, ఫాతిమా సనా షేక్ (దంగల్ నటి)ఓటీటీ: నెట్ఫ్లిక్స్ఓటీటీలు వచ్చాక సినిమాలు చూసే ధోరణి పూర్తిగా మారిపోయింది. తమకు నచ్చిన కంటెంట్ను చూసే వీలు దొరికింది. దీంతో భాషతో సంబంధం లేకుండా నచ్చిన కంటెంట్ తెగ చూసేస్తున్నారు. ప్రజెంట్ ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగానే ట్రెండ్కు తగ్గ సినిమాలు, వెబ్ సిరీస్లు వచ్చేస్తున్నాయి. అలా ప్రస్తుత రోజుల్లో 42 ఏళ్లయినా పెళ్లికానీ ఓ సంప్రదాయ యువకుడి కథే ఈ ఆప్ జైసా కోయి(Aap Jaisa Koi). ఎలా ఉందో రివ్యూలో చూసేయండి.కథేంటంటే..సంప్రదాయ కుటుంబానికి చెందిన 42 ఏళ్ల శ్రీరేణు(ఆర్ మాధవన్). అతని పెళ్లి కోసం ఇంట్లో వాళ్లు ఎన్నో ఏళ్లుగా సంబంధాలు చూస్తూనే ఉంటారు. శ్రీ పెళ్లి వేడుక కోసం ఫ్యామిలీ అంతా ఎదురు చూసేవారు. అసలు అతనికి పెళ్లి యోగం ఉందో లేదో అని జ్యోతిష్యులను అడిగేవారు. కానీ అవన్నీ వర్కవుట్ కాకపోవడంతో శ్రీరేణు మానసికంగా ఇబ్బందులు పడేవాడు.అలా ఇబ్బందులు పడుతున్న శ్రీకి అతని ఫ్రెండ్ ఓ సలహా ఇస్తాడు? అతని సలహా విన్న శ్రీరేణు ఉరకలెత్తే ఉత్సాహంతో మొదలుపెడతాడు? అలా అతను ఊహల్లో తేలుతుండగానే.. మధు బోస్(ఫాతిమా సనా షేక్) అతనికి పరిచయమవుతుంది. ఆ తర్వాత కొన్ని రోజులకే వీరి మధ్య విభేదాలొస్తాయి. ఇక ఇద్దరికీ సెట్ కాదని శ్రీరేణు భావిస్తాడు. దీంతో ఆమెను దూరంగా పెడతాడు. ఆ తర్వాత మళ్లీ వీరు కలిశారా? అసలు చివరికీ ప్రేమలో పడ్డారా? 40 ఏళ్లు దాటినా శ్రీరేణు పెళ్లి కళ నేరవేరిందా? అనేది తెలియాలంటే ఆప్ జైసా కోయి చూడాల్సిందే.డైరెక్టర్ వివేక్ సోని నేటి సమాజానికి అవసరమైన కథనే ఎంచుకున్నారు. ఈ సోషల్ మీడియా రోజుల్లో వర్జిన్ అన్న పదానికి అర్థం వెతకడం దాదాపు అసాధ్యమే. అలాంటి మైండ్సెట్ ఉన్న నేటి యువతకు ఈ మూవీతో సరైన సందేశం ఇచ్చాడు. ఒక మనిషికి ప్రేమ, నమ్మకం, ఆత్మగౌరవం అనేవి ఎంత ముఖ్యమో ఈ కథతో సరికొత్త నిర్వచనమిచ్చాడు దర్శకుడు. శ్రీ రేణు లాంటి అబ్బాయి.. మధు బోస్ లాంటి అమ్మాయికి మధ్య జరిగే సన్నివేశాలు నేటి యూత్కు బాగా కనెక్ట్ అవుతాయి. ఒకవైపు ప్రేమ- మరోవైపు నమ్మకం అనే వాటి చుట్టే కథను నడిపించాడు డైరెక్టర్. ఓవరాల్గా చూసే పెళ్లి కానీ 42 ఏళ్ల యువకుడి కథే. కానీ ఈ ప్రేమకథలో తీసుకొచ్చిన ఎమోషన్స్ అద్భుతం. ఆడ, మగను ఎక్కువ, తక్కువ అంటూ చూసే వాళ్ల కళ్లు తెరిపించే ప్రేమకథా చిత్రమే ఆప్ జైసా కోయి. వీకెండ్లో మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ కావాలంటే ఈ మూవీ ట్రై చేయండి. -
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా అలానే బ్యాడ్ గర్ల్, చిరంజీవ, కిస్, మిత్రమండలి, బారాముల్లా తదితర తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ బొమ్మలు.. డిజిటల్గా అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు జారన్ అనే సినిమా తెలుగు వెర్షన్ కూడా ఓటీటీలోకి వచ్చేసింది. వీటితోపాటు ఇప్పుడు మరో రెండు తెలుగు చిత్రాలు కూడా అందుబాటులోకి వచ్చేశాయి.(ఇదీ చదవండి: సౌండ్తో భయపెట్టారు.. 'డీయస్ ఈరే' తెలుగు రివ్యూ)కొన్నాళ్ల క్రితం తమిళంలో రిలీజై హిట్ టాక్ తెచ్చుకున్న చిత్రం హౌస్మేట్స్. జీ5లో అందుబాటులో ఉండేది. ఇప్పటివరకు తమిళంలో మాత్రమే ఉండగా.. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ కూడా తీసుకొచ్చినట్లు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దెయ్యమే లేకుండా ఈ హారర్ సినిమా తీయడం విశేషం. ఒకే అపార్ట్మెంట్లో రెండు వేర్వేరు కాలాల్లో రెండు కుటుంబాలు ఉంటాయి. దీంతో ఒకరి గురించి మరొకరు తెలుసుకుని భయపడతారు. చివరకు ఏమైందనేదే స్టోరీ.మరోవైపు 2023 అక్టోబరులో రిలీజైన 'ధీమహి' అనే తెలుగు సినిమా.. దాదాపు రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ విషయానికొస్తే.. అమెరికాలో సర్జన్గా కార్తీక్(సాహస్) పనిచేస్తుంటాడు. ఇతడికి మేనకోడలు ధీమహి అలియాస్ మహి(ఆషిక పగడాల) అంటే పంచప్రాణాలు. కొన్నిరోజులకు మహి అనూహ్యంగా కిడ్నాప్ అవుతుంది. తర్వాత చంపేస్తారు కూడా. మేనకోడలు చావుకి తానే కారణమని బాధపడే కార్తీక్.. నెక్రోమాన్సీ అనే పద్దతితో ఆమె ఆత్మతో మాట్లాడి ఆమె మరణానికి కారణమైన వ్యక్తిని చంపాలని అనుకుంటాడు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: రష్మిక 'గర్ల్ఫ్రెండ్' కలెక్షన్స్ ఎంత? మరి మిగతా సినిమాలకు) -
ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తాష్కెంట్ ఫైల్స్, కశ్మీర్ ఫైల్స్ సినిమాలతో వివాదాస్పద దర్శకుడిగా వివేక్ అగ్నిహోత్రి పేరు తెచ్చుకున్నాడు. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన చివరి చిత్రం 'ద బెంగాల్ ఫైల్స్'. 1947లో ఇండియా-పాక్ విభజన బ్యాక్డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. విడుదలకు ముందే చర్చనీయాంశమైన చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.'ద బెంగాల్ ఫైల్స్' సినిమా సెప్టెంబరు 5న థియేటర్లలోకి వచ్చింది. దాదాపు మూడున్నర గంటల నిడివితో దీన్ని తీశారు. తొలి రెండు చిత్రాల్లానే ఇది కూడా జీ5 ఓటీటీలోనే స్ట్రీమింగ్ కాబోతుంది. ఈనెల 21 నుంచి హిందీ భాషలో అందుబాటులోకి రానుంది.(ఇదీ చదవండి: ఓటీటీలో 'కె- ర్యాంప్'.. అధికారిక ప్రకటన)'ద బెంగాల్ ఫైల్స్' విషయానికొస్తే.. 1947వ సంవత్సరంలో భారత్-పాక్ ఎలా విడిపోయాయి. ఈ విషయంలో గాంధీ ఎలాంటి పాత్ర పోషించారు. అప్పుడు హిందువులు, ముస్లింల మధ్య ఎలాంటి గొడవలు చేలరేగాయి. ఎవరు ఎవరిని ఎందుకు చంపారు. ఈ అనర్థాలన్నీ ఎందుకు జరిగాయనేది ఈ సినిమా స్టోరీ.ప్రధానంగా భారతదేశం నుంచి పాకిస్థాన్ విడిపోయే సమయంలో గాంధీ, మహమ్మద్ అలీ జిన్నాని ఇదంతా వద్దని అంటారు. జిన్నా మాత్రం.. ముస్లింలు ఎప్పుడూ ముస్లింలే, హిందూ ముస్లిం భాయ్ భాయ్ కాదు అని అంటాడు. తర్వాత జిన్నా మనుషులు అప్పటి దేశ రాజధాని అయిన కలకత్తాలో మారణహోమం సృష్టిస్తారు. హిందూ స్త్రీలని, మహిళలని, చిన్నపిల్లలని చూడకుండా దారుణంగా కాల్చి చంపేస్తారు. ఇలాంటి సమయంలో మన దేశాన్ని పాలిస్తున్న బ్రిటీషర్లు ఏం చేశారు? ముస్లింలపై భారతీయులు ఎలా తిరుగుబాటు చేశారు? తమని తాము ఎలా కాపాడుకున్నారనే అంశాల్ని ఇందులో చూపించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
ఓటీటీలో 'కె- ర్యాంప్'.. అధికారిక ప్రకటన
టాలీవుడ్ నటుడు కిరణ్ అబ్బవరం నటించిన ‘కె- ర్యాంప్’ (KRamp) ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. దీపావళి పండుగ కానుకగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకుంది. ఇందులో యుక్తి తరేజా, నరేష్ వీకే, సాయి కుమార్, కామ్నా జెఠ్మలానీ తదితరులు నటించారు. తొలిసారిగా డైరెక్టర్గా ఛాన్స్ దక్కించుకున్న జైన్స్ నాని ప్రేక్షకులను మెప్పించాడు. ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ చిత్రాన్ని రాజేష్ దండా, శివ బొమ్మకు నిర్మించారు.'బుర్రపాడు ఎంటర్టైనర్' అంటూ 'కె- ర్యాంప్' పోస్టర్ను ఆహా (Aha) తెలుగు ఒక పోస్టర్ విడుదల చేసింది. నవంబర్ 15న ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ. 50 కోట్ల మార్క్ను చేరుకుంది. రాజశేఖర్ నటించిన ఆయుధం సినిమాలోని 'ఇదేమిటమ్మా మాయ మాయ.. మైకం కమ్మిందా.. ఆ ఇంద్రలోకం నిన్ను నన్ను.. ఏకం కమ్మందా' అనే సాంగ్ను కె ర్యాంప్లో రీక్రియేట్ చేసి మెప్పించారు. ఈ ఏడాదిలో షోషల్మీడియాను షేక్ చేసేలా చాలామంది రీల్స్ చేశారు. గతేడాది దీపావళికి ‘క’ సినిమాతో హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం... ఈ దీపావళికి ‘కె - ర్యాంప్’తో మరో విజయాన్ని దక్కించుకున్నారు.కథేంటికుమార్ అబ్బవరం(కిరణ్ అబ్బవరం) రిచ్ కిడ్. ఎంసెంట్ ఫెయిల్ అవ్వడమే కాకుండా రోజు తాగుతూ..చిల్లరగా ప్రవర్తిస్తుంటాడు. కొడుకు మీద ప్రేమతో నాన్న(సాయి కుమార్) ఒక్క మాట కూడా అనలేకపోతాడు. జ్యోతిష్యుడు సలహాతో మెడిసిన్ చదివించేందుకు కొడుకును కేరళకు పంపుతాడు. అక్కడ కూడా ఇలాగే తాగుతూ ఎంజాయ్ చేస్తున్న కుమార్.. తొలి చూపులోనే క్లాస్మేట్ మెర్సీ(యుక్తి తరేజా)తో ప్రేమలో పడతాడు.మెర్సీ కూడా కుమార్ని ఇష్టపడుతుంది. ఇద్దరి ఫ్యామిలీకీ వీరి ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అదే సమయంలో మెర్సికి అరుదైన వ్యాధి పోస్ట్ ట్రామాటిక్ స్టెస్ డిజార్డర్ (PSTD) ఉందనే విషయం తెలుస్తుంది. ఆమెకు ఉన్న వ్యాదితో కుమార్కు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? మెర్సీకి ఆ వ్యాది ఎలా సోకింది? దాని పరిష్కారం కోసం కుమార్ ఏం చేశాడు? ఈ కథలో నరేశ్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీకి సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చాక మలయాళ చిత్రాలకు ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. కంటెంట్ బాగుంటే ఆడియన్స్ తెగ చూసేస్తున్నారు. అక్కడ సూపర్ హిట్ అయిన చిత్రాలకు భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తున్నారు. ఇప్పటికే పలు మలయాళ మూవీస్ ఆడియన్స్ ఆదరణ దక్కించుకున్నాయి. తాజాగా మరో చిత్రం సినీ ప్రియులను అలరించేందుకు వచ్చేస్తోంది. మలయాళంంలో హిట్ అయిన కామెడీ ఎంటర్టైనర్ ఓటీటీలో సందడి చేయనుంది. సెన్నా హెగ్డే దర్శకత్వంలో వచ్చిన అవిహితం అనే బ్లాక్ కామెడీ మూవీ జియో హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈనెల 14 నుంచి మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల తర్వాత ఓటీటీలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో ఉన్నిరాజ్, రెంజి కంకోల్, వినీత్ చాక్యార్, రాకేష్ ఉషార్, ధనేష్ కోలియత్, అజిత్ పున్నద్, బృందా మీనన్ కీలక పాత్రలు పోషించారు. Avihitham – Not just a man’s right.Streaming exclusively on JioHotstar from November 14th.#Avihitham #AvihithamOnHotstar #Comedy #Family #Drama #JioHotstar #JioHotstarMalayalam pic.twitter.com/ZikNnucPFg— JioHotstar Malayalam (@JioHotstarMal) November 7, 2025 -
లెజెండ్ హీరోయిన్ పవర్ఫుల్ రోల్.. నేరుగా ఓటీటీలోనే రిలీజ్!
లెజెండ్ హీరోయిన్ రాధికా ఆప్టే(Radhika Apte) లీడ్ రోల్లో నటిస్తోన్న తాజా చిత్రం సాలీ మొహబ్బత్. ఈ మూవీలో మరోసారి పవర్ఫుల్ రోల్లో కనిపించనుంది. ఈ సినిమాకు టిస్కా చోప్రా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్నారు. గతేడాది రిలీజవుతుందని ప్రకటించిన ఈ మూవీ ఇప్పటి వరకు థియేటర్లకు రాలేదు.తాజాగా ఈ సినిమాకు సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చింది నిర్మాణ సంస్థ. సాలీ మొహబ్బత్ను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మూవీని త్వరలోనే జీ5 వేదికగా మీ ముందుకు రానుందని ప్రత్యేక పోస్టర్ను రిలీజ్ చేసింది. అయితే ఈ సినిమా ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందనేది మాత్రం వెల్లడించలేదు. కాగా.. ఇప్పటికే ఈ సినిమాను పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రదర్శించారు. ఈ సినిమాను జియో స్టూడియోస్ సమర్పణలో స్టేజ్5 ప్రొడక్షన్ బ్యానర్లో జ్యోతి దేశ్పాండే, దినేశ్ మల్హోత్రా, మనీశ్ మల్హోత్రా నిర్మించారు. Kabhi dard, toh kabhi sukoon deti hai..Yeh Saali Mohabbat na jaane kya kya karwati hai!#SaaliMohabbat, coming soon on #ZEE5#SaaliMohabbatOnZEE5@radhika_apte @divyenndu @anuragkashyap72 @anshumaanpushk1 #SauraseniMaitra #SharatSaxena @tiscatime #JyotiDeshpande… pic.twitter.com/WCnR9Sc9vg— Jio Studios (@jiostudios) November 7, 2025 -
ఓటీటీలోకి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో థ్రిల్లర్ లేదంటే హారర్ సినిమాలని ఎక్కువగా చూస్తుంటారు. అందుకు తగ్గట్లే ఎప్పటికప్పుడు డిఫరెంట్ హారర్ మూవీస్ వస్తూనే ఉంటాయి. తెలుగులో మాత్రం వివిధ భాషల్లోనూ ఈ జానర్ మూవీస్ హిట్ ఫార్ములానే. అలా ఈ ఏడాది జూన్లో రిలీజైన ఓ మరాఠీ హారర్.. ఇన్నాళ్లకు తెలుగులో అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఏంటి మూవీ స్పెషాలిటీ? ఎందులో చూడొచ్చు.(ఇదీ చదవండి: 'ఆర్యన్' రివ్యూ.. థ్రిల్లర్ సినిమా ఎలా ఉంది?)ఈ ఏడాది జూన్లో థియేటర్లలో రిలీజైన మరాఠీ సినిమా 'జారన్'. మరాఠీ భాషలో ఈ టైటిల్కి అర్థం చేతబడి. పేరుకి తగ్గట్లే మొత్తం బ్లాక్ మ్యాజిక్ తరహా సీన్స్ ఉంటాయి. ఇది ఆగస్టులోనే జీ5 ఓటీటీలోకి వచ్చింది. కాకపోతే హిందీలో మాత్రం స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ని కూడా తీసుకొచ్చేశారు. ఈ మేరకు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సైకలాజికల్ హారర్ చిత్రాలంటే ఆసక్తి ఉంటే దీనిపై ఓ లుక్కేయండి.'జారన్' విషయానికొస్తే.. రాధ(అమృత సుభాష్)కు భర్త, కుమార్తె ఉంటారు. బతకడం అయితే బతుకుతూ ఉంటుంది గానీ ఈమె ఇంట్లో ఏ మాత్రం ప్రశాంతత, సంతోషం అనేది ఉండదు. దానికి కారణం చేతబడి. రాధ కుటుంబాన్ని ఎవరో చేతబడి చేస్తారు. ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి రాధ.. ఈ సమస్యతో బాధపడుతూ ఉంటుంది. అసలు రాధకు ఎవరు ఇలా చేతబడి చేశారు? ఆమె కుటుంబంపై ఎవరికి పగ ఉంది? ఎందుకు ఉంది? చివరకు ఏమైందనేదే అసలు స్టోరీ.(ఇదీ చదవండి: ఈ జనరేషన్ ఆడపిల్లల మనసు ఆవిష్కరించిన సినిమా.. ఓటీటీ రివ్యూ) -
శుక్రవారం సినిమాల జాతర.. ఓటీటీల్లో ఏకంగా 17 చిత్రాలు!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలా బాక్సాఫీస్ వద్ద సినిమాలు సందడి. అలా ఈ ఫ్రైడే సుధీర్ బాబు నటించిన జటాధర, రష్మిక ది గర్ల్ఫ్రెండ్, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, ప్రేమిస్తున్నా లాంటి చిత్రాలు థియేటర్లలో రిలీజవుతున్నాయి. వీటితో పాటు ఆర్యన్, ఫీనిక్స్ లాంటి డబ్బింగ్ సినిమాలు వచ్చేస్తున్నాయి. వీటిలో ఒకట్రెండ్ చిత్రాలపైనే ఆడియన్స్లో ఆసక్తి నెలకొంది. వీటి సంగతి పక్కన పెడితే.. శుక్రవారం ఓటీటీల్లోనూ సినిమాలు స్ట్రీమింగ్కు రెడీ అవుతుంటాయి. అలా ఈ వారంలో తెలుగులో చిరంజీవ మూవీ స్ట్రీమింగ్కు రానుంది. బాలీవుడ్ నుంచి ఏక్ చతుర్ నార్ అనే సినిమా వస్తోంది. వీటితో పాటు పలు హాలీవుడ్ మూవీస్, వెబ్ సిరీసులు కూడా సందడి చేయనున్నాయి. మరి ఏయే చిత్రాలు ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయో తెలియాలంటే మీరు కూడా ఓ లుక్కేయండి. ఈ శుక్రవారం ఓటీటీ సినిమాలు..నెట్ఫ్లిక్స్ ఏక్ చతుర్ నార్(హిందీ సినిమా) - నవంబరు 07 బారాముల్లా (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 07 ఫ్రాంకెన్ స్టెయిన్ (ఇంగ్లీష్ చిత్రం) - నవంబరు 07 మ్యాంగో(హాలీవుడ్ మూవీ)- నవంబరు 07 యాజ్ యూ స్టూడ్ బై-(కొరియన్ థ్రిల్లర్ మూవీ)- నవంబరు 07 గ్రూమ్ అండ్ టూ బ్రైడ్స్(హాలీవుడ్ సినిమా)- నవంబరు 07 జియో హాట్స్టార్ఆల్ హర్ ఫాల్ట్- (హాలీవుడ్ మూవీ)- నవంబరు 07అమెజాన్ ప్రైమ్ వీడియోమ్యాక్స్టన్ హాల్ (జర్మన్ సిరీస్) - నవంబరు 07ఆహా చిరంజీవ (తెలుగు చిత్రం) - నవంబరు 07జీ5 కిస్ (తమిళ సినిమా) - నవంబరు 07 తోడే దూర్ తోడే పాస్ (హిందీ వెబ్ సిరీస్) - నవంబరు 07సోనీ లివ్ మహారాణి సీజన్ 4 (హిందీ వెబ్ సిరీస్) - నవంబరు 07ఆపిల్ ప్లస్ టీవీ ప్లరిబస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - నవంబరు 07మనోరమ మ్యాక్స్ కరమ్ (మలయాళ సినిమా) - నవంబరు 07లయన్స్ గేట్ ప్లే అర్జున్ చక్రవర్తి (తెలుగు సినిమా) - నవంబరు 07 ద హ్యాక్ సీజన్- 1 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - నవంబరు 07సన్ నెక్ట్స్ఎక్కా(కన్నడ సినిమా)- నవంబరు 07 -
ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్.. బడా నిర్మాత భార్య హీరోయిన్
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. కొన్నింటిని మాత్రం సర్ప్రైజ్ స్ట్రీమింగ్ అనేలా అప్పటికప్పుడు అనౌన్స్ చేస్తూ ఉంటారు. అలా ఓ హిందీ కామెడీ థ్రిల్లర్ రిలీజ్ గురించి ఇప్పుడు అధికారిక ప్రకటన వచ్చింది. ప్రజల సొమ్ము దొచుకునే కొందరిపై ఓ మహిళ పాములా పగబడితే అనే కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని తీశారు. ఇంతకీ ఇది ఏ ఓటీటీలో ఎప్పుడు రానుంది?(ఇదీ చదవండి: దుల్కర్ సల్మాన్ 'కాంత' ట్రైలర్ రిలీజ్)2004లో వచ్చిన ఉదయ్ కిరణ్ 'లవ్ టుడే' సినిమాతో హీరోయిన్ అయిన దివ్య ఖోస్లా.. తర్వాత ఏడాదే బాలీవుడ్ బడా నిర్మాత, టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ని పెళ్లి చేసుకుంది. నటన పక్కనబెట్టేసింది. 2016 నుంచి నటి, దర్శకురాలిగా సినిమాలు చేస్తున్న ఈమె.. ఇప్పుడు 'ఏక్ చతుర్ నార్' అనే సినిమాతో వచ్చింది. డార్క్ కామెడీ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబరు 12న థియేటర్లలోకి రాగా.. శుక్రవారం(నవంబరు 07) నుంచి నెట్ఫ్లిక్స్లోకి రానుంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది.ఏక్ చతుర్ నార్ విషయానికొస్తే.. లక్నోలోని ఓ మురికివాడలో మమత (దివ్య ఖోస్లా).. కొడుకు, అత్తతో కలిసి జీవిస్తుంటుంది. మెట్రో స్టేషన్లో ఉద్యోగం చేస్తుంటుంది. ఓ రోజు మమత పనిచేస్తున్న చోట పెద్ద ఫైనాన్షియర్ అభిషేక్ వర్మ (నీల్ నితిన్ ముఖేష్) ఫోన్ దొంగతనానికి గురవుతుంది. ఆ ఫోన్ని పట్టుకోవడానికి వెళ్లిన మమత ఏం చేసింది? అసలు ఫైనాన్షియర్కి మమతకు మధ్య గొడవేంటి? ఆ ఫోన్లో ఏముంది? దీన్ని అడ్డం పెట్టుకుని మమత ఏమేం పనులు చేసిందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: కొత్తింట్లోకి బిగ్ బాస్ ఫేమ్ కమెడియన్ జ్యోతి.. ఫొటోలు వైరల్)Ek Chatur Naar, joh hai tez tarrar jaise chaaku ki dhaar 👀 Jeetega is khel mein kaun? 😏Watch Ek Chatur Naar, out 7 November, on Netflix.#EkChaturNaarOnNetflix pic.twitter.com/IwpE0kUXNN— Netflix India (@NetflixIndia) November 6, 2025 -
ఓటీటీలో 'మిత్రమండలి'.. 20 రోజుల్లోనే స్ట్రీమింగ్
నటుడు ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా నటించిన కొత్త చిత్రం ‘మిత్రమండలి’ ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. విజయేందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, వెన్నెల కిశోర్,సత్య, విష్ణు, రాగ్ మయూర్ కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 16న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించలేదు. సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. అయితే, ఈ మూవీకి సమర్పకులుగా నిర్మాత బన్నీ వాస్ ఉన్నారు.మిత్రమండలి(Mithra Mandali) సినిమా నవంబర్ 6న ఓటీటీ విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అమెజాన్ ప్రైమ్(amazon prime video)లో స్ట్రీమింగ్ అవుతుందని ఒక పోస్టర్ను షేర్ చేశారు. కేవలం 20 రోజుల్లోనే ఓటీటీలోకి ఈ చిత్రం రానున్నడంతో సినీ ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.కథేంటంటే...జంగ్లీపట్నానికి చెందిన నారాయణ(వీటీవీ గణేష్)కి కులపిచ్చి. తన తుట్టె కులానికి చెందినవాళ్లు ఇతర కులాలకు చెందినవారిని పెళ్లి చేసుకంటే.. వారిని చంపేసే రకం. తుట్టె కులం అండతో ఎమ్మెల్యే కావాలనుకుంటాడు. ఓ ప్రధాన పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వడానికి ముందుకు వస్తుంది. అదే సమయంలో నారాయణ కూతురు స్వేచ్ఛ(నిహారిక ఎన్ఎమ్) ఇంటి నుంచి పారిపోతుంది. ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించి, ఎవరో కిడ్నాప్ చేశారంటూ ఎస్సై సాగర్ (వెన్నెల కిశోర్)ని కలుస్తాడు. లంచం ఇచ్చి గుట్టుచప్పుడు కాకుండా తన కూతురు ఆచూకీ కనుక్కోమని చెబుతాడు.అయితే, స్వేచ్ఛ పారిపోవడం వెనక ఆ ప్రాంతానికి చెందిన నలుగురు కుర్రాళ్లు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నలుగురు ఆవారాగాళ్లు. రోజంతా బాతకాలు కొట్టడం.. సాయంత్రం మందేసి చిందులు వేయడమే వీరి పని. ఇలాంటి చిల్లర గాళ్లకి స్వేచ్ఛకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? స్వేచ్ఛ పారిపోవడం వెనున ఉన్న అసలు కారణం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా(Mithra Mandali) చూడాల్సిందే. -
రూ. 7వేల కోట్ల సినిమా.. ఓటీటీలో ఉచితంగానే స్ట్రీమింగ్
హాలీవుడ్ సినిమా జురాసిక్ వరల్డ్: రీబర్త్ (Jurassic World Rebirth) మరో ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ ఏడాది జులైలో విడుదలైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 7500 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. 2025లో విడుదలైన హాలీవుడ్ చిత్రాల్లో కలెక్షన్స్ పరంగా నాలుగో స్థానంలో ఉంది. భారత్లో కూడా రూ. 100 కోట్లకు పైగానే రాబట్టి సత్తా చాటింది. అయితే, గత చిత్రాల ప్రభావం వల్లే ఈ కలెక్షన్స్ వచ్చాయని, రీబర్త్ పేరుతో వచ్చిన ఈ సీక్వెల్ అంతగా ప్రేక్షకులను మెప్పించలేదని రివ్యూలు వచ్చాయి. ఈ చిత్రంలో స్కార్లెట్ జాన్సన్, జోనాథన్ బెయిలీ, మహర్షలా అలీ కీలక పాత్రల్లో నటించారు. గారెత్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహించారు.జురాసిక్ వరల్డ్: రీబర్త్ చిత్రం ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ (amazon prime video)లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది. అమెజాన్లో ఈ మూవీ చూడాలంటే అదనంగా రూ. 399 చెల్లించాలని మొదట ప్రకటించారు. కొద్దిరోజుల తర్వాత దానిని రూ. 119కి తగ్గించారు. ఈ క్రమంలోనే తాజాగా జియోహాట్స్టార్ (JioHotstar)సంస్థ ఒక కీలక ప్రకటన చేసింది. జురాసిక్ వరల్డ్: రీబర్త్ చిత్రాన్ని ఉచితంగానే చూడొచ్చని తెలిపింది. నవంబర్ 14 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని జియోహాట్స్టార్ ప్రకటించింది.ప్రపంచవ్యాప్తంగా పిల్లలతో పాటు పెద్దలను కూడా ‘జురాసిక్ పార్క్’ చిత్రాలు ఆకట్టుకున్నాయి. 2022లో వచ్చిన ‘జురాసిక్ వరల్డ్: డొమినియన్’కు సీక్వెల్గా ‘జురాసిక్ వరల్డ్: రీబర్త్’ (Jurassic World Rebirth) పేరుతో విడుదల చేశారు. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. విజువల్స్తో పాటు కొన్ని థ్రిల్లింగ్కు గురిచేసే సీన్లు ఉన్నప్పటికీ ప్రేక్షకులను మాత్రం పెద్దగా మెప్పించలేదు. కథ మొత్తం సాగదీతగానే ఉంటుంది. -
ఈ జనరేషన్ ఆడపిల్లల మనసు ఆవిష్కరించిన సినిమా.. ఓటీటీ రివ్యూ
కొన్నాళ్ల క్రితం పలు వివాదాలకు కారణమైన తమిళ సినిమా 'బ్యాడ్ గర్ల్'. బ్రహ్మణులని కించపరిచే సీన్స్ ఉన్నాయని చెప్పి టీజర్ రిలీజ్ టైంలో చాలా హడావుడి చేశారు. సెన్సార్ దగ్గర కూడా పలు సమస్యలు ఎదుర్కొని ఎట్టకేలకు సెప్టెంబరు తొలివారంలో థియేటర్లలోకి వచ్చింది. రెండు నెలల తర్వాత ఇప్పుడు(నవంబరు 04 నుంచి) ఓటీటీలోకి వచ్చేసింది. హాట్స్టార్లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?మధ్యతరగతి కుటుంబానికి చెందిన టీనేజ్ అమ్మాయి రమ్య (అంజలి శివరామన్). అందరు ఆడపిల్లల్లానే తనకు కూడా ఓ బాయ్ ఫ్రెండ్, సుఖంగా ఉండేందుకు చిన్న ఇల్లు ఉంటే చాలు అని కలలు కంటూ ఉంటుంది. స్కూల్ చదువుతున్నప్పుడు నలన్ (హ్రిదు హరూన్), కాలేజీలో అర్జున్ (శశాంక్), ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇర్ఫాన్ (టీజే అరుణాచలం)తో రిలేషన్లో ఉంటుంది. వీటిలో ఏ బంధం కూడా ఎక్కువరోజులు నిలబడదు. కంటికి రెప్పలా చూసుకునే తల్లి, అద్భుతమైన స్నేహితురాలు ఉన్నా సరే ఈమెని సమాజం 'బ్యాడ్ గర్ల్' అని ముద్ర వేస్తుంది. ఇలా కావడానికి కారణమేంటి? చివరకు రమ్య ఏం చేసింది? అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఓ కుర్రాడు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో తిరిగితే సమాజం అతడిని ఏం అనదు. ఇదే పని ఓ అమ్మాయి చేస్తే తిరుగుబోతు అనే ముద్ర వేస్తుంది. ఆమె వైపు నుంచి తప్పుందా? అబ్బాయిల వైపు తప్పుందా? అనేది ఎవరు పట్టించుకోరు. సరిగ్గా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొని నిలబడిన ఓ అమ్మాయి కథే 'బ్యాడ్ గర్ల్'.సాధారణంగా అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో తీసే సినిమాల్లో మగాళ్లని కొన్నింట్లో వెధవల్లా, మరికొన్నింట్లో విలన్స్గా చూపిస్తుంటారు. 'బ్యాడ్ గర్ల్'లో అలాంటివేం ఉండవు. కేవలం ఓ అమ్మాయి మనసుని.. టీనేజీ నుంచి 30స్లోకి వచ్చేంతవరకు ఆవిష్కరించారు. ఏ మతం, ఏ కులంలో పుట్టినా సరే ఆడవాళ్లకూ మనసు ఉంటుంది. దానికి బోలెడన్ని కోరికలు ఉంటాయి. ఈ సినిమాలోనూ హీరోయిన్కి ప్రేమ, శృంగారం లాంటి ఆలోచనలు ఎక్కువగానే ఉంటాయి. ఎంతలా అంటే 9వ క్లాస్లో ఉన్నప్పుడే స్కూల్లోనే ఓ అబ్బాయికి ముద్దు పెడుతుంది. కాలేజీకి వెళ్లేసరికి శృంగారం, జాబ్ చేస్తున్నప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్.. ఇలా ఉంటాయి.ఓ అమ్మాయి తనకు నచ్చినట్లు బతికితే ఈ సమాజం, ఇందులోని వ్యక్తులు.. 'బ్యాడ్ గర్ల్'గా ఎలా ముద్రవేస్తారు అనేది చెప్పిచెప్పనట్లు ఈ సినిమాలో చూపించారు. క్లైమాక్స్లో ఆడపిల్లని పిల్లి పిల్లతో పోల్చి చూపించడం.. ఈ క్రమంలో రమ్య తల్లి చెప్పే డైలాగ్ భలే అనిపిస్తాయి. 'ఓ అబ్బాయి చేసిన గాయాన్ని మరో అబ్బాయి మానిపోయేలా చేయలేడు' లాంటి కొన్ని డైలాగ్స్ కూడా అవును నిజమే కదా అనిపించేలా చేస్తాయి. మూవీ విడుదలకు ముందు బ్రహ్మణులని టార్గెట్ చేసేలా సీన్స్ ఉన్నాయని అన్నారు గానీ చూస్తున్నప్పుడు అలా ఏం కనిపించలేదు.ఎవరెలా చేశారు?రమ్యగా అంజలి శివరామన్ అద్భుతంగా ఫెర్ఫార్మ్ చేసింది. టీనేజీ అమ్మాయిలా ఎంత బాగుందో.. స్వతంత్ర భావాలుండే మహిళగానూ చక్కగా ఇమిడిపోయింది. ఈమె పలికించిన చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ చాలా సహజంగా అనిపించాయి. ఈమె తల్లి పాత్ర చేసిన శాంతిప్రియ చాలా రియలస్టిక్ యాక్టింగ్ చేశారు. రమ్య స్నేహితురాలిగా చేసిన సెల్వి, బాయ్ఫ్రెండ్స్గా చేసిన హ్రిదు, శశాంక్, అరుణాచలం కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.టెక్నికల్ విషయాలకొస్తే దర్శకురాలు వర్ష భరత్ గురించి చెప్పాలి. ఇప్పటి జనరేషన్ అమ్మాయిలు ఎలా ఉన్నారు? ఎలా ఆలోచిస్తున్నారు? ఎలా ఉండాలనుకుంటున్నారు? వాళ్ల కోరికలు ఏంటి అనే విషయాల్ని ఫెర్ఫెక్ట్గా చూపించారు. ఈమెకు తోడు అమిత్ త్రివేది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ సరిగ్గా సరిపోయాయి. ఈ తరహా సినిమాలు అందరికీ నచ్చకపోవచ్చు. చూసే వ్యక్తుల పాయింట్ ఆఫ్ వ్యూ బట్టి ఆధారపడి ఉంటుంది. కొన్ని డైలాగ్స్ రియలస్టిక్గా ఉంటాయి కాబట్టి కుదినంతవరకు ఒంటరిగానే చూడండి.- చందు డొంకాన -
ఓటీటీలోకి రానున్న ‘మటన్ సూప్’ సినిమా
టాలీవుడ్లో ‘మటన్ సూప్’ పేరుతో విడుదలైన సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. అలుకా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ బ్యానర్లపై రామచంద్ర వట్టికూటి దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కింది. మల్లిఖార్జున ఎలికా (గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల ఈ మూవీని నిర్మించారు. రమణ్, వర్ష విశ్వనాథ్, జెమినీ సురేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ అక్టోబర్ 10న విడుదలై మంచి టాక్ను సొంతం చేసుకుంది.ఆ వారంలో బాక్సాఫీస్ దగ్గర విడుదలైన నాలుగు చిత్రాల్లో ‘మటన్ సూప్’ చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కింది. ప్రేక్షకులతో పాటు సినీ విమర్శకులు సైతం సినిమాలో ప్రధానాంశం వైవిధ్యంగా ఉందని ప్రశంసించటం విశేషం. డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్గా ‘మటన్ సూప్’ రూపొందింది. నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని, ఉహించని మలుపులతో, ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్టులతో, గ్రిప్పింగ్ స్క్రీన్ప్లేతో దర్శకుడు సినిమాను తెరకెక్కించారు.త్వరలోనే ఈ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చాలా తక్కువ బడ్జెట్లో ‘మటన్ సూప్’ సినిమాను ఎక్కడా తగ్గకుండా దర్శకుడు రామచంద్ర వట్టికూటి తెరకెక్కించారు. ఈ హిట్తో తాజాగా ఆయన మరో వైవిధ్యమైన కంటెంట్తో నెక్ట్స్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. -
ఈ వారం ఓటీటీల్లోకి 17 మూవీస్.. అవి మిస్ అవ్వొద్దు
మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి రష్మిక 'ద గర్ల్ ఫ్రెండ్', సుధీర్ బాబు 'జటాధర'తో పాటు 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో', 'ప్రేమిస్తున్నా' అనే తెలుగు సినిమాలతో పాటు 'ఆర్యన్', 'ఫీనిక్స్' అనే డబ్బింగ్ చిత్రాలు రాబోతున్నాయి. వీటిలో రష్మిక మూవీ తప్పితే మిగతా వాటిపై హైప్ లేదు. ఓటీటీల్లోనూ ఈ వీకెండ్ రిలీజయ్యే వాటిలో కొన్నిమాత్రమే ఆసక్తి కలిగిస్తున్నాయి.(ఇదీ చదవండి: ఎంతోమంది కళ్లు తెరిపించే మూవీ.. 'తలవర' రివ్యూ)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల్లో 'బ్యాడ్ గర్ల్', 'బారాముల్లా', 'కిస్', 'ద ఫెంటాస్టిక్ ఫోర్', 'అర్జున్ చక్రవర్తి'.. ఉన్నంతలో కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. వీటితో పాటు కొన్ని ఇంగ్లీష్ మూవీస్, వెబ్ సిరీసులు కూడా ఉన్నాయి. ఇవి కాకుండా వీకెండ్లో సడన్ సర్ప్రైజ్ అన్నట్లు కొత్త చిత్రాలు ఏమైనా రావొచ్చు కూడా. ఇంతకీ ఏ ఓటీటీలో ఏయే మూవీస్ రానున్నాయంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (నవంబరు 03 నుంచి 09 వరకు)హాట్స్టార్బ్యాడ్ గర్ల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబరు 05ద ఫెంటాస్టిక్ 4: ఫస్ట్ స్టెప్స్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 05నెట్ఫ్లిక్స్డాక్టర్ సూస్ ద స్నీచెస్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 03ఇన్ వేవ్స్ అండ్ వార్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 03బారాముల్లా (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 07ఫ్రాంకెన్ స్టెయిన్ (ఇంగ్లీష్ చిత్రం) - నవంబరు 07అమెజాన్ ప్రైమ్నైన్ టూ నాట్ మీట్ టూ యూ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 03మ్యాక్స్టన్ హాల్ (జర్మన్ సిరీస్) - నవంబరు 07ఆహాచిరంజీవ (తెలుగు చిత్రం) - నవంబరు 07జీ5కిస్ (తమిళ సినిమా) - నవంబరు 07తోడే దూర్ తోడే పాస్ (హిందీ సిరీస్) - నవంబరు 07సోనీ లివ్మహారాణి సీజన్ 4 (హిందీ సిరీస్) - నవంబరు 07ఆపిల్ ప్లస్ టీవీప్లరిబస్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 07మనోరమ మ్యాక్స్కరమ్ (మలయాళ సినిమా) - నవంబరు 07ఎమ్ఎక్స్ ప్లేయర్ఫస్ట్ కాపీ సీజన్ 2 (హిందీ సిరీస్) - నవంబరు 05లయన్స్ గేట్ ప్లేఅర్జున్ చక్రవర్తి (తెలుగు సినిమా) - నవంబరు 07ద హ్యాక్ సీజన్ 1 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 07(ఇదీ చదవండి: బిగ్బాస్లో పిక్నిక్ పూర్తి.. దువ్వాడ కోసమే బయటకు! ఏమన్న ప్లానా?) -
ఓటీటీలోకి 'డ్యూడ్'.. డేట్ ఫిక్సయిందా?
లవ్ టుడే, డ్రాగన్ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్. ఇతడి నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ 'డ్యూడ్'. దీపావళి సందర్భంగా గత నెలలో థియేటర్లలోకి వచ్చింది. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు నిర్మాతలు ప్రకటించారు. అలాంటిది ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయిందట. ఈ మేరకు డేట్ వైరల్ అవుతోంది.'డ్యూడ్' చిత్రంలో ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించారు. శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. పరువు హత్యల బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ చిత్రంలో ఆర్య సినిమా పోలికలు ఉన్నాయని చెప్పి సోషల్ మీడియాలో టాక్ వినిపించింది. దర్శకుడు కూడా ప్రమోషన్స్లో మాట్లాడుతూ.. ఈ కథకు ఆర్య-2 సినిమా స్పూర్తి అన్నట్లు చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ మూవీ.. నవంబరు 14 నుంచి నెట్ఫ్లిక్స్లోకి రానుందని సమాచారం.(ఇదీ చదవండి: రూ.200 కోట్ల వివాదం.. క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ వర్మ)విడుదలకు ముందు 'డ్యూడ్' ఓటీటీ హక్కుల డీల్ జరిగిపోయింది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారట. ఈ క్రమంలోనే ఈనెల 14 నుంచి సినిమాని స్ట్రీమింగ్ చేసే అవకాశముంది. తెలుగు, తమిళ భాషలతో పాటు మిగతా దక్షిణాది భాషల్లోనూ అందుబాటులోకి రావొచ్చు.'డ్యూడ్' విషయానికొస్తే.. గగన్ (ప్రదీప్ రంగనాథన్).. ఆముద(నేహాశెట్టి)ని ఇష్టపడతాడు. కానీ ఆమె మరొకరిని పెళ్లి చేసుకుంటుంది. మరోవైపు మేనమామ కూతురు కుందన (మమిత బైజు)కి చిన్నప్పటినుంచి గగన్ అంటే ఇష్టం. కానీ గగన్కి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. కుందన పెళ్లి ప్రపోజల్ తెచ్చినా రిజెక్ట్ చేస్తాడు. ఆ బాధలో పార్ధు(హృదయ్)ని కుందన ఇష్టపడుతుంది. కానీ అనుకోని పరిస్థితుల్లో కుందన, గగన్కి పెళ్లవుతుంది. కానీ ఆమె మనసులో పార్ధు ఉన్నాడని గగన్కి తెలుసు. దీంతో కుందన, ఆమె ప్రియుడిని కలిపే పనిలో ఉంటాడు. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సందీప్ రెడ్డి వంగా దెబ్బకు బాలీవుడ్ గల్లంతు.. ఇప్పటికీ) -
ఎంతోమంది కళ్లు తెరిపించే మూవీ.. 'తలవర' రివ్యూ
అందానికి అసలైన కొలమానం? రంగు, ఎత్తు, బరువు, ఆకృతి.. ఇవేవీ కావు. ఆత్మవిశ్వాసమే మనిషికి అసలైన అందం. ఈ నిజాన్ని అర్థం చేసుకున్నరోజు ఎవరి వెక్కిరింతలు మనల్ని ఏమీ చేయలేవు. ఆత్మనూన్యతతో కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం ముఖ్యం. మలయాళ మూవీ తలవర ఇదే విషయాన్ని నొక్కి చెప్తోంది.హీరోకి బొల్లి వ్యాధితలవర సినిమాలో హీరో జ్యోతిష్ (అర్జున్ అశోకన్) బొల్లి వ్యాధితో బాధపడుతుంటాడు. అది చూసి స్నేహితులు సహా అందరూ తనను వెక్కిరిస్తుంటారు. అతడు కూడా కెమెరా ముందుకు రావాలంటే జంకుతాడు. అలాంటి అతడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోల కోసం ఓ ఫోటోగ్రాఫర్ దగ్గరకు వెళ్తాడు. అప్పటికే అక్కడ షార్ట్ ఫిలిం షూటింగ్ జరుగుతూ ఉంటుంది. కానీ సడన్గా ఓ వ్యక్తి రావట్లేదని తెలిసి.. ఫోటో కోసం వెయిట్ చేస్తున్న హీరోను అతడి స్థానంలో నటించమని కోరతారు.అవమానాలుఅలా కెమెరా అంటే భయపడే హీరో తొలిసారి షార్ట్ ఫిలింలో నటిస్తాడు. అప్పుడు తనపై తనకు కొంత ధైర్యం వస్తుంది. సినిమా అవకాశాల కోసం ప్రయత్నించి అవమానాలు పడతాడు, దెబ్బలు తింటాడు. ఆ సమయంలో ప్రియురాలు (రేవతి శర్మ).. ఎవరో ఏదో అన్నారని గదిలో కూర్చుని ఏడుస్తూ ఉంటావా? టాలెంట్ను నమ్ముకుని ముందుకెళ్లమని చెప్తుంది. మరి యాక్టర్ అయ్యాడా? అందుకు అతడి తల్లి ఒప్పుకుందా? లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!ఎలా ఉంది?మలయాళ సినిమాలు ఆదరాబాదరా లేకుండా, ఎక్కువ హడావుడి చేయకుండా సింపుల్గా, నెమ్మదిగా ముందుకెళ్తాయి. ఫస్టాఫ్ అంతా మామూలుగా వెళ్తూ ఉంటుంది. సెకండాఫ్లో హీరో మనసులోని బాధ.. కోపంగా, పట్టుదలగా మారుతుంది. క్లైమాక్స్ బాగుంది. చాలామంది ఇప్పటికీ తమలో ఏదో ఒకటి తక్కువగా ఉందని లోలోనే మథనపడుతుంటారు. అలాంటివారి మనసు మార్చే సినిమా ఇది! ఓటీటీలో..ఈ కథను రాసుకుని, దాన్ని తెరపై అందంగా మలిచిన దర్శకుడు అఖిల్ అనిల్కుమార్ను అభినందించాల్సిందే! ముఖంతోపాటు శరీరమంతా తెల్లమచ్చలుండే వ్యక్తి పాత్రలో జీవించిన అర్జున్ను కూడా మెచ్చుకుని తీరాల్సిందే! తలవర అంటే విధి అని అర్థం. ఈ సినిమా ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ లేదు. -
ఓటీటీలోకి ఫాంటసీ రొమాంటిక్ కామెడీ సినిమా
తెలుగులో కమర్షియల్ సినిమాలు ఎక్కువ. తమిళ, మలయాళంలో మాత్రం చాలావరకు డిఫరెంట్ కాన్సెప్ట్ కథలతో మూవీస్ తీస్తుంటారు. దీంతో వీటిని మన ఆడియెన్స్ కూడా ఎంకరేజ్ చేస్తుంటారు. అలా ఇప్పుడు ఓ తమిళ ఫాంటసీ రొమాంటిక్ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ముద్దు బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా సంగతేంటి? ఎందులోకి రానుందనే చూద్దాం.'పాపా', 'బ్లడీ బెగ్గర్' లాంటి డబ్బింగ్ మూవీస్తో తెలుగులోనూ కాస్త గుర్తింపు తెచ్చుకున్న తమిళ హీరో కవిన్. ఇతడి లేటెస్ట్ సినిమా 'కిస్'. ప్రీతి ఆస్రానీ హీరోయిన్. సెప్టెంబరు 19న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. తమిళంలో మాత్రం దీన్ని విడుదల చేశారు. ఇప్పుడు ఈ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్పై క్లారిటీ ఇచ్చేశారు. నవంబర్ 7 నుంచి జీ5లో అందుబాటులోకి రానుందని పోస్టర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: నటిగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ చిన్న కూతురు)'కిస్' విషయానికొస్తే.. చిన్నప్పుడే తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో.. నెల్సన్(కవిన్) తల్లి దగ్గర పెరుగుతాడు. ప్రేమ, రొమాన్స్ లాంటివి ఇతడికి అస్సలు తెలీదు. ఓ రోజు అనుకోకుండా నెల్సన్ చేతికి ఓ పుస్తకం వస్తుంది. దీని ద్వారా అద్భుతమైన పవర్ వస్తుంది. ఎవరైనా ఇతడి ముందు ముద్దు పెట్టుకుంటూ కనిపిస్తే వాళ్ల భవిష్యత్ ఏంటనేది ఇతడికి తెలిసిపోతుంది. అదే టైంలో తనకు బుక్ ఇచ్చిన సారా(ప్రీతి ఆస్రానీ) భవిష్యత్ ఏంటో నెల్సన్కి తెలుస్తుంది. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ప్రస్తుతానికి తమిళ వెర్షన్ మాత్రమే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నప్పటికీ.. త్వరలో తెలుగు డబ్బింగ్ కూడా తీసుకొచ్చే అవకాశముంది. రొమాంటిక్ జానర్ మూవీస్ అంటే ఇష్టముంటే దీనిపై ఓ లుక్కేయండి. ఇకపోతే ఈ వారం ఓటీటీల్లోకి ఇడ్లీ కొట్టు, లోక ఛాప్టర్ 1, కాంతార ఛాప్టర్ 1 సినిమాలు వచ్చాయి. వీటితో పాటు డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు అనే తెలుగు సిరీస్ ఉన్నంతలో ఆసక్తి రేపుతున్నాయి. ఇవి కాకుండా తలవర అనే మలయాళ మూవీ కూడా బాగుంది. (ఇదీ చదవండి: బుల్లితెర నటి చెల్లితో ఆర్జే సూర్య ఎంగేజ్మెంట్) -
వెబ్సిరీస్లో మాధవన్.. కథ ఏంటో చెప్పిన డైరెక్టర్
ఇప్పుడు ఓటీటీ (OTT) సంస్థలు వెండితెరకు ధీటుగా మారుతున్నాయి. ప్రముఖ నటీనటులు కూడా వెబ్ సిరీస్లలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. అలా తాజాగా హీరో మాధవన్ (R Madhavan) లెగసీ అనే వెబ్ సిరీస్లో నటించారు. ఆయనకు జంటగా నిమిషా సజయన్ నటించారు. ఈ వెబ్ సిరీస్ను నెట్ఫ్లిక్స్ సంస్థతో కలిసి స్టోన్ బెంచ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మించింది. చారుకేశ్ శేఖర్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సిరీస్కు మాధవనే బలంతాజాగా దర్శకుడు మాట్లాడుతూ.. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుందన్నారు. ఒక వ్యక్తి తన సామ్రాజ్యాన్ని, కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసే పోరాటమే లెగసీ అని చెప్పారు. మాధవన్ సిరీస్లో భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు. ఆయన నటన ఈ వెబ్ సిరీస్కు బలమన్నారు. ఈ వెబ్ సిరీస్ రూపకల్పనకు నెట్ఫ్లిక్స్, స్టోన్ బెంచ్ సంస్థలు పూర్తి స్వేచ్ఛను ఇచ్చాయని పేర్కొన్నారు.నా ఫస్ట్ సిరీస్ ఇదేమాధవన్ మాట్లాడుతూ లెగసీ వెబ్ సిరీస్లో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి అద్భుతమైన పాత్రల్లో నటించే అవకాశం అరుదుగా వస్తుందన్నారు. మంచి ఫ్యామిలీ రిలేషన్ షిప్, ఎమోషనల్, గ్యాంగ్స్టర్స్ కథాంశంతో కూడిన చిత్రాలను నిర్మించే స్టోన్ బెంచ్ సంస్థ తాజాగా రూపొందించిన ఈ లెగసీ వెబ్ సిరీస్లో నటించడం సరికొత్త అనుభవం అని పేర్కొన్నారు. తాను నటించిన తొలి వెబ్ సిరీస్ ఇదని, అదేవిధంగా స్టోన్ బెంచ్ సంస్థలో ఇంతకు ముందు ఒక చిత్రంలో నటించానని, మళ్లీ ఈ వెబ్ సిరీస్లో నటించడం ఆనందంగా ఉందని నిమిషా సజయన్ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by NIMISHA BINDU SAJAYAN (@nimisha_sajayan) చదవండి: ఘనంగా నారా రోహిత్ వివాహం.. -
మహారాణి మళ్లీ వస్తోంది.. ట్రైలర్ చూశారా?
బాలీవుడ్ భామ హేమా ఖురేషి(Huma Qureshi) ప్రధాన పాత్రలో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్ మహారాణి(Maharani Season 4). ఇప్పటికే రిలీజైన మూడు సీజన్లు ఓటీటీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. క్రైమ్ థ్రిల్లర్స్కు ఆదరణ ఉన్న ఈ రోజుల్లో మహారాణి హిట్గా నిలవడంతో మేకర్స్ మరో సీజన్ను తెరకెక్కించారు. తాజాగా నాలుగో సీజన్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సీజన్ వచ్చేనెల 7 నుంచి స్ట్రీమింగ్కు రానుంది. ప్రముఖ ఓటీటీ సోనీ లివ్లో సందడి చేయనుంది. తాజాగా రిలీజైన ట్రైలర్ ఈ సీజన్పై మరింత ఆసక్తి పెంచుతోంది. మహారాణి తొలి సీజన్ 2021లో రాగా.. ఆ తర్వాత 2022లో రెండో సీజన్, 2024లో మూడో సీజన్ అభిమానులను అలరించాయి. నాలుగో తరగతి పాసైన ఓ సాధారణ గృహిణి సీఎంగా మారి.. రాజకీయంగా అక్రమాలకు పాల్పడే ఎలా చెక్ పెట్టిందనే కోణంలో ఈ సిరీస్ను రూపొందించారు. ఈ వెబ్ సిరీస్లో శ్వేతా బసు ప్రసాద్ కీలక పాత్రలో కనిపించనుంది. -
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు చాన్నాళ్ల క్రితం రిలీజైన చిత్రాల్ని కూడా ఎలాంటి హడావుడి లేకుండా స్ట్రీమింగ్లోకి తీసుకొస్తుంటారు. ఇప్పుడు అలానే గతేడాది రిలీజైన ఓ తెలుగు మూవీ.. ఇప్పుడు సడన్గా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆరు కథల ఆంథాలజీతో తీసిన ఈ చిత్రం.. ఏ ఓటీటీలో చూడొచ్చు? ఇంతకీ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.కొన్నేళ్ల క్రితం ఆంథాలజీ ట్రెండ్ బాగానే నడిచింది. తెలుగులోనూ కేరాఫ్ కంచరపాలెం, చందమామ కథలు, పంచతంత్రం లాంటి ఒకటి రెండు మూవీస్ వచ్చాయి. ఇదే జానర్లో గతేడాది సెప్టెంబరులో థియేటర్లలోకి వచ్చిన మూవీ 'లైఫ్ స్టోరీస్'. ఆరు కథలు, 11 మంది యాక్టర్స్ నటించిన ఈ సినిమాలో స్నేహం, సంతోషం, ఒంటరితనం, పశ్చాత్తపం, యవ్వనపు ప్రేమ, సాంగత్యం అనే కాన్సెప్ట్తో తీశారు. ఈ కథలన్నీ చివరలో లింక్ చేశారు.(ఇదీ చదవండి: నేను కూడా చిరుతో అప్పట్లో అనుకున్నా.. కానీ: మాళవిక మోహనన్)థియేటర్లలో రిలీజైనప్పుడు ఓ మాదిరి రెస్పాన్స్ అందుకున్న 'లైఫ్ స్టోరీస్'.. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతానికైతే అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. కొన్నిరోజుల్లో ఉచితంగానూ అందుబాటులోకి రావొచ్చు. ఈ ఆంథాలజీ చిత్రంలో క్యాబ్ క్రానికల్స్, ది మామ్, గ్లాస్ మేట్స్, జిందగీ, బంగారం, ది వైల్డ్ హట్స్ అనే టైటిల్స్తో స్టోరీలని చూపించారు. అన్నీ కూడా డీసెంట్గానే ఉంటాయి. కుదిరితే ఓ లుక్కేయండి.'లైఫ్ స్టోరీస్' విషయానికొస్తే.. ఇంజినీర్గా జాబ్ చేసి మనశ్శాంతి లేకపోవడంతో ఓ వ్యక్తి డ్రైవర్గా మారతాడు. ఓ రోజు సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఈ క్యాబ్ ఎక్కుతాడు. వీళ్ల మధ్య జరిగిన సంభాషణ ఏంటి అనేది ఓ స్టోరీ. తల్లితో(దేవయాని) కలిసి ఆనందంగా గడపాలని ఓ చిన్నారి ఆశపడుతుంటాడు. కానీ ఉద్యోగం కారణంగా కొడుక్కి సదరు తల్లి అస్సలు సమయం ఇవ్వలేకపోతూ ఉంటుంది. కొడుకు ఆనందం కోసం తల్లి తీసుకున్న నిర్ణయం ఏంటనేది ఓ స్టోరీ.(ఇదీ చదవండి: ఎట్టకేలకు రజనీకాంత్ షాకింగ్ నిర్ణయం?)సతీష్.. న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునేందుకు భార్యతో కలిసి ఓ రిసార్ట్కి వెళ్తాడు. అక్కడ అనుకోకుండా తన చిన్ననాటి స్నేహితుడు మంగేశ్ కనిపిస్తాడు. మాట్లాడుతూ వీళ్లిద్దరూ బాల్యంలోకి వెళ్లిపోతారు. మరోవైపు వీళ్లిద్దరి భార్యల మధ్య సాగిన డిస్కషన్ ఏంటనేది మరో స్టోరీ. ఐటీ ఉద్యోగి పీయూష్.. తన ప్రియురాలితో కలిసి కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్లాన్ రివర్స్ అవుతుంది. దీంతో ఒంటరిగానే వికారాబాద్ వెళ్లాల్సి వస్తుంది. ఇంతకీ ఏమైందనేది ఓ స్టోరీ.మంగమ్మ.. రోడ్ పక్కన ఓ టీ దుకాణం నడుపుతూ ఉంటుంది. ఈమె ఒంటరి జీవితంలోకి ఓ కుక్క వస్తుంది. దీంతో ఆ శునకానికి బంగారం అని పేరు పెట్టి పెంచుకుంటుంది. మరి బంగారంతో మంగమ్మకు ఎలాంటి బాండింగ్ ఏర్పడింది? అనేది ఓ స్టోరీ. శ్రియా.. తన భర్తతో కలిసి న్యూఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటుంది. కానీ బాస్ పనిఅప్పజెప్పడంతో ఆఫీస్లోనే ఉండిపోతుంది. మరి భర్తతో కలిసి పార్టీ చేసుకోవాలనే కోరిక తీరిందా లేదా అనేది మరో స్టోరీ.(ఇదీ చదవండి: హీరోయిన్గా మహేశ్బాబు మేనకోడలు ఎంట్రీ) -
సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ మూవీ
కొన్ని పాత్రలు చేయాలంటే దమ్ముండాలి. అది మలయాళ హీరో అర్జున్ అశోకన్కు కావాల్సినంత ఉంది. అర్జున్ 'తలవర' సినిమా (Thalavara Movie)లో బొల్లి వ్యాధితో బాధపడే యువకుడిగా నటించాడు. ఈ వ్యాధి కారణంగా అనేక అవమానాలను ఎదుర్కొంటాడు. కుటుంబం నుంచి సమాజం వరకు తనకు ఎదురయ్యే అనుభవాల కథే తలవర. ఈ సినిమా మలయాళంలో ఆగస్టు 22న థియేటర్లలో విడుదలైంది. రెండు నెలల తర్వాత ఓటీటీలోవసూళ్లు పెద్దగా రాలేదు కానీ కంటెంట్కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అఖిల్ అనిల్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా దాదాపు రెండు నెలల తర్వాత ఓటీటీకి వచ్చింది. బుధవారం సడన్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రత్యక్షమైంది. తెలుగు డబ్బింగ్ లేదు, కేవలం మలయాళ భాషలోనే అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ సబ్టైటిల్స్ ఉన్నాయి. ఈ సినిమాలో రేవతి శర్మ హీరోయిన్గా నటించింది. సినిమాఅశోకన్, దేవదర్శిని, అభిరామి రాధాకృష్ణన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కిలి, విజయానంద్ సంగీతం అందించారు. ఈ మూవీ రిలీజైన ఐదారు రోజులకే అక్కడ కల్యాణి ప్రియదర్శిని లోక సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో తలవర సినిమా వెనకబడిపోయింది. తలవర కంటే ముందు అర్జున్ అశోకన్.. సుమతి వలవు సినిమాతో మెప్పించాడు. ఈ మలయాళ మూవీ దాదాపు రూ.25 కోట్లు రాబట్టింది. #Thalavara (Malayalam)Now streaming on Primevideo 🍿!!#OTT_Trackers pic.twitter.com/kgHjNAjL8h— OTT Trackers (@OTT_Trackers) October 29, 2025 చదవండి: మరోసారి పోలీసులను ఆశ్రయించిన చిరంజీవి -
కాంతార చాప్టర్ 1 ఓటీటీపై షాకింగ్ నిర్ణయం.. అసలు కారణమదే!
రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1 బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా అదిరిపోయే కలెక్షన్స్ సాధించింది. ఇప్పటికే కన్నడ సినీ ఇండస్ట్రీలో కేజీఎఫ్-2 తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డ్ సృష్టించింది. అంతేకాకుండా ఈ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మొదటి సినిమాగా నిలిచింది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ మూవీ ఛావాను అధిగమించింది. ఇప్పటికే రూ.800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ ప్రీక్వెల్.. త్వరలోనే వెయ్యి కోట్ల మార్క్ చేరుకుంటుందని అంతా భావించారు.ప్రస్తుతం థియేటర్లలో కాంతారకు పోటీగా పెద్ద చిత్రాలు కూడా లేకపోవడం కలిసొస్తుందని అనుకున్నారు. కానీ సక్సెస్ఫుల్గా రన్ అవుతోన్న టైమ్లో ఓటీటీ రిలీజ్ విషయంలో మేకర్స్ ట్విస్ట్ ఇచ్చారు. రిలీజైన నాలుగు వారాల్లోనే ఓటీటీకి తీసుకు రావడంపై ఫ్యాన్స్ సైతం షాకవుతున్నారు. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్గా దూసుకెళ్తోన్న సమయంలోనే ఓటీటీ డేట్ను అఫీషియల్గా ప్రకటించడం కాంతార అభిమానులను డైలామాలో పడేసింది. ఈ ప్రకటనతో మూవీ వసూళ్లపై ప్రభావం పడుతుందని చాలా మంది ఆడియన్స్ ప్రశ్నించారు. దీంతో తాజాగా ఓటీటీ రిలీజ్పై హోంబాలే ఫిల్మ్స్ నిర్మాతల్లో ఒకరైన చలువే గౌడ స్పందించారు. త్వరగానే ఓటీటీకి తీసుకురావడంపై క్లారిటీ ఇచ్చారు.చలువే గౌడ మాట్లాడుతూ..'ఈ సినిమా తమిళం, కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం వర్షన్లు మాత్రమే ప్రస్తుతం ఓటీటీలో విడుదలవుంది. అయితే హిందీ వర్షన్ వచ్చేది ఇప్పుడు కాదు. ఎనిమిది వారాల తర్వాత మాత్రమే ఓటీటీకి వస్తుంది. ఎందుకంటే ఈ ఒప్పందం మూడేళ్ల క్రితమే జరిగింది. అందుకే ఇది మా వంతు బాధ్యత. అప్పట్లో పరిస్థితులు భిన్నంగా ఉండేది. కొవిడ్కు ముందు అన్ని సినిమాలకు ఎనిమిది వారాల సమయం ఉండేది. ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఓటీటీకి వచ్చినప్పటికీ థియేట్రికల్ రన్ ఇంకా కొనసాగుతుంది. డిజిటల్ రిలీజ్ తర్వాత కూడా కలెక్షన్స్ సాధిస్తుందని నమ్మకముంది. ఓటీటీకి రావడం 10 నుంచి 15 శాతం వరకు మాత్రమే కలెక్షన్లపై ప్రభావం ఉంటుందని ఆశిస్తున్నాం' అని తెలిపారు.కాగా.. ఈ దీపావళికి థియేటర్లలో థామా, ఏక్ దీవానే కి దేవానియాత్ లాంటి బాలీవుడ్ సినిమాలు ఉన్నప్పటికీ కాంతార చాప్టర్ 1 హిందీ వర్షన్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అక్టోబర్ 2న దసరా కానుకగా విడుదలైంది. -
అఫీషియల్.. ఎట్టకేలకు ఓటీటీలోకి 'ఫ్యామిలీ మ్యాన్ 3'
కరోనా టైంలో ఓటీటీలు జనాలకు బాగా అలవాటైపోయాయి. సరిగ్గా ఆ టైంలో మంచి క్రేజ్ తెచ్చుకున్న వెబ్ సిరీస్ 'ద ఫ్యామిలీ మ్యాన్'. మనోజ్ బాజ్పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ నుంచి ఇప్పటివరకు రెండు సీజన్లు వచ్చాయి. అయితే మూడో సీజన్ ఎప్పుడొస్తుందా మూవీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ బోల్డ్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)2019లో 'ద ఫ్యామిలీ మ్యాన్' తొలి సీజన్ రాగా అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. కామెడీకి కామెడీ, మరోవైపు థ్రిల్లింగ్ అంశాలు ఆకట్టుకున్నాయి. 2021లో వచ్చిన రెండో సీజన్లో సమంత విలన్గా చేయడం ఆశ్చర్యపరిచింది. అయితే మూడో సీజన్ రావడానికి ఏకంగా నాలుగేళ్లు పట్టేసింది. మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాలపై చైనా ఎటాక్, దీనికోసం కొవిడ్ వైరస్ని ఉపయోగించడం తదితర అంశాలు మూడో సీజన్ కాన్సెప్ట్.రాజ్, డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్ మూడో సీజన్.. నవంబర్ 21 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుందని తాజాగా ప్రకటించారు. ప్రధాన పాత్రలైన శ్రీకాంత్, సుచితో పాటు వీళ్ల పిల్లలిద్దరినీ చూపిస్తూ ఓ కామెడీ వీడియోతో అనౌన్స్మెంట్ ఇచ్చారు. తొలి రెండు సీజన్లలానే ఈ సీజన్ కూడా ఆకట్టుకునేలా కనిపిస్తుంది. తెలుగు, తమిళ, హిందీతో పాటు ఇంగ్లీష్లో ఈ సీజన్ స్ట్రీమింగ్ కానుంది. మరి ఇక్కడితో ముగిస్తారా లేదంటే నాలుగో సీజన్ కూడా ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) View this post on Instagram A post shared by prime video IN (@primevideoin) -
ఓటీటీలోకి తమిళ బోల్డ్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
కొన్నాళ్ల క్రితం తమిళంలో ఓ సినిమా తీశారు. టీజర్ రిలీజైన దగ్గర నుంచి టాక్ ఆఫ్ ద టౌన్గా ఈ మూవీ నిలిచింది. బ్రహ్మణులని కించపరిచే సీన్స్ ఉన్నాయని, యువతని పెడదోవ పట్టించేలా ఉందని చెప్పి రచ్చ రచ్చ చేశారు. సెన్సార్లోనూ ఇబ్బందులు తప్పలేదు. తర్వాత ఎలాగోలా థియేటర్లలోకి వచ్చిన ఈమూవీ.. ఇప్పుడు ఓటీటీలోనూ స్ట్రీమింగ్కి సిద్ధమైంది. తెలుగులోనూ అందుబాటులోకి రానుండటం విశేషం. ఇంతకీ దీని సంగతేంటి?(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి 'చిరంజీవ'.. ట్రైలర్ రిలీజ్)ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్ సమర్పణలో వచ్చిన బోల్డ్ మూవీ 'బ్యాడ్ గర్ల్'. అంజలి శివరామన్ లీడ్ రోల్ చేయగా.. వర్ష భరత్ దర్శకురాలు. సమాజంలో అమ్మాయి స్వతంత్రంగా ఉంటే.. కొందరు వ్యక్తులు దాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఆ అమ్మాయిని 'బ్యాడ్ గర్ల్'గా ఎలా ముద్ర వేస్తారు అనే పాయింట్తో తీసిన సినిమా ఇది. సెప్టెంబరు 5న థియేటర్లలో తమిళ వెర్షన్ రిలీజ్ కాగా ఇప్పుడు నవంబర్ 4 నుంచి హాట్స్టార్లోకి రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.'బ్యాడ్ గర్ల్' విషయానికొస్తే.. టీనేజీలోకి వచ్చిన మిడిల్ క్లాస్ అమ్మాయి రమ్య (అంజలి శివరామన్). అందరూ ఆడపిల్లల్లానే తనకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉండాలని అనుకుంటుంది. అలా స్కూల్ చదువుతున్నప్పుడు నలన్, కాలేజీలో ఉన్నప్పుడు అర్జున్, ఉద్యోగం చేస్తూ ఇర్ఫాన్ని ప్రేమిస్తుంది. కానీ కొన్ని కారణాలతో వీళ్లతో బ్రేకప్ కూడా అయిపోతుంది. కానీ ఒకానొక సందర్భంలో ఏం చేయాలో తెలియని అయోమయ స్థితికి వెళ్తుంది. దాన్నుంచి ఎలా బయటపడింది? రమ్యని బ్యాడ్ గర్ల్ అని సమాజం ఎందుకు ముద్ర వేసింది అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
నేరుగా ఓటీటీలోకి 'చిరంజీవ'.. ట్రైలర్ రిలీజ్
ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. తర్వాత మూవీస్ అయితే తీశాడు గానీ ఒక్కటంటే ఒక్క హిట్ లేక దాదాపు కనుమరుగైపోయాడు. గతేడాది 'తిరగబడరా సామీ' అనే చిత్రంతో వచ్చాడు గానీ ఫలితం మారలేదు. ప్రస్తుతం 'చిరంజీవ' అనే ఓటీటీ మూవీ చేస్తున్నాడు. నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ చిత్ర ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)'జబర్దస్త్' ఫేమ్ అభి ఈ సినిమాకు దర్శకుడు. ట్రైలర్ బట్టి చూస్తే ఓ ప్రమాదంలో గాయపడ్డ హీరోకు.. ఎవరెన్ని ఏళ్లు బతుకుతారనే విషయం కనిపిస్తూ ఉంటుంది. మరోవైపు వ్యక్తిగత సమస్యలు ఇతడిని ఇబ్బంది పెడుతుంటాయి. ఈ సమస్యల నుంచి ఎలా బయటపడ్డాడు? ఏంటనేదే స్టోరీలా అనిపిస్తుంది. మరి నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాతోనైనా రాజ్ తరుణ్ ఆకట్టుకుంటాడేమో చూడాలి?(ఇదీ చదవండి: ఒక్క సినిమాతో తెలుగు, తమిళంలో విలన్గా క్రేజ్.. గుర్తుపట్టారా?) -
ఓటీటీకి కాంతార చాప్టర్ 1.. అఫీషియల్ డేట్ వచ్చేసింది
రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1 బాక్సాఫీస్ వద్ద రికార్డుల ప్రభంజనం సృష్టిస్తోంది. దసరా కానుకగా థియేటర్లలో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే రూ.800 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ సినిమా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. కేవలం మూడు వారాల్లోనే ఈ ఘనతను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ మూవీ ఛావాను దాటేసింది.ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న ఈ మూవీ ఓటీటీ రిలీజ్పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే కాంతార మూవీ మేకర్స్ ఉత్కంఠకు తెరదించారు. అంతా ఊహించినట్లుగానే అక్టోబర్ 31 నుంచే అమెజాన్ ప్రైమ్లో అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో అందుబాటులో ఉండనుందని వీడియోను షేర్ చేసింది. హిందీ భాషలో స్ట్రీమింగ్కు సంబంధించి ఎలాంటి ప్రకటనైతే రాలేదు.చాప్టర్ 1 కథేంటంటే?'కాంతార 1' విషయానికొస్తే.. తొలిభాగం ప్రస్తుతంలో జరిగితే ఈసారి మాత్రం శతబ్దాల వెనక్కి వెళ్తుంది. విజయేంద్ర (జయరామ్) బాంగ్రా రాజ్యాన్ని పాలిస్తుంటాడు. ఇతడికి కులశేఖరుడు (గుల్షన్ దేవయ్య) అనే కొడుకు. అతనికి మహారాజ పట్టాభిషేకం చేసి విశ్రాంతి తీసుకుంటాడు తండ్రి. మందుకొట్టడం తప్ప అసలు పాలన ఏం చెయ్యడు. యువరాజు చెల్లెలు కనకవతి (రుక్మిణి వసంత్). ఈ రాజ్యానికి దగ్గరలోని కాంతార అనే ప్రాంతంలో కొన్ని తెగలు ఉంటాయి.కాంతార తెగకు ప్రత్యర్థులు కడపటి దిక్కువాళ్లు. వాళ్ల మధ్యలో పోరు ఎలా ఉన్నా, ఈ కాంతార తెగలో కొందరు బాంగ్రా రాజ్యానికి వస్తారు. వారి నౌకాతీరాన్ని ఆక్రమించుకుంటారు. ఈ గొడవ వల్ల బాంగ్రా రాజుకి, కాంతార నాయకుడు బెర్మే (రిషబ్)కి గొడవ అవుతుంది. ఈ క్రమంలో కులశేఖరుడు బెర్మే తల్లిని చంపేసి, అతని ఊరిని తగలబెట్టేస్తాడు. తర్వాత ఏమైంది? అసలు విలన్ ఎవరనేది మిగతా స్టోరీ. get ready to witness the LEGENDary adventure of BERME 🔥#KantaraALegendChapter1OnPrime, October 31@hombalefilms @KantaraFilm @shetty_rishab @VKiragandur @ChaluveG @rukminitweets @gulshandevaiah #ArvindKashyap @AJANEESHB @HombaleGroup pic.twitter.com/ZnYz3uBIQ2— prime video IN (@PrimeVideoIN) October 27, 2025 -
థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి 'కాంతార-1'
ఈ నెల ప్రారంభంలో రిలీజై బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన సినిమా 'కాంతార 1'. ఇదొచ్చిన తర్వాత పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం థియేటర్లలోకి రాలేదు. దీంతో పలు భాషల్లో ఇప్పటికీ బాగానే ప్రదర్శితమవుతోంది. రెండు మూడు రోజుల క్రితం రూ.800 కోట్ల కలెక్షన్స్ దాటినట్లు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో రూ.1000 కోట్ల మార్క్ త్వరలోనే అందుకుంటుందని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో ఓటీటీ గురించి అప్డేట్ వచ్చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్)2022లో రిలీజైన మూవీ అమెజాన్ ప్రైమ్లో ఉండగా.. ఈ సినిమా కూడా దీనిలోనే రానుందని సదరు ఓటీటీ సంస్థ క్లారిటీ ఇచ్చింది. 'లెజెండ్ కంటిన్యూస్' అని ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. దీనిబట్టి చూస్తే 'కాంతార ఛాప్టర్ 1' కూడా వేగంగానే ఓటీటీలోకి వచ్చేయబోతుందనమాట. అభిమానులు మాత్రం థియేటర్లలో ఉండగానే వచ్చేయడమేంటి? ఇంకొన్నిరోజులు ఆగి వస్తే బాగుంటుంది కదా అని అభిప్రాయపడుతున్నారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం ఈ వీకెండ్లోనే అంటే అక్టోబరు 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్స్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముందని.. హిందీ వెర్షన్ మాత్రం కొన్ని వారాల తర్వాత అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం మూవీ లవర్స్కి పండగే అని చెప్పొచ్చు. చూడాలి మరి ఎప్పుడు స్ట్రీమింగ్లోకి వస్తుందో?(ఇదీ చదవండి: మహాభారతాన్ని అద్భుతంగా చూపించిన సిరీస్.. ఓటీటీ రివ్యూ)'కాంతార 1' విషయానికొస్తే.. తొలిభాగం ప్రస్తుతంలో జరిగితే ఈసారి మాత్రం శతబ్దాల వెనక్కి వెళ్తుంది. విజయేంద్ర (జయరామ్) బాంగ్రా రాజ్యాన్ని పాలిస్తుంటాడు. ఇతడికి కులశేఖరుడు (గుల్షన్ దేవయ్య) అనే కొడుకు. అతనికి మహారాజ పట్టాభిషేకం చేసి విశ్రాంతి తీసుకుంటాడు తండ్రి. మందుకొట్టడం తప్ప అసలు పాలన ఏం చెయ్యడు. యువరాజు చెల్లెలు కనకవతి (రుక్మిణి వసంత్). ఈ రాజ్యానికి దగ్గరలోని కాంతార అనే ప్రాంతంలో కొన్ని తెగలు ఉంటాయి.కాంతార తెగకు ప్రత్యర్థులు కడపటి దిక్కువాళ్లు. వాళ్ల మధ్యలో పోరు ఎలా ఉన్నా, ఈ కాంతార తెగలో కొందరు బాంగ్రా రాజ్యానికి వస్తారు. వారి నౌకాతీరాన్ని ఆక్రమించుకుంటారు. ఈ గొడవ వల్ల బాంగ్రా రాజుకి, కాంతార నాయకుడు బెర్మే (రిషబ్)కి గొడవ అవుతుంది. ఈ క్రమంలో కులశేఖరుడు బెర్మే తల్లిని చంపేసి, అతని ఊరిని తగలబెట్టేస్తాడు. తర్వాత ఏమైంది? అసలు విలన్ ఎవరనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: కల్యాణ్ను పొడిచేసిన శ్రీజ.. బిగ్ బాస్ 8వ వారం నామినేషన్స్ లిస్ట్)...to become LEGENDARY 🔥 pic.twitter.com/xRh6zFJkS1— prime video IN (@PrimeVideoIN) October 26, 2025 -
ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి బాహుబలి ఎపిక్, మాస్ జాతర, ఆర్యన్, కర్మణ్యే వాధికరస్తే, ఆపరేషన్ పద్మ, ఎర్రచీర తదితర తెలుగు సినిమాలు రాబోతున్నాయి. వీటిలో బాహుబలి రీ రిలీజ్, మాస్ జాతర చిత్రాలపైనే కాస్తోకూస్తో బజ్ ఉంది. మరోవైపు ఓటీటీల్లోనూ హిట్ మూవీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. పలు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ లిస్టులో ఉండటం విశేషం.(ఇదీ చదవండి: మహాభారతాన్ని అద్భుతంగా చూపించిన సిరీస్.. ఓటీటీ రివ్యూ)ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. లోక, ఇడ్లీ కొట్టు, కాంతార ఛాప్టర్ 1 సినిమాలతో పాటు డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు అనే తెలుగు సిరీస్ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తోంది. వీటితో పాటు ఏయే ఓటీటీల్లోకి ఏ మూవీస్ రానున్నాయనేది ఇప్పుడు చూద్దాం.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (అక్టోబరు 27 నుంచి నవంబర్ 2 వరకు)నెట్ఫ్లిక్స్ద అస్సెట్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 27ఇడ్లీకొట్టు (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబరు 29బల్లాడ్ ఆఫ్ ఏ స్మాల్ ప్లేయర్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 29స్టిచ్ హెడ్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 29ఐలీన్: క్వీన్ ఆఫ్ సీరియల్ కిల్లర్స్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 30ద వైట్ హౌస్ ఎఫెక్ట్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 31అమెజాన్ ప్రైమ్హజ్బిన్ హోటల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 29హెడ్డా (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 29ట్రెమెంబా (పోర్చుగీస్ సిరీస్) - అక్టోబరు 31కాంతార ఛాప్టర్ 1 (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబరు 31హాట్స్టార్ఐటీ వెల్కమ్ టూ డెర్రీ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 27మెగా 2.0 (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 27మానా కీ హమ్ యార్ నహీన్ (హిందీ సిరీస్) - అక్టోబరు 29లోక (తెలుగు డబ్బింగ్ మూవీ) - అక్టోబరు 31జీ5డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు (తెలుగు సిరీస్) - అక్టోబరు 31బాయ్ తుజాప్యా (మరాఠీ సిరీస్) - అక్టోబరు 31మారిగళ్లు (కన్నడ సిరీస్) - అక్టోబరు 31గణోసోత్రు (బెంగాలీ సిరీస్) - అక్టోబరు 31సన్ నెక్స్ట్బ్లాక్ మెయిల్ (తమిళ సినిమా) - అక్టోబరు 30ఆపిల్ టీవీ ప్లస్డౌన్ సిమిట్రీ రోడ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 29సైనా ప్లేమధురం జీవామృతబిందు (మలయాళ సినిమా) - అక్టోబరు 31(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు సినిమాలు) -
ఓటీటీలో మెప్పిస్తున్న 'సన్ ఆఫ్ సర్దార్ 2'
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. సునీల్ హీరోగా రాజమౌళి తీసిన ‘మర్యాద రామన్న’ (2010) సినిమా గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాని ‘సన్ ఆఫ్ సర్దార్’గా అజయ్ దేవగన్(Ajay Devgn) హీరోగా హిందీలో రీమేక్ చేశారు. అయితే ఇప్పటివరకు ‘మర్యాద రామన్న’కు సీక్వెల్ రాలేదు కానీ ‘సన్ ఆఫ్ సర్దార్’కు మాత్రం మళ్ళీ అజయ్ దేవగన్ హీరోగా ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈసారి టైటిల్ మాత్రమే సీక్వెల్గా తీసుకున్నా కథను మాత్రం తమ పంథాలో తీసుకున్నారు మేకర్స్. ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా. దీనికి అజయ్ దేవగన్ నిర్మాతగా కూడా వ్యవహరించారు. కథ దాదాపుగా స్కాట్ల్యాండ్లోనే జరుగుతుంది. ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్విస్తుందీ చిత్రం. ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ కథాంశానికొస్తే... జస్సీ సింగ్ రాండ్వా పెళ్లయినా పరిస్థితుల ప్రభావం వల్ల తన భార్య విదేశాలలో ఉంటుంది. జస్సీ మాత్రం తన తల్లితో భారత్లో ఉంటాడు. సినిమా ప్రారంభంలోనే జస్సీ భార్య డింపుల్ ఫోన్ చేసి, జస్సీకి వీసా అప్రూవ్ అయిందని, వెంటనే తను కూడా తన దగ్గరకు రావచ్చని చెబుతుంది. ఎంతో ఆనందంతో భార్యను కలవడానికి విదేశాలలో అడుగు పెట్టిన జస్సీతో విడాకులు కావాలని షాకిస్తుంది డింపుల్. ఖంగుతిన్న జస్సీ ఏం చేయాలో తోచని స్థితిలో ఫ్రెండ్ ఇంటికి వెళతాడు... అనుకోకుండా పాకిస్థాన్కి చెందిన రబియాని కలుస్తాడు జస్సీ. రబియాకి సాబా అనే కూతురు ఉంటుంది. భర్త వదిలేసి వెళ్ళిపోతాడు. రబియా కూతురు సాబా గ్యాంగ్స్టర్ రాజా సంధు కొడుకైన రాజాతో ప్రేమలో ఉంటుంది. రాజా సంధుకు భారత దేశమంటే ఎంత ప్రేమో అంతకు మించి పాకిస్థానీయులంటే ద్వేషం. అటువంటి అతని కొడుకు ఓ పాకిస్థానీ ప్రేమలో పడతాడు. జస్సీని తన భర్తగా ఉండమని చెప్పి తామిద్దరూ పంజాబీ దంపతులుగా నటించి, రాజా సంధుతో సంబంధం ఖాయం చేసుకోవాలని చూస్తుంటుంది రబియా. ఇదే సమయంలో రాజా సంధు ఓ పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేస్తాడు. ఆ ఫంక్షన్లో రబియా, జస్సీ తల్లిదండ్రులుగా సంబంధం ఖాయం చేసుకునే సమయంలో అటు రబియా అసలు భర్త రావడంతో పాటు ఇటు జస్సీ భార్య డింపుల్ కూడా తారసపడుతుంది. ఈ గందరగోళంలో రబియా తన కూతురు పెళ్ళి చేయగలుగుతుందా? లేదా అన్నది సినిమాలోనే చూడాలి. ఈ సినిమా మంచి కామెడీ కాలక్షేపం. ఎందుకంటే ఇది కామెడీ ఆఫ్ సర్దార్ కాబట్టి. వర్త్ టు వాచ్. – హరికృష్ణ ఇంటూరు -
మహాభారతాన్ని అద్భుతంగా చూపించిన సిరీస్.. ఓటీటీ రివ్యూ
ఇప్పటి జనరేషన్లో ఎంతమందికి 'మహాభారతం' గురించి తెలుసు? కచ్చితంగా చాలామందికి తెలిసి ఉండదు. ఎందుకంటే రీసెంట్ టైంలో దీని ఆధారంగా వచ్చిన సినిమాలు పెద్దగా లేవని చెప్పొచ్చు. ప్రభాస్ 'కల్కి'లో కర్ణుడు, అశ్వద్ధామ పాత్రల్నిచూపించినా సరే మహాభారతంని పెద్దగా టచ్ చేయలేదు. అలాంటిది మహాభారతంలో జరిగిన యుద్దం ఆధారంగా 'కురుక్షేత్ర' అనే యానిమేటెడ్ సిరీస్ తీశారు. అక్టోబరు 10న తొమ్మిది ఎపిసోడ్స్తో తొలి సీజన్ రిలీజ్ కాగా ఇప్పుడు మిగిలిన తొమ్మిది ఎపిసోడ్స్ని రెండో సీజన్గా స్ట్రీమింగ్లోకి తీసుకొచ్చారు. ఇంతకీ ఇది ఎలా ఉంది? ప్రేక్షకుల్ని మెప్పించిందా అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ సర్వైవల్ థ్రిల్లర్.. డోంట్ మిస్)కథేంటి?'కురుక్షేత్ర' సంగ్రామంలో కౌరవ పక్షానికి సైన్యాధ్యక్షుడిగా ఉన్న ద్రోణుడిని పాండవులు సంహరించడంతో తొలి సీజన్ ముగించారు. అక్కడి నుంచే రెండో సీజన్ మొదలైంది. మరి కౌరవుల కొత్త సైన్యాధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? కౌరవులు పక్షాన ఉన్న ధుర్యోధనుడు, కర్ణుడు, అశ్వద్ధామ, దుశ్శాసన.. పాండవుల పక్షాన ఉన్న అర్జునుడు, ధర్మరాజు, భీముడు తదితరుల మధ్య ఎలాంటి భీకర పోరాటం జరిగింది? అసలు ఈ కురుక్షేత్రం ఎలా మొదలైంది? ఎలా అంతమైంది? శ్రీకృష్ణుడు బోధించిన ధర్మ మార్గం, కర్మ ఫలితం ఏంటి? యుద్ధం ముగిసిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?18 రోజుల పాటు సాగిన కురుక్షేత్ర యుద్ధాన్ని.. ఈ సిరీస్ మేకర్స్ 18 ఎపిసోడ్స్గా తీశారు. తొలుత తొమ్మిది ఎపిసోడ్స్ రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ సీన్స్, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇలా ప్రతిదీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తొలి సీజన్లో దాదాపు 15 రోజుల పాటు సాగిన యుద్ధాన్ని చూపించేశారు. రెండో సీజన్లో ఏం చూపిస్తారా అనే సందేహం వచ్చింది. కానీ మిగిలిన తొమ్మిది ఎపిసోడ్స్లో ఓవైపు యాక్షన్ చూపిస్తూనే మరోవైపు డ్రామాని కూడా అద్భుతంగా ఆవిష్కరించారు.కుంతి, కర్ణుడు, దుశ్శాసన, భీమ, అశ్వత్థామ, దుర్యోధన.. ఇలా ఒక్కో పాత్రకు ఒక్కో ఎపిసోడ్ డిజైన్ చేశారు. అసలు వీళ్లు ఎవరు? ఈ యుద్ధంలో ఎందుకు పాల్గొనాల్సి వచ్చింది? 'కురుక్షేత్ర'లో వీళ్ల పాత్ర ఏంటి? అనేది చక్కగా చూపించారు. పేరుకే యానిమేటెట్ సిరీస్ గానీ చూస్తున్నంతసేపు మహాభారతం కళ్లముందు కనిపిస్తుంది. నేరుగా యుద్ధాన్ని చూపించేసి సిరీస్ ముగించేస్తే పెద్దగా డ్రామా పండదు. 16వ ఎపిసోడ్లోనే యుద్ధం పూర్తయిపోతుంది. చివరి రెండు ఎపిసోడ్స్లో యుద్ధం తర్వాత పరిస్థితుల్ని ఆకట్టుకునేలా చూపించారు. 'స్త్రీ పర్వ' ఎపిసోడ్, అందులో వచ్చే డ్రామా, డైలాగ్స్ బాగుంటాయి. చివరి ఎపిసోడ్లో శ్రీ కృష్ణుడి పాత్రపై వచ్చే విజువల్స్.. సగటు సినీ ప్రేక్షకుడికి మంచి కిక్ ఇస్తాయి.ఇదివరకే మహాభారతం చూసినవాళ్లకు, తెలిసినవాళ్లకు ఈ సిరీస్ ఓకే అనిపించొచ్చు. కానీ మహాభారతం, కురుక్షేత్రం గురించి ఏ మాత్రం తెలియనవాళ్లకు మాత్రం బోలెడంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎందుకంటే కృష్ణుడు, అర్జునుడు, భీముడు, ధర్మరాజు, కర్ణుడు, అశ్వత్థామ, దృతరాష్ట్రుడు, కుంతి, గాంధారి, ద్రౌపతి, దుర్యోధనుడు, దుశ్శానస.. ఇలా లెక్కలేనన్ని పాత్రలు ఉన్నాసరే అన్నింటి మధ్య కనెక్షన్స్, ఆయా విజువల్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తాయి.రీసెంట్ టైంలో 'మహావతార్ నరసింహా' అనే యానిమేటెడ్ సినిమా.. దేశవ్యాప్తంగా అద్భుతమైన ఆదరణ దక్కించుకుంది. ఒకవేళ ఈ మూవీ గనక నచ్చితే 'కురుక్షేత్ర' సిరీస్ని అస్సలు మిస్ చేయొద్దు. పేరుకే 18 ఎపిసోడ్స్ గానీ ఒక్కొక్కటి 25-30 నిమిషాల నిడివితోనే ఉంటాయి. ఇలా మొదలుపెడితే అలా పూర్తయిపోతాయి. నెట్ఫ్లిక్స్లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. వీలైతే పిల్లలకు కూడా చూపిస్తే 'మహాభారతం' గురించి వాళ్లకు కూడా బోలెడంత జ్ఞానం వస్తుంది.- చందు డొంకాన(ఇదీ చదవండి: బిగ్బాస్ 9 నుంచి పచ్చళ్ల పాప ఎలిమినేట్!) -
ఓటీటీలోకి సూపర్ హీరోల సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
సూపర్ హీరో సినిమాలు అనగానే హాలీవుడ్లో మార్వెల్, డీసీ యూనివర్స్లే గుర్తొస్తాయి. కొన్నేళ్ల ముందు వరకు వీటి నుంచి అద్భుతమైన మూవీస్ వచ్చాయి. ప్రేక్షకుల నుంచి అలాంటి రెస్పాన్స్ వచ్చేది. కానీ రీసెంట్ టైంలో మాత్రం చిత్రాలైతే వస్తున్నాయి గానీ అంతంత మాత్రంగానే ఆదరణ దక్కించుకుంటున్నాయి. అలా ఈ ఏడాది జూలైలో వచ్చిన లేటెస్ట్ సూపర్ హీరోల మూవీ 'ద ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్'. ఇప్పుడు ఈ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఫిక్స్ అయింది.జూలై 25న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కాగా.. పాజిటివ్ టాక్ వచ్చినప్పుడు ఎందుకనో పెద్దగా కలెక్షన్స్ సాధించలేకపోయింది. కొన్నిరోజుల ముందు రెంట్ విధానంలో ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం.. ఇప్పుడు ఉచితంగానే నవంబర్ 5 నుంచి హాట్స్టార్లోకి రాబోతుంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఒకవేళ సూపర్ హీరో జానర్ మూవీస్ ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని ట్రై చేయండి.(ఇదీ చదవండి: 9 నెలల పిల్లాడు.. దెయ్యమై పగ తీర్చుకుంటే?)'ద ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్' విషయానికొస్తే.. రీడ్ రిచర్డ్ (పెడ్రో పాస్కల్), స్యూ స్ట్రామ్ (వన్నెసా), జానీ స్ట్రామ్ (జోసెఫ్ క్విన్), బెన్ (మోస్ బాక్రాక్).. ఓ జట్టుగా ఉండే వీళ్లు ఆస్ట్రోనాట్స్. అందరూ వీళ్లని ఫెంటాస్టిక్ ఫోర్ అని పిలుస్తుంటారు. భూమిని ఎప్పుడూ కాపాడటమే వీళ్ల పని. స్యూ ప్రెగ్నెంట్ కావడంతో ఈమెకు పుట్టబోయే బిడ్డకు కూడా సూపర్ పవర్స్ వస్తాయా అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి టైంలో గలాక్టస్ (రాల్ఫ్ ఇన్నేసన్) భూమిని అంతం చేయబోతున్నాడని తెలుస్తుంది. దీంతో ఇతడికోసం ఫెంటాస్టిక్ ఫోర్ వేట మొదలుపెడతారు.స్యూకి పుట్టబోయే బిడ్డని తనకు ఇస్తే.. భూమిని, మనుషుల్ని విడిచిపెడతానని గలాక్టస్ చెబుతారు. అప్పుడు స్యూ ఏం చేసింది? భూమ్మీదకు వచ్చిన గలాక్టస్ని ఫెంటాస్టిక్ ఫోర్ ఏం చేసింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: పిల్లలతో తీసిన హారర్ సినిమా.. ఓటీటీ రివ్యూ) -
జియో కొత్త రీఛార్జ్ ప్లాన్స్: హై-స్పీడ్ డేటా, ఫ్రీ కాలింగ్స్
జియో తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త రీఛార్జ్ ప్లాన్స్ తీసుకొస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే.. హై-స్పీడ్ ఇంటర్నెట్ ఉపయోగించేవారు కొరకు.. మూడు అద్భుతమైన ఫ్యాక్స్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్లాన్స్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా డేటా మాత్రమే కాకుండా.. ఫ్రీ టీవీ ఛానెల్స్, ఓటీటీ యాప్లకు ఫ్రీ యాక్సెస్ పొందవచ్చు.రూ. 599 రీఛార్జ్ ప్లాన్: ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడంతో.. మీకు 30Mbps ఇంటర్నెట్ వేగం.. 1000GB హై-స్పీడ్ డేటా పొందవచ్చు. ఫ్రీ వాయిస్ కాలింగ్ సదుపాయం లభిస్తుంది. అంతే కాకుండా.. 800 కంటే ఎక్కువ టీవీ ఛానెల్లు, జియో హాట్స్టార్, సోనీ లివ్, జీ5 తో సహా 11 ఓటీటీ యాప్లకు యాక్సెస్ను పొందవచ్చు.రూ. 899 రీఛార్జ్ ప్లాన్: ఈ ప్లాన్ 100Mbps వరకు ఇంటర్నెట్ వేగాన్ని అందిస్తుంది. 1000GB హై-స్పీడ్ ఇంటర్నెట్ డేటా లభిస్తుంది. కాగా ఈ ప్లాన్ 800కి పైగా టీవీ ఛానెల్లు, జియో హాట్స్టార్, సోనీ లివ్ & జీ5 తో సహా 11 ఓటీటీ యాప్లకు యాక్సెస్ పొందవచ్చు.రూ. 1199 రీఛార్జ్ ప్లాన్: ఈ ప్లాన్ 100Mbps వరకు ఇంటర్నెట్ వేగాన్ని అందిస్తుంది. మీకు మొత్తం 1000GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ ఉచిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలతో వస్తుంది. 800కి పైగా టీవీ ఛానెల్స్, నెట్ఫ్లిక్స్ (బేసిక్), అమెజాన్ ప్రైమ్ లైట్, జియో హాట్స్టార్తో సహా 15 ఓటీటీ యాప్లకు ఉచిత యాక్సెస్ కూడా పొందవచ్చు.ఇదీ చదవండి: అరట్టైను తెలుగులో ఎలా పిలవాలంటే?: శ్రీధర్ వెంబు -
పిల్లలతో తీసిన హారర్ సినిమా.. వాళ్లు చూడకపోవడమే బెటర్!
హారర్ సినిమా అంటే ఓ రేంజులో భయపెట్టాలి. మొదటి సీన్ నుంచే మనల్ని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్లిపోవాలి. కానీ మన దగ్గర రీసెంట్ టైంలో తీసే మూవీస్లో చాలావరకు అలాంటి మ్యాజిక్ చేయలేకపోతున్నాయి! అందుకే మూవీ లవర్స్.. కొరియన్, హాలీవుడ్ హారర్ చిత్రాల వెంటపడుతున్నరు. ఇప్పుడు అలాంటి వాళ్లని ఓ గుజరాతీ సినిమా తెగ భయపెట్టేస్తోంది. అదే 'వష్ 2'. ఇది ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఈ మూవీ సంగతేంటి? ఎలాంటి థ్రిల్ ఇచ్చిందనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: 'కురుక్షేత్ర' రివ్యూ.. ఓటీటీలో అస్సలు మిస్ అవ్వొద్దు)2023లో గుజరాతీలో 'వష్' అనే సినిమా రిలీజైంది. వశీకరణం స్టోరీతో వచ్చిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ ఇది. దీన్ని హిందీలో అజయ్ దేవగణ్ 'సైతాన్' పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టాడు. దీంతో 'వష్' గురించి అందరికీ తెలిసింది. ఇప్పుడు ఆ దర్శకనిర్మాతల నుంచి సీక్వెల్ వచ్చింది. 'వష్ లెవల్ 2' పేరుతో తీశారు. ఇది ఇప్పుడు నెట్ఫ్లిక్స్లోకి వచ్చేసింది. గుజరాతీతో పాటు హిందీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.కథేంటి?తొలి భాగానికి కొనసాగింపుగా 'వష్ 2' మొదలవుతుంది. మొదటి భాగంలో మాంత్రికుడికి ఉన్న శిష్యుడు.. ఓ స్కూల్లో చదివే 50 మందికి పైగా అమ్మాయిలని వశీకరణం ద్వారా తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. ఇతడి వశంలో ఉన్న కొందరు అమ్మాయిలు.. స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటారు. మరికొందరైతే ఊరిమీద పడి జనాలని దారుణంగా చంపేస్తుంటారు. అసలు దీనంతటికీ మూలకారణం ఏంటి? ఆ మాంత్రికుడి శిష్యుడిని ఎవరు ఎదుర్కొన్నారు? చివరకు అమ్మాయిలు బతికి బయటపడ్డారా లేదా అనేది మిగతా స్టోరీ.స్కూల్ పిల్లలు, ఓ మాంత్రికుడు, దుష్టశక్తులు.. ఇదే 'వష్ 2' సినిమా మెయిన్ ప్లాట్. వింటుంటేనే వామ్మో అనిపిస్తుంది కదా! అయినా పిల్లలతో హారర్ మూవీ ఎవరైనా తీస్తారా అని మీరు అనుకోవచ్చు. కానీ చూస్తున్నంతసేపు ఓవైపు భయమేస్తుంది. తర్వాత ఏం జరుగుతుందా అనే ఆత్రుత మరోవైపు కలుగుతూ ఉంటుంది. చెప్పాలంటే లోకల్గా తీసినప్పటికీ హాలీవుడ్ రేంజ్ కంటెంట్ డెలివరీ చేశారని చెప్పొచ్చు.ఆగస్టులో ఈ సినిమా థియేటర్లలో రిలీజైతే.. అదే నెలలో 'వెపన్స్' అనే హాలీవుడ్ మూవీ కూడా విడుదలైంది. విచిత్రం ఏంటంటే ఈ రెండింటి కాన్సెప్ట్ దాదాపు ఒక్కటే. కొన్ని షాట్స్ అయితే అరే ఒకేలా ఉన్నాయేంటి అని కచ్చితంగా అనిపిస్తుంది. ఒకే నెలలో రిలీజ్ కావడం వల్ల కాపీ అనే ప్రసక్తి రాదు. సరే 'వష్ 2' విషయానికొస్తే ఓ స్కూల్, ఉదయం కాగానే వచ్చే పిల్లల సందడితో సినిమా మొదలవుతుంది. సరిగ్గా 13 నిమిషాల తర్వాత నుంచి అసలు కథ మొదలవుతుంది. పదిమంది ఆడపిల్లలు.. బిల్డింగ్ పైకెక్కి అక్కడినుంచి దూకి చనిపోతారు. అలా మొదలయ్యే టెన్షన్, థ్రిల్.. ఎండ్ కార్డ్ పడేవరకు ఆపకుండా ఉంటుంది.కేవలం 100 నిమిషాలు మాత్రమే ఉండే ఈ సినిమా.. చూస్తున్నంతసేపు మనల్ని సీటు అంచున కూర్చోబెడుతుంది. సినిమా అంతా భయంకరమైన, షాకింగ్ విజువల్స్ ఉంటాయి. మోనాల్ గజ్జర్ తప్పితే తెలుగు ప్రేక్షకులకు తెలిసిన మరో ముఖం లేదు. అయినా సరే ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. పిల్లలందరూ యాక్టింగ్ అదరగొట్టేశారు. వీళ్లకు తోడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరింత భయపెడుతుంది. చిన్న చిన్న సౌండ్స్ కూడా సినిమాని మరింత ఎలివేట్ చేశాయి.అన్ని ప్లస్సులేనా మైనస్సులు ఏం లేవా అంటే ఉన్నాయి. చాలా హింసాత్మక సన్నివేశాలున్నాయి. వాటిలో టీనేజీ పిల్లలు ఉండటం కొందరికి ఇబ్బందిగా అనిపించొచ్చు. సెన్సిటివ్గా ఉండేవారు ఈ మూవీ చూడకపోవడమే మంచిది. మొదటి పార్ట్లో ఏదైతే స్టోరీ ఉందో దాన్ని అటుతిప్పి ఇటుతిప్పి చూపించినట్లు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు కూడా అంతంత మాత్రంగానే అనిపిస్తాయి. కానీ ఓవరాల్గా మాత్రం మంచి ఎక్స్పీరియెన్స్ ఇస్తుంది. మంచి హారర్ సినిమా చూద్దామనుకుంటే మాత్రం దీన్ని అస్సలు మిస్ కావొద్దు.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ సర్వైవల్ థ్రిల్లర్.. డోంట్ మిస్) -
సైలెంట్గా ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ఎప్పటిలానే ఈసారి కూడా బోలెడన్ని సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేశాయి. అలా భద్రకాళి, కిష్కింధపురి, ఓజీ, మిరాజ్ లాంటి తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ డిజిటల్గా అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు ఈ శుక్రవారం (అక్టోబర్ 24) పలు తెలుగు చిత్రాలు సడన్ సర్ప్రైజ్ అన్నట్లు స్ట్రీమింగ్లోకి వచ్చేశాయి. ఇంతకీ ఆ కొత్త మూవీస్ ఏంటి? ఎందులో చూడొచ్చు?కబడ్డీ బ్యాక్డ్రాప్లో తెలుగులో ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఇదే జానర్లో వచ్చిన లేటెస్ట్ మూవీ 'అర్జున్ చక్రవర్తి'. ఆగస్టు 29న థియేటర్లలో ఈ చిత్రం రిలీజైంది. డీసెంట్ టాక్ వచ్చినప్పటికీ స్టార్స్ ఎవరూ లేకపోవడంతో జనాలు దీన్ని పట్టించుకోలేదు. అలా వచ్చిన రెండు మూడు రోజులకే బిగ్ స్క్రీన్ పై నుంచి కనుమరుగైపోయింది. ఇప్పుడు ఎలాంటి ప్రకటన లేకుండా సడన్గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమాకు విక్రాంత్ రుద్ర దర్శకుడు కాగా విజయ్ రామరాజు, షిజా రోజ్ హీరోహీరోయిన్లుగా నటించారు.(ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి 'లోక' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సంగీత్ శోభన్ హీరోగా నటించిన సినిమా 'గ్యాంబ్లర్స్'. ఈ ఏడాది జూన్ తొలివారం థియేటర్లలోకి వచ్చింది. స్టోరీ పరంగా మరీ తీసికట్టుగా ఉండేసరికి ప్రేక్షకులు దీన్ని తిరస్కరించేశారు. ఆగస్టులో ఇది సన్ నెక్స్ట్ ఓటీటీలోకి రాగా ఇప్పుడు ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. రెండింటిలోనూ తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.దివంగత నటుడు శ్రీహరి ఫ్యామిలీ నుంచి ఇదివరకే ఆయన కొడుకు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఒకటి రెండు సినిమాలు చేశాడు గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు శ్రీహరి మేనల్లుడు ధనుష్ కూడా టాలీవుడ్లోకి పరిచయమయ్యాడు. 'థ్యాంక్యూ డియర్' పేరుతో మూవీ తీశాడు. ఆగస్టు 01న ఇది థియేటర్లలో రిలీజైంది. కానీ ఎప్పుడొచ్చి వెళ్లిందో కూడా తెలియనంతలా మాయమైపోయింది. ఇప్పుడు ఈ చిత్రం సైలెంట్గా అమెజాన్ ప్రైమ్లోకి వచ్చేసింది. కాకపోతే అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. తోట శ్రీకాంత్ కుమార్ దర్శకుడు కాగా ధనుష్ సరసన హెబ్బా పటేల్ నటించింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి ధనుష్ 'ఇడ్లీ కొట్టు' సినిమా) -
ఎట్టకేలకు ఓటీటీలోకి 'లోక' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సూపర్ హీరోల సినిమాలు సరిగ్గా తీయాలే గానీ అద్భుతమైన రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. హాలీవుడ్లో ఈ తరహా మూవీస్ ఎక్కువగా తీస్తుంటారు. మన దేశంలో మాత్రం ఆడపాదడపా మాత్రమే ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ జానర్ అనగానే చాలామంది హీరోలతోనే తీస్తుంటారు. కానీ ఫిమేల్ సూపర్ హీరో కాన్సెప్ట్తో తీసిన మూవీ 'లోక'. మలయాళ బ్యూటీ కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ చేసింది. ఇప్పుడు ఈ చిత్ర ఓటీటీ విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది.కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మించాడు. ఎలాంటి అంచనాల్లేకుండా ఆగస్టు 28న మలయాళంలో, 29న తెలుగులో రిలీజైంది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన దక్కించుకుంది. కేవలం రూ.30-40 కోట్ల బడ్జెట్ పెట్టగా.. ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. లెక్క ప్రకారం ఓటీటీలోకి ఎప్పుడో వచ్చేయాలి. కానీ థియేటర్లలో బాగా ఆడేసరికి కాస్త ఆలస్యం చేశారు. ఇప్పుడు స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి ధనుష్ 'ఇడ్లీ కొట్టు' సినిమా)ఈ నెల 31 నుంచి అంటే వచ్చే శుక్రవారం నుంచి హాట్స్టార్లో 'లోక' అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీతో పాటు బెంగాలీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని పోస్టర్ రిలీజ్ చేసి మరీ ప్రకటించారు. తెలుగు ప్రేక్షకుల్లో కొందరికి ఈ సినిమా బాగా నచ్చేయగా.. మరికొందరికి మాత్రం ఓకే ఓకే అనిపించింది. మరి ఓటీటీలోకి వచ్చాక ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి?'లోక' విషయానికొస్తే.. చంద్ర (కల్యాణి ప్రియదర్శన్)కి సూపర్ పవర్స్ ఉంటాయి. దీని గురించి కొందరికే తెలుసు. కొన్ని కారణాల వల్ల చంద్ర.. బెంగళూరు వచ్చేస్తుంది. తన అతీంద్రయ శక్తుల్ని దాచిపెట్టి, సాధారణ అమ్మాయిలా బతుకుతూ కేఫ్లో పనిచేస్తుంటుంది. ఈమె ఎదురింట్లో సన్నీ(నస్లేన్) ఫ్రెండ్స్తో కలిసి ఉంటాడు. చంద్రని చూసి తొలిచూపులోనే సన్నీ ఇష్టపడతాడు. పరిస్థితులు కలిసొచ్చి ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. కానీ ఓ రోజు రాత్రి జరిగిన సంఘటనల వల్ల చంద్ర జీవితం తలకిందులవుతుంది. అసలు ఇంతకీ చంద్ర ఎవరు? ఆమె గతమేంటి? ఈమెకు ఎస్ఐ నాచియప్ప (శాండీ)తో గొడవేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: కవలలకు జన్మనివ్వనున్న ఉపాసన.. చిరంజీవి ఆశ నెరవేరేనా?)The world of Lokah unfolds exclusively on JioHotstar, streaming from October 31st.@JioHotstarMal#Lokah #TheyLiveAmongUs@DQsWayfarerFilm @dulQuer @dominicarun@NimishRavi@kalyanipriyan@naslen__ @jakes_bejoy @chamanchakko @iamSandy_Off @santhybee @AKunjamma pic.twitter.com/dAklmsFR1M— Wayfarer Films (@DQsWayfarerFilm) October 24, 2025 -
ఓటీటీలోకి ధనుష్ 'ఇడ్లీ కొట్టు' సినిమా
పేరుకే తమిళ హీరో అయినప్పటికీ సార్, కుబేర లాంటి స్ట్రెయిట్ సినిమాలతో తెలుగులోనూ హిట్స్ కొట్టిన ధనుష్.. రీసెంట్గా హీరోగా నటిస్తూ దర్శకనిర్మాతగా ఓ మూవీ చేశాడు. అదే 'ఇడ్లీ కడై'. తెలుగులోనూ దీన్ని ఇడ్లీ కొట్టు పేరుతో థియేటర్లలో రిలీజ్ చేశారు. ఫీల్ గుడ్ ఎమోషన్స్తో ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.అక్టోబరు 01న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో రిలీజైంది. అయితే దీనికి ఒకరోజు తర్వాత 'కాంతార-1' రిలీజైంది. ఈ మూవీకి హిట్ టాక్ రావడంతో ఇడ్లీ కొట్టు చిత్రం తెలుగులో ఏ మాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయింది. అదే టైంలో తమిళంలో మాత్రం మంచి వసూళ్లు వచ్చాయి. హిట్ అయింది. ఇప్పుడీ చిత్రం థియేటర్లలోకి వచ్చిన నెలలోపే అంటే అక్టోబరు 29 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది.(ఇదీ చదవండి: కవలలకు జన్మనివ్వనున్న ఉపాసన.. చిరంజీవి ఆశ నెరవేరేనా?)'ఇడ్లీ కొట్టు' విషయానికొస్తే.. శంకరాపురం అనే ఊరిలో శివకేశవ(రాజ్ కిరణ్) ఓ ఇడ్లీ కొట్టు నడుపతుంటాడు. ఈ షాపులోని ఇడ్లీ.. చుట్టుపక్కలా చాలా ఫేమస్. ఇతడి కొడుకు మురళి(ధనుష్) మాత్రం తండ్రిలా ఊరిలో ఉండటం తన వల్ల కాదని, హొటల్ మేనేజ్మెంట్ చదువుతాడు. జాబ్ కోసం కుటుంబాన్ని వదిలిపెట్టి బ్యాంకాక్ వెళ్లిపోతాడు. కొన్నాళ్ల తర్వాత పనిచేస్తున్న కంపెనీ ఓనర్ విష్ణువర్ధన్ (సత్యరాజ్) కూతురు మీరా (షాలినీ పాండే)తోనే పెళ్లికి మురళి రెడీ అవుతాడు. సరిగ్గా పెళ్లికి రెండు మూడు రోజులు ఉందనగా శివకేశవ చనిపోతాడు. దీంతో మురళి.. సొంతూరికి వస్తాడు. తర్వాత ఏమైంది? విష్ణువర్ధన్ కొడుకు అశ్విన్(అరుణ్ విజయ్)తో మురళికి గొడవేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్!) View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
ఓటీటీల్లో పండగే.. ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్!
దీపావళి సెలవులు ముగిసిపోయాయి. చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. గతవారం థియేటర్లలో దీపావళికి టాలీవుడ్ చిత్రాలు చేశాయి. ఇక ఈ వారంలో పెద్దగా సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. బాక్సాఫీస్ వద్ద విక్రమ్ తనయుడు హీరోగా వస్తోన్న బైసన్ రిలీజవుతోంది. ఇది తప్ప పెద్దగా బజ్ ఉన్న సినిమాలేవీ రావడం లేదు.ఇక ఓటీటీల విషయానికొస్తే ఇప్పటికే హిట్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. థియేటర్లలో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ఓటీటీల వైపు చూస్తున్నారు ఆడియన్స్. ఈ శుక్రవారం జాన్వీ కపూర్ పరమ్ సుందరి, విజయ్ ఆంటోనీ భద్రకాళి, కురుక్షేత్ర లాంటి యానిమేషన్ సినిమాలు సందడి చేసేందుకు వస్తున్నాయి. ఓటీటీ ప్రియులు ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్కురుక్షేత్ర - 2 (యానిమేటెడ్ సిరీస్) - అక్టోబర్ 24ఎ హౌజ్ ఆఫ్ డైనమైట్ - అక్టోబర్ 24పరిష్ (వెబ్ సిరీస్)- అక్టోబర్ 24ది డ్రీమ్ లైఫ్ ఆఫ్ మిస్టర్ కిమ్ (వెబ్ సిరీస్)- అక్టోబర్ 25అమెజాన్ ప్రైమ్..ఈడెన్ (హాలీవుడ్ మూవీ)- అక్టోబర్ 24పరమ్ సుందరి(బాలీవుడ్ సినిమా) - అక్టోబర్ 24అడ్వెంచర్ టైమ్- ఫియాన్ అండ్ కేక్-సీజన్2 (యానిమేషన్)- అక్టోబర్ 24బోన్ లేక్(హాలీవుడ్ మూవీ)- అక్టోబర్ 24(రెంట్ పద్దతిలో)జియో హాట్స్టార్..భద్రకాళి(తమిళ సినిమా) - అక్టోబర్ 24ది కర్దాసియన్స్ (సీజన్-7)- అక్టోబర్ 24మహాభారత్: ఏక్ ధర్మయుధ్ (వెబ్ సిరీస్)- అక్టోబర్ 25ఆహా..అక్యూజ్డ్(తమిళ సినిమా)- అక్టోబర్ 24లయన్స్ గేట్ ప్లే..ది అప్రెంటిస్(హాలీవుడ్ మూవీ)- అక్టోబర్ 24నడికర్(మలయాళ సినిమా)- అక్టోబర్ 24ఫ్రీ లాన్స్ (హాలీవుడ్ మూవీ)- అక్టోబర్ 24యాపిల్ టీవీ ప్లస్..స్టిల్లర్ అంజ్ మియారా నథింగ్ ఈజ్ లాస్(హాలీవుడ్)- అక్టోబర్ 24సన్ నెక్ట్స్..టేల్స్ ఆఫ్ ట్రేడిషన్(తమిళ సినిమా)- అక్టోబర్ 24జంబూ సర్కస్(కన్నడ సినిమా)- అక్టోబర్ 24హెచ్బీవో మ్యాక్స్..వెపన్స్-(హాలీవుడ్ మూవీ)- అక్టోబర్ 24 -
ఓటీటీలో ఒళ్లు గగుర్పొడ్చే హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీల్లో హారర్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ జోనర్ చిత్రాలకు ఆడియన్స్ నుంచి విపరీతమైన ఆదరణ వస్తోంది. ఇలాంటి చిత్రాలు చూసేందుకు ఓటీటీ ప్రియులు ఎప్పుడు ఆసక్తి చూపిస్తుంటారు. 2023లో విడుదలై నేషనల్ అవార్డ్ దక్కించుకున్న హారర్ మూవీ వాష్. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. గుజరాతీలో తెరకెక్కించిన ఈ సినిమాను హిందీలోనూ రిలీజ్ చేశారు.ఈ చిత్రానికి సీక్వెల్గా వాష్ లెవెల్-2 మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ ఏడాది ఆగస్టు 27న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. రిలీజైన రెండు నెలల్లోపే డిజిటల్గా స్ట్రీమింగ్ కానుంది. ఈనెల 22 నుంచే నెట్ఫ్లిక్స్ వేదికగా సందడి చేయనుంది. గుజరాతీ భాషతో పాటు హిందీలోనూ అందుబాటులోకి రానుంది. అయితే సౌత్ భాషల్లో మాత్రం స్ట్రీమింగ్ కావడం లేదు. కాగా.. ఈ చిత్రానికి కృష్ణదేవ్ యాగ్నిక్ దర్శకత్వం వహించారు. Darr ka mahaul hai. Iss baar bachna hoga mushkil 👀 Watch Vash Level 2, out 22 October, on Netflix.#VashLevel2OnNetflix pic.twitter.com/5fIrKyBR5J— Netflix India (@NetflixIndia) October 21, 2025 -
దీపావళి ధమాకా.. ఓటీటీలో 19 సినిమాలు/ సిరీస్లు
బాక్సాఫీస్ దగ్గర దీపావళి సందడి నెలకొంది. మిత్రమండలి, తెలుసుకదా, డ్యూడ్, కె-ర్యాంప్ చిత్రాలు పండగ రేసులో నిలబడ్డాయి. వీటిలో కొన్ని తడబడుతుంటే మరికొన్ని దూసుకుపోతున్నాయి. పోటీకి సై అంటూ రష్మిక మందన్నా థామా కూడా అక్టోబర్ 21న విడుదల కాబోతోంది. తమిళంలో పాజిటివ్ టాక్ అందుకున్న బైసన్ కూడా అక్టోబర్ 24న తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. ప్రముఖ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించారు. థియేటర్ల సంగతి సరే.. మరి ఓటీటీలో ఈ వారం (అక్టోబర్ 20- 26 వరకు) ఏయే సినిమాలు రిలీజవుతున్నాయో చూసేద్దాం.. అమెజాన్ ప్రైమ్ వీడియోఎలివేషన్: అక్టోబర్ 21లజారస్ (వెబ్ సిరీస్) - అక్టోబర్ 22విషియస్ - అక్టోబర్ 22ఈడెన్ - అక్టోబర్ 24పరమ్ సుందరి - అక్టోబర్ 24జియో హాట్స్టార్భద్రకాళి - అక్టోబర్ 24మహాభారత్: ఏక్ ధర్మయుధ్ (వెబ్ సిరీస్)- అక్టోబర్ 25పిచ్ టు గెట్ రిచ్ (రియాలిటీ షో) - అక్టోబర్ 20నెట్ఫ్లిక్స్మాబ్ వార్: ఫిలడెల్ఫియా వర్సెస్ ద మాఫియా (డాక్యుమెంటరీ సిరీస్) - అక్టోబర్ 22ద మాన్స్టర్ ఆఫ్ ఫ్లోరెస్ (వెబ్ సిరీస్) - అక్టోబర్ 22ఓజీ - అక్టోబర్ 23నోబడీ వాంట్స్ దిస్ సీజన్ 2 (వెబ్ సిరీస్)- అక్టోబర్ 23ద ఎలిక్సిర్ - అక్టోబర్ 23కురుక్షేత్రం - పార్ట్ 2 (యానిమేటెడ్ సిరీస్) - అక్టోబర్ 24ఎ హౌజ్ ఆఫ్ డైనమైట్ - అక్టోబర్ 24పరిష్ (వెబ్ సిరీస్)- అక్టోబర్ 24ది డ్రీమ్ లైఫ్ ఆఫ్ మిస్టర్ కిమ్ (వెబ్ సిరీస్)- అక్టోబర్ 25సన్ నెక్స్ట్ఇంబం - అక్టోబర్ 20సింప్లీ సౌత్దండకారణ్యం - అక్టోబర్ 20చదవండి: ఒక్కరాత్రిలోనే ఫ్యామిలీ అంతా కోల్పోయింది.. ఎవరికీ తెలీదు! -
ఓటీటీలోకి చావును వెంటాడే సినిమా.. ధైర్యం ఉంటేనే చూడండి (రివ్యూ)
ఈ వీకెండ్లో మీరు అదిరిపోయే సినిమా చూడాలని అనుకుంటున్నారా..? అయితే, ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్లైన్స్(Final Destination Bloodlines) చిత్రాన్ని చూసేయండి. అయితే, ఇందులో హింసాత్మకమైన సీన్స్ ఉంటాయి. మిమ్మల్ని కలవరపరిచే ఛాన్స్ ఉంది. కాబట్టి సున్నితమైన వారు, చిన్న పిల్లలు దూరంగా ఉండటం మంచిది. ఫైనల్ డెస్టినేషన్ మే 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కానీ, అక్టోబర్ 16న జియోహాట్స్టార్లో స్ట్రీమింగ్కు వచ్చేసింది. తెలుగు వర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఓటీటీలో అదిరిపోయే సూపర్ థ్రిల్లర్ సినిమా చూడాలనే ఆసక్తి ఉంటే దీనిని వదులుకోకండి. రూ.440 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.2700 కోట్లు వసూలు చేయడం విశేషం. ఈ మూవీ రన్టైమ్ కేవలం 1:50 మాత్రమే.ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంఛైజీలో భాగంగా ఈ ఏడాది పార్ట్-6 విడుదలైంది. చివరిగా 2011లో వచ్చిన ఫైనల్ డెస్టినేషన్ 5 తర్వాత సుమారు 14 ఏళ్లకు ఈ ఫ్రాంఛైజీ నుంచి ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్లైన్స్ వచ్చింది. ఈ మూవీని దర్శకులు జాక్ లిపోవ్స్కీ, ఆడమ్ స్టీన్ తెరకెక్కించారు. కైట్లిన్ శాంటా జువానా, రిచర్డ్ హార్మన్, టోనీ టాడ్ వంటి స్టార్స్ ఈ సినిమాలో నటించారు.మన కుటుంబంలోని వ్యక్తులు ఏ విధంగా మరణిస్తారో ముందే తెలిస్తే ఎలా ఉంటుంది..? ఇదే కాన్సెప్ట్తో సినిమా కొనసాగుతుంది. అయితే, నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగానే ఈ మూవీని తీశామని మేకర్స్ చెప్పారు. ఇప్పటికే వచ్చిన ఈ ఫ్రాంఛైజీలోని 5 సినిమాలు కూడా ఇదే రేంజ్లో ఉంటాయి. తాజాగా విడుదలైన పార్ట్-6 కథ విషయానికి వస్తే.. 1968లో ఓ స్కై వ్యూ హోటల్లో జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే ఊహించి, వందల మందిని కాపాడుతుంది ఐరిస్ (బ్రెక్ బాసింగర్). జరగబోయే ప్రమాదం గురించి ఆమె పసిగట్టేస్తుంది. అయితే, వారి ఆయుష్షు తీరినా కూడా ఐరిస్ తెలివిగా కొందరిని కాపాడుతుంది. ఎంతో ఘోరమైన ప్రమాదంలో చాలామంది దారుణమైన రీతిలో మరణిస్తారు. కానీ ఐరిస్ వల్ల కొందరు ప్రాణాలతో బయటపడతారు. చావును ఎదిరించి ప్రాణాలతో ఉన్న వారిని ఒక్కొక్కరిగా చావు తరుముతూ వస్తుంది. అయితే, ఒక ఆర్డర్ ప్రకారమే వారు మరణిస్తారు. ఈ క్రమంలోనే వారందరినీ కాపాడిని ఐరిస్ వంతు ఒకరోజు వస్తుంది. ఆమె మరణిస్తే తన తర్వాతి కుటుంబ సభ్యులు కూడా చనిపోతారని గ్రహిస్తుంది. ఈ ఆర్డర్ను తప్పించేందుకు ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంది..? చావును ఎదిరించి ఎలా బతికింది..? తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఐరిస్ చాలా పకడ్బందీగా వేసుకున్న ప్లాన్ ఏంటి..? ఫైనల్గా తన కుటుంబ సభ్యులను కాపాడుకుందా..? ఈ క్రమంలోనే ఆమె మనవరాలు స్టేఫినీ (కైట్లిన్ శాంటా జువానా) చేసిన సాహసం ఏంటి..? అనేది తెలియాలంటే ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్లైన్స్ చూడాల్సిందే. ఇందులో ఎలాంటి అసభ్యకరమైన సీన్లు ఉండవ్.. ఫ్యామిలీతో చూడొచ్చు. కానీ, ఘోరమైన ప్రమాదాలు కలవరపరిచేలా ఉంటాయి.ఫైనల్ డెస్టినేషన్ కథ సింపుల్గానే ఉన్నప్పటికీ ప్రేక్షకుడిని థ్రిల్ చేస్తూ.. సస్పెన్స్ తో కూడిన డెత్ సీన్స్ ట్రీట్ ఇస్తాయి. గుండెకు సంబంధించిన ఇబ్బందులు ఉన్న ఆడియెన్స్ ఈ మూవీకి దూరంగా ఉండటం మంచింది. మనిషి జీవితంలో మరణం ఏ రీతిలో పలకరిస్తుంది ముందే తెలుసుకుంటే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపించారు. -
'కురుక్షేత్ర-2' స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
యానిమేషన్ చిత్రం'మహావతార్ నరసింహా' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. దీంతో ఇదే ట్రెండ్ను పలు సినిమాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కురుక్షేత్ర యానిమేటెడ్ చిత్రం కొద్దిరోజుల క్రితం నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. ఈ మూవీకి కూడా మంచి రెస్సాన్స్ వచ్చింది. దీంతో పార్ట్-2 ను దర్శకుడు ఉజాన్ గంగూలీ రూపొందించారు. తాజాగా కురుక్షేత్ర-2 ట్రైలర్ను షేర్ చేశారు. అక్టోబర్ 24న నెట్ఫ్లిక్స్లోనే ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగు వర్షన్ కూడా అందుబాటులో ఉంది.'కురుక్షేత్ర-1' కథేంటి?అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసిన తర్వాత పాండవులకు ఇచ్చిన మాట ప్రకారం కౌరవులు.. రాజ్యంలో వాటా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మాట తప్పుతారు. ఐదుగురికి ఐదు ఊళ్లు ఇవ్వడానికి కూడా నిరాకరిస్తారు. కృష్ణుడి సూచన మేరకు పాండవులు ఓపిగ్గానే ఉంటారు. సంజయుడితో కౌరవులకు రాయబారం పంపిస్తారు. కానీ అది విఫలమవుతుంది. కౌరవులు.. యుద్ధం పట్ల ఉత్సాహంగా ఉన్నారనే విషయం పాండవులకు తెలుస్తుంది. దీంతో కృష్ణుడు, అర్జునుడు వైపు.. కృష్ణుడి సైన్యం దుర్యోధనుడికి దక్కుతుంది. అలా 'కురుక్షేత్రం' మొదలవుతుంది. ఆయుధాలే పట్టనని అనుకున్న అర్జునుడు.. కృష్ణుడి గీతోపదేశం తర్వాత ఎలా మారాడు? ఈ యుద్ధంలో అసలేం జరిగిందనేది అసలు కథ? -
ఓటీటీలో 'ఓజీ'.. అధికారికంగా ప్రకటన
టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ నటించిన‘ఓజీ’ (OG) సినిమా ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. కేవలం నెలరోజుల్లోనే ఓటీటీలోకి ఈ చిత్రం ఎంట్రీ ఇవ్వనుంది. సుజీత్ దర్శకత్వం వహించిన చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రకాశ్ రాజ్, శ్రియారెడ్డి, ప్రియాంక మోహన్ తదితరులు నటించారు. 'హరి హర వీరమల్లు' వంటి భారీ డిజాస్టర్ తర్వాత వచ్చిన ఓజీ కాస్త పర్వాలేదనిపించింది.ఓజీ సినిమా అక్టోబర్ 23 నుంచి ‘నెట్ఫ్లిక్స్’ (Netflix)లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ,తమిళ్, కన్నడ, మలయాళంలో విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మొదటిరోజు భారీ కలెక్షన్స్ రాబట్టిన ఓజీ ఆ తర్వాత ఆశించినంత రేంజ్లో కలెక్ట్ చేయలేదు. కాంతార సినిమా విడుదల తర్వాత చాలాచోట్ల ఓజీ చిత్రాన్ని తొలగించేశారు కూడా. దీంతో ఓజీ బయ్యర్లకు నష్టాలు తప్పలేదు.ఓజీ కథేంటి..?ఓజీ కథ అంతా 1970-90ల మధ్యకాలంలో జరుగుతుంది. జపాన్లో జరిగిన ఓ దాడి నుంచి బయటపడ్డ ఓజాస్ గంభీర (పవన్ కల్యాణ్) ఇండియాకు వెళ్లే ఓడ ఎక్కుతాడు. అక్కడ సత్యాలాల్ అలియాస్ సత్యదాదా(ప్రకాశ్రాజ్)పై అటాక్ జరిగితే.. రక్షిస్తాడు. దీంతో ఓజీని సత్యాదాదా బొంబాయి తీసుకొస్తాడు. అక్కడ ఓ పోర్ట్ని నిర్మించి.. సత్యదాదా డాన్గా ఎదుగుతాడు. అతనికి ఓజాస్ గంభీర తోడుగా నిలుస్తాడు. కొన్నాళ్ల తర్వాత ఓ కారణంగా గంభీర బొంబాయి వదిలి వెళ్తాడు. డాక్టర్ కన్మణిని పెళ్లి చేసుకొని నాసిక్లో కొత్త జీవితం ప్రారంభిస్తారు.ఓజీ బొంబాయి వీడిన తర్వాత సత్యదాదా స్నేహితుడు మిరాజ్ కర్(తేజ్ సప్రూ)తో పాటు తన కొడుకులు జిమ్మీ (సుదేవ్ నాయర్), ఓమీ (ఇమ్రాన్ హష్మీ) నగరాన్ని తమ గుప్పిట్లో పెటుకునేందుకు ప్రయత్నిస్తారు. సత్యదాదా పోర్ట్లో ఉన్న తన కంటేనర్ని స్వాధీనం చేసుకునేందుకు ఇస్తాంబుల్లో ఉన్న ఓమీ.. ముంబైకి వస్తాడు. సత్యదాదా పోర్ట్ని స్వాధీనం చేసుకొని.. అతడి మనుషులను దారుణంగా చంపేస్తాడు. అప్పటికే ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకున్న సత్యదాదాకు మళ్లీ ఓజీ అవసరం పడుతుంది. మరి ఓజీ తిరిగి బొంబాయి వచ్చాడా? అసలు ఓజీ బొంబాయిని ఎందుకు వదలాల్సి వచ్చింది? తండ్రిలా భావించే సత్యదాదాకు ఆయన ఎందుకు దూరంగా ఉన్నాడు? ఓమీ కంటేనర్లో ఉన్న విలువలైన వస్తుంలేంటి? సత్యాదాదా ఇద్దరు కొడుకులు ఎలా చనిపోయారు? దాదా మనవడు అర్జున్(అర్జున్ దాస్) ఓజీని ఎందుకు చంపాలనుకున్నాడు? ఓజీ ప్లాష్బ్యాక్ ఏంటి? ఈ కథలో శ్రీయారెడ్డి పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
నేరుగా ఓటీటీకే సూపర్ నేచురల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఓటీటీల హవా నడుస్తోంది. ఆడియన్స్ సైతం డిజిటల్ వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో ఓటీటీలు సైతం సరికొత్త కంటెంట్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా మరో సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ వచ్చేస్తోంది. మానవ్ కౌల్, భాషా సుంబ్లి నటించిన ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు.దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. నవంబర్ 7న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుందని పోస్టర్ పంచుకున్నారు. ఈ సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీకి ఆదిత్య సుహాస్ జంభలే దర్శకత్వం వహించారు. కశ్మీర్లోని బారాముల్లా లోయ ప్రాంతానికి చెందిన డిఎస్పీ రిద్వాన్ సయ్యద్ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రిద్వాన్ బదిలీపై వచ్చిన వెంటనే ఓ యువకుడు అదృశ్యమవుతాడు? ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అనేదే బారాముల్లా కథ. ఈ చిత్రాన్ని బీ62 స్టూడియోస్, జియో స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య, లోకేష్ ధార్తో కలిసి జ్యోతి దేశ్పాండే నిర్మించారు. Welcome to the town, where truth is a myth, and myths have truth. Enter the world of ‘Baramulla’ on 7th November. Only on Netflix.#BaramullaOnNetflix pic.twitter.com/pB7swLUIYm— Netflix India (@NetflixIndia) October 17, 2025 -
మెగా కోడలి సస్పెన్స్ థ్రిల్లర్.. సడన్గా ఓటీటీకి!
మెగా కోడలు లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటించిన చిత్రం టన్నెల్(Tunnel). కోలీవుడ్ హీరో అథర్వా మురళి సరసన ఈ చిత్రంలో కనిపించింది. తమిళంలో తనల్(Thanal) పేరుతో ఈ మూవీని తెరకెక్కించారు. సెప్టెంబర్ 19న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ మూవీకి రవీంద్ర మాధవ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను లచ్చురామ్ ప్రొడక్షన్స్పై ఎ. రాజు నాయక్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో అథర్వ పోలీస్ ఆఫీసర్గా నటించారు. అశ్విన్ కాకుమాను విలన్గా మెప్పించారు.తాజాగా ఈ చిత్రం నెల రోజులైనా కాకముందే ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీకి వచ్చేసింది. ఈ రోజు సాయంత్రం ఆరు గంటల నుంచే అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. క్రూరమైన హత్యలకు పాల్పడుతున్న ఓ సైకోను పోలీసులు ఎలా పట్టుకున్నారు? అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కించారు. కాగా.. ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. -
ఓటీటీలో భారీ యాక్షన్ సినిమా.. భాగీ-4 సడెన్గా స్ట్రీమింగ్
బాలీవుడ్ హిట్ ఫ్రాంచైజీలో భాగీ సినిమాకు ఎక్కువగానే ఫ్యాన్స్ ఉన్నారు. సెప్టెంబర్ 5న విడుదలైన భాగీ4 సడెన్గా ఓటీటీలోకి వచ్చేసింది. టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన ఈ భారీ యాక్షన్ చిత్రంలో హర్నాజ్ కౌర్ సంధూ, పంజాబీ బ్యూటీ సోనమ్ ప్రీత్ బజ్వా హీరోయిన్లుగా నటించారు. మితిమీరిన రక్తపాతంతో నిండిన ఈ మూవీ పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు. కానీ, యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారిని మాత్రం నిరాశపరచలేదని చెప్పాలి.అమెజాన్ ప్రైమ్లో సడెన్గా భాగీ-4 స్ట్రీమింగ్కు వచ్చేసింది. అయితే, ఈ మూవీని అద్దె ప్రాతిపదికలో చూడొచ్చు. రూ. 349 అధనంగా చెల్లించి భాగీ-4 చూడొచ్చని ఆ సంస్థ ప్రకటించింది. ‘భీమా’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు ఎ.హర్ష ఈ మూవీని తెరకెక్కించారు. ఇందులో సంజయ్ దత్ కీలక పాత్రలో నటించారు. 'భాగీ' తొలి భాగంలో జంటగా నటించిన టైగర్, శ్రద్ధా 'భాగీ 3'లో మళ్లీ కలిసి నటించారు. 'భాగీ 2'లో హీరోయిన్గా దిశా పటానీ కనిపించింది. అయితే, వీరిలో ఎవరూ భాగీ-4లో లేరు. -
వరుసగా మూడు రోజుల సెలవులు.. ఓటీటీల్లో ఒక్క రోజే 19 సినిమాలు!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. దీనికి తోడు వచ్చే సోమవారమే దీపావళి పండుగ. ఇంకేముంది వరుసగా మూడు రోజులు సెలవులు కూడా వచ్చేస్తున్నాయి. ఈ వారాంతానికి తోడు దీపావళి కలిసి రావడంతో ఫ్యామిలీతో చిల్ అయ్యేందుకు సినీ ప్రియులు సిద్ధమైపోయారు. మీ కోసమే ఈ వారంలో మిత్రమండలి, తెలుసుకదా, డ్యూడ్, కె ర్యాంప్ లాంటి థియేటర్లకు వరుసగా క్యూ కడుతున్నాయి.అదే సమయంలో థియేటర్లలో వెళ్లలేని వారు ఓటీటీ చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఫ్రైడే ఏయే సినిమాలు డిజిటల్గా స్ట్రీమింగ్ కానున్నాయోనని తెగ వెతికేస్తున్నారు. అలాంటి వారి కోసం రెండు టాలీవుడ్ మూవీస్ శుక్రవారం స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. మంచు లక్ష్మీ దక్ష, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కంధపురి ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. వీటితో పాటు ఆనందలహరి అనే వెబ్ సిరీస్ కూడా సందడి చేయనుంది. అంతేకాకుండా పలు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్లు శుక్రవారమే ఓటీటీలో అలరించనున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేసేయండి.ఓటీటీల్లో ఫ్రైడే మూవీస్నెట్ఫ్లిక్స్ 27 నైట్స్ (స్పానిష్ మూవీ) - అక్టోబర్ 17 గుడ్ న్యూస్ (కొరియన్ సినిమా) - అక్టోబర్ 17 గ్రేటర్ కాలేష్ (హిందీ సిరీస్) - అక్టోబర్ 17 షీ వాక్స్ ఇన్ డార్క్నెస్ (స్పానిష్ సినిమా) - అక్టోబర్ 17 ద ఫెర్ఫెక్ట్ నైబర్ (ఇంగ్లీష్ చిత్రం) - అక్టోబర్ 17 టర్న్ ఆఫ్ ది టైడ్- సీజన్ 2- (హాలీవుడ్ సిరీస్)- అక్టోబర్ 17 ది డిప్లొమాట్- సీజన్ 3- అక్టోబర్ 17 హౌటూ ట్రైన్ యువర్ డ్రాగన్(యానిమేషన్ మూవీ)- అక్టోబర్ 18అమెజాన్ ప్రైమ్దక్ష(తెలుగు సినిమా)- అక్టోబరు 17హాలీవుడ్ హస్లర్- గ్లిట్జ్, గ్లామ్, స్కామ్(డాక్యుమెంటరీ సిరీస్)- అక్టోబరు 17ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్- అక్టోబర్ 18 జియో హాట్స్టార్ఘోస్ట్స్ సీజన్-5(హాలీవుడ్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 17 ఆహా ఆనందలహరి (తెలుగు వెబ్ సిరీస్) - అక్టోబరు 17జీ5 కిష్కింధపురి (తెలుగు సినిమా) - అక్టోబరు 17 భగవాన్ ఛాప్టర్ 1: రాక్షస్ (హిందీ మూవీ) - అక్టోబరు 17 ఎలుమలే (కన్నడ సినిమా) - అక్టోబరు 17 మేడమ్ సేన్ గుప్తా (బెంగాలీ మూవీ) - అక్టోబరు 17 అభయంతర కుట్టవాళి (మలయాళ సినిమా) - అక్టోబరు 17సన్ నెక్స్ట్ ఇంబమ్ (మలయాళ మూవీ) - అక్టోబరు 17 మట్టా కుతిరై(మలయాల సినిమా)- అక్టోబర్ 19లయన్స్ గేట్ ప్లే సంతోష్ (హిందీ సినిమా) - అక్టోబరు 17 వుయ్ లివ్ ఇన్ టైమ్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 17 -
ఓటీటీకి తెలుగు రొమాంటిక్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చాక సినిమాలు చూసే ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఎంత పెద్ద సినిమాలైనా నెల రోజుల తర్వాత ఇంట్లోనే కూర్చుని ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక వెబ్ సిరీస్లకైతే కొదవే లేదు. వారంలో నాలుగైదు వెబ్ సిరీస్లే ఉంటున్నాయి. వీటిలో క్రైమ్, రొమాంటిక్ ఓరియంటేడ్ స్టోరీలకు ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగులో మరో ఆసక్తికర సిరీస్ అలరించేందుకు వచ్చేస్తోంది.తెలుగులో తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ఆనందలహరి (Ananda lahari). ఈ సిరీస్లో ఆనంద్, లహరి అనే యువ జంట చుట్టూ తిరిగే ప్రేమ కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. పాన్ గోదావరి అంటూ ఈస్ట్ అబ్బాయి, వెస్ట్ అమ్మాయి మధ్య జరిగే ప్రేమ, పెళ్లి నేపథ్యంలో తీశారు. ఇందులో అభిషేక్, భ్రమరాంబిక జంటగా నటించారు ఇప్పటికే ట్రైలర్ విడుదల చేయగా.. ఈ నెల 17 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ పోస్టర్ను పంచుకున్నారు. ఈ వెబ్ సిరీస్కు సాయి వానపల్లి దర్శకత్వం వహించారు.2 days to go!Not just another love story… it’s an Anandalahari of fun, drama & heart!Oct 17th, witness how East meets West — in love, war & Flexi Raju style! 😎@sureshProdns @SouthBayLive#aha #SureshProductionsmini pic.twitter.com/AuSbATe8uz— ahavideoin (@ahavideoIN) October 15, 2025 -
నెలలోపే ఓటీటీలోకి మంచు లక్ష్మీ థ్రిల్లర్ సినిమా
మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మంచు లక్ష్మీ.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ చెప్పుకోదగ్గ సినిమాలే రీసెంట్ టైంలో ఏం రాలేదు. కొన్నాళ్ల క్రితం ఓటీటీ కోసం హిందీలో ఓ షో చేసింది గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. గత నెలలో లీడ్ రోల్ చేసిన ఓ తెలుగు సినిమా రిలీజైంది. ఇప్పుడది ఓటీటీలోకి కూడా వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి విజయ్ ఆంటోనీ పొలిటికల్ థ్రిల్లర్)మంచు లక్ష్మీ పోలీస్గా ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'దక్ష'. మోహన్ బాబు అతిథి పాత్రలో కనిపించారు. మర్డరీ మిస్టర్ థ్రిల్లర్ స్టోరీతో తీశారు. సెప్టెంబరు 19న థియేటర్లలోకి వస్తే.. వచ్చిన విషయం కూడా చాలామందికి తెలియనంత వేగంగా వెళ్లిపోయింది. ఇప్పుడు అక్టోబరు 17 నుంచి అంటే ఈ శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని మంచు లక్ష్మీనే ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. మరి బిగ్ స్క్రీన్పై తేలిపోయిన ఈ చిత్రం.. ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి?'దక్ష' విషయానికొస్తే.. హైదరాబాద్లో ఓ వ్యక్తి అనుమానాస్పద రీతిలో మరణిస్తాడు. ఆ కేసును సీఐ దక్ష (లక్ష్మీ మంచు) ఇన్వెస్టిగేట్ చేస్తుంది. తర్వాత అమెరికా నుంచి వచ్చిన ఓ ఫార్మా కంపెనీ ప్రతినిధి హత్యకు గురవుతాడు. ఈ రెండు కేసుల్లో క్లూస్ ఒకేలా ఉంటాయి. మరోవైపు దక్ష మీద డాక్యుమెంటరీ తీయాలని జర్నలిస్ట్ సురేష్ (జెమినీ సురేష్) ఆమెని ఫాలో అవుతూ ఉంటాడు. అతడు సేకరించిన సమాచారంతో నమ్మశక్యం కాని ఓ నిజం వెలుగులోకి వస్తుంది. ఇంతకీ హత్యలు చేసింది ఎవరు? దక్ష, మిథిలా (చిత్రా శుక్లా)కు సంబంధం ఏంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ సర్వైవల్ థ్రిల్లర్.. డోంట్ మిస్) -
ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ సర్వైవల్ థ్రిల్లర్.. డోంట్ మిస్
కల్పిత కథలతో సినిమాలు తీయడం సులభమే. కానీ నిజ జీవిత సంఘటనల ఆధారంగా మూవీస్ తీసి హిట్ కొట్టడం చాలా కష్టం. కొన్నిసార్లు మాత్రం ఇలా తీసి బ్లాక్ బస్టర్ కొడుతుంటారు లేదంటే చూసే ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ అందిస్తుంటారు. ఈ మధ్య అలా వచ్చిన 'ద లాస్ట్ బస్' అనే చిత్రం మూవీ లవర్స్కి మంచి అనుభూతి ఇస్తూ తెగ నచ్చేస్తోంది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి విజయ్ ఆంటోనీ పొలిటికల్ థ్రిల్లర్)కథేంటి?అది 2018. అమెరికాలోని కాలిఫోర్నియా. కెవిన్ (మాథ్యూ మెక్ కొనాగే) స్కూల్ బస్ డ్రైవర్. ఇతడికి నడవలేని స్థితిలో ఉండే తల్లి, టీనేజ్ కొడుకు ఉంటారు. ఓ రోజు డ్యూటీలో భాగంగా పిల్లల్ని స్కూల్లో దింపేసి కెవిన్.. ఇంటికి తిరిగొచ్చే దారిలో ఉంటాడు. అప్పుడే ఆ ప్రాంతమంతా కార్చిచ్చు అంటుకుంటుంది. దీంతో స్కూల్లో ఉన్న 22 మంది పిల్లల్ని మరోచోటకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కెవిన్పై పడుతుంది. ఓవైపు ఊళ్లకు ఊళ్లు తగలబడిపోతుంటాయి. మరోవైపు కెవిన్.. ఈ పిల్లలందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించాలి? మరి కెవిన్ ఏం చేశాడు? చివరకు పిల్లలతో పాటు బతికి బయటపడ్డాడా లేదా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఈ సినిమాని నిజంగా జరిగిన సంఘటనల స్ఫూర్తితో తీశారు. 2018లో కాలిఫోర్నియాలో కార్చిచ్చులో 85 మంది చనిపోయారు. వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. వందలాది మంది నిరాశ్రయులు అయ్యారు. ఊళ్లకు ఊళ్లు బూడిదయ్యాయి. ఇదంతా జరుగుతున్న సమయంలోనే కెవిన్ అనే సాధారణ స్కూల్ బస్ డ్రైవర్.. ఊళ్లని తగలబెట్టేసే మంటల్ని దాటుకుని 22 మంది పిల్లల్ని సాహసోపేతంగా ఎలా కాపాడాడనేదే 'ద లాస్ట్ బస్' మూవీ.పేరుకే ఇది సినిమా. కానీ చూస్తున్నప్పుడు ఏ మాత్రం అలా అనిపించదు. చాలా రియలస్టిక్గా ఉంటుంది. మనం కూడా ఆ బస్సులోనే ఉన్నామా అని ఫీలింగ్ కలుగుతుంది. అసలు ఈ రేంజు విజువల్స్, గ్రాఫిక్స్ ఎలా తీశార్రా అని కచ్చితంగా సందేహం వస్తుంది. ఎందుకంటే ఏ ఒక్క సీన్ కూడా గ్రాఫిక్స్లా అనిపించదు. ఫస్టాప్ చూస్తున్నప్పుడు డాక్యుమెంటరీ ఫీలింగ్ వస్తుంది గానీ సెకండాఫ్కి వచ్చేసరికి సర్వైవల్ థ్రిల్లర్ జానర్లోకి వస్తుంది. తర్వాత ఏమవుతుందా అనే టెన్షన్ మనల్ని కుదురుగా కూర్చోనివ్వదు.ఏదైనా ఆపద వచ్చినప్పుడు 'ప్రెజెన్స్ ఆఫ్ మైండ్' అనేది చాలా కీలకం. ఇందులో బస్ డ్రైవర్ కెవిన్ ఆలోచన విధానం చూస్తే అదే గుర్తొస్తుంది. తొందరపడటం కంటే కొన్నిసార్లు ఏం చేయకుండా అలా ఉండటం కూడా ఒకందుకు మంచిదే అనేలా ఓ సీన్ ఉంటుంది. కానీ కార్చిచ్చు వీళ్ల దగ్గరకు కూడా వచ్చేసరికి మంటల్లోని బస్ పోనిచ్చే సీన్ అయితే ప్రీ క్లైమాక్స్లో గూస్ బంప్స్ తెప్పిస్తుంది. చివరకొచ్చేసరికి హ్యాపీ ఎండింగ్తోనే ముగించడం సంతోషం.సినిమాలో కనిపించిన నటీనటులు ఎవరూ మనకు తెలియదు. కానీ వాళ్లతో పాటు మనం కూడా ట్రావెల్ అవుతాం. అయితే సినిమాలో ఎమోషన్స్, డ్రామా లాంటివి ఇంకా పెట్టొచ్చు కానీ దర్శకుడు ఆ పనిచేయలేదు. అది మాత్రం కాస్త వెలితిగా అనిపిస్తుంది. సెప్టెంబరు 19న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కాగా.. అక్టోబరు 03 నుంచి ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఇంగ్లీష్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. కుటుంబంతోనూ చూడొచ్చు. ఒకవేళ మంచి సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ కావాలనుకుంటే మాత్రం దీన్ని అస్సలు మిస్ చేయొద్దు.- చందు డొంకాన(ఇదీ చదవండి: 'కురుక్షేత్ర' రివ్యూ.. ఓటీటీలో అస్సలు మిస్ అవ్వొద్దు) -
ఓటీటీలోకి విజయ్ ఆంటోనీ పొలిటికల్ థ్రిల్లర్
ఏడాదిలో కచ్చితంగా మూడు నాలుగు సినిమాలైన తీసే విజయ్ ఆంటోనీ.. ఈ ఏడాది ఇప్పటికే 'మార్గన్' అనే మూవీతో వచ్చాడు. థియేటర్లలో ఆడనప్పటికీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చింది. గత నెలలో 'భద్రకాళి' అనే డబ్బింగ్ బొమ్మతో వచ్చాడు. థియేటర్లలో దీనికి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. దీంతో ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది.(ఇదీ చదవండి: 'కురుక్షేత్ర' రివ్యూ.. ఓటీటీలో అస్సలు మిస్ అవ్వొద్దు)స్వతహాగా సంగీత దర్శకుడైన విజయ్ ఆంటోనీ.. 'బిచ్చగాడు'తో హిట్ కొట్టి తమిళంతో పాటు తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత చాలా సినిమాలు తీస్తున్నాడు గానీ వర్కౌట్ కావట్లేదు. ఇప్పుడు అరుణ్ ప్రభు దర్శకత్వంలో 'భద్రకాళి' అనే పొలిటికల్ థ్రిల్లర్ చేశాడు. ఇందులో హీరోగా నటించడంతో పాటు సంగీతం, నిర్మాణం కూడా విజయ్ ఆంటోనీదే. సెప్టెంబరు 5న ఈ చిత్రం థియేటర్లలోకి రాగా.. వచ్చే శుక్రవారం(అక్టోబరు 24) నుంచి హాట్స్టార్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు.'భద్రకాళి' విషయానికొస్తే.. కిట్టు (విజయ్ ఆంటోనీ) సెక్రటేరియట్లో ఓ పవర్ బ్రోకర్. ప్రభుత్వంలోని ఎలాంటి పని అయినా సరే చిటికలే చేసి పెడుతుంటాడు. అలా ఓసారి కేంద్ర మంత్రి లతకు సంబంధించిన రూ.800 కోట్ల భూముల వ్యవహారంలో వేలు పెడతాడు. అంతా సవ్యంగానే జరిగినా చివరలో ఓ ఎమ్మెల్యే హత్య జరగడం, దాని వల్ల లతకు రాజకీయంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఏం జరిగిందా అని ఆరా తీయగా.. కిట్టు గురించి, అతడు వెనకేసిన రూ.6,200 కోట్ల గురించి తెలుస్తుంది. అసలు కిట్టు ఎవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు) -
సస్పెన్స్కు తెర.. రూ.300 కోట్ల సినిమా ఓటీటీ ఫ్లాట్ఫామ్ ఫిక్స్!
కల్యాణి ప్రియదర్శన్ కీలక పాత్రలో వచ్చిన చిత్రం 'లోకా'. మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాని తెలుగులో 'కొత్త లోక' పేరుతో రిలీజ్ చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లు వసూళ్లు సాధించినట్లు ఇటీవలే పోస్టర్ పంచుకున్నారు మేకర్స్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ చిత్రం మలయాళంలో ఆగస్టు 28న రిలీజైంది. ఆ తర్వాత తెలుగులో ఒక రోజు ఆలస్యంగా విడుదలైంది. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా ఫర్వాలేదనిపించింది.అయితే ఈ సినిమా ఇప్పటి వరకు ఓటీటీకి రాలేదు. ఈ మూవీ రిలీజై 50 రోజులు కావొస్తోంది. పెద్ద పెద్ద సినిమాలే కేవలం నాలుగైదు వారాల్లోనే స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. అలాంటిది ఈ సినిమా ఇంకా ఓటీటీకి రాలేదు. ఈ మూవీ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలోనే ఓటీటీకి రానుందని వార్తలొచ్చినా అలాంటిదేం జరగలేదు. రూమర్స్ రావడంతో దుల్కర్ సైతం ఓటీటీ రిలీజ్పై క్లారిటీ ఇచ్చారు.తాజాగా కొత్త లోక స్ట్రీమింగ్ ఓటీటీ ఫ్లాట్ఫామ్ను రివీల్ చేశారు. జియో హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. త్వరలోనే రిలీజ్ తేదీని రివీల్ చేస్తామని పోస్టర్ పంచుకున్నారు. దీంతో కొత్త లోక మూవీ కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్లో సస్పెన్స్కు తెరపడింది. (ఇది చదవండి: హీరోయిన్కి సూపర్ పవర్స్ ఉంటే.. 'కొత్త లోక' రివ్యూ)కొత్త లోక కథేంటంటే..'లోక' విషయానికొస్తే.. చంద్ర (కల్యాణి ప్రియదర్శన్) సూపర్ పవర్స్ ఉన్న ఓ అమ్మాయి. ఈమె గురించి కొందరికి తెలుసు. ఓ సందర్భంలో చంద్ర, బెంగళూరు రావాల్సి వస్తుంది. తన పవర్స్ బయటపెట్టకుండా సాధారణ అమ్మాయిలా బతుకుతుంది. రాత్రిపూట ఓ కేఫ్లో పనిచేస్తుంటుంది. ఎదురింట్లో ఉంటే సన్నీ(నస్లేన్).. ఈమెని చూసి లవ్లో పడతాడు. పరిస్థితులు కలిసొచ్చి ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. కానీ ఓ రోజు రాత్రి జరిగిన సంఘటనల దెబ్బకు చంద్ర జీవితం తలకిందులవుతుంది. ఇంతకీ చంద్ర గతమేంటి? ఎస్ఐ నాచియప్ప(శాండీ)తో గొడవేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. The beginning of a new universe.Lokah Chapter 1: Chandra — coming soon on JioHotstar.@DQsWayfarerFilm @dulQuer @kalyanipriyan @naslen__ @NimishRavi @SanthyBee#Lokah #LokahChapter1 #Wayfarerfilms #DulquerSalmaan #DominicArun #KalyaniPriyadarshan #Naslen #SuperheroFantasy… pic.twitter.com/BMlsbEJM0q— JioHotstar Malayalam (@JioHotstarMal) October 14, 2025 -
ఎన్టీఆర్ వార్-2.. బాక్సాఫీస్ నో క్రేజ్.. ఓటీటీలో సూపర్ రికార్డ్!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చిత్రం వార్-2((War2 Movie)). ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ మూవీలో హృతిక్ రోషన్ కూడా నటించారు. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా.. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో ఆదిత్య చోప్రా నిర్మించారు. ఈ సినిమాలో గేమ్ ఛేంజర్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా మెప్పించింది.అయితే ప్రస్తుతం వార్-2 ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అక్టోబరు 09 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు వచ్చేసింది. తాజాగా ఈ చిత్రం డిజిటల్ ఫ్లాట్ఫామ్లో రికార్డ్ క్రియేట్ చేసింది. అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 12 వరకు ఇండియాలో అత్యధిక మంది వీక్షించిన సినిమాల జాబితాలో మొదటిస్థానంలో నిలిచింది. 3.5 మిలియన్ల వ్యూస్తో సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ క్రమంలోనే రజినీకాంత్ కూలీ, సన్ ఆఫ్ సర్దార్-2, మహావతార్ నర్సింహా, మదరాసి సినిమాలను దాటేసింది. ఈ విషయాన్ని ప్రముఖ ఆర్మాక్స్ మీడియా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.అయితే బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేని వార్-2 చిత్రానికి డిజిటల్ ఫ్లాట్ఫామ్లో మాత్రం ఆదరణ దక్కించుకుంటోంది. దీంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. ఈ చిత్రంలో అనిల్ కపూర్, అశుతోష్ రాణా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. Top 5 most-watched films on OTT in India, for the week of Oct 6-12, 2025, estimated based on audience researchNote: Estimated number of Indian audience (in Mn) who watched at least 30 minutes. pic.twitter.com/1a4ouoYh45— Ormax Media (@OrmaxMedia) October 13, 2025 -
ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
'దృశ్యం' సినిమా అనగానే చాలామందికి దర్శకుడు జీతూ జోసెఫ్ గుర్తొస్తాడు. ఎందుకంటే థ్రిల్లర్ జానర్లో ఈ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతడు ప్రస్తుతం మూడో పార్ట్ షూటింగ్తో బిజీగా ఉన్నాడు. అయితే జీతూ లేటెస్ట్ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కి సిద్దమైంది. ఇంతకీ ఈ థ్రిల్లర్ ఎప్పుడు ఓటీటీలోకి రానుంది? దీని సంగతేంటి అనేది చూద్దాం.జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'మిరాజ్'. అసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రలు పోషించారు. సెప్టెంబరు 19న రిలీజైన ఈ థ్రిల్లర్.. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంది. ఇప్పుడు దీన్ని అక్టోబరు 20 నుంచి అంటే వచ్చే సోమవారం నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటనతో పాటు వీడియో కూడా విడుదల చేశారు. తెలుగులోనూ ఈ మూవీ అందుబాటులోకి రానుంది.(ఇదీ చదవండి: 'కురుక్షేత్ర' రివ్యూ.. ఓటీటీలో అస్సలు మిస్ అవ్వొద్దు)'మిరాజ్' విషయానికొస్తే.. ప్రేమించి పెళ్లి చేసుకుందామని అనుకున్న కిరణ్ (హకీమ్ షాజహాన్) సడన్గా అభిరామి (అపర్ణ బాలమురళి).. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తుంది. అప్పుడే కిరణ్.. రైలు ప్రమాదంలో చనిపోయాడనే విషయం తెలిసి షాక్ అవుతుంది. దీని నుంచి తేరుకునేలోపు ఓ పోలీస్ ఆఫీసర్ (సంపత్ రాజ్), ఓ రౌడీ (శరవణన్), ఓ ప్రైవేట్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ (ఆసిఫ్ అలీ).. అభిరామిని హార్డ్ డిస్క్ కోసం ప్రశ్నించడం మొదలుపెడతారు. ఇంతకీ ఆ హార్డ్ డిస్క్లో ఏముంది? కిరణ్కి ఏమైంది? వీళ్లందరి సాయంతో అభిరామి.. ఈ ప్రమాదం నుంచి బయటపడిందా లేదా అనేది మిగతా స్టోరీ.ఇకపోతే ఈ వారం 24 వరకు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో కిష్కింధపురి, హౌ టూ ట్రైన్ యువర్ డ్రాగన్, ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్, సంతోష్ చిత్రాలతో పాటు ఆనందలహరి అనే తెలుగు సిరీస్ ఉన్నంతలో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. ఇవి కాకుండా వీకెండ్లో సడన్ సర్ప్రైజులు కూడా ఉండొచ్చు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు) -
దక్షిణ భారత కథలతో...
ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ సంస్థ ఆరు కొత్త తెలుగు, తమిళ ఒరిజినల్ సినిమాలు, వెబ్ సిరీస్లను సోమవారం ప్రకటించింది. వాటిలో భాగంగా ఆనంద్ దేవరకొండ హీరోగా దర్శకుడు వినోద్ అనంతోజు తెరకెక్కించనున్న తెలుగు చిత్రం ‘తక్షకుడు’. ఈ సినిమాలో ఆనంద్ అంధుడి పాత్రలో కనిపించనున్నారు. అదేవిధంగా సందీప్ కిషన్ హీరోగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో ఓ తెలుగు వెబ్ సిరీస్ రూ పొందనుంది.అలాగే ప్రియాంక మోహన్, పార్క్ హై–జిన్ ప్రధాన పాత్రల్లో రా కార్తీక్ దర్శకత్వంలో ‘మేడ్ ఇన్ కొరియా’ అనే తమిళ చిత్రం తెరకెక్కనుంది. అదేవిధంగా ఆర్. మాధవన్, నిమిషా సజయన్ ముఖ్య తారలుగా చారుకేశ్ శేఖర్ దర్శకత్వంలో ‘లెగసీ’ (తమిళం), గోమతి శంకర్ ప్రధాన పాత్రలో మిథున్ డైరెక్షన్లో ‘స్టీఫెన్’(తమిళం) చిత్రాలు, అర్జున్ దాస్, ఐశ్వర్య లక్ష్మి జంటగా బాలాజీ మోహన్ దర్శకత్వంలో ‘# లవ్’(తమిళం) అనే వెబ్ సిరీస్ రూ పొందనుంది. ‘‘పైన పేర్కొన్న సినిమాలు, సిరీస్ల ద్వారా దక్షిణ భారత భాషల్లోని కథలను ప్రోత్సహించడానికి మేము చాలా ఉత్సాహంగా ఉన్నాం’’ అని నెట్ఫ్లిక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మోనికా శెర్గిల్ పేర్కొన్నారు. -
'కురుక్షేత్ర' రివ్యూ.. ఓటీటీలో అస్సలు మిస్ అవ్వొద్దు
మొన్నటివరకు సినిమా అంటే కచ్చితంగా నటీనటులు ఉండాలి, భారీ బడ్జెట్ పెట్టాలనేది అందరికీ తెలిసిన విషయం. కానీ 'మహావతార్ నరసింహా'.. దీన్ని బ్రేక్ చేసింది. సరికొత్త ట్రెండ్కి శ్రీకారం చుట్టింది. మొత్తం యానిమేషన్తో తీసిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించింది. వందల కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ తరహా యానిమేషన్తో ఇప్పుడు మహాభారతంలోని కురుక్షేత్ర ఘట్టానికి దృశ్యరూపం ఇచ్చారు. అలా 'కురుక్షేత్ర' పేరుతో వెబ్ సిరీస్గా ఓటీటీలోకి వచ్చింది.(ఇదీ చదవండి: Bigg Boss 9: వైల్డ్ కార్డ్స్ చేతిలో 'పవర్'.. ఆరోవారం నామినేషన్స్ లిస్ట్)ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో తెలుగులోనూ ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఉజాన్ గంగూలీ దర్శకుడు. 18 రోజుల పాటు జరిగిన కురుక్షేత్ర యుద్ధాన్ని 18 ఎపిసోడ్స్గా తెరకెక్కించారు. ఛాప్టర్-1 పేరుతో ఇప్పుడు తొమ్మిది ఎపిసోడ్స్ రిలీజ్ చేయగా.. ఈనెల 24న మిగిలిన తొమ్మిది ఎపిసోడ్స్ విడుదల చేయనున్నారు. మరి 'కురుక్షేత్ర' తొలి సీజన్ ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.'కురుక్షేత్ర' కథేంటి?అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసిన తర్వాత పాండవులకు ఇచ్చిన మాట ప్రకారం కౌరవులు.. రాజ్యంలో వాటా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మాట తప్పుతారు. ఐదుగురికి ఐదు ఊళ్లు ఇవ్వడానికి కూడా నిరాకరిస్తారు. కృష్ణుడి సూచన మేరకు పాండవులు ఓపిగ్గానే ఉంటారు. సంజయుడితో కౌరవులకు రాయబారం పంపిస్తారు. కానీ అది విఫలమవుతుంది. కౌరవులు.. యుద్ధం పట్ల ఉత్సాహంగా ఉన్నారనే విషయం పాండవులకు తెలుస్తుంది. దీంతో కృష్ణుడు, అర్జునుడు వైపు.. కృష్ణుడి సైన్యం దుర్యోధనుడికి దక్కుతుంది. అలా 'కురుక్షేత్రం' మొదలవుతుంది. ఆయుధాలే పట్టనని అనుకున్న అర్జునుడు.. కృష్ణుడి గీతోపదేశం తర్వాత ఎలా మారాడు? ఈ యుద్ధంలో అసలేం జరిగిందనేది అసలు కథ?ఎలా ఉందంటే?మహాభారతం అంతులేని సబ్జెక్ట్. ఎంత చెప్పినా అస్సలు తరగదు. దీనిపై ఇప్పటికే పలు సినిమాలు, సీరియల్స్ వచ్చాయి. జనాలని అలరించాయి. నెట్ఫ్లిక్స్ మాత్రం 18 రోజుల పాటు జరిగిన యుద్ధాన్ని మాత్రమే తీసుకుని ఈ 'కురుక్షేత్ర' సిరీస్ తీసింది. ఒక్కముక్కలో చెప్పాలంటే అదిరిపోయింది. ముందే యానిమేటెడ్ సిరీస్ అని చెప్పేశారు కాబట్టి ఓ అంచనా ఉంటుంది. దాన్ని అందుకోవడంలో ఏ మాత్రం తగ్గలేదు. గ్రాఫిక్స్, తెలుగు డబ్బింగ్, కథని చెప్పే విధానం.. ఇలా ప్రతిదీ టాప్ రేంజులో ఉన్నాయి.(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'హృదయపూర్వం' సినిమా రివ్యూ (ఓటీటీ))అయితే ఉన్నది ఉన్నట్లు చెబితే చూసే ప్రేక్షకుడికి బోర్ కొట్టొచ్చు. అందుకే ఓవైపు యుద్ధాన్ని చూపిస్తూనే మరోవైపు ఫ్లాష్ బ్యాక్స్ కూడా చూపిస్తూ ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించారు. కౌరవుల దగ్గరకెళ్లి సంజయుడి రాయబారం చేసే సీన్స్తో తొలి ఎపిసోడ్ మొదలవుతుంది. రెండో ఎపిసోడ్కి యుద్ధం ప్రారంభమైపోతుంది. అక్కడి నుంచి భీష్ముడి మరణం, పద్మవ్యూహంలో బంధించి అభిమన్యుడిని కౌరవులు చంపడం, జయద్రధుడిని అర్జునుడు సంహరించే సీన్.. ఇలా గూస్ బంప్స్ ఇచ్చే సన్నివేశాలతో ఆద్యంతం అలరించేలా తీశారు.మహాభారతంలో పాత్రలు చాలా ఉంటాయి. వాటిని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. కానీ ఈ సిరీస్లో చాలా సులభంగా గుర్తుపెట్టుకునేలా అన్ని పాత్రల్ని తీర్చిదిద్దారు. ఎలాంటి సాగదీత లేకుండా క్లియర్ కట్గా సీన్స్ అన్ని చూపించారు. కాస్ట్యూమ్స్ గానీ కోటలు, రాజభవనాలు గానీ.. యుద్ధ సన్నివేశాలు గానీ ప్రతిదీ టాప్ క్వాలిటీతో తెరకెక్కించారు. తెలుగు డబ్బింగ్ కూడా ఫెర్ఫెక్ట్గా ఉంది. ఇప్పటి జనరేషన్కి మహాభారతం, కురుక్షేత్రం గురించి అస్సలు తెలియకపోవచ్చు. వాళ్లు గానీ ఈ సిరీస్ చూస్తే థ్రిల్ కావడంతో పాటు చాలా విషయాలు తెలుసుకుంటారు కూడా!ఈ సిరీస్లో మిగిలిన పాత్రల సంగతేమో గానీ కర్ణుడు పాత్ర చూస్తున్నప్పుడు మాత్రం ప్రభాస్ పోలికలు కనిపిస్తాయి. మరి మేకర్స్ కావాలని పెట్టారా లేదంటే అలా కుదిరేసిందో? ఏదేమైనా రీసెంట్ టైంలో 'మహాభారతం' ఆధారంగా సినిమాలు గానీ సిరీస్లు గానీ రాలేదు. ఓ రకంగా ఈ విషయం ఈ సిరీస్కి చాలా ప్లస్ పాయింట్. టైమ్ ఉంటే మాత్రం ఓటీటీలో ఉన్న ఈ జెమ్ని అస్సలు మిస్ కావొద్దు- చందు డొంకాన(ఇదీ చదవండి: ప్రతి 10 నిమిషాలకో ట్విస్ట్.. ఓటీటీలో పక్కా చూడాల్సిన సినిమా) -
కొత్త తెలుగు సినిమాలు.. డైరెక్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్
ఇప్పుడంతా ఓటీటీల జమానా నడుస్తోంది. థియేటర్లకు వెళ్లే జనాలు వెళ్తూనే ఉన్నారు. కాకపోతే చాలామంది.. ఓటీటీలో రిలీజైన తర్వాతే మొబైల్ లేదా టీవీల్లో కొత్త సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు సంస్థలు కూడా కేవలం ఓటీటీల్లో కొన్నింటిని నేరుగా విడుదల చేస్తున్నాయి. ఇప్పుడు అలానే నెట్ఫ్లిక్స్ సంస్థ తమ దానిలో రాబోయే పలు తెలుగు, తమిళ చిత్రాలు, వెబ్ సిరీసుల గురించి అధికారిక ప్రకటన చేసింది.'ఓజీ'తో రీసెంట్గా హిట్ కొట్టిన ప్రియాంక మోహన్ చేసిన తమిళ మూవీ 'మేడ్ ఇన్ కొరియా'. గత కొన్నాళ్ల నుంచి కొరియన్ చిత్రాలు, సిరీస్లకు చాలామంది అమ్మాయిలు ఫ్యాన్స్ అయిపోతున్నారు. అలాంటి ఓ అమ్మాయి కొరియా వెళ్లిన తర్వాత ఏం జరిగిందనే కాన్సెప్ట్తో ఈ సినిమా తీసినట్లు కనిపిస్తుంది. ఆర్ఏ కార్తీక దీనికి దర్శకుడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు)ఆనంద్ దేవరకొండ, 'లాపతా లేడీస్' ఫేమ్ నితాన్షీ గోయల్ జంటగా నటించిన సినిమా 'తక్షకుడు'. వేటగాడి చరిత్రలో జింకపిల్లలే నేరస్థులు అనే ట్యాగ్ లైన్తో రాబోతుంది. పోస్టర్ చూస్తుంటే ఇదో రూరల్ బ్యాక్ డ్రాప్లో జరిగే యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. గతంలో ఆనంద్ దేవరకొండతోనే 'మిడిల్ క్లాస్ మెలోడీస్' అనే మూవీ తీసిన వినోద్ అనంతోజు దీనికి దర్శకుడు.సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు సిరీస్ 'సూపర్ సుబ్బు'. మిథిలా పాల్కర్, మురళీ శర్మ ఇతర పాత్రలు చేస్తున్నారు. ఓ టీచర్.. పల్లెటూరికి వెళ్లి స్కూల్లో పిల్లలకు సె*క్స్ ఎడ్యుకేషన్ నేర్పించాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేది ఫన్నీగా చూపించబోతున్నారు. ఎనిమిది నెలల క్రితం ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఈ చిత్రాలన్నీ కూడా త్వరలో నెట్ఫ్లిక్స్లో మాత్రమే స్ట్రీమింగ్ కాబోతున్నాయని చెప్పారు. మరి ఈ ఏడాదిలోనే రిలీజ్ చేస్తారా? వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకొస్తారా అనేది చూడాలి.(ఇదీ చదవండి: Bigg Boss 9: ఫ్లోరా ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతంటే?) -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు
వచ్చేవారం మొదట్లోనే దీపావళి పండగ ఉంది. దీంతో ఈ వీకెండ్ నాలుగు తెలుగు సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. వీటిలో మిత్రమండలి, తెలుసు కదా, డ్యూడ్, కె ర్యాంప్ చిత్రాలు ఉన్నాయి. వీటన్నింటిపైనా కాస్తోకూస్తో బజ్ ఉండనే ఉంది. మరోవైపు ఓటీటీల్లోనూ 24 వరకు కొత్త మూవీస్-వెబ్ సిరీసులు అందుబాటులోకి రానున్నాయి. వీటిలోనూ చూడదగ్గ చిత్రాలు కొన్ని ఉన్నాయండోయ్.(ఇదీ చదవండి: ఫ్లోరా ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతంటే?)ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోయే వాటిలో కిష్కింధపురి, హౌ టూ ట్రైన్ యువర్ డ్రాగన్, ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్, సంతోష్ చిత్రాలతో పాటు ఆనందలహరి అనే తెలుగు సిరీస్ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తోంది. ఇవి కాకుండా వీకెండ్లో సడన్ సర్ప్రైజులు కూడా ఉండొచ్చు. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందంటే?ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే మూవీస్ (అక్టోబరు 13 నుంచి 19 వరకు)హాట్స్టార్హౌ టూ ట్రైన్ యువర్ డ్రాగన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబరు 13ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్ లైన్స్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - అక్టోబరు 16స్ట్రైకింగ్ రెస్క్యూ (చైనీస్ మూవీ) - అక్టోబరు 16నెట్ఫ్లిక్స్ఎవ్రిబడి లవ్స్ మూవీ వెన్ ఐయామ్ డెడ్ (థాయ్ సినిమా) - అక్టోబరు 14ఇన్సైడ్ ఫ్యూరియోజా (పోలిష్ మూవీ) - అక్టోబరు 15బ్యాడ్ షబ్బోస్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 16ద టైమ్ దట్ రిమైన్స్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 16ద ట్విట్స్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 1627 నైట్స్ (స్పానిష్ మూవీ) - అక్టోబరు 17గుడ్ న్యూస్ (కొరియన్ సినిమా) - అక్టోబరు 17గ్రేటర్ కాలేష్ (హిందీ సిరీస్) - అక్టోబరు 17షీ వాక్స్ ఇన్ డార్క్నెస్ (స్పానిష్ సినిమా) - అక్టోబరు 17ద ఫెర్ఫెక్ట్ నైబర్ (ఇంగ్లీష్ చిత్రం) - అక్టోబరు 17అమెజాన్ ప్రైమ్కల్ప నేస్ట్రా (స్పానిష్ మూవీ) - అక్టోబరు 16ఆహాఆనందలహరి (తెలుగు సిరీస్) - అక్టోబరు 17జీ5కిష్కింధపురి (తెలుగు సినిమా) - అక్టోబరు 17భగవాన్ ఛాప్టర్ 1: రాక్షస్ (హిందీ మూవీ) - అక్టోబరు 17ఎలుమలే (కన్నడ సినిమా) - అక్టోబరు 17మేడమ్ సేన్ గుప్తా (బెంగాలీ మూవీ) - అక్టోబరు 17అభయంతర కుట్టవాళి (మలయాళ సినిమా) - అక్టోబరు 17సన్ నెక్స్ట్ఇంబమ్ (మలయాళ మూవీ) - అక్టోబరు 17ఆపిల్ ప్లస్ టీవీలూట్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 15లయన్స్ గేట్ ప్లేసంతోష్ (హిందీ సినిమా) - అక్టోబరు 17వుయ్ లివ్ ఇన్ టైమ్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 17(ఇదీ చదవండి: నాలుగేళ్లుగా శ్రీనివాస్తోనే.. నరకం చూడని రోజంటూ లేదు: మాధురి) -
ఓటీటీలో ‘జురాసిక్ వరల్డ్: ఖోస్ థియరీ’ ఫైనల్ స్ట్రీమింగ్
జురాసిక్ పార్క్ ఫ్రాంచైజీలో ఫైనల్ సిరీస్ "జురాసిక్ వరల్డ్: ఖోస్ థియరీ" ఓటీటీలో విడుదల కానుంది. సైన్స్ ఫిక్షన్ యానిమేటెడ్ సిరీస్గా నెట్ఫ్లిక్స్లో నవంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ సిరీస్ డైనోసార్లు మనుషుల ప్రపంచంలోకి వచ్చిన తర్వాత జరిగే సంఘటనల గురించి తెలియజేస్తుంది. మొదటి సీజన్లో, బ్రూక్లిన్, సోయోనా శాంటోస్ వంటి పాత్రలు కీలకంగా వ్యవహరిస్తాయి. ఇందులో కూడా వారు కొనసాగనున్నారు. ఈ సిరీస్ ప్రధానంగా వినోదం, స్నేహం, డైనోసార్ల గురించి ఉంటుంది. "జురాసిక్ పార్క్" ఫ్రాంచైజీలో భాగం, డ్రీమ్వర్క్స్ యానిమేషన్ ద్వారా ఈ సిరీస్ను తెరకెక్కించారు. -
ఓటీటీలో సూపర్ హీరో సినిమా.. ఎలా ఉందంటే?
టైటిల్: మిన్నల్ మురళినటీనటులు- టొవినో థామస్,గురు సోమసుందరం, అజు వర్గీస్, సాజన్సంగీతం: సుశీన్ శ్యామ్, షాన్ రెహమాన్సినిమాటోగ్రఫీ: సమీర్ తాహిర్ఎడిటింగ్: లివింగ్స్టోన్ మాథ్యూదర్శకత్వం: బాసిల్ జోసెఫ్ఓటీటీ: నెట్ఫ్లిక్స్ఓటీటీల్లో చిత్రాలకు ఆడియన్స్ నుంచి విపరీతమైన క్రేజ్ ఉంటోంది. భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఆదరిస్తున్నారు. మరీ ముఖ్యంగా మలయాళ చిత్రాలకైతే ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. అలా వచ్చి ఓటీటీలో సూపర్ హిట్గా నిలిచిన మిన్నల్ మురళి సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.సినీ ఇండస్ట్రీలో గతంలో సూపర్ మ్యాన్ తరహాలో చాలా సినిమాలొచ్చాయి. ఇలాంటి చిత్రాలకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఈ చిత్రాలు ఎక్కువగా హాలీవుడ్, బాలీవుడ్లోనే ఎక్కువగా వస్తుంటాయి. అయితే మలయాళ సినీ పరిశ్రమ ప్రేక్షకులకు ఆ స్థాయి ఎక్స్పీరియన్స్ వచ్చే సినిమాను తీసుకొచ్చింది. టొవినో థామస్ ప్రధాన పాత్రలో వచ్చిన మిన్నల్ మురళి ఓటీటీ ప్రియులను ఆకట్టుకుంది. అసలు మిన్నల్ మురళి కథేంటి? అతను సూపర్ హీరో ఎలా అయ్యాడో చూసేద్దాం.మిన్నల్ మురళి కథేంటంటే..అనంతపురంలోని ఉరవకొండ గ్రామంలో నివసించే జేసన్ (టొవినో థామస్ ఓ టైలర్. కానీ చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో ఓ పెద్దాయన అతన్ని చేరదీస్తాడు. అతని జీవిత లక్ష్యం అమెరికా వెళ్లడమే. అందుకు సంబంధించిన ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే క్రమంలో పోలీస్ ఆఫీసర్ కూతురిని ప్రేమించి విఫలమవుతాడు. అయితే అదే గ్రామంలో హోటల్లో పని చేసే శిబు (గురు సోమసుందరం), జేసన్ (టోవినో థామస్) ఒకరోజు మెరుపు దాడి(పిడుగుపాటు) గురవుతారు. ఆ సమయంలో వీరిద్దరికీ ఊహించని శక్తులు వస్తాయి. మరీ ఆ శక్తులను వాళ్లు ఎలా ఉపయోగించారు? మంచి కోసం వాడారా? వీరి వల్ల ఆ గ్రామ ప్రజలు ఎందుకు ఇబ్బందులు పడ్డారు? అన్నది తెలియాలంటే మిన్నల్ మురళి చూడాల్సిందే.ఎలా ఉందంటే..సూపర్ హీరో ఒక్కరే ఉంటే.. అతను విలన్ అంతం చేయడమనేది ఉంటుంది. కానీ ఇద్దరికీ ఓకే రకం పవర్స్ ఉంటే సరాసరి పోరాటం ఉంటుంది. అదే ఈ మిన్నల్ మురళి. తెరపై ఇద్దరు సూపర్ హీరోలు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హాలీవుడ్లో మార్వెల్, డీసీ కామిక్స్ లాంటి ఎందరో సూపర్ హీరోలను మనం చూశాం. కానీ ఇండియా సినీ చరిత్రలో ఇద్దరు సూపర్ హీరోల పాత్రలు అరుదనే చెప్పలి. జేసన్ తన అమెరికా కల కోసం పోరాటం.. శిబు తన ప్రియురాలి కోసం ఆరాటం.. ఈ క్రమంలోనే తమ సూపర్ పవర్ని ఎలా ఉపయోగించారనే స్టోరీని అద్భుతంగా తెరకెక్కించాడు బాసిల్ జోసెఫ్.ఈ సూపర్హీరో కథను ఇండియన్ ఆడియన్స్కు అర్థమయ్యేలా రూపొందించడంలో బాసిల్ జోసెఫ్ సక్సెస్ అయ్యారు. ఈ మూవీలో జేసన్ కంటే శిబు పాత్ర హైలెట్గా అనిపిస్తుంది. లేటు వయసులో తన ప్రియురాలి కోసం చేసే పోరాటం ఎమోషనల్గా టచ్ చేస్తుంది. కానీ శిబు లవ్ స్టోరీ మాత్రం ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టిస్తుంది. చివరికీ క్లైమాక్స్లో ఇద్దరు సూపర్ హీరోల పోరాటం సీట్ నుంచి కదలకుండా చేస్తుంది. ఇద్దరు సూపర్ హీరోలను ఒకరికి తెలియకుండా ఒకరి కథను తీసుకెళ్లిన విధానం బాగుంది. ఈ సూపర్ హీరోల స్టోరీలో ఎమోషనల్ టచ్ ఇవ్వడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే కథ నెమ్మదిగా సాగడం.. కొన్ని సీన్స్ ముందుగానే ప్రేక్షకులు ఊహించేలా ఉండడం మైనస్.ఎవరెలా చేశారంటే..మలయాళ హీరో టొవినో థామస్ గురించి చెప్పాల్సిన పనిలేదు. సూపర్హీరో పాత్రలో టొవినో ఒదిగిపోయాడు. మరో సూపర్ హీరో గురు సోమసుందరం శిబు పాత్రలో మెప్పించాడు. ఇతర నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా ఫర్వాలేదు. సుశీన్ నేపథ్య సంగీతం.. సమీర్ సినిమాటోగ్రఫీని ఓకే అనిపించాయి. ఈ వీకెండ్ ఓటీటీల్లో సినిమా చూసేవారు మిన్నల్ మురళిపై ఓ లుక్కేయొచ్చు. -
ఓటీటీల్లోకి వచ్చిన 37 సినిమాలు.. ఈ వీకెండ్ పండగే
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి పలు చిన్న సినిమాలు వచ్చాయి గానీ ఒక్కదానికి కూడా పాజిటివ్ టాక్ రాలేదు. మరోవైపు ఓటీటీల్లో మాత్రం ఈ శుక్రవారం(అక్టోబరు 10).. 35కి పైగా కొత్త మూవీస్-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్లోకి వచ్చేశాయి. (ఇదీ చదవండి: అక్క- బావ కాళ్లకు మొక్కిన నార్నె నితిన్.. వీడియో వైరల్)వీటిలో వార్ 2, మిరాయ్, లీగల్లీ వీర్, గది, త్రిబాణధారి బార్బరిక్ తదితర తెలుగు సినిమాలతో పాటు పరమ్ సుందరి అనే హిందీ మూవీ.. కురుక్షేత్ర, సెర్చ్ అనే తెలుగు డబ్బింగ్ సిరీస్లు ఉన్నంతలో ఆకట్టుకుంటున్నాయి. తెలుగువి మాత్రమే చూద్దామనుకుంటే వీటిని ట్రై చేయొచ్చు. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే?అమెజాన్ ప్రైమ్గది - తెలుగు సినిమాత్రిబాణధారి బార్బరిక్ - తెలుగు చిత్రంపరమ్ సుందరి - హిందీ మూవీబాంబ్ - తమిళ సినిమారిప్పన్ స్వామి - కన్నడ మూవీఎడ్ షరీన్ - ఇంగ్లీష్ సిరీస్ఎల్లిగే పయన ఎవుదో దారి - కన్నడ మూవీజాన్ క్యాండీ - ఇంగ్లీష్ సినిమాద హోమ్ - ఇంగ్లీష్ మూవీథిక్కర్ దాన్ వాటర్ - నైజీరియన్ సినిమాహాట్స్టార్మిరాయ్ - తెలుగు సినిమా9-1-1 సీజన్ 9 - ఇంగ్లీష్ సిరీస్గ్రేస్ అనాటమీ సీజన్ 22 - ఇంగ్లీష్ సిరీస్సెర్చ్: ద నైనా మర్డర్ కేస్ - తెలుగు డబ్బింగ్ సిరీస్సోలార్ ఆపోజిట్ సీజన్ 1-3 - ఇంగ్లీష్ సిరీస్టీమ్ మెక్బట్స్: ఎనిమల్ రెస్క్యూ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్నెట్ఫ్లిక్స్వార్ 2 - తెలుగు డబ్బింగ్ మూవీకురుక్షేత్ర - తెలుగు డబ్బింగ్ సిరీస్మై ఫాదర్ ద బీటీకే కిల్లర్ - ఇంగ్లీష్ సినిమాస్విమ్ టూ మీ - స్పానిష్ మూవీద చూజన్ - ఇంగ్లీష్ సిరీస్ద ఉమన్ ఇన్ కాబిన్ 10 - ఇంగ్లీష్ సినిమాఓల్డ్ మనీ - టర్కిష్ సిరీస్సన్ నెక్స్ట్రాంబో - తమిళ మూవీజీ5ఏ మ్యాచ్ - మరాఠీ సినిమాఅక్షర్ధమ్ - హిందీ మూవీవెదువన్ - తమిళ సిరీస్ఆహాగంధి కన్నడి - తమిళ సినిమామనోరమ మ్యాక్స్సాహసం - మలయాళ మూవీవన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వజ్ ఏ కల్లన్ - మలయాళ సినిమాఆపిల్ టీవీ ప్లస్నైఫ్ ఎడ్జ్ - ఇంగ్లీష్ సిరీస్ద లాస్ట్ ఫ్రంటియర్ - ఇంగ్లీష్ సిరీస్బుక్ మై షోవాళియే - కన్నడ సినిమాఎమ్ఎక్స్ ప్లేయర్జమ్నపార్ సీజన్ 2 - హిందీ సిరీస్వెడ్డింగ్ ఇంపాజిబుల్ - తెలుగు డబ్బింగ్ సిరీస్లయన్స్ గేట్ ప్లేలీగల్లీ వీర్ - తెలుగు మూవీఇన్టూ ద డీప్ - తెలుగు డబ్బింగ్ సినిమా(ఇదీ చదవండి: మొన్న విజయ్..నేడు రష్మిక.. అలా బయటపెట్టేశారుగా!) -
ఓటీటీలోకి సెడెన్గా వచ్చేసిన 'జాన్వీ కపూర్' సినిమా
రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో సిద్ధార్థ్ మల్హోత్రా( Sidharth Malhotra), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా నటించిన హిందీ చిత్రం ‘పరమ్ సుందరి’(Param Sundari). ఎలాంటి ప్రకటన లేకుండానే సడెన్గా ఓటీటీలోకి ఈ చిత్రం వచ్చేసింది. ఆగష్టు 29న విడుదలైన ఈ చిత్రం కేరళ ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ అనుకున్నంత రేంజ్లో బాలీవుడ్లో కూడా మెప్పించలేదు. కానీ, కలెక్షన్స్ పరంగా మాత్రం పర్వాలేదనిపించింది. తుషార్ జలోటా దర్శకత్వం వహించగా దినేష్ విజన్ నిర్మించారు.‘పరమ్ సుందరి’ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన మాత్రమే అందుబాటులో ఉంది. పరమ్ సుందరిని చూడాలంటే రూ.349 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మూవీలో కేరళ అమ్మాయిగా జాన్వీ, ఢిల్లీ అబ్బాయిగా సిద్ధార్థ్ కనిపించారు. ఉత్తరాదికి చెందిన హీరోయిన్ను మలయాళ యువతిగా చూపించడంపై కేరళలో కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. దానికి జాన్వీ కూడా వివరణ ఇచ్చింది. మలయాళ సంస్కృతి అంటే తనకు చాలా ఇష్టమని పేర్కొంది. ఈ చిత్రంలో తమిళ యువతిగా కూడా ఆమె కనిపిస్తుంది. రూ. 60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 90 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. -
ఓటీటీలో హిట్ సినిమా'కిష్కింధపురి'.. స్ట్రీమింగ్ ప్రకటన
బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన హారర్ సినిమా 'కిష్కింధపురి'(Kishkindhapuri ) ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ చిత్రం భారీ విజయం సొంతం చేసుకోవడంతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించికుంది. దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ దుమ్మురేపింది.'కిష్కింధపురి' చిత్రం జీ5 వేదికగా అక్టోబర్ 17 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ఒక పోస్టర్ను విడుదల చేశారు. అయితే, సాయంత్రం 6 గంటల నుంచి స్ట్రీమింగ అవుతుందని ఆ సంస్థ పేర్కొంది. ఆపై అక్టోబర్ 19 సాయంత్రం జీ టీవీలో ఈ మూవీని ప్రదర్శించనున్నట్లు ప్రకటించింది. సుమారు రూ. 20 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 30 కోట్లకు పైగానే రాబట్టింది. ఇప్పుడు ఓటీటీ ఢీల్ కూడా భారీ ధరకే కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఏదేమైన బెల్లంకొండ శ్రీనివాస్ , అనుపమ పరమేశ్వరన్ మరోసారి మ్యాజిక్ చేశారని చెప్పవచ్చు.కథేంటి?రాఘవ్ (బెల్లంకొండ శ్రీనివాస్), మైథిలి (అనుపమ పరమేశ్వరన్) ప్రేమికులు. మరో స్నేహితుడితో కలిసి ఘోస్ట్ వాకింగ్ టూర్స్ చేస్తుంటారు. దీనికి బయట నుంచి కొందరు వ్యక్తులు వస్తుంటారు. వీళ్లందరూ కలిసి జన సంచారం లేని కొన్ని ప్రదేశాలకు వెళ్తుంటారు. ఓ సందర్భంలో 'సువర్ణమాయ' అనే పాడుబడ్డ రేడియో స్టేషన్కి 11 మంది వెళ్తారు. కానీ అక్కడికి వెళ్లొచ్చిన తర్వాత ఊహించని రీతిలో ముగ్గురు చనిపోతారు. అనంతరం ఈ బృందంలోని ఓ చిన్నారి.. దెయ్యానికి టార్గెట్ అవుతుంది. ఇంతకీ వీళ్లని చంపుతున్న దెయ్యం ఎవరు? రాఘవ ఏం చేశాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. -
మహారాణి మళ్లీ వస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చాక వెబ్ సిరీస్లకు విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. క్రైమ్ థ్రిల్లర్ వాటికైతే ఎక్కువమంది ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. వీటితో పాటు పొలిటికల్ థ్రిల్లర్స్కు సైతం విశేష ప్రేక్షకాదారణ ఉంటోంది. అలా రాజకీయ కోణంలో వచ్చి.. సూపర్ హిట్గా నిలిచిన పొలిటికల్ సిరీస్ మహారాణి(Maharani Season4). ఇప్పటికే మూడు సీజన్స్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుంది. తాజాగా మరో సీజన్ స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది.బాలీవుడ్ స్టార్ హ్యుమా ఖురేషీ (Huma Qureshi) ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. చదువు రాని ఓ గృహిణి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన రాణి భారతి (హ్యుమా ఖురేషి) జీవిత ప్రయాణాన్ని ఇందులో చూపించారు. ఈ వెబ్ సిరీస్కు పునీత్ ప్రకాశ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా మహారాణి సీజన్ 4 స్ట్రీమింగ్ డేట్ను అనౌన్స్ చేశారు. నవంబర్ 7వ తేదీ నుంచి సోని లివ్లో ప్రసారం కానుందంటూ ట్రైలర్ను షేర్ చేశారు మేకర్స్.తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచింది. ఎలాంటి భయం లేకుండా ఉండే ముఖ్యమంత్రి రాణి భారతిగా హ్యుమా ఖురేషి తన రాష్ట్ర ప్రజలను కాపాడుకోవటానికి ఎంత దూరమైనా వెళ్లే పవర్ఫుల్ పాత్రలో అలరించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త సీజన్లో రాణి భారతి పాట్నాను వదిలి.. ఢిల్లీ రాజకీయాలకు వెళ్లనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. The lioness returns to defend her home! Rani gears up for her biggest battle yet.#Maharani4 streaming from 7th Nov only on Sony LIV#MaharaniOnSonyLIV pic.twitter.com/Xzkt7owqrp— Sony LIV International (@SonyLIVIntl) October 9, 2025 -
'అర్జున్ దాస్, శివాత్మిక'ల సినిమా ఆరు ఓటీటీల్లో స్ట్రీమింగ్
తమిళ నటుడు అర్జున్ దాస్, రాజశేఖర్ కూతురు శివాత్మిక నటించిన 'బాంబ్' సినిమా ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. విశాల్ వెంకట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కోలీవుడ్లో సెప్టెంబర్ 12న విడుదలై మంచి విజయం సాధించింది. కాళి వెంకట్, నాజర్, అభిరామి, సింగంపులి, బాలశరవణన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. పాజిటివ్ టాక్స్తో రన్ అయిన ఈ మూవీకి 8.2 ఐఎండీబీ రేటింగ్తో గుర్తింపు పొందింది.‘బాంబ్’ సినిమా ఏకంగా ఆరు ఓటీటీలలోకి రాబోతుంది. అమెజాన్ ప్రైమ్, ఆహా తమిళ్, సింప్తీ సౌత్, షార్ట్ఫ్లిక్స్, బ్లాక్షీప్, బ్రియో వంటి సంస్థలలో అక్టోబర్ 10న విడుదల కానుంది. అర్జున్ దాస్, శివాత్మిక రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ థ్రిల్లర్ మూవీ సరికొత్త కథతో మెప్పించింది.బాంబ్ సినిమా ఓ థ్రిల్లర్ కాన్సెప్ట్తో ఉంటుంది. ఒకే గ్రామం కాలపట్టి, కమ్మైపట్టి అనే రెండు చిన్న గ్రామాలుగా విడిపోయి గొడవలు పడుతుంటారు. ఆ గ్రామంలో దేవుణ్ని నమ్మని కతిరావన్ (కాళీ వెంకట్) అనుకోకుండా చనిపోతాడు. అయితే, అతణ్ని రెండు గ్రామాల మధ్యలో ఉన్న ఒక చెట్టు దగ్గర కూర్చోబెడుతారు. కానీ మణిముత్తు (అర్జున్ దాస్) మాత్రం తన ఫ్రెండ్ కతిరావన్ చనిపోలేదని నమ్ముతాడు. కానీ, మిగిలిన వారందరూ అతడు చనిపోయాడనుకుని ఏడుస్తుంటే.. అతడు సడన్గా అపానవాయువు(Fart) వదులుతుంటాడు. దీంతో అతడు చనిపోయాడా లేదా అనే ఆందోళనలో గ్రామస్థులు ఉంటారు. ఇంతకూ అతను చనిపోయాడా లేదా.. ఒకవేళ చనిపోతే అలా ఎందుకు చేస్తున్నాడు అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. -
OTT: ఓటీటీలో దూసుకెళ్తున్న తెలుగు హారర్ మూవీ
కొన్ని సినిమాలు థియేటర్స్లో కంటే ఓటీటీలోనే ఎక్కువ బాగా ఆడతాయి. ముఖ్యంగా చిన్న సినిమాలకు ఓటీటీ వరంలా మారింది. కంటెంట్ ఉంటే చాలు.. కాస్టింగ్ని పట్టించుకోకుండా సినిమాను ఆదరిస్తున్నారు. ఇప్పటికే పలు చిన్న చిత్రాలు ఓటీటీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ తెలుగు హారర్ సినిమా కూడా ఓటీటీలో రిలీజై సూపర్ హిట్గా నిలిచింది. అదే ‘బకాసుర రెస్టారెంట్’(Bakasura Restaurant ). పలు సినిమాల్లో కమెడియన్గా నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ ఈ చిత్రంలో లీడ్ రోల్ చేశాడు. ఈ ఏడాది ఆగస్ట్లో థియేటర్స్లో రిలీజై మంచి టాక్ని సంపాదించుకున్న ఈ చిత్రం..ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న టాప్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. కన్నప్ప, పరద, కూలి లాంటి సినిమాలను సైతం వెనక్కి నెట్టి, వరుసగా 24 రోజులుగా టాప్ 10లోనే ఉండడం గమనార్హం. అంతేకాదు ఇప్పటికే 250 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిందంటే.. ఈ సినిమాను ఓటీటీ ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చను.పెద్ద సినిమాల నడుమ నిలబడటం చాలా కష్టమని అందరూ అనుకునే పరిస్థితిలో, బకాసుర రెస్టారెంట్ మాత్రం ఆ అపోహను చెరిపేసింది. కంటెంట్ బలం ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే విషయాన్ని మరొకసారి నిరూపించింది.కథేంటంటే..పరమేశ్వర్(ప్రవీణ్) ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నలుగురు స్నేహితులతో కలిసి ఓ రూమ్లో ఉంటూ ఇష్టం లేకపోయినా డబ్బుల కోసం ఆ జాబ్ చేస్తుంటాడు. ఎప్పటికైనా ఓ రెస్టారెంట్ పెట్టాలనేది ఆయన కోరిక. ఓ సారి తన కోరికనే స్నేహితులతో పంచుకోగ.. డబ్బుల కోసం యూట్యూబ్ లో ఘోస్ట్ వీడియోలు చేద్దామని సలహా ఇస్తారు. అనుకున్నట్లే మొదటి వీడియో బాగా వైరల్ అవుతుంది. రెండో వీడియో కోసం ఓ హోస్ట్ హౌస్కి వెళ్తారు. అక్కడ వీరికి ఒక తాంత్రిక పుస్తకం దొరుకుతుంది. దాన్ని వాడి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటారు. అందులో రాసి ఉన్నట్లుగా మంత్ర పూజ చేయగా.. నిమ్మకాయలోకి 200 ఏళ్ల క్రితం నాటి ఆత్మ వస్తుంది. ఆ ఆత్మకు ఆకలి ఎక్కువ. ఇంట్లో ఉన్న ఫుడ్ అంతా తిసేస్తుంది.ఆ నిమ్మకాయలో ఉన్న ఆత్మను కట్టడి చేసేందుకు ప్రయత్నించగా.. పరమేశ్వర్ రూమ్లోకి వచ్చిన అంజిబాబు(ఫణి) శరీరంలోకి వెళ్తుంది. అంజిబాబు శరీరాన్ని ఆవహించిన ఆత్మను పొగొట్టేందుకు పరమేశ్వర్ గ్యాంగ్ చేసిన ప్రయత్నాలు ఏంటి? బక్క సూరి(వైవా హర్ష) ఎవరు? అతనికి ఉన్న రోగం ఏంటి? అంజిబాబులో ఉన్న ఆత్మ బక్క సూరిది అని తెలిసిన తర్వాత పరమేశ్వర్(ప్రవీణ్) గ్యాంగ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది. చివరకు అంజిబాబు శరీరం నుంచి ఆ ఆత్మ బయటకు వెళ్లిందా లేదా? రెస్టారెంట్ పెట్టాలన్న పరమేశ్వర్ కోరిక నెరవేరిందా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
పెళ్లి తర్వాత శోభిత తొలి సినిమా.. నేరుగా ఓటీటీలో రిలీజ్!
నాగచైతన్య గతేడాది డిసెంబరులో శోభితని పెళ్లి చేసుకున్నాడు. అప్పటినుంచి వీళ్లిద్దరూ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. అప్పటి నుంచి శోభిత కొత్త ప్రాజెక్టులు ఒప్పుకొన్నట్లు ఎలాంటి అప్డేట్ రాలేదు. రీసెంట్గా ఓ తమిళ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఇప్పటికే శోభిత.. ఓటీటీ మూవీని పూర్తి చేసిందని, వచ్చే నెలలోనే ఇది రిలీజ్ కానుందని ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.(ఇదీ చదవండి: నాగార్జునతో టబు.. మళ్లీ ఇన్నేళ్లకు జంటగా!)వైజాగ్కి చెందిన శోభిత.. తొలుత మోడలింగ్ చేసింది. 2016 నుంచి సినిమాలు చేస్తోంది. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. మేడ్ ఇన్ హెవెన్, బార్డ్ ఆఫ్ బ్లడ్, ద నైట్ మేనేజర్ లాంటి వెబ్ సిరీసుల్లోనూ యాక్ట్ చేసింది. అయితే 'చీకట్లో' అనే ఓటీటీ మూవీలో శోభిత నటించింది. కానీ దీని గురించి ఎక్కడా చిన్న అప్డేట్ కూడా లేదు. సురేశ్ ప్రొడక్షన్ నిర్మించిన ఈ చిత్రానికి శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించాడట.'చీకట్లో' పేరుతో తీసిన ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో నవంబరు 18న రిలీజ్ చేయబోతున్నారట. అయితే ఈ మూవీని ఏకంగా 18 భాషల్లో డబ్బింగ్ చేసి స్ట్రీమింగ్లోకి తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. ఇదంతా అనధికారికంగా బయటకొచ్చిన ఇన్ఫర్మేషన్. త్వరలో ఈ మూవీ గురించి అధికారిక ప్రకటనతో పాటు ఇతర వివరాలు కూడా రావొచ్చు. శోభిత భర్త, హీరో నాగచైతన్య ప్రస్తుతం హారర్ జానర్లో ఓ సినిమా చేస్తున్నాడు.(ఇదీ చదవండి: క్రేజీగా ప్రదీప్-మమిత 'డ్యూడ్' ట్రైలర్) -
సర్ప్రైజ్.. స్టార్ హీరోని మళ్లీ బతికించారు
ఎవరైనా నటుడు లేదా నటి మరణిస్తే.. జ్ఞాపకాలుగా మిగిలేవి వాళ్లు చేసిన సినిమాలు మాత్రమే. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు టెక్నాలజీ చాలా మారిపోయింది. ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ని ఉపయోగించి మరణించిన గాయనీగాయకుల గాత్రాన్ని కొత్త పాటల్లో వినిపించేలా చేస్తున్నారు. నటీనటుల్ని కూడా మళ్లీ బతికిస్తున్నారు. ఇప్పుడు అలానే ఓ ఓటీటీ సిరీస్ కోసం కన్నడ పవర్స్టార్ పునీత్ రాజ్ కుమార్ని మళ్లీ తెరపై చూపించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్)కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన పునీత్ రాజ్ కుమార్.. చాలా చిన్న వయసులోనే కోట్లాది మంది అభిమానుల ప్రేమని సంపాదించుకున్నారు. తెలుగులోనూ ఇతడు నటించిన పలు చిత్రాలు డబ్బింగ్గా రిలీజ్ అయ్యాయి. 2021లో కేవలం 46 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించాడు. ఈయన చనిపోయిన తర్వాత జేమ్ అనే సినిమా, గంధగ గుడి అనే డాక్యుమెంటరీ రిలీజయ్యాయి. తర్వాత నుంచి ఇప్పటికీ ఈయన్ని కన్నడ దర్శకనిర్మాతలు గుర్తుచేసుకుంటూనే ఉన్నారు.అయితే 'మారిగల్లు' అనే ఓటీటీ సిరీస్ కోసం ఇప్పుడు ఈయన్ని మరోసారి తెరపై చూపించారు. ఏఐ టెక్నాలజీ ఉపయోగించి పునీత్ రాజ్ కుమార్ని ఈ సిరీస్లో చూపించారు. కాదంబ రాజ్యానికి చెందిన మయూర వర్మ అనే రాజుగా పునీత్ కనిపించనున్నారు. మిగతా పార్ట్ అంతా నటీనటులే కనిపిస్తారు గానీ పునీత్కి సంబంధించిన సీన్స్ మాత్రం ఏఐ టెక్నాలజీతో తెరకెక్కించారు. ఈ సిరీస్ జీ5 ఓటీటీలో ఈనెల 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఒకవేళ ఈ సిరీస్ గనక వర్కౌట్ అయి పునీత్ పాత్రకు పేరొస్తే గనక రాబోయే రోజుల్లో ఈ తరహా ప్రయోగాలు చాలానే చూడొచ్చు. ఈ సిరీస్ నిర్మించింది పునీత్ కుటుంబ సభ్యులే కావడం విశేషం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు) -
సకుటుంబ సమేతంగా..
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రముఖ ఓవర్ ది టాప్ (ఓటీటీ) స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లు అందించే కంటెంట్లో సరికొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతంలో నేరప్రవృత్తితో కూడిన, అశ్లీల సంబంధ వెబ్ సిరీస్లను రూపొందించి ప్రసారం చేయడం ద్వారా వీక్షకులను ఆకర్షించిన ఓటీటీ ప్లాట్ఫామ్లు.. ఇటీవల కాలంలో మాత్రం కుటుంబ సమేతంగా చూడదగ్గ విభిన్న ఇతివృత్తాలతో ముందుకొస్తున్నాయి.సబ్స్క్రైబర్లను పెంచుకోవడంపై తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో దక్షిణాదితో పాటు ద్వితీయ, తృతీయశ్రేణి నగరాలు, పట్టణాలపై ఓటీటీలు ప్రత్యేక దృష్టిపెట్టి ఈ మేరకు మార్పుచేర్పులకు శ్రీకారం చుడు తున్నాయి. ఇందులో భాగంగా దక్షిణాది భాషలకు సంబంధించిన కంటెంట్కు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు కుటుంబ, స్నేహపూర్వక డ్రామాలు, ప్రేమకథలు, కామెడీలతో కూడిన కంటెంట్ను అందించడంపై దృష్టిపెట్టాయి. స్థానిక భాషల కంటెంట్కు డిమాండ్... ఓటీటీల్లో గతంలో ప్రసారమైన సినిమాలు, వెబ్సిరీస్లు ఆంగ్లం లేదా హిందీకే పరిమితమవగా ఇటీవల కాలంలో స్థానిక భాషల్లో కంటెంట్ను వీక్షించేందుకే ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. తమ సొంత సంస్కృతి, భాషను ప్రతిబింబించే షోలు, సినిమాలను వీక్షించాలని సబ్స్క్రైబర్లు కోరుకుంటున్నారు. దీంతో తెలుగు, తమిళం, మరాఠీ,బెంగాలీ సహా ఇతర భాషల్లో భిన్నమైన కంటెంట్ను అందించడానికి ఓటీటీ సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇందుకోసం కంటెంట్ సృష్టికర్తలతో జతకడుతున్నాయి. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, జీ5, ఆభా, హోయిచాయ్ వంటి ప్లాట్ఫామ్లు ప్రాంతీయ భాషల్లో స్థానిక కంటెంట్తో షోలు, సినిమాలను అందించడంలో ముందువరసలో నిలుస్తున్నాయి. బెంగాలీ షోలకు ప్రసిద్ధి చెందిన హోయిచోయ్ భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన బెంగాలీలను కూడా తన సరికొత్త కంటెంట్తో వీక్షకులను ఆకర్షించడం ద్వారా సబ్స్రై్కబర్ల సంఖ్యను పెంచుకుంది. చౌపాల్ పంజాబీ, హర్యాన్వి, భోజ్పురి ప్రేక్షకులకు ప్రాంతీయ అభిరుచులతో లోతుగా ప్రతిధ్వనించే కథలను అందిస్తోంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ స్థానిక భాషల్లో సినిమాలను నిర్మించడంతోపాటు సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు, టాక్ షోలను అందిస్తున్నాయి. ఈటీవీ విన్, సన్ నెక్ట్స్æ, ఆహా వంటి ఓటీటీలు తెలుగు, తమిళ కంటెంట్ను రూపొందించి విడుదల చేయడంపై దృష్టిపెడుతున్నాయి. ఇక జియో హాట్స్టార్, సోని లివ్ తదితర ఓటీటీలు సినిమాలు, డ్రామాలు, వెబ్ సిరీస్లతోపాటు క్రికెట్ సహా వివిధ క్రీడలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి.వచ్చే 12–18 నెలల్లో దక్షిణాది భాషల్లో ఒరిజినల్ స్ట్రీమింగ్ టైమింగ్ను జియో హాట్స్టార్ డబుల్ చేయనుంది. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ సైతం దక్షిణాది సంబంధ కంటెంట్ను మరింతగా అందించడంపై దృష్టిసారిస్తోంది. బిగ్బాస్ సౌత్ ఓటీటీని నాలుగు దక్షిణాది భాషల్లో ప్రజలు 400 కోట్ల గంటలకుపైగా వీక్షించారంటే ప్రాంతీయ భాషల్లో షోలకు ఎంత ఆదరణ లభిస్తోందో స్పష్టమవుతోంది.ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటే... ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది మీడియా ప్రసార మాధ్యమం. ఇందులో ఇంటర్నెట్ ద్వారా కంటెంట్ను అందిస్తారు. వీక్షకులు సంబంధిత యాప్లను నిర్ణీతరుసుము చెల్లించి సబ్స్రై్కబ్ చేసుకొని వాటిల్లోని సినిమాలు, సిరీస్లు సహాఆయా యాప్లలో ఉండే కంటెంట్ను ఎన్ని సార్లయినా చూడొచ్చు. -
ఓటీటీలోకి 'వార్ 2'.. అధికారిక ప్రకటన
ఈ ఏడాది ఎన్టీఆర్.. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా 'వార్ 2'. హృతిక్ రోషన్ మరో హీరోగా నటించాడు. ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర ఆకట్టుకోలేకపోయింది. తెలుగులో అయితే మరీ ఘోరమైన టాక్ వచ్చింది. హిందీలో ఓ మాదిరి కలెక్షన్స్ వచ్చాయి. గత కొన్నిరోజులుగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్పై పలు రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడ వాటికి చెక్ పెడుతూ అధికారిక ప్రకటన వెలువడింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్)'వార్ 2' డిజిటల్ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. థియేటర్లలో రిలీజైన 8 వారాల తర్వాత ఓటీటీల్లో స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు అలా రేపటి(అక్టోబరు 09) నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుందని పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే వారంనుంచి ఇదే తేదీన రానుందని ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే నిజమైంది. థియేటర్లలో అంతంత మాత్రంగా ఆడిన ఈ చిత్రం.. ఓటీటీలో ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి?'వార్ 2' విషయానికొస్తే.. రా మాజీ ఏజెంట్ కబీర్ (హృతిక్ రోషన్)ని తమ కార్టెల్లో భాగం చేసుకోవాలనేది కలి అనే విలన్ ప్లాన్. దీంతో టాస్క్ పేరు చెప్పి కబీర్తో తనకి గాడ్ ఫాదర్ లాంటి సునీల్ లుథ్రాని చంపించేస్తారు. దీంతో కబీర్ని పట్టుకునేందుకు రా కొత్త చీఫ్ విక్రాంత్ కౌల్ (అనిల్ కపూర్), భారత ప్రభుత్వం సోల్జర్ విక్రమ్ చలపతి (ఎన్టీఆర్) నేతృత్వంలో ఓ టీమ్ రంగంలోకి దింపుతుంది. ఆ బృందంలో లూథ్రా కూతురు, వింగ్ కమాండర్ కావ్య లూథ్రా (కియారా అడ్వాణీ) కూడా ఉంటుంది. అసలు కబీర్ దేశద్రోహిగా ఎందుకు మారాడు? కబీర్కి విక్రమ్ ఎవరో తెలిశాక ఏం చేశాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: హిట్ సినిమా.. ఇప్పుడు మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్)Double the rage. Double the rampage. Ready for the War? 🔥#War2OnNetflix pic.twitter.com/wkTWTIu0Wu— Netflix India South (@Netflix_INSouth) October 8, 2025 -
హిట్ సినిమా.. ఇప్పుడు మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అప్పుడప్పుడు ఒక దానిలో ఉన్న మూవీస్.. మరో ఓటీటీలోనూ అందుబాటులోకి వస్తుంటాయి. అలా ఇప్పుడు ఓ డబ్బింగ్ చిత్రం అమెజాన్ ప్రైమ్లోకి వచ్చేసింది. పెళ్లికి ముందే తొందరపడి పేరెంట్స్ అయిన ఓ జంట.. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనే పాయింట్తో ఎమోషనల్ గా తీసిన ఈ మూవీ సంగతేంటి? ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతుందనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: వీడియో: పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ.. ముఖంలో పెళ్లికళ)2023లో తమిళంలో 'డాడా' టైటిల్తో ఓ సినిమా రిలీజైంది. హిట్ అయింది. కవిన్, అపర్ణా దాస్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఈ ఏడాది జూన్లో 'పాపా' పేరుతో థియేటర్లలో రిలీజ్ చేశారు. కాకపోతే డబ్బింగ్ బొమ్మ కావడం వల్ల ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. ఇది జరిగిన కొన్నాళ్లకు అంటే జూలై చివరలో ఆహా ఓటీటీలోకి వచ్చింది. తర్వాత మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఎలాంటి హడావుడి లేకుండా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.'పాపా' విషయానికొస్తే.. మణికంఠ (కవిన్), సింధు (అపర్ణ) క్లాస్మేట్స్. వీళ్ల మధ్య మొదలైన స్నేహం.. కొన్నాళ్లకు ప్రేమగా మారుతుంది. అయితే కాస్త తొందరపడేసరికి పెళ్లికి ముందే మణి వల్ల సింధు గర్భం దాల్చుతుంది. ఆ విషయం తెలిసిన కుటుంబ పెద్దలు వీళ్లని దూరం పెడతారు. దీంతో మణి- సింధు ఓ అద్దె ఇంట్లో ఉంటూ చదువు పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తారు. ఈ ప్రయాణంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? జన్మనిచ్చిన వెంటనే బిడ్డను వదిలేసి సింధు ఎందుకు వెళ్లిపోయింది? ఆ చిన్నారిని పెంచేందుకు మణి ఎంతగా కష్టపడ్డాడు? మణి జీవితంలోకి మళ్లీ సింధు వచ్చిందా? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్) -
ఓటీటీలోకి తెలుగు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్
ఓటీటీల్లోకి ప్రతివారం కొత్త సినిమాలు, సిరీస్లు వస్తూనే ఉంటాయి. అయితే కొన్నిసార్లు థియేటర్లలో కాకుండా నేరుగా కొన్ని మూవీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయిపోతుంటాయి. ఇప్పుడు అలానే ఓ తెలుగు థ్రిల్లర్ సిరీస్ డిజిటల్గా అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. ఈ మేరకు అధికారిక ప్రకటనతో పాటు పోస్టర్ రిలీజ్ చేశారు. ఇంతకీ ఏంటా సిరీస్? ఎందులోకి రానుంది?రాజీవ్ కనకాల, ఉదయభాను ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు సిరీస్ 'డాటరాఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు'. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ స్టోరీతో దీన్ని తీశారు. ఇది ఇప్పుడు నేరుగా జీ5 ఓటీటీలో ఈ నెల 31వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. రెక్కీ, విరాటపాలెం తదితర సిరీసులు తీసిన సౌతిండియన్ స్క్రీన్స్ దీన్ని నిర్మించింది. పోలూరు కృష్ణ దర్శకుడు. రాజీవ్ కనకాల తండ్రిగా చేయనుండగా.. అతడి కూతురు స్వాతిగా వాసంతిక నటించింది. ఉదయభాను పోలీస్ పాత్రలో కనిపించనుంది.(ఇదీ చదవండి: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బ్యాచిలర్ పార్టీ!)ఈ ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్లో తండ్రైన రాజీవ్ కనకాల.. కనిపించకుండా పోయిన తన కూతురు స్వాతి కోసం వెతుకుతుంటాడు. తండ్రికి ఏం చేయాలో తెలియక అన్వేషిస్తుంటాడు. ఈ క్రమంలో నిజానికి దగ్గరయ్యే కొద్ది తనకు తెలిసే రహస్యాలు, మోసాలు వెనుక దాగిన ఊహించని నిజాలు ఏంటి? ప్రేమ, కోల్పోయినప్పుడు ఉండే వెలితి, మోసం మధ్య ఉండే సన్నని సరిహద్దులు కనిపించకుండా పోతాయి. బాధ, భావోద్వేగం కలగలిసిన ఈ ప్రయాణమే అసలు స్టోరీ.ఇకపోతే ఈ వారం 20కి పైగా కొత్త చిత్రాలు, సిరీసులు పలు ఓటీటీల్లోకి రాబోతున్నాయి. వీటిలో తేజా సజ్జా 'మిరాయ్', 'త్రిబాణధారి బార్బరిక్', ఎన్టీఆర్ 'వార్ 2', లీగల్లీ వీర్ అనే తెలుగు మూవీస్ ఉన్నాయి. వీటితో పాటు 'కురుక్షేత్ర' అనే యానిమేటెడ్ తెలుగు డబ్బింగ్ సిరీస్ కూడా ఈ వీకెండ్లోనే అందుబాటులోకి రానుంది. ఇవే కాకుండా శుక్రవారం నాడు ఏమైనా సడన్ సర్ప్రైజ్ ఉండొచ్చు! (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు) -
ఓటీటీలో 'ఓజీ'.. నెలరోజుల్లోనే స్ట్రీమింగ్!
కాంతార సినిమాకు క్రేజ్ దక్కడంతో పవన్ కల్యాణ్ నటించిన ఓజీ చిత్రంపై భారీ దెబ్బ పడింది. ఓజీ కేవలం మొదటిరోజు మాత్రమే భారీ కలెక్షన్స్ సాధించినప్పటికీ ఆ తర్వాత థియేటర్ల పరిస్థితి ధారుణంగా మారింది. ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా కాంతార జోరు ఉండటంతో ఓజీ థియేటర్స్ ఖాళీగానే కనిపిస్తున్నాయి. దీంతో ఓటీటీ బాటలోకి ఓజీ వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కేవలం నెలరోజుల్లోనే స్ట్రీమింగ్కు రానున్నట్లు తెలుస్తోంది.ఓజీ సినిమా నెట్ఫ్లిక్స్ (NetflixI) ఓటీటీ (OTT)లో ఆక్టోబర్ 23 నుంచి తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. నెల రోజుల్లోనే ఓటీటీలో విడుదల అయ్యేలా ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఓటీటీ వర్షన్లో కొన్ని అదనపు సీన్లు యాడ్ చేస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.భారీ అంచనాలతో సెప్టెంబర్ 25న ఓజీ విడుదలైంది. అయితే, కలెక్షన్స్ పరంగా టాలీవుడ్ రికార్డ్స్ తిరగరాయాలని అత్యధిక ప్రీమియర్ షోలు (336) వేసి ఒక్కో టికెట్ ధర రూ. 1000 నిర్ణయించడంతో మొదటిరోజు భారీ కలెక్షన్స్ రాబట్టింది. కానీ, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి అగ్రహీరోల మొదటిరోజు కలెక్షన్ల రికార్డ్స్ను ఎంత మాత్రం టచ్ చేయలేకపోయింది. ఓజీ రెండోరోజు నుంచే ఒక్కసారిగా 80 శాతం పైగా కలెక్షన్స్ తగ్గిపోయాయి. కాంతార విడుదల తర్వాత కలెక్షన్స్ పరిస్థితి మరింతగా తగ్గిపోయాయి. ఇప్పటి వరకు ఓజీ రూ. 183 కోట్ల నెట్ సాధించినట్లు ప్రముఖ వెబ్సైట్ సాక్నిల్క్ పేర్కొంది. ఈ మూవీలో పవన్ కల్యాణ్తో పాటు ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి వంటి వారు నటించారు. -
ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు
మరోవారం వచ్చేసింది. గత వీకెండ్ 'కాంతార 1', 'ఇడ్లీ కొట్టు' లాంటి డబ్బింగ్ చిత్రాలు ప్రేక్షకుల్ని పలకరించాయి. ఈసారి మాత్రం తెలుగు స్ట్రెయిట్ మూవీస్ కొన్ని థియేటర్లలోకి రాబోతున్నాయి. వీటిలో ఎర్రచీర, కానిస్టేబుల్, శశివదనే, అందెల రవమిది, అరి, మటన్ సూప్, ప్రేమతో దెయ్యం లాంటి సినిమాలతో పాటు 'బల్టీ' అనే డబ్బింగ్ బొమ్మ ఉన్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ 20కి పైగా కొత్త మూవీస్, వెబ్ సిరీసులు రాబోతున్నాయి.(ఇదీ చదవండి: 'బాహుబలి'ని తొలగించిన ప్రముఖ ఓటీటీ సంస్థ)ఓటీటీల్లోకి వచ్చే సినిమాల విషయానికొస్తే.. మిరాయ్, త్రిభాణదారి బార్బరిక్, లీగల్లీ వీర్ అనే తెలుగు చిత్రాలతో పాటు కురుక్షేత్ర అనే యానిమేటెడ్ డబ్బింగ్ సిరీస్ ఈ వారంలోనే రానుంది. అలానే ఎన్టీఆర్ నటించిన హిందీ మూవీ 'వార్ 2' కూడా ఈ వారాంతంలోనే స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. మరి ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ అందుబాటులోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (అక్టోబరు 06 నుంచి 12వ తేదీ వరకు)హాట్స్టార్మిరాయ్ (తెలుగు సినిమా) - అక్టోబరు 10సెర్చ్: ద నైనా మర్డర్ కేస్ (హిందీ సిరీస్) - అక్టోబరు 10నెట్ఫ్లిక్స్హోర్టన్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 06మ్యాట్ మక్కస్కర్: ఏ హంబుల్ ఆఫరింగ్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 07ట్రూ హాంటింగ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 07కారమెలో (పోర్చుగీస్ సినిమా) - అక్టోబరు 08ఈజ్ ఇట్ కేక్? హాలోవీన్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 08నెరో (ఫ్రెంచ్ సిరీస్) - అక్టోబరు 08బూట్స్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 08వార్ 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబరు 09 (రూమర్ డేట్)ద రీసరెక్టెడ్ (మాండరిన్ సిరీస్) - అక్టోబరు 09ద ఉమెన్ ఇన్ కాబిన్ 10 (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 09విక్టోరియా బెక్హమ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 09కురుక్షేత్ర (తెలుగు డబ్బింగ్ యానిమేటెడ్ సిరీస్) - అక్టోబరు 10స్విమ్ టూ మీ (స్పానిష్ మూవీ) - అక్టోబరు 10 అమెజాన్ ప్రైమ్మెయింటైనెన్స్ రిక్వైర్డ్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 08జాన్ క్యాండీ: ఐ లైక్ మీ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 10సన్ నెక్స్ట్త్రిభాణదారి బార్బరిక్ (తెలుగు మూవీ) - అక్టోబరు 10రాంబో (తమిళ సినిమా) - అక్టోబరు 10జీ5ఏ మ్యాచ్ (మరాఠీ సినిమా) - అక్టోబరు 10వెదువన్ (తమిళ సిరీస్) - అక్టోబరు 10లయన్స్ గేట్ ప్లేలీగల్లీ వీర్ (తెలుగు మూవీ) - అక్టోబరు 10ఆపిల్ ప్లస్ టీవీద లాస్ట్ ఫ్రంటియర్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 10(ఇదీ చదవండి: రచయిత కోన వెంకట్ కూతురి రిసెప్షన్.. హాజరైన చిరంజీవి) -
ఓటీటీ వీక్షకులు @ 60 కోట్లు
సకుటుంబ సపరివార సమేతంగా... టీవీ ముందు కూర్చుంటున్నారు. అది కేబుల్ కనెక్షన్ టీవీ కాదు.. ‘కనెక్టెడ్ టీవీ’. అందులో తమకు నచ్చిన సినిమా లేదా వెబ్ సిరీస్ లేదా షో చూస్తున్నారు. సంప్రదాయ టీవీ చానళ్లలో కాదు.. ఓటీటీ వేదికల్లో. ఇదే ఇప్పుడు ట్రెండ్. ఇది కరోనా తరవాత రికార్డు స్థాయిలో దేశమంతా పాకేసింది. దేశంలో ఓటీటీ చూస్తున్న ప్రేక్షకుల సంఖ్య రికార్డు స్థాయిలో 60 కోట్లకు ఎగబాకిందన్న అంచనాలే ఇందుకు నిదర్శనం. అంటే దేశ జనాభాలో 40 శాతానికిపైగా ఓటీటీలకు అలవాటుపడ్డారన్నమాట.టీవీ కొనాలంటే.. వందసార్లు ఆలోచించడం లేదు. హాల్లోకి సరిపోయే పెద్ద సైజు టీవీని.. అది కూడా స్మార్ట్ టీవీనే కొనేస్తున్నారు. ‘మార్డోర్ ఇంటెలిజెన్స్’ అంచనా ప్రకారం 2025లో దేశీయ స్మార్ట్ టీవీ మార్కెట్ విలువ 22.39 బిలియన్ డాలర్లు. 2023లో ఇది సుమారు 11 బిలియన్ డాలర్లే. స్మార్ట్ టీవీల కొనుగోళ్లు ఎంతలా పెరిగాయో చెప్పడానికి ఈ అంకెలే నిదర్శనం. అంత ఖరీదైన టీవీ కొన్నాక.. సాధారణ కేబుల్ టీవీ ఒక్కటే ఉంటే ఏం బాగుంటుంది? అందుకే, ఏదో ఒకటి లేదా అంతకుమించి ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసేసుకుంటున్నారు. అంతే, ఎంచక్కా ఇక సకుటుంబ సపరివార సమేతంగా సినిమాలు, వెబ్ సిరీస్లు, షోలు చూస్తున్నారు. దేశంలో ఇటీవలి కాలంలో ఈ ధోరణి పెరిగింది.కనెక్టెడ్ టీవీలో..: ఒకప్పుడు కేబుల్ టీవీ ప్రతి ఇంటా సర్వసాధారణంగా ఉండేది. ఇప్పుడు దాని స్థానాన్ని కనెక్టెడ్ టీవీ ఆక్రమిస్తోంది. కనెక్టెడ్ టీవీ అంటే ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యే టీవీ. ఇది మధ్య తరగతి, ఆపై స్థాయి కుటుంబాల్లో సర్వసాధారణం అయిపోయింది. మీడియా కన్సల్టింగ్ సంస్థ ఆర్మాక్స్ మీడియా ‘ఓటీటీ ఆడియన్స్ రిపోర్ట్ 2025’ ప్రకారం.. కనెక్టెడ్ టీవీ వీక్షకుల సంఖ్య 2024లో 6.97 కోట్లు మాత్రమే ఉండేది. 2025లో అది ఏకంగా 12.92 కోట్లకు పెరిగింది. అంటే.. దాదాపు రెట్టింపు అయిందన్నమాట.ఆకట్టుకునే కంటెంట్అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, జియో హాట్స్టార్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో విభిన్నమైన కంటెంట్తో వెబ్సిరీస్లు, సినిమాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కంటెంట్కు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఆర్మాక్స్ అంచనా ప్రకారం.. దేశంలో ఓటీటీ వీక్షకుల (నెలలో కనీసం ఒక్కసారైనా ఓటీటీ వీడియో చూసినవారు) సంఖ్య 60 కోట్లకుపైనే. 2024తో పోలిస్తే ఇది దాదాపు 10 శాతం ఎక్కువ. దేశ జనాభాలో ఇది 40 శాతానికిపైనే. వీక్షకులు పెరగడంతో ఓటీటీల్లో దేశీయ భాషల్లో వచ్చే వెబ్సిరీస్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఓటీటీల్లోనే విడుదల చేసే సినిమాలూ పెరుగుతున్నాయి. సెలవు రోజుల్లోనూ... రాత్రుళ్లు భోజన సమయాల్లోనూ కుటుంబ సభ్యులతో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, ఆహా, జీ5, సోనీ లివ్.. ఇలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో నచ్చిన సినిమా లేదా రియాలిటీ షో లేదా వెబ్సిరీస్ చూడటం సర్వసాధారణం అయిపోయింది.దేశంలో ఓటీటీ చందాదారుల సంఖ్య (సుమారుగా)⇒ జియో హాట్స్టార్ 30 కోట్లు⇒ అమెజాన్ ప్రైమ్ 2.8 కోట్లు⇒ నెట్ఫ్లిక్స్ 1.23 కోట్లుఆర్మాక్స్ మీడియా నివేదిక ప్రకారం.. 2025 జనవరి–జూన్ మధ్య ప్రసారమైన ఒరిజినల్స్లో వీక్షకులు అత్యధికంగా చూసినవి వెబ్ సిరీస్లే. వీక్షకుల పరంగా టాప్–50 ఒరిజినల్స్లో 80 శాతం వాటా వెబ్ సిరీస్లు కైవసం చేసుకోవడం విశేషం. ఆ తరవాతి స్థానంలో సినిమాలు, రియాలిటీ షోలు ఉన్నాయి. -
ఓటీటీలో 'త్రిబాణధారి బార్బరిక్' సినిమా స్ట్రీమింగ్
త్రిబాణధారి బార్బరిక్( Tribanadhari Barbarik) సినిమా చుట్టూ చాలా ఆసక్తికరమైన విషయాలు జరిగాయి. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఈ మూవీ విడుదల తర్వాత ఎవరూ చూడలేదని ఆ చిత్ర దర్శకుడు మోహన్ శ్రీవత్స (Mohan Srivatsa) సోషల్ మీడియాలో భావోద్వేగానికి గురైన సంగతి తెలిసిందే. తన కష్టానికి తగిన ఫలితం దక్కలేదని మీడియా ముందే చెప్పుతో కొట్టుకున్నారు. దీంతో ఈ మూవీ గురించి వైరల్ అయింది. ఆపై సినిమా ఫలితం చూసి ఉదయభాను కూడా గుక్కపెట్టి ఏడ్చింది. ఇలా త్రిబాణధారి బార్బరిక్ చుట్టూ అనేక సంఘటనలు జరిగాయి. ఇప్పుడు ఓటీటీలోకి రానున్నండంతో నెటిజన్లు ఈ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు.‘త్రిబాణధారి బార్బరిక్’.. సన్ నెక్స్ట్(Sun NXT)లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 10 నుంచి తెలుగుతో పాటు తమిళ్లో కూడా విడుదల కానుందని ఒక పోస్టర్ను పంచుకున్నారు. ఈ చిత్రంలో సత్య రాజ్, వశిష్ట ఎన్ సింహా, ఉదయ భాను, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్, మేఘన కీలక పాత్రల్లో నటించారు.కథేంటంటే..ప్రముఖ సైకాలజిస్ట్ శ్యామ్ కతు(సత్యరాజ్) మనవరాలు నిధి(మేఘన) కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయిస్తాడు. ఈ కేసుని కానిస్టేబుల్ చంద్ర(సత్యం రాజేశ్) డీల్ చేస్తుంటాడు. మరోవైపు మధ్యతరగతి కుటుంబానికి చెందిన రామ్(వశిష్ట సింహా) విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటాడు. దానికోసం రూ.30 లక్షల వరకు కావాల్సి ఉంటుంది. తన స్నేహితుడు, లేడీ డాన్ వాలికి పద్మ(ఉదయ భాను) మేనల్లుడు దేవ్(క్రాంతి కిరణ్)తో కలిసి ఇష్టం లేకపోయిన కొన్ని అసాంఘీక పనులు చేస్తుంటాడు.దేవ్కి జూదం అంటే పిచ్చి. అత్త వాకిలి పద్మకు తెలియకుండా డ్రగ్స్ మాఫియా లీడర్ దాస్(మొట్ట రాజేంద్రన్) దగ్గర లక్షల్లో అప్పు చేసి జూదంలో పొగొట్టుకుంటాడు. కొన్నాళ్ల తర్వాత దాస్ తన అప్పు తీర్చమని దేవ్పై ఒత్తిడి చేస్తాడు. దీంతో డబ్బు కోసం రామ్ ఓ ప్లాన్ వేస్తాడు. అదేంటి? నిధి మిస్సింగ్కి వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అసలు నిధిని కిడ్నాప్ చేసిందెవరు? ఎందుకు చేశారు? మనవరాలి కోసం శ్యామ్ ఏం చేశాడు? అనేది తెలియాంటే సినిమా చూడాల్సిందే. -
ట్రెండింగ్లో దెయ్యం సినిమా..'సుమతి వలవు' మూవీ రివ్యూ
తక్కువ బడ్జెట్లో క్వాలిటీ సినిమాలు తీయడం, భారీ వసూళ్లు రాబట్టడంలో మలయాళ ఇండస్ట్రీ దిట్ట! ఈ ఏడాది మాలీవుడ్లో అనేక సినిమాలు హిట్గా నిలిచాయి. అందులో ఒకటి సుమతి వలవు. హారర్ కామెడీ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా రూ.25 కోట్లు వసూలు చేసింది. ఈ మధ్యే ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లోకి వచ్చేసింది. తెలుగులోనూ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఓటీటీలో టాప్ ట్రెండింగ్లో ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దాం..రియల్ స్టోరీసుమతి వలవు (Sumathi Valavu Movie Review) అంటే తెలుగులో సుమతి మలుపు. ఇది సినిమాలోనే కాదు నిజంగా ఉంది. కేరళ రాష్ట్రం తిరువనంతపురం జిల్లాలోని మైలమ్మూడుకు సమీపంలో ఈ మలుపు ఉంది. 1950ల ప్రాంతంలో సుమతి అనే అమ్మాయిని అక్కడ చంపేశారని, తను దెయ్యమై అక్కడే తిరుగుతోందన్న కథ ప్రచారంలో ఉంది. దాన్ని ఆధారంగా చేసుకుని ఈ మూవీ తీశారు.కథఅడవిని ఆనుకుని కల్లేలి అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి వెళ్లాలంటే అడవి గుండా వెళ్లాలి. అక్కడే సుమతి వలవు అనే టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అక్కడే సుమతి అనే దెయ్యం తిరుగుతూ ఉంటుంది. రాత్రి 8 గంటల తర్వాత ఎవరూ అక్కడకు వెళ్లరు. కానీ ఓ రోజు రాత్రి ఆ ఊర్లోని శేఖరన్ పెద్ద కూతురు ప్రేమించినవాడితో పారిపోతుంది. హీరో అప్పూ (అర్జున్ అశోకన్)యే ఏదో చేసుంటాడని శేఖరన్ కుటుంబం అతడిపై పగపెంచుకుంటుంది. ఈ క్రమంలో శేఖరన్ రెండో కూతురు భామ (మాళవిక మనోజ్)తో ప్రేమలో పడతాడు అప్పు. మరి వీరి ప్రేమకథను ఒప్పుకుంటారా? శేఖరన్ పెద్ద కూతురు పారిపోయిందా? లేదా దెయ్యం చంపేసిందా? అన్నది ఓటీటీలో చూసి తెలుసుకోవాల్సిందే!విశ్లేషణహీరో అప్పుకు చీకటంటే పిరికి. ఓరోజు రాత్రి ఊర్లోని నిండు గర్భిణి పురిటినొప్పులతో బాధపడుతుంటే ఆస్పత్రికి తీసుకెళ్లాలంటారు. అందరూ భయపడుతుంటే హీరో గ్యాంగ్ మాత్రం బండి సిద్ధం చేసుకుని తీసుకెళ్తారు. మలుపు దాకా వెళ్లాక బండి దానంతటదే ఆగిపోతుంది. ఈ ఇంటర్వెల్లో జరిగే సీన్లు బాగుంటాయి. కానీ సెకండాఫ్లో కాస్త పస తగ్గినట్లు అనిపిస్తుంది. ఏదేమైనా సినిమాను చాలా సహజంగా తెరకెక్కించారు. మూవీలో ఓ పక్క ప్రేమకథ.. మరోపక్క హారర్ రెండూ ఉంటాయి. మరీ ఎక్కువ భయపెట్టకుండా నవ్విస్తూ, అలరిస్తూ కథ అలా ముందుకు సాగుతుంది. ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా చూసేయొచ్చు. అన్నట్లు దీనికి సీక్వెల్ కూడా ప్రకటించారు. The Curve That Everyone’s Talking About — 100 M+ Streaming Minutes Strong 🚀 #ArjunAshokan #SidharthBharathan #GokulSuresh #BaluVarghese #SaijuKurup #BobyKurian #MalavikaManoj #JoohiJu #SijaRoseGeorge #Shivada #GopikaAnil@GokulamMovies @DreamBig_film_s @jsujithnair… pic.twitter.com/0CjoYEX6EL— ZEE5 Malayalam (@zee5malayalam) October 3, 2025 -
పైరసీ వెబ్సైట్లు ఎక్కువ చూసేది వాళ్లే!
ఇటీవల హైదరాబాద్ పోలీసులు దేశంలోనే అతిపెద్ద సినీ పైరసీ గుట్టు రట్టు చేశారు. ఐదేళ్లలో 1,050 సినిమాలను పైరసీ చేసిన ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పైరసీపై చర్చ మొదలైంది. భారత వినోద పరిశ్రమకు పైరసీ ‘బొమ్మ’ చూపిస్తోంది. విడుదలైన రోజే పైరసీ వెబ్సైట్లలో సినిమా దర్శనమిస్తోంది. అంతేకాదు పైరసీ భూతం చట్టానికే సవాల్ విసురుతోంది. పైరసీ సమస్య (Piracy Problem) ఒక్క సినిమా పరిశ్రమకే కాదు.. టీవీ, మ్యూజిక్, సాఫ్ట్వేర్, పబ్లిషింగ్ రంగాలకూ విస్తరించింది.ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది పైరసీ వెబ్సైట్ల విజిట్స్ 21,630 కోట్లు నమోదయ్యాయి. 2024లో మొత్తం పైరసీ ట్రాఫిక్లో మనదేశ వాటా 8.12%. అంటే మన దేశం నుంచి 1,756 కోట్ల విజిట్స్ నమోదయ్యాయన్నమాట. పబ్లిక్, ప్రైవేట్ టొరెంట్స్, వెబ్ ఆధారంగా ఫిల్మ్, టీవీ, మ్యూజిక్ స్ట్రీమింగ్; సాఫ్ట్వేర్, పబ్లిషింగ్ రంగాలలో ప్రపంచ పైరసీ ట్రెండ్స్ను పర్యవేక్షిస్తున్న డేటా కంపెనీ ‘మ్యూసో’.. ‘పైరసీ ట్రెండ్స్ అండ్ ఇన్ సైట్ రిపోర్ట్ 2024’ అనే నివేదిక రూపొందించింది. దీని ప్రకారం పైరసీ వెబ్సైట్ల వీక్షకుల సంఖ్యలో 12% వాటాతో అమెరికా (America) తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో భారత్ ఉంది. మొదటి స్థానం మనదేమొదటి స్థానం మనదే మ్యూసో 2023 నివేదిక ప్రకారం ప్రపంచ చలనచిత్ర పైరసీలో మనదే పైచేయి. మొత్తం పైరసీలో 30.58% వాటా మన దేశానిదే. యూఎస్ 6.26%, టర్కీ 5.75% వాటాతో ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. పైరసీ కంటెంట్ను డౌన్లోడ్ చేసుకుని చూసేవారితో (49.6 శాతం) పోలిస్తే.. అప్పటికప్పుడే చూసే (స్ట్రీమింగ్) వాళ్లు కాస్త ఎక్కువ ఉండటం (50.4 శాతం) గమనార్హం. వినోదం ఇప్పటికీ ఖరీదుగా ఉండడం, అందుబాటు విషయంలో కస్టమర్ల అంచనాలను అందుకోలేకపోవడం వల్లే పైరసీ కొనసాగుతోందని నివేదిక వెల్లడించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా 2023తో పోలిస్తే గత ఏడాది ఈ–బుక్స్, ఆడియో బుక్స్, పేపర్స్, మ్యాగజైన్స్ వంటి పబ్లిషింగ్ రంగంలో పైరసీ 4.3% పెరిగింది.జీఎస్టీ నష్టం రూ.4,313 కోట్లుఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ‘ద రాబ్ రిపోర్ట్ 2024’ ప్రకారం.. 2023లో భారత వినోద పరిశ్రమ పైరసీ కారణంగా రూ.22,400 కోట్ల నష్టాన్ని చవి చూసింది. ఓటీటీ (OTT) ప్లాట్ఫామ్లకు రూ.8,700 కోట్లు, థియేటర్లకు రూ.13,700 కోట్ల నష్టం వాటిల్లింది. మొత్తంగా ప్రభుత్వానికి జరిగిన జీఎస్టీ నష్టం రూ.4,313 కోట్లు.- సాక్షి, స్పెషల్ డెస్క్ -
నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న మిరాయ్.. ఎప్పుడంటే?
యంగ్ హీరో తేజ సజ్జ (Teja Sajja) వరుస బ్లాక్బస్టర్స్ అందుకుంటున్నాడు. గతేడాది హనుమాన్తో సూపర్ డూపర్ హిట్ అందుకున్న ఈ హీరో ఈ ఏడాది మిరాయ్ (Mirai Movie)తో మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. కేవలం రూ.60 కోట్ల బడ్జెట్తో విజువల్ వండర్గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించింది. ఏకంగా రూ.150 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం నెల తిరిగేలోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది.ఓటీటీలో మిరాయ్ఈ విషయాన్ని జియో హాట్స్టార్ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 10న హాట్స్టార్లో రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. మిరాయ్ విషయానికి వస్తే.. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. రితికా నాయక్ హీరోయిన్ కాగా మంచు మనోజ్ విలన్గా నటించారు. శ్రియ, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఓటీటీలో ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి! View this post on Instagram A post shared by JioHotstar Telugu (@jiohotstartelugu)చదవండి: సంజనా శాడిజం.. చచ్చినా, బతికినా తనతోనే.. ఇమ్మూ లవ్స్టోరీ -
థియేటర్లలో కాంతార ఛాప్టర్-1.. ఓటీటీల్లో ఏయే సినిమాలంటే?
అసలే దసరా సెలవులు.. చూస్తుండగానే అయిపోతున్నాయి. మరో వీకెండ్ కూడా వచ్చేస్తోంది. ఈ పండుగకు అలరించేందుకు కాంతార చాప్టర్-1, ఇడ్లీ కొట్టు సినిమాలు సందడి చేస్తున్నాయి. ఇవీ తప్ప పెద్దగా సినిమాలేవీ దసరాకు రిలీజ్ కాలేదు. కాంతార మూవీపై భారీ అంచనాలు ఉండడంతో ఆడియన్స్ క్యూ కడుతున్నారు.ఇక ఓటీటీల విషయానికొస్తే అదే పరిస్థితి నెలకొంది. ఈ శుక్రవారం పెద్దగా మూవీస్ ఏవీ స్ట్రీమింగ్ కావట్లేదు. మైనే ప్యార్ రియా అనే మలయాళ సినిమా, హాలీవుడ్ చిత్రాలు, మరికొన్ని వెబ్ సిరీస్లు మాత్రమే స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో పెద్దగా బజ్ చిత్రాలేవీ కనిపించడం లేదు. అయితే దసరా సెలవులు కావడంతో కాస్తా డిఫరెంట్ సిరీస్, సినిమాలు ట్రై చేసే వాళ్లు ఓ లుక్కేయ్యొచ్చు. ఏయే చిత్రాలు ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయో చూసేయండి.నెట్ఫ్లిక్స్..స్టీవ్(హాలీవుడ్ మూవీ)- అక్టోబరు 03మాన్స్టర్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 03జెనీ మేక్ ఏ విష్(కొరియన్ సిరీస్)- అక్టోబరు 03ఓల్డ్ డాగ్.. న్యూ ట్రిక్స్(స్పానిష్ కామెడీ సిరీస్)- అక్టోబరు 03ది న్యూ ఫోర్స్(స్వీడీష్ మూవీ)- అక్టోబరు 03జీ5డాకున్ కా ముండా-3(పంజాబీ మూవీ)- అక్టోబర్ 03జియో హాట్స్టార్బిగ్బాస్ తమిళ్(రియాలిటీ షో)- అక్టోబర్ 05లయన్స్ గేట్ ప్లేమైనే ప్యార్ కియా(మలయాళ సినిమా)- అక్టోబరు 03 ఆపిల్ ప్లస్ టీవీ లాస్ట్ బస్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 03హులువేర్ వాల్వ్స్- అక్టోబర్ 03 -
రిషబ్ శెట్టి కాంతార ఛాప్టర్-1.. ఏ ఓటీటీకి రానుందంటే?
రిషబ్ శెట్టి (Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం కాంతార చాఫ్టర్-1(Kantara Chapter1). ఈ మూవీని బ్లాక్ బస్టర్ హిట్ కాంతారకు ప్రీక్వెల్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈరోజే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. తొలి రోజే ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ రిలీజైన తర్వాత ఏ ఓటీటీకి రానుందనే విషయంపై ఆసక్తి నెలకొంది.తాజాగా కాంతార ఛాప్టర్-1 ఓటీటీకి సంబంధించిన సినీ ప్రియులు సైతం నెట్టింట తెగ వెతికేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ రైట్స్ను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మేకర్స్ కుదుర్చుకున్న డీల్ ప్రకారం.. ఈ సినిమా ఆరు వారాల తర్వాతే ఓటీటీకి రానుందని టాక్ వినిపిస్తోంది. థియేటర్లలో వచ్చే రెస్పాన్స్ చూసి ఓటీటీ డేట్ రివీల్ చేయనున్నారు. అప్పటి వరకు కాంతార ఫ్యాన్స్ వెయిట్ చేయక తప్పదు. -
ఓటీటీకి వెన్నులో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలకు క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్స్కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి సినిమాలకు పెద్ద సంఖ్యలో ఆడియన్స్ ఉన్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి చిత్రాలు ఎక్కువగా వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా హాలీవుడ్ సినిమాల్లో ఫైనల్ డెస్టినేషన్ సిరీస్ చిత్రాలకు ఇండియాలోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ సిరీస్లో సుమారు 15 ఏళ్ల తర్వాత 'ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్ లైన్స్' పేరుతో ఆరో భాగాన్ని తెరకెక్కించారు. మే 15న భారత్లో రిలీజైన ఈ సినిమా ఆడియన్స్ను తెగ భయపెట్టేసింది.అయితే ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలో అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇండియా ఫ్యాన్స్కు మాత్రం వీక్షించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో మేకర్స్ మరో ఓటీటీలో ఫైనల్ డెస్టినేషన్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇండియా ఫ్యాన్స్ కోసం జియో హాట్స్టార్ వేదికగా అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 16 నుంచి తెలుగు ఇంగ్లీష్, హిందీ, తమిళం భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.కాగా.. రూ. 430 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 2300 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. జాక్ లిపోవ్స్కీ, అడమ్ స్టేయిన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సుమారు గంట 49 నిమిషాల రన్టైమ్ ఉన్న ఈ చిత్రంలో బ్రెక్ బసింగర్, విలియమ్ బ్లడ్వర్త్, రిచర్డ్ హార్మోన్, క్యాథలీన్ శాంటా జువానా, టియో బ్రియోన్స్ తదితరులు నటించారు. 2000లో తొలి పార్ట్ రాగా.. 2003, 2006, 2009, 2011లో మిగతా పార్ట్స్ వచ్చాయి. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఆరోది రిలీజ్ అయింది. -
ఓటీటీలోకి 'కురుక్షేత్ర'.. ట్రైలర్ రిలీజ్
కొన్నాళ్ల క్రితం థియేటర్లలోకి వచ్చిన యానిమేటెడ్ మూవీ 'మహావతార్ నరసింహా'.. ఊహించని విధంగా బ్లాక్బస్టర్ రెస్పాన్స్ అందుకుంది. కేవలం రూ.40 కోట్లు పెడితే రూ.300 కోట్ల పైగా కలెక్షన్ అందుకుని ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలోనే యానిమేటెడ్ ట్రెండ్ మొదలైపోయింది. తెలుగులోనూ రీసెంట్గానే 'వాయుపుత్ర' అనే యానిమేటెడ్ మూవీ ప్రకటించారు.(ఇదీ చదవండి: ధనుష్ 'ఇడ్లీ కొట్టు' సినిమా రివ్యూ)ఇది సినిమాల వరకే పరిమితం కాలేదు. ఇప్పుడు ఓటీటీలోనూ 'కురుక్షేత్ర' అనే యానిమేటెడ్ సిరీస్ రాబోతుంది. కొన్నిరోజుల క్రితం దీని స్ట్రీమింగ్ గురించి ప్రకటించారు. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే 18 రోజుల పాటు కురుక్షేత్ర సంగ్రామంలో ఏం జరిగిందో చూపించబోతున్నారని ట్రైలర్తో చూస్తే అర్థమైంది. కాకపోతే ట్రైలర్లో యానిమేషన్ ఏమంత గొప్పగా అనిపించలేదు.అక్టోబరు 10 నుంచి ఈ సిరీస్.. నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటితరానికి కురుక్షేత్రం గురించి పాండవులు, కౌరవుల మధ్య యుద్ధం గురించి చాలామందికి తెలియదు. ఒకవేళ యానిమేషన్ అంతంత మాత్రంగా ఉన్నాసరే మేకర్స్.. కంటెంట్ని ఎంగేజింగ్గా చెప్పగలిగితే ఈ సిరీస్ హిట్ కావొచ్చు. చూడాలి మరి ఏం చేశారో?(ఇదీ చదవండి: రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన 'జూనియర్') -
మరో ఓటీటీకి నయనతార వివాదాస్పద సినిమా.. వారికి మాత్రమే!
కోలీవుడ్ భామ నయనతార నటించిన వివాదాస్పద చిత్రం 'అన్నపూరణి-ది గాడెస్ ఆఫ్ ఫుడ్'. 2023లో వచ్చిన ఈ సినిమాకు నీలేశ్ కృష్ణ దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీకి థియేటర్ల వద్ద మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. ఇందులో నయన్ బ్రహ్మణి అమ్మాయి పాత్రలో కనిపించింది. అదే పెద్ద వివాదానికి దారితీసింది. ఈ చిత్రంలో ఓ బ్రహ్మణ అమ్మాయిని నాన్ వెజ్ వంటలు చేసే చెఫ్గా చూపించడం ఆ వర్గం మనోభావాలు దెబ్బతీసింది. దీంతో నెట్ఫ్లిక్స్ నుంచి ఈ సినిమాను తొలగించగా.. నయనతార క్షమాపణలు చెప్పింది.తాజాగా ఈ చిత్రం మరో భాషలో అందుబాటులోకి వస్తోంది. అక్టోబర్ 1 నుంచి జియో హాట్ స్టార్లో హిందీ వర్షన్ స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో రిలీజైన దాదాపు రెండేళ్లు పూర్తి కావొస్తోంది. ఇన్ని రోజుల తర్వాత హిందీ వర్షన్ అందుబాటులోకి తీసుకురావడం విశేషం. అన్నపూరణి సినిమాను జీ స్టూడియోస్, నాద్ స్టూడియోస్, ట్రైడెంట్ ఆర్ట్స్ బ్యానర్లపై ఆర్. రవీంద్రన్ మరియు జతిన్ సేథి నిర్మించారు. ఈ సినిమాకు టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ చిత్రం సింప్లీ సౌత్ అనే ఓటీటీలో అందుబాటులో ఉంది. అయితే ఈ ఓటీటీ ఫ్లాట్ఫామ్ కేవలం ఓవర్సీస్ ఆడియన్స్కు మాత్రం అందుబాటులో ఉంది. -
రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన 'జూనియర్'
కొన్నిరోజుల క్రితం వైరల్ వయ్యారి అంటూ శ్రీలీల తెగ వైరల్ అయిపోయింది. 'జూనియర్' సినిమాలోనిది ఆ పాట. అయితే దాదాపు రెండున్నర నెలల క్రితం థియేటర్లలోకి మూవీ వచ్చింది. కానీ ఓటీటీ సంగతి మాత్రం పూర్తిగా సైలెంట్గా ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఒకేసారి రెండింటిలో స్ట్రీమింగ్ అయిపోయింది. ఇంతకీ ఈ మూవీ వేటిలో చూడొచ్చు.గాలి జనార్ధన రెడ్డి కొడుకు కిరీటి హీరోగా పరిచయమైన చిత్రం 'జూనియర్'. కాలేజీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ కాగా జెనీలియా కీలక పాత్రలో నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. రాధాకృష్ణ రెడ్డి దర్శకత్వం వహించాడు. థియేటర్లలో మోస్తరు టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు ముందే ప్రకటించినట్లు డిజిటల్గా అందుబాటులోకి వచ్చింది.(ఇదీ చదవండి: 1,050 సినిమాల పైరసీ.. రూ.22,400 కోట్ల నష్టం)ముందే చెప్పినట్లు ఆహా ఓటీటీలోకి రాగా.. ఏ మాత్రం హడావుడి లేకుండా సైలెంట్గా అమెజాన్ ప్రైమ్లోకి కూడా వచ్చేసింది. ఈ రెండింటిలో తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుండగా.. నమ్మ ఫ్లెక్స్ అనే ఓటీటీలో కన్నడ వెర్షన్ అందుబాటులో ఉంది.'జూనియర్' విషయానికొస్తే.. అభి (కిరీటి) జ్ఞాపకాలే ముఖ్యమనుకునే కుర్రాడు. అలా జాలీగా ఇంజినీరింగ్ చేస్తాడు. కాలేజీలో ఉన్నప్పుడు ప్రేమించిన స్పూర్తి(శ్రీలీల) పనిచేస్తున్న కంపెనీలోనే ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. అయితే అదే కంపెనీకి బాస్ అయిన విజయ(జెనీలియా)కి అభి అస్సలు నచ్చడు. అయితే వీళ్లిద్దరికీ ఓ గతం ఉంటుంది. ఒకరంటే ఒకరిని పడని అభి-విజయ.. విజయనగరం అనే ఊరికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది. చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ ఓజీకి బిగ్ షాక్..!) -
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు.. ఆ మూడు మాత్రం
మరోవారం వచ్చేసింది. ఈసారి దసరా పండగ హడావుడి తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది. ఈ వారంలో తెలుగు స్ట్రెయిట్ మూవీస్ ఏం విడుదల కావట్లేదు. ధనుష్ 'ఇడ్లీ కొట్టు', రిషభ్ శెట్టి 'కాంతార 1' లాంటి డబ్బింగ్ చిత్రాలు వరస రోజుల్లో బిగ్ స్క్రీన్పైకి రానున్నాయి. వీటిలో 'కాంతార' ప్రీక్వెల్పై ఓ మాదిరి బజ్ ఉంది.(ఇదీ చదవండి: Bigg Boss 9: ప్రియ ఎలిమినేట్.. ఎంత సంపాదించిందంటే?)మరోవైపు ఓటీటీల్లోనూ చెప్పుకోదగ్గ రీతిలో పలు చిత్రాలు స్ట్రీమింగ్ కానున్నాయి. మదరాసి, జూనియర్ మూవీస్ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు 'ద గేమ్' సిరీస్ కూడా కాస్తోకూస్తో ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఈ వారం ఓటీటీల్లోకి ఏయే మూవీస్ ఎందులో స్ట్రీమింగ్ కానున్నాయంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 5 వరకు)అమెజాన్ ప్రైమ్మదరాసి (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబరు 01ప్లే డర్టీమూవీ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 01నెట్ఫ్లిక్స్మిస్సింగ్ కింగ్ (జపనీస్ సిరీస్) - సెప్టెంబరు 29నైట్ మేర్స్ ఆఫ్ నేచర్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 30ద గేమ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబరు 02మాన్స్టర్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 03ఆహాజూనియర్ (తెలుగు సినిమా) - సెప్టెంబరు 30సన్ నెక్స్ట్సాహసం (తమిళ మూవీ) - అక్టోబరు 01గౌరీ శంకర (కన్నడ సినిమా) - అక్టోబరు 01టేల్స్ ఆఫ్ ట్రెడిషన్ (తమిళ సిరీస్) - అక్టోబరు 02జీ5చెక్ మేట్ (మలయాళ సినిమా) - అక్టోబరు 02డాకున్ డా ముందా 3 (పంజాబీ మూవీ) - అక్టోబరు 02సోనీ లివ్13th (హిందీ సిరీస్) - అక్టోబరు 01ఆపిల్ ప్లస్ టీవీద సిస్టర్ గ్రిమ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 02లాస్ట్ బస్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 03(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'వార్ 2'.. స్ట్రీమింగ్ డేట్ అదేనా?) -
ఓటీటీలోకి 'వార్ 2'.. స్ట్రీమింగ్ డేట్ అదేనా?
ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తీస్తున్న 'డ్రాగన్' మూవీ చేస్తున్నాడు. త్వరలో కొత్త షెడ్యూల్ మొదలుకానుంది. దీంతో దాదాపుగా షూటింగ్ పూర్తి కానుంది. మరోవైపు నెలన్నర క్రితం 'వార్ 2' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించాడు. దీనికి మిశ్రమ స్పందన వచ్చింది. హిందీలో ఓ మాదిరిగా ఆడింది గానీ తెలుగులో చెప్పుకోదగ్గ వసూళ్లు వచ్చినట్లు కనిపించలేదు. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.'ఆర్ఆర్ఆర్' తర్వాత పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్.. హిందీలో 'వార్ 2' చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. స్పై యూనివర్స్లో వచ్చిన సినిమా ఇది. హృతిక్ రోషన్, తారక్ లీడ్ రోల్స్ చేశారు. కియారా అడ్వాణీ హీరోయిన్. అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఆగస్టు 14న దేశవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. అయితే టాక్ ఏ మాత్రం పాజిటివ్ రాకపోవడంతో వసూళ్లు కూడా తక్కువగానే వచ్చాయి.(ఇదీ చదవండి: నొప్పితోనే 'కాంతార 1' ఈవెంట్కు ఎన్టీఆర్)ఇకపోతే హిందీ సినిమాలు చాలావరకు 8 వారాల విండోతోనే ఓటీటీల్లోకి వస్తున్నాయి. ఇప్పుడు 'వార్ 2' కూడా అలానే నెట్ఫ్లిక్స్లోకి రాబోతుందని, అయితే దసరా సందర్భంగా ఈ వీకెండ్లో స్ట్రీమింగ్ అయినా సరే ఆశ్చర్యపోనక్కర్లేదని మరో మాట వినిపిస్తుంది. ఇదే జరిగితే అక్టోబరు 2న లేదంటే 9న రావొచ్చని టాక్ అయితే వినిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి?'వార్ 2' విషయానికొస్తే.. రా మాజీ ఏజెంట్ కబీర్ (హృతిక్ రోషన్)ని తమ కార్టెల్లో భాగం చేసుకోవాలనేది కలి అనే విలన్ ప్లాన్. దీంతో టాస్క్ పేరు చెప్పి కబీర్తో తనకి గాడ్ ఫాదర్ లాంటి సునీల్ లుథ్రాని చంపించేస్తారు. దీంతో కబీర్ని పట్టుకునేందుకు రా కొత్త చీఫ్ విక్రాంత్ కౌల్ (అనిల్ కపూర్), భారత ప్రభుత్వం సోల్జర్ విక్రమ్ చలపతి (ఎన్టీఆర్) నేతృత్వంలో ఓ టీమ్ రంగంలోకి దింపుతుంది. ఆ బృందంలో లూథ్రా కూతురు, వింగ్ కమాండర్ కావ్య లూథ్రా (కియారా అడ్వాణీ) కూడా ఉంటుంది. అసలు కబీర్ దేశద్రోహిగా ఎందుకు మారాడు? కబీర్కి విక్రమ్ ఎవరో తెలిశాక ఏం చేశాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: టాలీవుడ్ డైరెక్టర్ నిశ్చితార్థం.. చైతూ-శోభిత సందడి) -
'ద ట్రయల్ 2' రివ్యూ: ఈ సిరీస్ పెద్దల కోసమే!
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో ‘ది ట్రయల్’ రెండో సీజన్ ఒకటి. ఈ సిరీస్ గురించి తెలుసుకుందాం.ఏదైనా నేరం జరిగితే తగిన సాక్ష్యాలతో నేరస్థుడిని నిరూపించే ప్రక్రియలో న్యాయవాదులు ఉంటారు. ఆ న్యాయవాదుల సమూహంగా కొన్ని కంపెనీలు కూడా ఉంటాయి. ఆ కంపెనీలలో ఎంతో మంది న్యాయవాదులు తమ క్లయింట్ల తరఫున కోర్టులో విచారణకు హాజరవుతుంటారు. అటువంటి లా ఫర్మ్లపై తీసిన సిరీస్ ‘ది ట్రయల్’. 2023లో ఈ సిరీస్ మొదటి భాగం హాట్ స్టార్ వేదికగా రిలీజ్ అయింది. మళ్ళీ రెండేళ్ళకు దానికి కొనసాగింపుగా ఇప్పుడు 2025లో ‘ది ట్రయల్’ రెండో సీజన్ రిలీజ్ అయింది. కాజోల్ ప్రధాన పాత్రలో నటించగా ఆమె భర్త అజయ్ దేవగన్ ఈ సిరీస్కి నిర్మాతగా వ్యవహరించడం విశేషం.రెండు సిరీస్లు కలిపి 14 ఎపిసోడ్లతో ఉన్న ‘ది ట్రయల్’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్ కథాంశానికొస్తే... న్యోనికాసేన్ గుప్తా ఓ పేరున్న ఫర్మ్లో మంచి లాయర్. ఆమె భర్త రాజకీయ నాయకుడు. ఆమె చేస్తున్న లా ఫర్మ్లో ఎన్నో రాజకీయాలతో ఆమె ప్రమోషన్ని అడ్డుకుంటూ న్యోనికా కుటుంబానికి కూడా ఆపద కలిగిస్తుంటారు ఆమె ప్రత్యర్థులు. ఆ లా ఫర్మ్లోకి వచ్చే కేసులు కూడా ఈ భార్యాభర్తలకు లింకు అవుతుంటాయి. ఆ లింకులు పెద్ద పెద్ద కష్టాలనే తెచ్చిపెడతాయి. మరి... ఆ కష్టాలన్నింటినీ తట్టుకుని తన క్లయింట్ల కేసులను వాదిస్తూ, ఫర్మ్లోని రాజకీయాలను ఎదుర్కొంటూ న్యోనికా నిజంగా ట్రయల్ గెలుస్తుందా? లేదా అన్నది మాత్రం సిరీస్లోనే చూడాలి. హాట్ స్టార్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ‘ది ట్రయల్’ మంచి కాలక్షేపం. ఈ లా ఫర్మ్ కథలు పెద్దలు మాత్రమే చూడదగినవి. ఎంజాయ్..– హరికృష్ణ ఇంటూరు -
అక్టోబర్ 2 నుంచి నెట్ఫ్లిక్స్లో గేమ్
చారిత్రక కథా చిత్రంలో నటించాలనుంది తమిళసినిమా: నటి శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రను పోషించిన వెబ్ సిరీస్ గేమ్. సంతోష్ ప్రతాప్ హీరోగా నటించిన ఈ వెబ్ సిరీస్కు రాజేశ్.ఎం.సెల్వ దర్శకత్వం వహించారు. తమిళంలో రూపొందిన ఈ థ్రిల్లర్ కథాంశంతో కూడిన వెబ్ సిరీస్ను నెట్ ఫ్లిక్స్ సంస్థ, అప్లాజ్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ కలిసి నిర్మించాయి. క్రీడ అనేది కాలక్షేపానికి మాత్రమేననీ, అయితే అదే ప్రళయంగా మారితే అనే కథాంశంతో కూడిన ఈ వెబ్ సిరీస్ను అక్టోబర్ 2వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ కథ థ్రిల్లర్ మాత్రమే కాదనీ జీవన ప్రపంచాన్ని ప్రతిబింబించే థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు చెప్పారు. ఇందులో కుటుంబ అనుబంధాలతో పాటు వర్చువల్ ప్రపంచం చోటు చేసుకుంటాయన్నారు. వర్చువల్ ప్రపంచంగా మాత్రమే ఉండడం లేదనీ అది జీవితాలను టచ్ చేసినప్పుడు ఏర్పడే తీవ్ర పరిణామాలను కట్టడి చేయలేకపోతున్నామన్నారు. అలాంటి కథాంశంతో తెరకెక్కించిన వెబ్ చిత్రం గేమ్ అని చెప్పారు. ఇది తాను దర్శకత్వం వహించిన తొలి తమిళ్ ఒరిజినల్ వెబ్ సిరీస్ అని చెప్పారు. దీన్ని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారన్న ఆతృతతో ఎదురు చూస్తున్నట్లు దర్శకుడు రాజేశ్ ఎం.సెల్వ పేర్కొన్నారు. -
మోహన్ లాల్ 'హృదయపూర్వం' సినిమా రివ్యూ (ఓటీటీ)
ఓటీటీల్లోకి వచ్చే మలయాళ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. థ్రిల్లర్ చిత్రాలు ఎక్కువగా ఈ ఇండస్ట్రీ నుంచి వస్తుంటాయి. కానీ అప్పుడప్పుడు ఫీల్ గుడ్ ఎమోషనల్ మూవీస్ కూడా వస్తుంటాయి. అలాంటి ఓ చిత్రమే 'హృదయపూర్వం'. గత నెలలో థియేటర్లలో రిలీజై రూ.100 కోట్లకు పైగా కలెక్షన్ అందుకున్న ఈ సినిమా.. ఇప్పుడు హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఇది ఎలా ఉంది? చూడొచ్చా లేదా?కథేంటి?సందీప్ బాలకృష్ణన్(మోహన్ లాల్) కొచ్చిలో క్లౌడ్ కిచెన్ నడుపుతుంటాడు. ఇతడికి గుండె సమస్య. ఓ రోజు పుణెలో ఉండే కర్నల్ రవీచంద్రన్ ప్రమాదంలో చనిపోతాడు. దీంతో ఈయన గుండెని వైద్యులు.. సందీప్కి అమర్చుతారు. తర్వాత కొన్నిరోజులకు సందీప్ దగ్గరకు వచ్చిన కర్నల్ కూతురు హరిత(మాళవిక మోహనన్).. తన నిశ్చితార్థానికి రమ్మని ఆహ్వానిస్తుంది. అలా సందీప్.. పుణె వెళ్తాడు. అక్కడికి వెళ్లాక ఎదురైన పరిస్థితులు ఏంటి? రెండు రోజులు అనుకున్నది కాస్త రెండు వారాలు ఎందుకు ఉండాల్సి వచ్చింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఇప్పుడొస్తున్న చాలా సినిమాలు ఫ్యామిలీ ఆడియెన్స్ని ఎంటర్టైన్ చేయడంలో ఫెయిల్ అవుతున్నాయి. కానీ ఈ చిత్రం ఫీల్ గుడ్ ఎమోషన్స్తో అందరినీ ఆకట్టుకుంటుంది. చెప్పుకోవాలంటే ఇందులో పెద్దగా కథేం ఉండదు కానీ పరిస్థితులకు తగ్గట్ల వచ్చే సింపుల్ కామెడీ, క్లైమాక్స్లో వచ్చే ఎమోషన్స్.. ఫెర్ఫెక్ట్ మూవీ చూశాం అనే ఫీలింగ్ కలిగిస్తాయి.సాధారణంగా అవయవాల ట్రాన్స్ప్లాంటేషన్ అనే మాటని అప్పుడప్పుడు వింటుంటాం. అలా ప్రమాదంలో చనిపోయిన ఓ వ్యక్తి గుండెని హీరోకి అమర్చుతారు. చెప్పుకొంటే ఇది సీరియస్ సబ్జెక్ట్. కానీ దర్శకుడు దీన్ని ఓ అందమైన ప్రయాణంలా చూపించాలని ఫిక్సయ్యాడు. ఆ విషయంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు.కర్నల్ గుండెని సందీప్కి అమర్చడంతో కథ నేరుగా మొదలవుతుంది. తర్వాత సందీప్ చుట్టూ ఉండే ప్రపంచాన్ని చూపిస్తారు. అనంతరం జెర్రీ అనే నర్స్తో కలిసి పుణె వెళ్లడం, అనుకోని పరిస్థితుల్లో హరిత నిశ్చితార్థం ఆగిపోవడం.. ఇలా స్టోరీలో సంఘర్షణ ఏర్పడుతుంది. అప్పటివరకు కామెడీగా వెళ్తున్నది కాస్త రొమాంటిక్ టర్న్ తీసుకుంటుంది. హరిత, అతడి తల్లి చూపించే కేరింగ్ హీరోకి మరోలా అర్థం కావడం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. చివరకొచ్చేసరికి ఎమోషనల్గా ముగించిన తీరు ఆకట్టుకుంటుంది.ప్రారంభంలో మొహమాటం, కాస్తంత అమాయకత్వం ఉన్న సందీప్... గుండె అమర్చిన తర్వాత పరిస్థితుల కారణంగా ఎలా మారుతాడు. చివరకు ధైర్యం, ముక్కుసూటితనం లాంటివి ఎలా నేర్చుకుంటాడు అనే విషయాన్ని చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. ఇందులో హీరో హీరోయిన్ అంటూ ఎవరూ ఉండరు. మోహన్ లాల్ పాత్ర అతి సామాన్యంగా ఉంటుంది. హరిత, ఆమె తల్లి పాత్రలు కూడా మన చుట్టూ మనుషుల్లానే అనిపిస్తారు.సందీప్ బాలకృష్ణన్ పాత్రని మోహన్ లాల్ సటిల్డ్గా చేసుకుంటూ వెళ్లిపోయాడు. హరితగా మాళవిక మోహనన్ అందంగా ఉంది. జెర్రీగా సంగీత్ ప్రతాప్, సందీప్ బావగా సిద్ధిఖీ కామెడీ చేసే బాధ్యత తీసుకున్నారు. వీళ్లతో పాటు మిగతా పాత్రధారులందరూ ఏ మాత్రం అతి చేయకుండా చాలా సహజంగా నటించారు. చూస్తున్నంతసేపు ఓ సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ రానంత సహజంగా అనిపిస్తుంది. పాటలు, సెకండాఫ్లో వచ్చే మెలోడ్రామా కాస్త సాగదీతగా అనిపిస్తుంది. తప్పితే ఓవరాల్గా మూవీ భలే అనిపిస్తుంది. కుటుంబంతో కలిసి నిరభ్యంతరంగా చూడొచ్చు.- చందు డొంకాన -
ఓటీటీకి వచ్చేస్తోన్న మదరాసి.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన చిత్రం మదరాసి. అమరన్ సూపర్ హిట్ తర్వాత వచ్చిన ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రం సెప్టెంబరు 5న బిగ్ స్క్రీన్పై సందడి చేసింది. అయితే ఫ్యాన్స్ అంచనాలు అందుకోలేకపోయినా.. ఉన్నంతలో ఫర్వాలేదనిపించింది. అయినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కోట్ల రూ.100 వసూళ్లు రాబట్టింది. కాగా.. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా మెప్పించింది.ఈ యాక్షన్ మూవీ కోసం ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తోన్న ఓటీటీ స్ట్రీమింగ్ డేట్స్ వైరల్ కావడంతో అధికారిక ప్రకటన వచ్చేసింది. అక్టోబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు శివ కార్తికేయన్తో వీడియో రిలీజ్ చేసింది. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్లో విద్యుత్ జమాల్ విలన్గా మెప్పించగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు.మదరాసి కథేంటంటే?తమిళనాడులో గన్ కల్చర్ తీసుకురావాలనేది విరాట్(విద్యుత్ జమ్వాల్) అనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్లాన్. ఇందులో భాగంగా గన్స్ ఉన్న ఆరు కంటెయినర్లని రాష్ట్రంలోకి తీసుకొస్తుంటాడు. ఈ సంగతి ఎన్ఐఏ(NIA)కి తెలుస్తుంది. ఆఫీసర్ ప్రేమ్(బిజు మేనన్).. తన టీమ్తో కలిసి వీటిని ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ పెద్ద గొడవ. ఆఫీసర్ ప్రేమ్ తీవ్ర గాయాలపాలవుతాడు. మరోవైపు లవ్ ఫెయిలైందని రఘు(శివకార్తికేయన్) ఆత్మహత్యాయత్నం చేస్తాడు. ఫ్లైఓవర్ పై నుంచి దూకేస్తాడు. ఇతడికీ గాయాలవుతాయి. అనుకోకుండా ప్రేమ్-రఘని ఒకే అంబులెన్స్లో ఆస్పత్రికి తీసుకొస్తారు. తర్వాత ప్రేమ్ లీడ్ చేస్తున్న మిషన్లోకి రఘు ఎలా ఎంటర్ అయ్యాడు? రఘు ప్రేమించిన మాలతి (రుక్మిణి వసంత్) ఎవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. Brace yourself for a mad ride with yours truly Madharaasi ❤️🔫#MadharaasiOnPrime, Oct 1@SriLakshmiMovie @Siva_Kartikeyan @ARMurugadoss @anirudhofficial @VidyutJammwal #BijuMenon @rukminitweets @actorshabeer @vikranth_offl @SudeepElamon pic.twitter.com/McLGlMBEN4— prime video IN (@PrimeVideoIN) September 26, 2025 -
ఫ్రైడే ధమాకా: ఒక్కరోజే ఓటీటీలో 22 సినిమాలు
ఈ ఫ్రైడే ఓటీటీలో కిక్కిచ్చే సినిమాలు రిలీజవుతున్నాయి. యాక్షన్, హారర్, కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్.. ఇలా అన్నిరకాల చిత్రాలు ఓటీటీప్రియులను అలరించేందుకు రెడీ అయ్యాయి. వాటిలో ఘాటి, హృదయం పూర్వం, సుమతి వళవు చిత్రాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మరి రేపు (సెప్టెంబర్ 26) ఒక్కరోజే ఓటీటీలో రిలీజయ్యే సినిమాలేంటో చూసేద్దాం..జియోహాట్స్టార్👉 హృదయపూర్వం (మలయాళ మూవీ)అమెజాన్ ప్రైమ్👉 ఘాటి (తెలుగు మూవీ)👉 మాదేవా (కన్నడ మూవీ)నెట్ఫ్లిక్స్👉 ధడక్ 2 (హిందీ మూవీ)👉 సనాఫ్ సర్దార్ (హిందీ మూవీ)👉 ఒడుమ్ కుతిరా చడుమ్ కుతిరా (మలయాళ మూవీ)👉 ది గెస్ట్ (ఇంగ్లీష్ సిరీస్) 👉 అలైస్ (ఇంగ్లీష్ సిరీస్)👉 హౌస్ ఆఫ్ గిన్నీస్ (ఇంగ్లీష్ సిరీస్)👉 మాంటిస్ (దక్షిణ కొరియన్ సినిమా)👉 ఫ్రెంచ్ లవర్ (ఇంగ్లీష్ మూవీ)👉 రుత్ అండ్ బోజ్ (ఇంగ్లీష్ మూవీ)👉 క్రైమ్సీన్ జీరో (కొరియన్ వెబ్సిరీస్ - కొత్త ఎపిసోడ్)జీ5👉 జనావర్: ద బీస్ట్ వితిన్ (హిందీ సిరీస్)👉 సుమతి వళవు (మలయాళ సినిమా)సన్ నెక్స్ట్👉 మేఘాలు చెప్పిన ప్రేమకథ (తెలుగు మూవీ)👉 దూరతీర యానా (కన్నడ మూవీ)ఆపిల్ ప్లస్ టీవీ👉 ఆల్ ఆఫ్ యూ (ఇంగ్లీష్ మూవీ)👉 ద సావంత్ (ఇంగ్లీష్ సిరీస్)లయన్స్ గేట్ ప్లే👉 డేంజరస్ యానిమల్స్ (ఇంగ్లీష్ సినిమా)మనోరమ మ్యాక్స్👉 సర్కీత్ (మలయాళ మూవీ)హుళు👉 ద మ్యాన్ ఇన్ మై బేస్మెంట్ (ఇంగ్లీష్ మూవీ)చదవండి: OG మూవీలో హీరోయిన్కు అన్యాయం -
‘ఓజీ’.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా?
పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ మూవీ ఎట్టకేలకు నేడు(సెప్టెంబర్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ మూవీపై ముందు నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆ అంచనాలను మాత్రం ఈ సినిమా అందుకోలేపోయింది. సాంకేతికంగా సినిమా బాగున్నా.. కథ-కథనం అంతగా ఆకట్టుకోలేకపోయిందని పలు రివ్యూస్ చెబుతున్నాయి. (‘ఓజీ’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఎలివేషన్పైనే ఎక్కువ దృష్టిపెట్టి.. కథనాన్ని గాలికొదిలేశారనే విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి రిలీజ్ ముందు ఉన్నంత అయితే హైప్ ఇప్పుడు లేదు. మరి ఈ ప్రభావం కలెక్షన్స్పై ఉంటుందో లేదో వీకెండ్లో తెలిసిపోతుంది. ఇక ఈ సినిమాకు టికెట్ రేట్లు అధికంగా పెంచడంతో సాధారణ సినీ ప్రేక్షకులు థియేటర్స్కు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. నాలుగు రోజులు ఆగితే ఓటీటీలోకి వచ్చేస్తుందిలే అని చాలా మంది అనుకుంటున్నారు. నెట్టింట కూడా ఓజీ ఓటీటీ రిలీజ్పై ఆరా తీస్తున్నారు. ఏ ఓటీటీలో వస్తుంది.. ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది.. తదితర విషయాల గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. ఆ ఓటీటీలోనే.. ఓజీ డిజిటల్ రైట్స్ని ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 80 కోట్లకు వరకు చెల్లించినట్లు టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. అయితే రిలీజ్ అయిన నాలుగు వారాల్లోనే ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకురావాలనుకున్నారట. ఈ ఒప్పందంతోనే నెట్ఫ్లిక్స్ అంత డబ్బు పెట్టి ఓటీటీ రైట్స్ తీసుకుందట. ఈ లెక్కన అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ ఫస్ట్ వీక్లో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. -
శ్రద్ధా శ్రీనాథ్ వెబ్ సీరిస్ స్ట్రీమింగ్.. ట్రైలర్ చూశారా?
కాశ్మీర్ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ నటించిన వెబ్ సీరిస్ 'ది గేమ్ : యు నెవర్ ప్లే అలోన్' విడుదలకు సిద్ధమైంది. అక్టోబర్ 2న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు. దర్శకుడు సెల్వా తెరకెక్కించిన ఈ వెబ్ సీరిస్ను అప్లాజ్ ఎంటర్ టైన్ మెంట్స్ తెరకెక్కిస్తుంది. ఇందులో సంతోష్ ప్రతాప్, చాందినీ, శ్యామ హరిణి, హేమా, బాల హాసన్, ధీరజ్ తదితరులు నటించారు. 'ది గేమ్ : యు నెవర్ ప్లే అలోన్' అనే వెబ్ సిరీస్ను తమిళ్లో నెట్ఫ్లిక్స్ విడుదల చేస్తున్న మొదటిది కావడం విశేషం. ఇందులో డిజిటల్ యుగం రియాలిటీలతో పాటు ప్రజల కోరికలు వారి బలం, బలహీనత, నిజం, అబద్దం వంటి అంశాల్లో ఉండే చిన్న తేడాలను ఈ చిత్రంలో చూపించనున్నారు. ఈ వెబ్ సిరీస్ తెలుగు వర్షన్ కూడా విడుదల కావచ్చని తెలుస్తోంది. -
ఓటీటీలోకి అనుష్క ‘ఘాటీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
అనుష్క శెట్టి(Anushka shetty) నటించిన తాజా చిత్రం ‘ఘాటి’(Ghaati Movie). క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం ఈ చిత్రం సెప్టెంబర్ 5న విడుదలై మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. కథా నేపథ్యం బాగున్నా.. దాన్ని అంతే ఆకర్షనీయంగా తెరపై చూపించడంలో క్రిష్ సఫలం కాలేదు. ఫలితంగా రెండో రోజు నుంచే సినిమా కలెక్షన్స్ తగ్గిపోయాయి. దీంతో విడుదలైన 20 రోజుల్లోనే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తోంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ని అమెజాన్ ప్రైమ్(Amazon prime Video) రిలీజ్ చేసింది.స్ట్రీమింగ్ ఎప్పుడంటే..‘ఘాటి’ఓటీటీ రైట్స్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. అయితే రిలీజైన 8 వారాలకు ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనుకున్నారు. కానీ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ముందుగానే ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. సెప్టెంబర్ 26 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.ఘాటి కథేంటంటే..ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మాత్రమే ఖరీదైన గంజాయి పంట శీలావతి. ఆ పంటను కోసి, బయటకు తీసుకొచ్చే సత్తా ఘాటీలకు మాత్రమే ఉంటుంది. అలా బయటకు తీసుకొచ్చిన గంజాయిని డ్రగ్స్ మాఫీయా లీడర్ కాష్టాల నాయుడు (రవీంద్ర విజయ్), అతని తమ్ముడు కుందుల నాయుడు(చైతన్యరావు) ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తుంటారు. అలా ఘాటీలుగా పని చేసిన దేశిరాజు(విక్రమ్ ప్రభు), శీలావతి(అనుష్క).. ఓ కారణంగా ఆ పని వదిలేస్తారు... వేరే పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు.కట్ చేస్తే.. కుందుల నాయుడికి తెలియకుండా ఓ గ్యాంగ్ శీలావతి గంజాయిని లిక్విడ్గా మార్చి బయటి ప్రాంతాలకు సరఫరా చేస్తుంటుంది. ఈ ముఠాకి లీడర్గా దేశిరాజు ఉన్నట్లు కుందుల నాయుడికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఘాటీ పని వదిలిన దేశి రాజు, శీలావతి మళ్లీ గంజాయి స్మగ్లింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? శీలావతి క్రిమినల్గా ఎందుకు మారాల్సి వచ్చింది? దేశిరాజు లక్ష్యం ఏంటి? ఆ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు శీలావతి ఏం చేసింది? అనేదే మిగతా కథ. -
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు రొమాంటిక్ సినిమా
మరో తెలుగు సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. థియేటర్లలోకి వచ్చిన నెలరోజుల్లోనే స్ట్రీమింగ్ కానుంది. మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా కాన్సెప్ట్తో తీసిన ఈ చిత్రానికి డీసెంట్ టాక్ వచ్చింది. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఏ ఓటీటీలోకి రానుంది?మత్తు వదలరా, పంచతంత్రం, పరువు, వికటకవి లాంటి సినిమాలు, వెబ్ సిరీస్ల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న నరేశ్ అగస్త్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'మేఘాలు చెప్పిన ప్రేమకథ'. ఆగస్టు 22న థియేటర్లలో రిలీజ్ కాగా ప్రేక్షకుల్లో పెద్దగా రిజిస్టర్ కాకుండానే మాయమైపోయింది. ఇప్పుడు సన్ నెక్స్ట్ ఓటీటీలో ఈ నెల 26 నుంచి అంటే శుక్రవారం నుంచే అందుబాటులోకి వచ్చేసింది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: రామ్ చరణ్ కోసం ఫ్లాప్ హీరోయిన్?) 'మేఘాలు చెప్పిన ప్రేమకథ' విషయానికొస్తే.. వరుణ్ (నరేశ్ అగస్త్య) విదేశాల్లో చదువుకుని తిరిగి ఇండియాకు వచ్చేస్తాడు. సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనేద ఇతడి కోరిక. దీని గురించి తండ్రికి(సుమన్) చెబితే కోప్పడతాడు. దీంతో వరుణ్ ఇంటి నుంచి బయటకొచ్చేస్తాడు. తమిళనాడులోని వాల్పరై అనే ఊరికి వెళ్తాడు. ఇక్కడ చిన్నప్పుడు నాయినమ్మ కాంచీపురం కామాక్షి శంకరమూర్తి(రాధిక శరత్ కుమార్)తో గడిపిన బంగ్లా, ఎస్టేట్ ఉంటాయి. మరోవైపు మేఘన(రబియా ఖాతూన్) కూడా ఈ ఊరికి వస్తుంది. అనుకోని పరిస్థితుల్లో వరుణ్-మేఘన ప్రేమలో పడతారు. మరి వీరిద్దరి మధ్య దూరం ఎందుకు పెరిగింది? గాయకుడు, సంగీత దర్శకుడిగా వరుణ్ సక్సెస్ అయ్యాడా లేదా అనేది మిగతా స్టోరీ.ఈ వారం ఓటీటీల్లో 'మేఘాలు చెప్పన ప్రేమకథ' కాకుండా జూనియర్, సుందరకాండ లాంటి స్ట్రెయిట్ తెలుగు మూవీస్ కూడా ఓటీటీలోకి వచ్చేశాయి. అలానే హృదయపూర్వం, ఒడుమ్ కుతిరా చడుమ్ కుతిరా, సుమతి వళవు తదితర డబ్బింగ్ సినిమాలు కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటితో పాటు సడన్ సర్ప్రైజులు లాంటి కొత్త చిత్రాలు కూడా ఏమైనా రావొచ్చు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 27 సినిమాలు)Two worlds, one bond.Together, they find something greater 💖💫Meghalu Cheppina Prema Katha premieres 26th September on SunNXT.Watch the journey unfold!#MeghaluCheppinaPremaKatha #Premieres26thSeptemberOnSunNXT #LoveStory #MusicalRomance pic.twitter.com/qbHwqVq0ZX— SUN NXT (@sunnxt) September 22, 2025 -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 27 సినిమాలు
మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి పవన్ కల్యాణ్ 'ఓజీ' మూవీ రానుంది. మరి ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి? మరోవైపు ఓటీటీల్లో 27 సినిమాలు, వెబ్ సిరీసులు రానున్నాయి. ఈ వీకెండ్ తెలుగు స్ట్రెయిట్ చిత్రాలతో పాటు పలు డబ్బింగ్లు కూడా ఉండటం ఆసక్తి రేపుతోంది.(ఇదీ చదవండి: 'ఓజీ'.. జస్ట్ మిస్ అయింది)ఓటీటీల్లో రిలీజయ్యే వాటి విషయానికొస్తే.. జూనియర్, సుందరకాండ లాంటి స్ట్రెయిట్ సినిమాలతో పాటు హృదయపూర్వం, ఒడుమ్ కుతిరా చడుమ్ కుతిరా, సుమతి వళవు తదితర డబ్బింగ్ చిత్రాలు రాబోతున్నాయి. వీటిపై కాస్తంత ఆసక్తి ఉండనే ఉంది. ఇవే కాకుండా వీకెండ్లో సడన్ సర్ప్రైజ్లు ఏమైనా ఉండొచ్చేమో చూడాలి? ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ కానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు (సెప్టెంబరు 21 నుంచి 28 వరకు)ఆహాజూనియర్ (తెలుగు సినిమా) - సెప్టెంబరు 22అమెజాన్ ప్రైమ్హోటల్ కాస్టైరా (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 24కొకైనా క్వార్టర్ బ్యాక్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 25టూమచ్ విత్ కాజల్ అండ్ ట్వింకిల్ (హిందీ టాక్ షో) - సెప్టెంబరు 25మాదేవా (కన్నడ సినిమా) - సెప్టెంబరు 26నెట్ఫ్లిక్స్ఒడుమ్ కుతిరా చడుమ్ కుతిరా (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 26ది గెస్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 26అలైస్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 26మాంటిస్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 26హౌస్ ఆఫ్ గిన్నీస్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 26హాట్స్టార్సుందరకాండ (తెలుగు సినిమా) - సెప్టెంబరు 23ది డెవిల్ ఈజ్ బిజీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - సెప్టెంబరు 24హృదయపూర్వం (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 26మార్వెల్ జాంబియాస్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 24ద బల్లాడ్ ఆఫ్ వల్లిస్ ఐలాండ్ (ఇంగ్లీష్ చిత్రం) - సెప్టెంబరు 28ఉమన్ ఇన్ ద యార్డ్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 28ద ఫ్రెండ్ (ఇంగ్లీష్ చిత్రం) - సెప్టెంబరు 28డెత్ ఆఫ్ ఏ యూనికార్న్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 28సన్ నెక్స్ట్దూరతీర యానా (కన్నడ మూవీ) - సెప్టెంబరు 26జీ5జనావర్ (హిందీ సిరీస్) - సెప్టెంబరు 26సుమతి వళవు (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 26ఆపిల్ ప్లస్ టీవీస్లో హార్సస్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 24ఆల్ ఆఫ్ యూ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 26ద సావంత్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 26లయన్స్ గేట్ ప్లేడేంజరస్ యానిమల్స్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 26మనోరమ మ్యాక్స్సర్తీక్ (మలయాళ మూవీ) - సెప్టెంబరు 26ఎమ్ఎక్స్ ప్లేయర్సిక్సర్ సీజన్ 2 (హిందీ సిరీస్) - సెప్టెంబరు 24(ఇదీ చదవండి: మనీష్ ఎలిమినేట్.. రెండువారాల సంపాదన ఎంతంటే?) -
ఓటీటీలో కనిపించని 'జూనియర్'.. కారణం ఏంటి?
కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా నటించిన తొలి చిత్రం జూనియర్(Junior Movie).. థియేటర్స్లో మెప్పించిన ఈ సినిమా తాజాగా ఓటీటీ ప్రకటన కూడా చేసింది. ఇందులో ‘వైరల్ వయ్యారి..’ పాటకు శ్రీలీల, కిరీటి వేసిన స్టెప్పులు సినిమాకు భారీ హైప్ వచ్చింది. దీంతో ఈ మూవీ ఓటీటీ విడుదల కోసం అభిమానులు భారీగానే ఎదురుచూశారు. అయితే, ప్రకటన వచ్చినప్పటికీ ఈ చిత్రం అనుకున్న సమయానికి స్ట్రీమింగ్కు రాలేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.జూనియర్ మూవీ ఆహా ఓటీటీలోకి రాబోతుందనే ఇప్పటికే అధికారికంగా ప్రకటంచిన సంగతి తెలిసిందే. నేడు (సెప్టెంబర్ 22) నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ఒక పోస్టర్ను కూడా పంచుకున్నారు. అయితే, ఇప్పటికీ కూడా ఆహా తెలుగు ఓటీటీలో జూనియర్ కనిపించలేదు. దీంతో అభిమానులు సోషల్మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. ఇదే సమయంలో సెప్టెంబర్ 22 నుంచే నమ్మఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్లో జూనియర్ స్ట్రీమింగ్ కానుందని చెప్పారు. ఇది కన్నడ ఓటీటీ యాప్ అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం అందులో కూడా విడుదల కాలేదని తెలుస్తోంది.కిరిటీ, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించగా జెనీలియా కీలక పాత్ర పోషించింది. కాలేజీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో మొదలై ఎమోషనల్గా సాగే ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించాడు. వాస్తవంగా ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ మొదట దక్కించుకుంది. కానీ, ఇప్పటివరకు స్ట్రీమింగ్ గురించి ఆ సంస్థ పెద్దగా ప్రచారం చేయలేదు. ఈ క్రమంలో సడెన్గా ఆహా ఓటీటీ సంస్థ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ముందుగా అనుకున్న సమయానికి జూనియర్ ఓటీటీలోకి రాకపోవడంతో అమెజాన్, ఆహాలతో మేకర్స్ ఏమైనా డీలింగ్స్ విషయంలో ఇబ్బందులు వచ్చాయా అనే సందేహం వ్యక్తమౌతుంది. -
ఓటీటీలోకి 'లోక'.. దుల్కర్ ట్వీట్తో క్లారిటీ
రీసెంట్ టైంలో రెండు సూపర్ హీరో సినిమాలు వచ్చాయి. తెలుగులో వచ్చిన 'మిరాయ్' హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతానికి రూ.120 కోట్ల వరకు కలెక్షన్ సాధించింది. మరోవైపు గత నెల చివర్లో 'లోక' అనే మలయాళ ఫిమేల్ సూపర్ హీరో మూవీ ఒకటి వచ్చింది. కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలోకి రానుందనే రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడు వీటిపై నిర్మాత దుల్కర్ సల్మాన్ ఓ క్లారిటీ ఇచ్చాడు.కల్యాణి ప్రియదర్శన్ 'లోక' సినిమాని తెలుగులో 'కొత్త లోక' పేరుతో రిలీజ్ చేశారు. ఇక్కడ పర్లేదనే టాక్ వచ్చింది గానీ వసూళ్లు అంతంత మాత్రంగానే వచ్చాయి. కానీ ఒరిజినల్ వెర్షన్ మలయాళంలో మాత్రం అద్భుతమైన కలెక్షన్ వచ్చాయి. ప్రస్తుతం రూ.250 కోట్లకు పైనే వచ్చాయని, తద్వారా మలయాళ ఇండస్ట్రీ హిట్గా ఈ చిత్రం నిలిచింది. అయితే ఈ మూవీని ఇప్పట్లో ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశం లేదని నిర్మాత దుల్కర్ సల్మాన్ ట్వీట్ చేశాడు. రూమర్స్ను నమ్మొద్దు. అధికారిక ప్రకటన కోసం వేచి చూడండి అని విజ్ఞప్తి చేశాడు.(ఇదీ చదవండి: రాజమౌళి కంటే ధనుష్తోనే కష్టం: 'కట్టప్ప' సత్యరాజ్)ఈ శుక్రవారం నుంచే 'లోక' స్ట్రీమింగ్ ఉండనుందనే రూమర్స్ వచ్చేసరికి చాలామంది నెటిజన్లు సంతోషపడ్డారు. కానీ ఈ చిత్ర నిర్మాత దుల్కర్ ట్వీట్తో క్లారిటీ ఇచ్చేసరికి సైలెంట్ అయిపోయారు. ఈ మూవీ డిజిటల్ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుంది. ఇప్పటికీ థియేటర్లలో ఇంకా ఒరిజినల్ వెర్షన్ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. కాబట్టి ఓటీటీ డేట్ అనుకున్న టైం కంటే కాస్త లేటుగా తీసుకురానున్నారు. అంటే అక్టోబరు రెండో వారం వస్తుందేమో చూడాలి?'లోక' విషయానికొస్తే.. చంద్ర (కల్యాణి ప్రియదర్శన్) సూపర్ పవర్స్ ఉన్న ఓ అమ్మాయి. ఈమె గురించి కొందరికి తెలుసు. ఓ సందర్భంలో చంద్ర, బెంగళూరు రావాల్సి వస్తుంది. తన పవర్స్ బయటపెట్టకుండా సాధారణ అమ్మాయిలా బతుకుతుంది. రాత్రిపూట ఓ కేఫ్లో పనిచేస్తుంటుంది. ఎదురింట్లో ఉంటే సన్నీ(నస్లేన్).. ఈమెని చూసి లవ్లో పడతాడు. పరిస్థితులు కలిసొచ్చి ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. కానీ ఓ రోజు రాత్రి జరిగిన సంఘటనల దెబ్బకు చంద్ర జీవితం తలకిందులవుతుంది. ఇంతకీ చంద్ర గతమేంటి? ఎస్ఐ నాచియప్ప(శాండీ)తో గొడవేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఐఫోన్తో తీసిన జాంబీ సినిమా.. ఓటీటీ రివ్యూ)Lokah isn't coming to OTT anytime soon. Ignore the fake news and stay tuned for official announcements! #Lokah #WhatstheHurry— Dulquer Salmaan (@dulQuer) September 21, 2025 -
ఓటీటీలో ఫహాద్ ఫాజిల్, కళ్యాణి ప్రియదర్శన్ సినిమా
మలయాళ ప్రముఖ నటుడు ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil), కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan), రేవతి పిళై నటించిన రొమాంటిక్ చిత్రం ‘ఓడుం కుతిర చాదుం కుతిర’. మలయాళంలో రొమాంటిక్ కామెడీ చిత్రంగా విజయం సాధించింది. ఈ సినిమాను దర్శకుడు అల్తాఫ్ సలీం తెరకెక్కించగా.. ఆషిక్ ఉస్మాన్ నిర్మించారు. ఆగష్టు 29న విడుదలైన ఈ చిత్రం తాజాగా ఓటీటీ వివరాలను పంచుకున్నారు.‘నెట్ఫ్లిక్స్’ (Netflix) వేదికగా సెప్టెంబర్ 26న ఓటీటీలో విడుదల కానున్నట్లు ఒక పోస్టర్ను పంచుకున్నారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీలో స్ట్రీమింగ్ అవుతుందని ఆ సంస్థ వెల్లడించింది. ఈ చిత్రం నవ్వులు పూయిస్తూనే.. ఒక జోడీ మధ్య చిలిపి సరదాలతో ప్రేమకథ కనిపిస్తుంది.అభి (ఫహాద్ ఫాజిల్), నిధి (కల్యాణి ప్రియదర్శన్) పెళ్లి తంతుతో కథ ప్రారంభం అవుతుంది. అయితే, ఎంగేజ్మెంట్ నాడు తమ ఇంటికి గుర్రంపై రాజులా రావాలని అభికి నిధి కండీషన్ పెడుతుంది. దీంతో అభి కూడా గుర్రంపై ఆమె ఇంటికి బయలుదేరుతాడు. ఈ క్రమంలో ఎవరూ ఊహించని విధంగా గుర్రం నుంచి కిందపడుతాడు. ఆ సమయంలో కోమాలోకి వెళతాడు. దీంతో వారి పెళ్లి ఆగిపోతుంది. నిధి కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతో ఆమె మరొకరిని వివాహం చేసుకునేందుకు ఒప్పుకుంటుంది. అయితే, సడెన్గా అభి పూర్తి ఆరోగ్యంతో తిరిగొస్తాడు. నిధి గురించి తెలుసుకుని కొత్త జీవితం మొదలుపెట్టాలని బెంగళూరు వెళ్లిపోతాడు. అక్కడి నుంచి కథ మరో మలుపు తిరుగుతుంది. అక్కడ ఒక అమ్మాయి అభి జీవితంలోకి వచ్చేస్తుంది. ఫైనల్గా అభి జీవితం ఏమౌతుంది..? ఎవరిని పెళ్లి చేసుకుంటాడు..? అనేది చాలా ఫన్నీగా అందరినీ నవ్వించేలా సినిమా ఉంటుంది. -
ఐఫోన్తో తీసిన జాంబీ సినిమా.. ఓటీటీ రివ్యూ
ఓటీటీల్లో థ్రిల్లర్, హారర్ సినిమాలకు ఉండే డిమాండ్ వేరు. అందున హాలీవుడ్ నుంచి ఈ జానర్ మూవీస్ వస్తున్నాయి అంటే కచ్చితంగా భయపెట్టి తీరేలానే ఉంటాయి. అలా జూన్లో థియేటర్లలోకి వచ్చిన ఓ చిత్రం.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. అదే '28 ఇయర్స్ లేటర్'(28 ఏళ్ల తర్వాత). ప్రస్తుతం ఇది నెట్ఫ్లిక్స్లో తెలుగులో ఉచితంగానే స్ట్రీమింగ్ అవుతోంది. 'స్లమ్ డాగ్ మిలీయనీర్'ని తీసిన డేనీ బోయెల్ దీనికి దర్శకుడు. మరి ఈ సినిమా అంతలా భయపెట్టిందా అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: 'ఇలాంటి సినిమా మీరెప్పుడూ చూసుండరు'.. టాక్ ఏంటి?)కథేంటి?2002లో రేజ్ వైరస్ రాకతో ప్రపంచమంతా అతలాకుతలం అవుతుంది. అలా 28 ఏళ్లు గడిచిపోతాయి. బ్రిటన్లోని ఓ దీవిలో ఈ వైరస్ బారిన పడని కొంతమంది జీవిస్తుంటారు. హీరో జేమీ తన 12 ఏళ్ల కొడుకు స్పైక్, భార్యతో కలిసి బతుకుతుంటాడు. ఓ రోజు వేట కోసం జేమీ, స్పైక్.. మెయిన్ ల్యాండ్కు వెళ్తారు. ఇక్కడ మెయిన్ ల్యాండ్ అంటే జాంబీలు ఉండే ప్రదేశం. అక్కడ 'ఆల్ఫా' అనే బలమైన జాంబీ ఈ తండ్రి కొడుకులకు ఎదురుపడుతుంది. తర్వాత ఏమైంది? తిరిగి ద్వీపానికి చేరుకున్నారా లేదా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఇదో జాంబీ సినిమా. అంటే వైరస్ సోకేసరికి చాలామంది మనుషులు రాక్షసుల్లా మారిపోతారు. వీళ్ల నుంచి తప్పించుకున్న కొందరు ఓ ద్వీపంలో తలదాచుకుంటారు. ఆ ద్వీపానికి జాంబీలు ఉండే ప్రదేశానికి మధ్యలో చిన్న దారి ఉంటుంది. కానీ రాత్రయితే ఆ దారి అంతా సముద్రంలో మునిగిపోతూ ఉంటుంది. అలాంటి వీళ్లలోని ఓ తండ్రి కొడుకు జాంబీల దగ్గరకు వెళ్తారు. తర్వాత ఊహించి పరిస్థితులు ఎదురవుతాయి. అక్కడి నుంచి పాత్రల మధ్య ఎలాంటి సంఘర్షణ ఏర్పడుతుంది. తర్వాత ఏమైందనేది మూవీ చూసి ఎక్స్పీరియెన్స్ చేయాలి.ఈ సినిమాని కచ్చితంగా ఒంటరిగానే చూడండి. అలా అని బూతు సన్నివేశాలు ఏం ఉండవు. జాంబీలన్నీ బట్టల్లేకుండానే ఉంటాయి. కానీ ఒంటిపై బురదలాంటిది ఉంటుంది. కానీ జాంబీలని భయంకరంగా చంపడం లాంటి సీన్స్ ఉంటాయి. ఇదో హారర్ మూవీ అయినప్పటికీ మరోవైపు థ్రిల్ పంచుతూ మానవ సంబంధాలు, భావోద్వేగాలని కూడా చూపిస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్.రెండు గంటల్లోపే ఉండే ఈ సినిమా నెమ్మదిగానే ఉంటుంది గానీ విజువల్స్ గానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గానీ డిఫరెంట్ అనుభూతిని ఇస్తుంది. నటీనటుల ఫెర్ఫార్మెన్స్ కూడా మూవీలో మీరు లీనమయ్యేలా చేస్తుంది. తెలుగు డబ్బింగ్ పర్లేదు. అయితే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్ని ఐఫోన్తో తీయడం విశేషం. అమెజాన్ ప్రైమ్, జీ5 తదితర ఓటీటీల్లోనూ ఉంది గానీ వాటిలో రెంట్ పద్ధతిలో చూడొచ్చు. నెట్ఫ్లిక్స్లో ఫ్రీగా తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. హారర్ థ్రిల్లర్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే దీనిపై ఓ లుక్కేసేయండి.-చందు డొంకాన(ఇదీ చదవండి: రీసెంట్ టైంలో బెస్ట్ హాలీవుడ్ సినిమా.. 'ఎఫ్ 1' రివ్యూ (ఓటీటీ)) -
OTT: ఎలియో మూవీ రివ్యూ
హేయ్ కిడ్స్...మీకెవరికైనా ఏలియన్స్ ని చూడాలనుందా లేదా వాళ్ళ దగ్గరకి వెళ్ళాలనుందా. అమ్మో అస్సలు లేదు అనుకుంటున్నారా..కాని ఎలియోకి మాత్రం తనను ఎవరైనా ఏలియన్స్ తీసుకువెళితే బావుండు అని అనుకుంటున్నాడు, అది కూడా ఎంతలా అంటే రోజూ బీచ్ కి వెళ్ళి అలా ఒంటరిగా ఉండిపోయి పడుకుండి పోతాడు. ఎప్పుడైనా ఓ ఏలియన్ తనను చూసి ఎత్తుకెళ్ళకుండా ఉంటదా అన్న చిన్న ఆశ ఎలియోకి. తన పేరెంట్స్ ని పోగొట్టుకోని ఎయిర్ ఫోర్స్ మేజర్ అయిన తన పిన్ని దగ్గర ఉంటున్న ఎలియోకి చిన్నప్పటి నుండి ఈ ఏలియన్స్ అంటే పిచ్చి, అందుకే తనను ఎత్తుకుపొమ్మని కనిపించిన సిగ్నల్స్ కి మెసేజ్ పెడుతుంటాడు ఎలియో. ఆ రోజు రానే వస్తుంది. ఎలియోని ఓ ఏలియన్ గ్రూప్ ఎత్తుకువెళుతుంది. ఏలియన్స్ గ్రూప్ లో గ్లోర్డన్ ఎలియోకి మంచి ఫ్రెండ్ అవుతుంది. ఇక అక్కడ నుండి వీళ్ళు చేసే అల్లరి, ఫాంటసీ అడ్వెంచర్స్ మాత్రం హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న యానిమేటెడ్ ఫాంటసీ మూవీ ఎలియోని చూడాల్సిందే. కిడ్స్ ఎలియో ఈజ్ ఎ సూపర్ మూవీ. ఇంకెందుకాలస్యం గ్రాబ్ యువర్ రిమోట్ టు జాయిన్ ఎలియో ఎలాంగ్ విత్ ఏలియన్స్.- హరికృష్ణ ఇంటూరు -
ఓటీటీల్లోకి వచ్చేసిన రెండు తెలుగు సినిమాలు
ఈ వీకెండ్ ఓటీటీల్లోకి పలు సినిమాల వచ్చాయి. వాటిలో మహావతార్ నరసింహా, కన్యాకుమారి, కొత్త రంగుల ప్రపంచం లాంటి తెలుగు స్ట్రెయిట్ మూవీస్ రిలీజయ్యాయి. అలానే ఎలియో, 28 ఇయర్స్ లేటర్ తదితర హాలీవుడ్ డబ్బింగ్ బొమ్మలు కూడా డిజిటల్గా అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఇవి కాకుండా మరో రెండు తెలుగు చిత్రాలు కూడా ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీల్లోకి రావడం విశేషం.(ఇదీ చదవండి: ఆస్కార్ రేసులో పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం, కన్నప్ప)గత నెల 1వ తేదీన థియేటర్లలో రిలీజైన తెలుగు సినిమా 'నీ బంధీనైపోయా'. అసలు ఇది ఎప్పుడు వచ్చి వెళ్లిందో కూడా తెలీదు. చిన్న నటీనటులతో తీసిన ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 2 గంటల పాటు సాగే ఈ మూవీని క్రైమ్ థ్రిల్లర్ స్టోరీతో తెరకెక్కించారు. జానకి అనే అమ్మాయి.. తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ నుంచి దూరంగా వెళ్లిపోయి బతకాలనుకుంటుంది. కానీ ఓ వ్యక్తి ఈమెని కిడ్నాప్ చేస్తాడు. ఇంతకీ అతడెవరు? ఈమెనే ఎందుకు బంధించాడు? అనేదే మిగతా స్టోరీ.అలానే ఈ ఏడాదే థియేటర్లలో రిలీజైన '4 గర్ల్స్' అనే సినిమా కూడా అమెజాన్ ప్రైమ్లోకి వచ్చేసింది. కాకపోతే ఇది రెంట్ విధానంలో అందుబాటులో ఉంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ చూడొచ్చు. శ్రుతిక, ఆక్షణ, ప్రిన్స్, అంకుర్ ప్రధాన పాత్రల్లో నటించారు. శివ దర్శకత్వం వహించాడు. అయితే ఇవి చిన్న సినిమాలు. కంటెంట్ పరంగానే అంతంత మాత్రంగానే ఉందనే టాక్ వినిపిస్తుంది. ఆసక్తి బట్టి చూడండి.(ఇదీ చదవండి: ఓజీ.. జగనే కరెక్ట్: నట్టి కుమార్) -
మలయాళ బ్లాక్బస్టర్ మూవీ.. ఓటీటీలో ఎప్పుడంటే?
మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ (Mohanlal) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం హృదయపూర్వం (Hridayapoorvam Movie). సంగీత్ ప్రతాప్, ది రాజాసాబ్ బ్యూటీ మాళవిక కీలక పాత్రల్లో నటించారు. క్లాసిక్ సినిమాకు కేరాఫ్ అడ్రస్ అయిన సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించాడు. ఆశీర్వాద్ సినిమా బ్యానర్పై ఆంటొని పెరుంబవూర్ నిర్మించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించాడు. ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ హిట్ కొట్టింది. వచ్చేవారమే రిలీజ్కేవలం రూ.30 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.70 కోట్ల మేర కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికీ కేరళలోని పలు థియేటర్లలో ప్రదర్శితమవుతూనే ఉంది. సినిమా రిలీజై మూడువారాలు దాటిపోవడంతో ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు. జియో హాట్స్టార్లో సెప్టెంబర్ 26న విడుదల చేస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.వరుస హిట్లుమోహన్లాల్ ఈ ఏడాది ఫుల్ జోష్లో ఉన్నాడు. ఈ ఏడాది మూడు సినిమాలు రిలీజవగా ఆ మూడు కూడా బ్లాక్బస్టర్ హిట్లు కొట్టాయి. ఎల్2: ఎంపురాన్ మూవీ ఏకంగా రూ.260 కోట్లు రాబట్టింది. మలయాళ సినీ చరిత్రలోనే రూ.250 కోట్లు దాటిన మొట్టమొదటి సినిమాగా రికార్డుకెక్కింది. తర్వాత తుడరుమ్ రిలీజ్ అవగా ఈ మూవీ కూడా రూ.230 కోట్లు వసూలు చేసింది. తర్వాత వచ్చిన హృదయపూర్వం రూ.70 కోట్లు కలెక్ట్ చేసింది. మరి మోహన్లాల్ మున్ముందు ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి! എന്ന് ഹൃദയപൂർവം ജിയോഹോട്ട്സ്റ്റാർ#Hridayapoorvam will be streaming from September 26 on JioHotstar. @mohanlal @antonypbvr @aashirvadcine @MalavikaM_#Hridayapoorvam #HridayapoorvamOnJioHotstar #Mohanlal #HridayapoorvamMohanlal #Family #Drama #Comedy #Malayalam #JioHotstar pic.twitter.com/r8Q1hL4JEv— JioHotstar Malayalam (@JioHotstarMal) September 19, 2025చదవండి: గాజులేసుకుని కూర్చో.. సుమన్పై సంజనా చీప్ కామెంట్స్ -
‘రవీంద్ర నీ ఎవిడే’ మూవీ రివ్యూ : భార్యపై అనుమానం.. నవ్వు గ్యారెంటీ!
నేటి సమాజంలో నమ్మకమనేది దూరంగా ఉన్న స్నేహితుడిలాంటిదైతే, అనుమానమనేది దగ్గరగా ఉన్న శతృవులాంటిది. ఎందుకంటే అనుమానం వస్తే పోదు, నమ్మకం అంత తేలిగ్గా రాదు. ఇదే నేపధ్యంలో వచ్చిన సూపర్ కామెడీ సినిమా రవీంద్ర నీ ఎవిడే అంటే రవీంద్ర నీ వెక్కడ అని అర్ధం. ఇదో మళయాళ సినిమా కాని తెలుగు లోనూ జియో హాట్ స్టార్ వేదికగా లభ్యమవుతోంది.మందు చెప్పినట్టు ఈ సినిమా మొత్తం అనుమానం మీదే నడుస్తుంది.ప్రేక్షకులను నవ్విస్తుంది. ఈ సినిమా కథాంశానికొస్తే కథానాయకుడు రవీంద్రన్ వాతావరణ శాఖలో ప్రజలకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసే కీలక బాధ్యతలు నిర్వర్తిస్తుంటాడు. రవీంద్రన్ కి ఓ భార్య, కూతురు. చిన్న కుటుంబం, చింతలేని ఆనందం అని అనుకుంటున్న తరుణంలో రవీంద్రన్ కి అనుకోకుండా తన భార్య మీద ఓ అనుమానం వస్తుంది. తన భార్య ఇంకెవరితోనో సంబంధం పెట్టుకుందని భావిస్తాడు రవీంద్రన్. తన అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి ఓ సారి ఊరు వెళ్తున్నానని చెప్పి ఇంట్లోనే ఓ మారుమూల గదిలో ఉండిపోతాడు. కాకపోతే ఆ గదిలో ఎవరూ లేరని భార్య జాన్ కుట్టీ తాళం వేసి తమ అమ్మవాళ్ళ ఊరు వెళిపోతుంది. ఇక అక్కడి నుండి కథ మొదలవుతుంది. రవీంద్రన్ భార్య తమ అమ్మవాళ్ళ దగ్గర నుండి ఫోన్ చేసినా రవీంద్రన్ ఎత్తకపోయేసరికి భయం వేసి తన భర్త కనిపించట్లేదని కంగారు పడుతుంది. ఇంతలో ఊళ్ళో ఇదో పెద్ద న్యూస్ అయి మొత్తం హాట్ టాపిక్ గా మారిపోతుంది.మరి రవీంద్రన్ ఆ గది నుండి బయటకు వస్తాడా, తనకు భార్య మీదున్న అనుమానాన్ని నివృత్తి చేసుకుంటాడా లేదా అన్నది మాత్రం హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న రవీంద్ర నీ ఎవిడే సినిమాలోనే చూడాలి. కృష్ట పూజాపుర అందించిన ఈ కథకు మనోజ్ పాలోడన్ దర్శకత్వం వహించాడు. అనూప్ మీనన్, థ్యాన్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ఆద్యంతం రక్తి కట్టిస్తుందనే చెప్పాలి. మస్ట్ వాచ్ ఫర్ ది వీకెండ్. -
ఓటీటీలోకి 'జూనియర్'.. స్ట్రీమింగ్ డేట్ ప్రకటన
ఒక్క పాటతో గుర్తింపు తెచ్చుకున్న సినిమా 'జూనియర్'. శ్రీలీల వైరల్ వయ్యారి అని స్టెప్పులు వేసేసరికి ఈ చిత్రం అప్పట్లో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. గాలి జనార్ధన రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా పరిచయమైన ఈ మూవీ.. జూలైలోనే థియేటర్లలోకి వచ్చింది. కానీ ఓటీటీ రిలీజ్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. రీసెంట్గానే ఆహా లోకి వస్తుందని ప్రకటించారు. ఎప్పుడా అని నెటిజన్లు ఎదురుచూస్తుండగా ఇప్పుడు తేదీని కూడా అనౌన్స్ చేశారు.(ఇదీ చదవండి: సగం వయసున్న వాళ్లతో డేటింగ్.. నేను కూడా రెడీ: హీరోయిన్ అమీషా పటేల్)కిరిటీ, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించగా జెనీలియా కీలక పాత్రలో నటించింది. కాలేజీ బ్యాక్ డ్రాప్తో తీసిన ఎమోషనల్ మూవీ ఇది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. బాక్సాఫీస్ దగ్గర అంతంత మాత్రంగానే ఆడిన ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. తొలుత ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుందని టాక్ నడిచింది. కానీ ఇప్పుడు తెలుగు వెర్షన్ ఆహా ఓటీటీలో ఈనెల 22 నుంచి అంటే సోమవారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు. మరోవైపు కన్నడ వెర్షన్.. నమ్మ ఫ్లెక్స్ అనే ఓటీటీలో ఇదే రోజునుంచి అందుబాటులోకి రానుందని ప్రకటించారు.'జూనియర్' విషయానికొస్తే.. ఇంజినీరింగ్ చదివే అభి(కిరీటి) జ్ఞాపకాలే ముఖ్యమనుకుని నమ్ముతాడు. అందుకు తగ్గట్లే కాలేజీలో నాలుగేళ్లు సరదాగా గడిపేస్తాడు. మంచి జ్ఞాపకాల్ని దాచుకుంటాడు. చదువు పూర్తయిన తర్వాత తాను లవ్ చేసిన స్ఫూర్తి (శ్రీలీల) పనిచేసే కంపెనీలోనే ఉద్యోగంలో చేరతాడు. కానీ బాస్ విజయ సౌజన్య (జెనీలియా)కి ఇతడంటే నచ్చదు. అలాంటి అభితో కలిసి అనుకోని పరిస్థితుల్లో విజయనగరం అనే ఊరికి వెళ్లాల్సి వస్తుంది. మరి విజయనగరానికి, విజయకి సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: మౌళి.. రౌడీ టీ షర్ట్, మహేశ్ ట్వీట్.. ఇవన్నీ ఫేక్: బండ్ల గణేశ్) -
ఓటీటీకి రూ.340 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ డేట్ రివీల్
ఎలాంటి అంచనాలు లేకుండా యానిమేషన్ చిత్రం మహావతార్ నరసంహా. జూలై 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా కలెక్షన్స్ రాబట్టింది. రెండురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 7 కోట్ల నెట్ కలెక్షన్స్తో రికార్డ్ క్రియేట్ చేసింది. మహా విష్ణువు దశావతారాల ఆధారంగా 'మహావతార్' సినిమాటిక్ యూనివర్స్ (ఎమ్.సి.యు) పేరుతో తొలి చిత్రంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.అశ్విన్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధవాన్, కుశల్ దేశాయ్, చైతన్య దేశాయ్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం 200 థియేటర్స్కు పైగా 50 రోజులు పూర్తి చేసుకుందని ఇటీవలే మేకర్స్ ప్రకటించారు. రిలీజైన రోజు నుంచి ఏకంగా రూ. 340 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టినట్లు వెల్లడించారు. ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే.బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచిన ఈ మూవీ కోసం ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సూపర్ హిట్ మూవీ ఓటీటీ డేట్ మేకర్స్ రివీల్ చేశారు. ఈ శుక్రవారం(సెప్టెంబర్ 19న) మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు నెట్ఫ్లిక్స్ మహావతార్ నరసింహ పోస్టర్ను పంచుకుంది. ఇంకెందుకు ఆలస్యం రేపటి నుంచి ఫ్యామిలీతో కలిసి ఓటీటీలో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in)


