breaking news
OTT
-
ఓటీటీలో చూడండి.. స్టేజీపై నోరు జారి.. అంతలోనే సారీ!
ఎంత పెద్ద సినిమా అయినా సరే.. కథలో దమ్ముంటేనే జనాలు థియేటర్కు వస్తున్నారు. ఏమాత్రం నచ్చకపోయినా మాకు అక్కర్లేదు అంటూ ఆ దిక్కు కూడా చూడటం లేదు. ఇండియన్ 2, థగ్ లైఫ్ ఫెయిల్యూర్స్ అందుకు పెద్ద ఉదాహరణ.. ఇకపోతే లేటెస్ట్గా కుబేర, 8 వసంతాలు (8 Vasantalu Movie) చిత్రాలు రిలీజయ్యాయి. కుబేర బ్లాక్బస్టర్ టాక్తో దూసుకుపోతోంది. అటు 8 వసంతాలు మూవీకి కూడా కాస్త పాజిటివ్ టాక్ లభించినప్పటికీ కుబేర ముందు తేలిపోయింది.ఓటీటీలో బాగుంటుందిఇలాంటి సమయంలో ప్రేక్షకుల్ని తమ సినిమా వైపు ఎలా తిప్పుకోవాలా? అని చిత్రయూనిట్ ఆలోచించాలి! కానీ దర్శకుడు ఫణీంద్ర సక్సెస్ మీట్కు డుమ్మా కొట్టాడు. మరోవైపు సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి మాత్రం ఎంచక్కా ఓటీటీలో చూసేయమని చెప్తున్నాడు. సక్సెస్ మీట్లో విశ్వనాథ్ మాట్లాడుతూ.. ఇది త్వరలోనే ఓటీటీలోకి వస్తుంది. అది కూడా నెట్ఫ్లిక్స్లో వస్తుంది. థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్ కంటే ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ నెట్ఫ్లిక్స్లో ఉండబోతుంది. ఇమేజ్ క్వాలిటీ ఇంకా మెరుగ్గా ఉంటుంది అంటూ తమ సినిమాను ఓటీటీలో చూడమని చెప్పకనే చెప్పాడు. అక్కడున్నవాళ్లు మధ్యలో కలుగజేసుకోవడంతో స్టేజీపైనే సారీ చెప్పాడు.సినిమా8 వసంతాలు చిత్రంలో మ్యాడ్ ఫేమ్ అనంతిక సనిల్ కుమార్ కథానాయికగా నటించింది. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, సమీరా కిశోర్, కన్నా పసునూరి కీలక పాత్రలు పోషించారు. జూన్ 20న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. “#8Vasantalu Theatre లో Experience కంటే Netflix లో Experience బాగుంటుంది.”- Cinematographer Vishwanath pic.twitter.com/5LyQOphewO— Movies4u Official (@Movies4u_Officl) June 23, 2025చదవండి: థగ్ లైఫ్ డిజాస్టర్.. క్షమాపణలు మాత్రమే చెప్పగలను.. మణిరత్నం -
ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో మంచు విష్ణు 'కన్నప్ప' రిలీజ్ కానుంది. అలానే హిందీలో 'మా' అనే హారర్ మూవీ రాబోతుంది. ఇవి తప్పితే పెద్దగా చెప్పుకోదగ్గ చిత్రాలేం లేవు. మరోవైపు ఓటీటీల్లో మాత్రం 18కి పైగా కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. ప్రస్తుతానికైతే ఈ లెక్క కనిపిస్తుంది. వీకెండ్ వచ్చేసరికి నంబర్ పెరగొచ్చు. (ఇదీ చదవండి: నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు: నాగార్జున)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. ఈ వారమే రైడ్ 2, ఒక పథకం ప్రకారం సినిమాలతో పాటు స్క్విడ్ గేమ్ సీజన్ 3, పంచాయత్ సీజన్ 4, విరాటపాలెం సిరీస్లు ఉన్నంతలో కాస్త ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏ మూవీ రిలీజ్ కానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు (జూన్ 23 నుంచి 29 వరకు)నెట్ఫ్లిక్స్స్టీఫ్ టొలెవ్: ఫిల్త్ క్వీన్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 24ట్రైన్ రెక్: పూప్ క్రూయిజ్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 24ద అల్టిమేటమ్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 25రైడ్ 2 (హిందీ సినిమా) - జూన్ 27స్క్విడ్ గేమ్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 27అమెజాన్ ప్రైమ్పంచాయత్ సీజన్ 4 (హిందీ సిరీస్) - జూన్ 24హాట్స్టార్స్కార్స్ ఆఫ్ బ్యూటీ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 26ద బేర్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 26మిస్త్రీ (హిందీ సిరీస్) - జూన్ 27జీ5విరాటపాలెం (తెలుగు సిరీస్) - జూన్ 27బిబీషణ్ (బెంగాలీ సిరీస్) - జూన్ 27అట తంబైచ నాయ్! (మరాఠీ మూవీ) - జూన్ 28సన్ నెక్స్ట్అజాదీ (తమిళ సినిమా) - జూన్ 27ఒక పథకం ప్రకారం (తెలుగు మూవీ) - జూన్ 27బుక్ మై షోఅల్ఫా (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 24ద బ్రేకప్ క్లబ్ (డచ్ మూవీ) - జూన్ 24రక్తబీజ్ (గుజరాతీ సినిమా) - జూన్ 26ఆపిల్ ప్లస్ టీవీస్మోక్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 27(ఇదీ చదవండి: ఫైనల్లీ కనిపించిన 'కన్నప్ప' డైరెక్టర్.. ఈయన ఎవరంటే?) -
ఓటీటీలో అత్యధికంగా వీక్షించిన వెబ్ సిరీస్, సినిమాలు ఇవే!
కోవిడ్ తర్వాత ఓవర్ ద టాప్(ఓటీటీ)ల వాడకం ఎక్కువైంది. మహమ్మారి సమయంలో థియేటర్స్ మూత పడడంతో సినీ ప్రేక్షకులు ఓటీటీలవైపు మొగ్గుచూపారు. కొత్త సినిమాలు నేరుగా ఓటీటీలో రిలీజ్ కావడంతో వీక్షకుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోయింది. గతేడాది(2024) నాటికి దేశవ్యాప్తంగా ఓటీటీ వీక్షకుల సంఖ్య 55 కోట్లకు చేరిందంటేనే దీని స్పీడ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఓటీటీలలో సినిమాల కంటే వెబ్ సిరీస్ల హవానే ఎక్కువగా కొనసాగుతుంది. గతేడాదిలో రిలీజైన 315 ఒరిజినల్స్లో 214 వెబ్ సిరీస్లే ఉన్నాయి. అత్యధిక మంది చూసిన వెబ్ సిరీస్గా మీర్జాపూర్ సీజన్ 3 నిలిచింది. ఈ హిందీ వెబ్ సిరీస్ని 3 కోట్ల మంది వీక్షించారు. ఇక తెలుగులో సేవ్ ద టైగర్స్ సీజన్ 2ని అత్యధికంగా(50లక్షల మంది) వీక్షించారట. సినిమాల విషయానికొస్తే దో పత్తీ(హిందీ)ని 1.51 కోట్ల మంది ఓటీటీలో చూశారు. ఇంటర్నేషనల్ షోలలో.. స్వీడ్ గేమ్ సీజన్ -2ని 1.96 కోట్ల మంది భారతీయులు వీక్షించారు. కంటెంట్ పరంగా హీందీ అగ్రస్థానంలో ఉంది. ఓటీటీలో వస్తున్న మొత్తం ఒరిజినల్స్లో మూడింట రెండొంతులు బాలీవుడ్ నుంచే ఉందట. బెంగాలీ 2వ స్థానంలో ఉండగా.. 9 శాతం వాటాలతో తెలుగు మూడో స్థానంలో ఉంది. -
ఓటీటీలో అదరగొడుతున్న తెలుగు సినిమా
కొన్ని చిత్రాలు థియేటర్స్లో ఆశించిన స్థాయిలో ఆడకపోయినా.. ఓటీటీలో మాత్రం అదరగొడుతున్నాయి. అలాంటి చిత్రాల్లో ‘చౌర్యపాఠం’ ఒకటి. ఇటీవల ప్రైమ్ వీడియోలోకి వచ్చిన ఈ చిత్రం 120 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్తో టాప్ ట్రెండింగ్లో దూసుకుపోతుంది. స్టార్ల హంగామా లేదు, భారీ సెట్టింగుల ఆర్భాటం అంతకన్నా లేదు. అయినా ఈ సినిమా కథతోనే ఆడియన్స్ను కట్టిపడేసింది. ఇంతలా ప్రేక్షకాదరణ దక్కడానికి కారణం ఏంటంటే... కొత్త దర్శకుడు నిఖిల్ గొల్లమారి సాహసోపేతమైన దర్శకత్వం, కథలోని పచ్చి నిజాయితీ, నటీనటుల అద్భుతమైన సహజ నటన. ముఖ్యంగా, ఈ చిత్రంలో వేదాంత్ రామ్ పాత్రలో కనిపించిన ఇంద్ర రామ్, తొలి సినిమా అయినా అనుభవజ్ఞుడైన నటుడిలా అద్భుతంగా నటించారు.నిధుల కోసం ధనపల్లి అనే గ్రామంలోని బ్యాంకును దోచుకోవడానికి ఒక చిన్న ముఠాతో కలిసి పథకం వేసే దర్శకుడిగా అతడి నటన ఆకట్టుకుంటుంది. నక్కిన నరేటివ్స్ బ్యానర్పై త్రినాధరావు నక్కిన, వి. చూడామణి నిర్మించిన ఈ చిత్రం, తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదలై, అన్ని వర్గాల ఆడియన్స్ను ఆకట్టుకుంటోంది. -
OTT: ‘గ్యాంగర్స్’మూవీ రివ్యూ
తమిళనాట సుందర్.సి వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తుంటారు. ఆయన కథల్లో సామాన్యులు కూడా అనితరసాథ్యమైన ఫీట్లు చేస్తుంటారు. అలానే కథలు రాసుకుంటారు సుందర్.సి. అదే కోవలో తీసుకువచ్చిన మరో యాక్షన్ కామెడీ థ్రిల్లర్ గ్యాంగర్స్(Gangers Movie Review ). ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా తెలుగు వెర్షన్ లో కూడా లభ్యమవుతోంది. సుందర్.సి ఈ కథను తానే రాసుకుని, అదే కథకు తాను నిర్మాతగా కూడా వ్యవహరించి దర్శకత్వం కూడా తానే చేశారు. అరసన్ హైస్కూల్లో కంప్యూటర్ సైన్స్ టీచర్ సుజి తన స్టూడెంట్ రమ్య కనబడకుండా పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రారంభమయ్యే ఈ సినిమా ఒక ఉత్కంఠభరిత యాక్షన్ థ్రిల్లర్. సుజి స్కూల్ కరస్పాండెంట్ మలైయరసన్ అలాగే అతని సోదరుడు కొట్టైయరసన్లపై రమ్య గురించి చేసిన ఆరోపణలతో కథ ఊపందుకుంటుంది. ఈ ఫిర్యాదు తరువాత దానిని విచారణ చేయడానకి ఓ రహస్య అధికారిగా శరవణన్ PT టీచర్గా ఆ స్కూల్ లో కి వస్తాడు. శరవణన్ ఆ స్కూల్ లోకి వచ్చీ రాగానే స్కూల్ లో స్టూడెంట్స్ తీసుకుంటున్న మత్తుపదార్ధాల బండారాన్ని బయట పెట్టడంతో పాటు రమ్య కేసును కూడా విచారిస్తుంటాడు.రమ్య కనబడకుండా పోవడానికి కారణం ఈ ఊరి డాన్ అయిన ముదియరసన్ అని శరవణన్ తెలుసుకుంటాడు. అంతేకాదు ఆ ఊరిలో అక్రమంగా ముదియరసన్ దాదాపు 100 కోట్లకు పైగా డబ్బులు దాచి పెట్టాడని శరవణన్ కు తెలుస్తుంది. తన తోటి టీచర్లతో కలిసి ఆ డబ్బును కొట్టేయడానికి ప్లాన్ వేస్తాడు శరవణన్. మరి ఆ ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా అన్నది మాత్రం గ్యాంగర్స్ సినిమాలోనే చూడాలి. సాధారణ టీచర్లు 100 కోట్ల రూపాయలను ఓ డాన్ దగ్గర నుండి కొట్టేయాలని ఏం చేస్తారు అన్నదే ఈ సినిమాలో సూపర్ పాయింట్. సినిమా ఆద్యంతం యాక్షన్ కామెడీతో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా వర్ధమాన తమిళ హాస్య నటుడు వడివేలు పండించిన కామెడీ ఈ సినిమాకు హైలైట్. ఓవరాల్ గా ఈ సినిమా వీకెండ్ కు మంచి కాలక్షేపం.- హరికృష్ణ ఇంటూరు -
ఓటీటీ రిలీజ్.. సూపర్ హిట్!
ఓవర్ ద టాప్.. సంక్షిప్తంగా ఓటీటీ. వినోద రంగాన్ని సమూలంగా మార్చి కొత్త రికార్డులకు వేదికవుతోంది. దేశవ్యాప్తంగా ఓటీటీ వీక్షకుల సంఖ్య 2024 నాటికి 55 కోట్లకు చేరిందంటే దీని స్పీడును అర్థం చేసుకోవచ్చు. టెలికం కంపెనీల దూకుడు పుణ్యమాని నగరాలే కాదు పల్లెలకూ ఆన్ లైన్ లో వీడియో స్ట్రీమింగ్ సంస్కృతి పాకింది. ఈ స్థాయిలో ప్రాచుర్యంలోకి వచ్చింది కాబట్టే నేరుగా ఓటీటీల్లో (ఒరిజినల్స్) రిలీజయ్యే సినిమాలు, వెబ్ సిరీస్, షోల సంఖ్య మన దేశంలో భారీగా పెరిగాయి. దేశంలో సగటున రోజుకో ఓటీటీ ఒరిజినల్ విడుదలై వీక్షకులకు వినోదాన్ని పంచుతోంది.2021లో మొత్తం ఓటీటీ ఒరిజినల్స్లో సినిమాల వాటా ఏకంగా 53 శాతం నమోదై రికార్డు సృష్టించింది. మహమ్మారి సమయంలో థియేటర్లు చాలా కాలం పాటు మూతపడ్డాయి. థియేటర్లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమాలు మరో మార్గం లేక ఓటీటీ బాట పట్టాయి. అయితే 2022 నుండి వెబ్ సిరీస్ల ఆధిపత్యం కొనసాగుతోంది. గడిచిన మూడేళ్లలో వెబ్ సిరీస్ల వాటా ఏటా 68–71 శాతం ఉంది. 2024లో రిలీజైన 315 ఒరిజినల్స్లో 214 వెబ్ సిరీస్లే. 2023లో ఈ సంఖ్య 272గా ఉంది. మొత్తం ఓటీటీ వీక్షకుల్లో 27.5 శాతం (15 కోట్లు) మంది పెయిడ్ కంటెంట్ను ఆస్వాదిస్తున్నారు. మిగిలిన 72.5 శాతం మంది ఉచితంగా అందుబాటులో ఉన్న కంటెంట్ను వీక్షిస్తున్నారు.ప్రాంతీయ భాషలపై ఫోకస్2021 నుంచి చూస్తే.. మొత్తం ఒరిజినల్స్లో మూడింట రెండొంతులు హిందీ కంటెంట్ కైవసం చేసుకుంది. దేశంలో గత ఏడాది ఓటీటీల్లో ప్రత్యక్షమైన ఒరిజినల్స్లో 65% వాటాతో హిందీ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. హొయిచొయి, క్లిక్, అడ్డాటైమ్స్ వంటి ఓటీటీ యాప్స్ దూకుడుతో బెంగాలీ 2వ స్థానాన్ని సంపాదించింది. దాదాపు 9 శాతం వాటాతో తెలుగు మూడో స్థానంలో ఉంది. తెలుగులో ‘ఆహా’ యాప్ 27 లక్షల మంది చందాదారులతో దూసుకుపోతోంది. ఇతర భాషలతో పోలిస్తే హిందీతోపాటు బెంగాలీ, తెలుగు, తమిళం, మలయాళంలో సృజనాత్మకత మెరుగ్గా ఉంది. దీంతో నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఇతర పెద్ద ప్లాట్ఫామ్లు ఈ ప్రాంతీయ భాషలపై దృష్టి సారించాయి. దక్షిణాదిన ఓటీటీ వినియోగాన్ని సినిమాలే నడిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో పెద్ద హిట్స్లో దాదాపు 70 శాతం నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్లలోనివే. మిగిలినవి జియో హాట్స్టార్, సోనీ లివ్లో ప్రసారం అయ్యాయి. -
‘స్ట్రా' మూవీ రివ్యూ.. కూతురు కోసం ఒంటరి మహిళ పోరాటం
ఓ ఊహకు మంచి ఆలోచన తోడై దానికి క్రియేటివిటీ అనే మసాలాను జోడిస్తే అవుతుంది ఓ అద్భుతమైన సినిమా. ఒక వ్యక్తిని అది కూడా ఒక తల్లిని... పరిస్థితులు, సమాజం నిస్సహయరాయుల్ని చేస్తే... నలుగురు కలిసి అన్ని రకాలుగా ఒక మూలకు నెట్టేస్తే ఆమేం చేసిందన్న విషయాన్ని ఊహకు అందనట్టుగా అదే సమయంలో మనసుకు హత్తుకునేట్టుగా తీసే దర్శకులు ప్రపంచ స్థాయిలో చాలా మందే ఉన్నారు. బోలెడంత ఖర్చుతో , పెద్ద స్టార్ కాస్టింగ్ తో ఓ కథను తీయడం పెద్ద కష్టమేమీ కాదు, కాని అదే సమయంలో చిన్న ఆలోచనను చిన్న స్టార్ కాస్ట్ తో ప్రేక్షకుడిని ఆకట్టుకోవడం కత్తి మీద సామే. అలా తన ఆలోచనకు తానే నిర్మాతగా మారి, దర్శకత్వం వహించి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన హాలివుడ్ దర్శకుడు టైలర్ పెర్రీ నిజంగా పెద్ద సాహసమే చేశాడు. ఆ సాహసం పేరే తాను తీసిన సినిమా స్ట్రా(Straw Movie Review). చిన్న ఆలోచనతో తన సినిమా చూస్తున్న ప్రేక్షకుడిని కదలనివ్వకుండా చేసిన సినిమా ఈ స్ట్రా. ఇది ఓ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే.అంతలా ఏముందీ సినిమాలో ఓసారి చూద్దాం...జనయా ఓ సింగిల్ మదర్, తన కూతురితో చిన్నపాటి ఇరుకు గదిలో అతి కష్టం మీద సర్దుకుంటూ ఉంటుంది. ఓ షాపింగ్ మాల్ లో పని చేసే జనయాకు ఆనందం అన్న విషయమే తెలియదు, అంతగా ఆమె జీవితం కష్టాలమయం. కనీసం స్కూల్ లో కూతురికి ఓ రోజు బ్రెడ్ కూడా పెట్టలేని పరిస్థితి. ఓ రోజు కూతురి బ్రెడ్ కోసం డబ్బులు లేక బ్యాంకు కు వెళ్ళి విత్ డ్రా చేయడానికి వెళితే, బ్యాంకు సిబ్బంది ఏదో కారణాల వల్ల డబ్బు ఇవ్వలేమని చెబితే వాళ్ళని ఎదిరించడానికి గన్ చూపిస్తుంది. బ్యాంకు లో గన్ చూపించడంతో అక్కడ ఉన్న సిబ్బంది అవాక్కయి పోలీసులకు ఫోన్ చేస్తారు.ఇక అక్కడ నుండి అసలు కథ మొదలవుతుంది. జనయాకి బ్యాంకుల వాళ్ళు డబ్బులు ఇస్తారా, లేదా గన్ చూపించినదానికి జనయాను పోలీసులు అరెస్ట్ చేస్తారా అన్నది మాత్రం సినిమాలోనే చూడాలి. చూడడానికి ఇది చిన్న కథే అయినా ఆఖర్లో వచ్చే ట్విస్ట్ తో చూసే ప్రేక్షకుల మతి పోవడం ఖాయం. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారిగా తరాజి పి హాన్సన్ జీవించిందని చెప్పవచ్చు. నిజానికి ఆ ఆలోచనకే దర్శకుడికి హాట్సాఫ్ చెప్పవచ్చు. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా పెద్ద వాళ్ళకు మాత్రమే. అలాగే ఇది తెలుగులోనూ లభ్యమవుతుంది. ఈ రివ్యూ చదివిన ప్రతి ప్రేక్షకుడు ఈ సినిమా తప్పనిసరిగా చూడండి. ఎందుకంటే ఎన్నో సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి, కాని ఇలాంటి సినిమా మాత్రం చాలా అరుదు. మస్ట్ వాచ్. -
సడన్గా రెండు ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు సినిమా
రీసెంట్ టైంలో కొత్త సినిమాలు ఓటీటీల్లోకి అనుకున్న దానికంటే త్వరగానే వచ్చేస్తున్నాయి. కొన్ని చిన్న బడ్జెట్ చిత్రాలైతే మరీ రెండు మూడు వారాలకే స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పుడు కూడా ఓ తెలుగు మూవీ ఇలానే ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. 'రాజాసాబ్' దర్శకుడు మారుతి దీన్ని సమర్పించడం విశేషం. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో ప్రస్తుతం అందుబాటులో ఉంది?(ఇదీ చదవండి: '8 వసంతాలు' సినిమా రివ్యూ)'ఉయ్యాలా జంపాలా', 'బాహుబలి' తదితర సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన నిఖిల్ దేవాదుల ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ఘటికాచలం'. నిజ జీవితంలో జరిగిన సంఘటనల్ని తీసుకుని సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అమర్ కామెపల్లి దర్శకత్వం వహించగా.. నిఖిల్తో పాటు ప్రభాకర్, ఆర్వికా గుప్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ మూవీ రెండు ఓటీటీల్లోకి ఎలాంటి హడావుడి లేకుండా వచ్చేసింది.మే 31న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. ఇప్పుడు 20 రోజులకే అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీల్లోకి వచ్చేసింది. తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతోంది. హారర్ అంశాలు బాగున్నప్పటికీ చిన్న సినిమా కావడంతో జనాలకు పెద్దగా రీచ్ కాలేదు. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్లు చూస్తారేమో? ఘటికాచలం విషయానికొస్తే.. తండ్రి కోరిక మేరకు మెడిసన్ చదివే ఓ కుర్రాడికి భయంకరమైన గొంతు వినిపిస్తూ ఉంటుంది. దీంతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తాడు. ఇంతకీ అలా చేయడానికి కారణమేంటి? ఆ గొంతు ఎవరిది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) -
ఐదు నెలల తర్వాత ఓటీటీకి తెలుగు సినిమా.. ఎక్కడ చూడాలంటే?
దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడు శ్రీరామ్ శంకర్ హీరోగా నటించిన చిత్రం ఒక పథకం ప్రకారం. ఈ ఏడాదిలో ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. మలయాళ డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వం వహించారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన ఈ సినిమాలో శృతి సోది, ఆషిమా నర్వాల్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు.తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు చేసుకుంది. రిలీజైన ఐదు నెలల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 27 నుంచి సన్ నెక్స్ట్లో అందుబాటులోకి రానుంది. ఈ సినిమా క్లైమాక్స్ యాక్షన్ సీన్ కోసం 25 డాగ్స్తో ఫైట్ సీన్ తెరకెక్కించారు. కాగా.. హీరో సాయిరాం శంకర్ 143, బంపర్ ఆఫర్ లాంటి సినిమాలతో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా గ్యాప్ ఇచ్చిన ఈ ఏడాది ఒక పథకం ప్రకారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.ఒక పథకం ప్రకారం కథేంటంటే..ఈ కథ మొత్తం 2014 విశాఖపట్నంలో జరుగుతూ ఉంటుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిద్ధార్థ నీలకంఠ (సాయిరాం శంకర్) భార్య సీత (ఆషిమా నర్వాల్) షాపింగ్ కి వెళ్లగా అక్కడ భార్య మిస్ అవుతుంది. ఆమె ఏమైందో తెలియక ఇబ్బంది పడుతున్న సిద్ధార్థ డ్రగ్స్కు బానిస అవుతాడు. అయితే సిద్ధార్థతో కలిసి డ్రగ్స్ తీసుకునే దివ్య(భాను శ్రీ) అనూహ్యంగా దారుణమైన స్థితిలో హత్యకు గురవుతుంది. ఈ కేసు విచారణలో ఏసిపి రఘురాం(సముద్రఖని), సిద్ధార్థ ఈ మర్డర్ చేశాడని భావించి అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడితే డ్రగ్స్ కేసు కారణంగా సస్పెండ్ కావడంతో ఆ స్థానంలో ప్రాసిక్యూటర్గా రావాలని ప్రయత్నించే చినబాబు (కళాభవన్ మణి) కూడా సిద్ధార్థని ఇరికించే ప్రయత్నం చేస్తాడు. అయితే తాను స్వతహాగా లాయర్ కావడంతో తాను హత్య చేయలేదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తాడు సిద్ధార్థ్. తర్వాత ఇదే క్రమంలో అనేక హత్యలు జరుగుతున్నాయని తెలుసుకుని అసలు ఈ హత్యలకు కారణం ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నంలో అతనికి ఏసీపీ కవిత(శృతి సోది) కూడా సహకరిస్తుంది. అసలు వరుస హత్యలు చేసేది ఎవరు? ఆ హత్యలకు సిద్ధార్థకి ఏమైనా సంబంధం ఉందా? సిద్ధార్థ్ను మాత్రమే ఇరికించాలని ఎందుకు ఏసీపీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సహా మరి కొంత మంది ప్రయత్నించారనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే తెరపై చూడాల్సిందే. -
కొత్త సినిమాలు.. వచ్చేది ఆ ఓటీటీల్లోనే
ఈ వారం ఓటీటీల్లో దాదాపు 24 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్లోకి వచ్చేశాయి. మరోవైపు థియేటర్లలోనూ మూడు కొత్త మూవీస్ వచ్చేశాయి. వీటిలో 'కుబేర'కి పాజిటివ్ టాక్ గట్టిగా వినిపిస్తోంది. బిచ్చగాడిగా ధనుష్ యాక్టింగ్ ఇరగదీశాడని అంటున్నారు. నాగార్జున, రష్మిక కూడా ఆకట్టుకున్నారని రివ్యూస్ వస్తున్నాయి. అయితే ఈ మూవీని థియేటర్కి వెళ్లి చూసేవాళ్లు చూస్తారు. అలానే ఓటీటీలో ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేవాళ్లు కూడా ఉంటారు.'కుబేర' ఓటీటీ డీల్ విషయానికొస్తే.. రిలీజ్కి ముందు డిజిటల్ హక్కులు అమ్మేశారు. లెక్క ప్రకారం నిర్మాతలు.. జూలైలో వద్దామని ప్లాన్ చేసుకున్నారు. కానీ హక్కులు దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ సంస్థ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ 20న థియేటర్లలో రిలీజ్ చేయాలని చెప్పాడు. దీంతో నిర్మాతలు తలొగ్గారు. అయితే ఓటీటీ ఒప్పందం మాత్రం నాలుగు వారాలకే చేసుకున్నట్లు తెలుస్తుంది. అంటే జూలై 3వ వారంలో అలా స్ట్రీమింగ్ కావొచ్చేమో?(ఇదీ చదవండి: Kuberaa Review: ‘కుబేర’ మూవీ రివ్యూ)'8 వసంతాలు' విషయానికొస్తే.. ఓ చక్కటి ప్రేమకథా చిత్రం. బాగుందనే టాక్ వస్తుంది. అదే టైంలో స్టోరీ చాలా నెమ్మదిగా సాగేలా ఉందని అంటున్నారు. హీరోయిన్గా అనంతిక యాక్టింగ్ ఇచ్చిపడేసిందని రివ్యూలు వచ్చాయి. కంప్లీట్ లవ్ స్టోరీ సినిమా చూద్దామనుకుంటే దీన్ని ప్రయత్నించొచ్చు. ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. రీసెంట్ టైంలో ఈ ఓటీటీలో సినిమాలన్నీ నాలుగు వారాలకే వచ్చేస్తున్నాయి. ఇది కూడా అలానే స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయి.ఈ రెండింటితో పాటు హిందీ సినిమా ఆమిర్ ఖాన్ 'సితారే జమీన్ పర్' కూడా థియేటర్లలో రిలీజైంది. దీని బుకింగ్స్ చాలా డల్గా ఉన్నాయి. పాజిటివ్ టాక్ అయితే వచ్చింది గానీ బాక్సాఫీస్ దగ్గర ఎంతమేర నిలబడుతుందో చూడాలి? ఎందుకంటే ఆమిర్ గత చిత్రాలు దారుణంగా ఫెయిలయ్యాయి. అలానే ఈ మూవీ డిజిటల్ హక్కుల్ని ఏ ఓటీటీ సంస్థకు కూడా అమ్మలేదు. 8 వారాల తర్వాత యూట్యూబ్లో పే పర్ వ్యూ పద్ధతిలో స్ట్రీమింగ్ చేయాలని ప్లాన్.(ఇదీ చదవండి: '8 వసంతాలు' సినిమా రివ్యూ) -
టాప్ ట్రెండింగ్లో టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?
టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర మరో ఆసక్తికర సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చారు. బ్లైండ్ స్పాట్ అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీతో అలరించాడు. మే 9న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రైమ్ థ్రిల్లర్కు రాకేశ్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను మ్యాంగో మాస్ మీడియా రామకృష్ణ వీరపనేని నిర్మించారు.అయితే ఇటీవలే బ్లైండ్ స్పాట్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. జూన్ 13 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో అంతగా రాణించలేకపోయినప్పటికీ.. డిజిటల్ ఫ్లాట్ఫామ్లో మాత్రం దూసుకెళ్తోంది. అమెజాన్ ప్రైమ్లో ఇండియా వ్యాప్తంగా ఏకంగా టాప్-2లో ట్రెండ్ అవుతోంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇంకెందుకు ఆలస్యం ఆ క్రైమ్ థ్రిల్లర్ కథేంటో మీరు కూడా చూసేయండి. కాగా.. ఈ చిత్రంలో రాశీసింగ్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీలో ఆలీ రెజా, గాయత్రి భార్గవి, రవి వర్మ కీలక పాత్రలు పోషించారు.బ్లైండ్ స్పాట్ కథేంటంటే?హైదరాబాద్కు చెందిన మెన్ జైరాం (రవి వర్మ) ప్రముఖ వ్యాపారవేత్తగా ఉంటాడు. అయతే, తన భార్య దివ్య (రాశీ సింగ్)తో తరుచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఆమె అనుమానాస్పదంగా మరణిస్తుంది. అది హత్య లేక ఆత్మహత్యనా అనేది అంతుపట్టదు. దివ్య మరణించిన విషయాన్ని ఆ ఇంటి పనిమనిషి పోలీసులకు సమాచారం ఇస్తుంది. అప్పుడు ఆ ఏరియా పోలీస్ విక్రమ్ (నవీన్ చంద్ర) రంగంలోకి దిగుతాడు. ఇక ఇక్కడ నుంచి అసలు కథ మొదలౌతుంది. ఆమెది ఆత్మహత్య కాదు హత్య అని విక్రమ్ చెబుతాడు. మరి ఆ హత్యకు కారణాలు ఏంటి..? ఎవరు చేశారు..? ఆమెను చంపే అంత అవసరం ఎందుకు వచ్చింది..? ఇంట్లో ఉన్నవారితోనే ప్లాన్ వేశారా..? దివ్య మానసిక పరిస్థితి ఎలా ఉండేది? చివరికి హత్య చేసిన వారిని పోలీసులు ఎలా పట్టుకున్నారు..? అనేది తెలియాలంటే 'బ్లైండ్ స్పాట్' చూడాల్సిందే. View this post on Instagram A post shared by Gayatri Bhargavi (@gayatri_bhargavi) -
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. థియేటర్లలోకి వచ్చిన '8 వసంతాలు', 'కుబేర', 'సితారే జమీన్ పర్' సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తోంది. దీంతో ఈ వీకెండ్ బిగ్ స్క్రీన్స్ కళకళలాడటం గ్యారంటీ. మరోవైపు ఓటీటీల్లోనూ ఈ శుక్రవారం 24 వరకు కొత్త చిత్రాలు-వెబ్ సిరీసులు ఉన్నాయి. వీటిలో పలు తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ కూడా ఉన్నాయండోయ్.(ఇదీ చదవండి: '8 వసంతాలు' సినిమా రివ్యూ)ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే.. ఘటికాచలం, హద్దులేదురా, జింఖానా, యుద్ధకాండ, లవ్లీ, గ్రౌండ్ జీరో సినిమాలతో పాటు కేరళ క్రైమ్ ఫైల్స్ వెబ్ సిరీసు.. ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తోంది. ఇప్పుడు చెప్పిన వాటిలో స్ట్రెయిట్ తెలుగు మూవీస్ ఉన్నాయి. అలానే ఇతర భాషా చిత్రాలు కూడా ఉన్నాయి. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏ మూవీ వచ్చిందంటే?ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన మూవీస్ (జూన్ 20)అమెజాన్ ప్రైమ్యుద్ధకాండ ఛాప్టర్ 2 - తెలుగు డబ్బింగ్ సినిమాలవ్లీ - మలయాళ మూవీఘటికాచలం - తెలుగు మూవీఆహాఅలప్పుజా జింఖానా - తెలుగు మూవీజిన్ ద పెట్ - తమిళ సినిమాసేవ్ నల్ల పసంగ - తమిళ సిరీస్యుగీ - తమిళ సినిమా నెట్ఫ్లిక్స్కె-పాప్ డీమన్ హంటర్స్ - కొరియన్ సినిమాఒలింపో - స్పానిష్ సిరీస్సెమీ సోయిటర్ - ఇంగ్లీష్ సినిమాఏ కింగ్ లైక్ మీ - ఇంగ్లీష్ మూవీగ్రీన్ బోన్స్ - తగలాన్ సినిమాబేబీ ఫార్మ్ సీజన్ 1 - నైజీరియన్ సిరీస్ఏ లాగోస్ లవ్ స్టోరీ - నైజీరియన్ మూవీద గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3 - హిందీ కామెడీ షో (జూన్ 21)హాట్స్టార్ఫౌండ్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2 - తెలుగు డబ్బింగ్ సిరీస్జీ5డిటెక్టివ్ షెర్డిల్ - హిందీ సినిమాగ్రౌండ్ జీరో - హిందీ మూవీప్రిన్స్ అండ్ ఫ్యామిలీ - మలయాళ సినిమాఎమ్ఎక్స్ ప్లేయర్ఫస్ట్ కాపీ - హిందీ సిరీస్లయన్స్ గేట్ ప్లేకబోల్ - ఫ్రెంచ్ సిరీస్ఎలెవన్ - తమిళ మూవీబుక్ మై షోహద్దులేదురా - తెలుగు సినిమా(ఇదీ చదవండి: హిట్3 మేకర్స్పై కేసు వేసిన అభిమాని) -
నేరుగా ఓటీటీకి స్టార్ హీరో సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అమితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'కాళిధర్ లపతా'. ఈ సినిమాకు మధుమిత దర్శకత్వం వహించారు. ఈ మూవీని జీ స్టూడియోస్ బ్యానర్లో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాపై విడుదలకు సిద్ధమైంది.అయితే ఈ చిత్రాన్ని థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నట్లు అభిషేక్ బచ్చన్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ మేరకు కాళిధర్ లపతా పోస్టర్ను పంచుకున్నారు. ఈ చిత్రం జూలై 4న జీ5లో ప్రీమియర్ అవుతుందని తెలిపారు. ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్ టైటిల్ రోల్ పోషించగా.. దైవిక్ భగేలా, జీషన్ అయూబ్ కీలక పాత్రల్లో నటించారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాను ఓటీటీలోనే చూసేయండి.తన కుటుంబం తనను వదిలించుకోవాలని చూస్తున్న విషయం తెలుసుకున్న ఓ వృద్ధుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. కుటుంబానికి దూరంగా పారిపోవడానికి ఆ వృద్ధుడు యత్నిస్తాడు. అతనికి ఎనిమిదేళ్ల అనాథ అయిన బల్లుతో ఊహించని పరిచయం.. జీవితాన్ని మార్చే సంఘటనకు దారితీస్తుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలే ఈ చిత్రంలో చూపించారు. కాగా.. అభిషేక్ బచ్చన్ చివరిసారిగా 'హౌస్ఫుల్ 5'చిత్రంలో కనిపించారు. ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. चर्चाओं पर अब फुल स्टॉप! Sometimes, getting lost isn’t a detour, it’s where the real story begins.Full of dreams, twists, and the people who make it worth it. 😊#KaalidharLaapata premieres 4th July, only on #ZEE5.#KaalidharLaapataOnZEE5@Mdzeeshanayyub #DaivikBaghela… pic.twitter.com/0BDqAumEUR— Abhishek 𝐁𝐚𝐜𝐡𝐜𝐡𝐚𝐧 (@juniorbachchan) June 19, 2025 -
OTT: రాజీవ్ గాంధీ హత్య కేసు ఆధారంగా 'ద హంట్'
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసును ఆధారంగా చేసుకుని ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. అదే ద హంట్ (The Hunt: The Rajiv Gandhi Assassination Case). ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీలివ్ అధికారికంగా ప్రకటించింది. జూలై 4 నుంచి సోనీలివ్లో ప్రసారం కానున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ టీజర్ కూడా రిలీజ్ చేసింది. అందులో.. 'రాజీవ్ గాంధీ బతికే ఉన్నారా? ఆయనింకా బతికే ఉన్నారా?' అని శ్రీలంకలోని భారత హై కమిషనర్ కార్యాలయానికి ఫోన్ రావడంతో టీజర్ మొదలవుతుంది. బాంబు పేల్చి రాజీవ్గాంధీని చంపిందెవరు? వారి ఉద్దేశ్యం ఏంటి? అన్న కోణాల్లో విచారణ మొదలుపెడతారు. ప్రతి సెకను కూడా ముఖ్యమేనంటూ నిందితులను పట్టుకునే పనిలో ఉంటారు. తర్వాత ఏం జరిగిందన్నది తెలియాలంటే ఓటీటీలో సిరీస్ చూడాల్సిందే! ద హంట్కు నగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించాడు. కాగా 1991, మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్లో నాటి దేశ ప్రధాని రాజీవ్ గాంధీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఆ సమయంలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో రాజీవ్ గాంధీ హతమయ్యారు. The assassination that shook the nation. The manhunt that stunned the world.The Hunt - The Rajiv Gandhi Assassination Case, streaming from 4th July on Sony LIV.#TheHuntOnSonyLIV pic.twitter.com/ExOXEZxYFK— Sony LIV (@SonyLIV) June 18, 2025 -
సడన్గా ఓటీటీలో వచ్చేసిన రాధికా ఆప్టే సినిమా
కొన్ని సినిమాలు థియేటర్లలోకి వచ్చిన వారాల వ్యవధిలోనే ఓటీటీలోకి వచ్చేస్తుంటాయి. ఇప్పుడు కూడా హీరోయిన్ రాధిక ఆప్టే లేటెస్ట్ మూవీ ఒకటి అలానే సడన్గా స్ట్రీమింగ్లోకి వచ్చింది. బోల్డ్ కాన్సెప్ట్తో డార్క్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రానికి కరణ్ కాందహారి దర్శకుడు కాగా మిగిలిన విభాగాల్లో హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేశారు. ఇంతకీ ఏంటీ సినిమా? ఎందులో అందుబాటులో ఉంది?రాధికా ఆప్డే లేటెస్ట్ బోల్డ్ మూవీ 'సిస్టర్ మిడ్ నైట్'. మే 30న థియేటర్లలో రిలీజ్ కాగా.. ఇదో సినిమా ఉందనే విషయం కూడా జనాలకు తెలియలేదు. దీంతో ఎలా వచ్చిందో అలా వెళ్లిపోయింది. ఇప్పుడు ఈ చిత్రం రెండు వారాలు కాగానే ఓటీటీలోకి వచ్చేసింది. కాకపోతే ఇక్కడే ఓ ట్విస్ట్. ప్రస్తుతం యూకేలో అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ, గూగుల్ ప్లే ఫ్లాట్ ఫామ్స్లో హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో మన దగ్గర కూడా అందుబాటులోకి రావొచ్చు.(ఇదీ చదవండి: రామోజీ ఫిల్మ్ సిటీ భయంకరమైన ప్లేస్: హీరోయిన్ కాజోల్)'సిస్టర్ మిడ్ నైట్' విషయానికొస్తే.. పెద్దలు పెళ్లి కుదర్చడంతో ఉమ(రాధికా ఆప్టే) గోపాల్ని పెళ్లి చేసుకుంటుంది. ముంబైలోని ఓ మురికివాడలో వీళ్లు నివసిస్తుంటారు. ఈ వివాహం ఇష్టం లేకుండా చేసేసరికి ఉమ.. భర్తతో కలవలేకపోతుంది. అతడు కూడా భార్యని తాకడానికి కూడా ఇబ్బంది పడుతుంటాడు. పెళ్లయి చాన్నాళ్లు అవుతున్నా భర్త తనతో అంటీముట్టనట్లు ఉండటంత.. తన లైంగిక వాంఛ గురించి బయటకు చెప్పలేక ఇబ్బంది పడుతుంది. అనారోగ్యానికి గురవుతుంది.ఓరోజు ఎలాగోలా ధైర్యం చేసి భర్తతో కలుస్తుంది. కానీ తెల్లారి లేచి చూసేసరికి ఉమ శవమై కనిపిస్తాడు. దీంతో ఈమె ఏం చేసింది? చివరకు ఏమైందనేదే స్టోరీ. బోల్డ్ అండ్ డార్క్ కామెడీకి తోడు కొన్ని సీన్లు మరీ పచ్చిగా ఉన్నాయి. రాధికా ఆప్డే యాక్టింగ్ బాగుందని అంటున్నారు. ఒకవేళ పొరపాటున గనక ఈ మూవీ చూస్తే మాత్రం ఒంటరిగానే చూడండి.(ఇదీ చదవండి: ఓటీటీ సినిమా 'పడక్కళమ్' రివ్యూ.. కామెడీ ఎంటర్టైనర్) -
భారీ డిజిటల్ రైట్స్ తో రామ్ చరణ్ పెద్ది సినిమా సంచలనం
-
సినిమా థియేటర్లకు ఆదరణ లేక..
మాచర్ల రూరల్: ఒకప్పుడు సినిమా విడుదల అంటే పల్లె, పట్టణం లేడా లేదు.. ఊరుంతా పండుగ వాతావరణం. టికెట్ దొరకతే ఆ ఆనందం లెక్క వేరు. అర్ధరాత్రి నుంచి అభిమానులు థియేటర్ల వద్ద బారులు తీరేవారు. అప్పట్లో ఏడాది కాలంగా ఒకే థియేటర్లో సినిమా ప్రదర్శించిన రోజులున్నాయి. ప్రస్తుతం రోజులు మారాయి. వినోద రంగం కొత్త పుంతలు తోక్కుతోంది. ఓటీటీలు రాకతో థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పట్టణంలో ఇలా.. మాచర్ల పట్టణంలో నీలిమా డీలక్స్, శ్రీ రామాటాకీస్, శ్రీనివాస మహాల్, నాగార్జున కళామందిర్, శ్రీ వెంకటేశ్వర థియేటర్లు ఉండేవి. చంద్రవంక నూతన బ్రిడ్జి నిర్మాణంతో నీలిమా డీలక్స్ «సినిమా హాలు వాగు నీటి ప్రవాహంతో థియేటర్కు రాకపోకలకు ఇబ్బంది కలుగుతుండటంతో 20 ఏళ్ల క్రితం ఆ థియేటర్ను పూర్తిగా మూసివేశారు. ప్రస్తుతం నాలుగు థియేటర్లు ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నాయి. ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో శ్రీ రామాటాకీస్, నాగార్జున కళామందిర్ ప్రేక్షకులు రాకపోవటంతో సినిమాలు రిలీజ్లు లేకపోవటంతో నెల రోజుల నుంచి ఆ రెండు థియేటర్లు మూసివేశారు. మల్టీప్లెక్స్ లు రాకతోనూ... మలీ్టఫ్లెక్స్ వచ్చిన తరువాత సింగిల్ స్క్రీన్కు వెళ్లేందుకు ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపటం లేదు. కరోనా వచ్చిన తరువాత సినిమా థియేటర్లు నిర్వహణ సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. అద్దె ప్రాతిపదికన నిర్వహించటం, డిస్ట్రిబ్యూటర్లుకు, ఎగ్జిబిటర్లు తమ వల్ల కావడం లేదని చెబుతున్నారు.ప్రస్తుతం సింగిల్ థియేటర్లకు సినిమా విడుదల చేసే సమయంలో ఒప్పందాలు చేసుకుంటున్నారు. మల్టిఫ్లెక్స్కు షేరు విధానం అమలు చేస్తున్నారు. అద్దె ప్రతిపాదన వలన ఆర్థికంగా నష్టపోతున్నట్లు సింగిల్ థియేటర్లు నిర్వాహకులు వాపోతున్నారు. భారీ బడ్జెట్ చిత్రాల విడుదల చేసినా కొన్ని రోజుల వరకు రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తుంది. దీని వలన డి్రస్టిబ్యూటర్లు, నిర్మాతకు మాత్రమే ప్రయోజనం జరుగుతుందని, తమకు న్యాయం జరగటం లేదని చెబుతున్నారు. -
ఓటీటీ సినిమా రివ్యూ.. కన్ఫ్యూజన్ కామెడీ ఎంటర్టైనర్
సింపుల్ బడ్జెట్, డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు తీయడంలో మలయాళ దర్శకుల తర్వాత ఎవరైనా. ఎందుకంటే రీసెంట్ టైంలో అలా వచ్చిన పలు చిత్రాలు అటు థియేటర్లలో ఇటు ఓటీటీల్లో దుమ్మురేపుతున్నాయి. అలాంటి ఓ చిత్రమే 'పడక్కళమ్'. ఓవైపు నవ్విస్తూనే కన్ఫ్యూజన్ కామెడీతో ఆకట్టుకున్న ఈ చిత్రం ఎలా ఉంది? దీని సంగతేంటి అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?ఓ ఇంజినీరింగ్ కాలేజీ. షాజీ(సూరజ్ వెంజరమోడు) అనే ప్రొఫెసర్. ఆయన డిపార్ట్మెంట్ హెచ్ఓడీని సస్పెండ్ చేయడంతో ఆ స్థానంలోకి షాజీ వెళ్తాడు. అదే కాలేజీలో పనిచేస్తున్న మరో ప్రొఫెసర్ రంజిత్(షరాఫుద్దీన్)కి ఇది నచ్చదు. దీంతో తన దగ్గరున్న మాయాపెట్టెతో షాజీని తన కంట్రోల్కి తీసుకుని ఆటాడిస్తాడు. ఇదంతా జతిన్(సందీప్ ప్రదీప్) అనే కుర్రాడు చూసేస్తాడు. తన ఫ్రెండ్స్కి చెబుతాడు. కానీ వాళ్లు నమ్మరు. దీంతో రంజిత్ బ్యాగ్ని దొంగిలించడానికి జతిన్ ప్రయత్నిస్తాడు. తర్వాత కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల జతిన్ శరీరంలో రంజిత్, రంజిత్ బాడీలోకి షాజీ, షాజీ శరీరంలోకి జతిన్ ఆత్మలు ప్రవేశిస్తాయి. అసలు ఎందుకిలా జరిగింది? చివరకు ఏమైంది అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఇంజినీరింగ్ కాలేజీ బ్యాక్ డ్రాప్ సినిమాలు అనగానే హా ఏముంది లవ్ స్టోరీ అయ్యింటుందిలే అనుకుంటాం. కానీ ఇందులో 'జంబలకిడిపంబ' తరహాలో ఒకరి శరీరంలో మరొకరు ప్రవేశించడం అనే కాన్సెప్ట్ని జోడించడం కాస్త కొత్తగా అనిపించింది. పడక్కళమ్ అంటే యుద్ధభూమి అని అర్థం. సినిమా ప్రారంభంలోనే ఓ రాజ్యం, యుద్ధం అని మొదలుపెడతారు. ఓ మాయ పెట్టె గురించి చెబుతారు. కట్ చేస్తే ప్రస్తుతానికి వచ్చేస్తాం. కాలేజీలో జతిన్ గ్యాంగ్ చేసే అల్లరి, షాజీ-రంజిత్ పాత్రలు కాస్త నవ్విస్తాయి. అలా అలా ఫస్టాప్ అయిపోతుంది. సరిగ్గా ఇంటర్వెల్ సమయానికి ప్రధాన పాత్రధారులు ముగ్గరు.. ఒకరి శరీరాల్లోకి ఒకరు వెళ్లడం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది.సెకండాఫ్ అంతా కూడా ఒకరి శరీరంలోకి ప్రవేశించిన మరొకరు అసలు ఏం చేశారు? చివరకు మళ్లీ యాధావిధిగా వచ్చేశారా? లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ మూవీస్తో పోలిస్తే ఈ సినిమా బాగుంది. కాకపోతే ఫస్టాప్ సరదాగా సాగిపోయినప్పటికీ.. సెకండాఫ్ మాత్రం కన్ఫ్యూజన్ కామెడీతో కొంతమేర ఆకట్టుకుంది. అక్కడక్కడ థ్రిల్లింగ్గా అనిపించినా లాజిక్స్ లాంటివి ఏం పట్టించుకోకుండా చూస్తే టైమ్ పాస్ అయిపోతుంది. చివర్లో కాస్త ఎమోషన్ సీన్స్ పడేసరికి ఓ మంచి సినిమా చూశాంలే అనే ఫీలింగ్ కలుగుతుంది.ఎవరెలా చేశారు?ఈ సినిమాలో జతిన్గా చేసిన సందీప్ ప్రదీప్కి ఎక్కువ స్కోప్ దొరికింది. ఫస్టాప్ అంతా అమాయక కుర్రాడిగా, సెకండాఫ్ అంతా అగ్రెసివ్గా పాత్రలో ఆకట్టుకున్నాడు. విలనీ లక్షణాలున్న పాత్రలో షరాఫుద్దీన్ కూడా మెప్పించాడు. సూరజ్ వెంజరమోడు పాత్ర కూడా బాగుంది కానీ ఇంకాస్త మంచిగా సీన్స్ పడుంటే బాగుంటుంది కదా అనిపించింది. మిగతా పాత్రధారులు ఓకే. టెక్నికల్ విషయాలకొస్తే.. కాలేజీలో జరిగే కన్ఫ్యూజన్ కామెడీ ఎంటర్టైనర్ సింపుల్ బడ్జెట్లో తీసేశారు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఓకే ఓకే. డైరెక్షన్ కూడా పర్లేదు. ప్రస్తుతం హాట్స్టార్లో ఈ సినిమా తెలుగు డబ్బింగ్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. కాసేపు అలా ఫ్యామిలీతో కలిసి నవ్వుకుందాం అనుకుంటే ఈ సినిమాపై ఓ లుక్కేయొచ్చు.- చందు డొంకాన -
'సితారే జమీన్ పర్' రిలీజ్.. రూ.120 కోట్ల ఆఫర్ వద్దన్న అమిర్ ఖాన్!
బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ నటించిన తాజా చిత్రం సితారే జమీన్ పర్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 20న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో జెనీలియా దేశ్ముఖ్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకు ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్, అపర్ణ పురోహిత్ నిర్మించారు. ఇటీవలే సెన్సార్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకుంది. ఎటువంటి కట్స్ లేకుండానే సితారే జమీన్ పర్ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ తెగ వైరలవుతోంది. ఈ మూవీకి దాదాపు రూ.120 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసేందుకు అమెజాన్ ప్రైమ్ ముందుకొచ్చింది. అయితే ఈ డీల్ను అమిర్ ఖాన్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కేవలం థియేటర్లలోనే ఆడుతుందని.. ఓటీటీలో విడుదల ఉండదని అమిర్ ఖాన్ స్పష్టం చేసినట్లు సమాచారం. ఓటీటీలో సినిమా రిలీజ్ చేయకపోవడం వల్ల ఆడియన్స్ థియేటర్లకు రప్పించేందుకు అమిర్ ఖాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే సితారే జమీన్ పర్ థియేటర్లలో ప్రదర్శన తర్వాత యూట్యూబ్లో అందుబాటులో ఉంచుతారని అమిర్ ఖాన్ చెబుతున్నారు. కానీ అది ఉచితం కాదు.. ప్రేక్షకులు సినిమా చూడటానికి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన వెంటనే యూట్యూబ్లో అందుబాటులోకి వస్తుందో లేదో అన్నదానిపై క్లారిటీ లేదు. అయితే ఎనిమిది వారాల థియేటర్ రన్ తర్వాత విడుదల కోసం అమెజాన్ రూ. 120 కోట్లు ఆఫర్ చేసింది. -
ఓటీటీలోకి సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'విరాటపాలెం'
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు ఏదో ఓ కొత్త సినిమా లేదా వెబ్ సిరీస్ వస్తూనే ఉంటుంది. గతవారం అలా 30కి పైగా స్ట్రీమింగ్లోకి వచ్చాయి. ఈ వారం కూడా పలు తెలుగు స్ట్రెయిట్ మూవీస్, డబ్బింగ్ చిత్రాలు ఓటీటీల్లోకి రాబోతున్నాయి. వాటి సంగతి అలా పక్కనబెడితే ఓ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఫస్ట్ లుక్ ప్రకటించడంతో స్ట్రీమింగ్ తేదీని కూడా ఖరారు చేశారు.(ఇదీ చదవండి: కీర్తి సురేశ్ కొత్త సినిమా.. నేరుగా ఓటీటీలోనే రిలీజ్)యూట్యూబర్ అభిజ్ఞ కానిస్టేబుల్గా నటిస్తున్న ఈ థ్రిల్లర్కి 'విరాటపాలెం' అనే టైటిల్ నిర్ణయించారు. ఇది వెబ్ సిరీస్గా రాబోతుంది. పొల్లూరు కృష్ణ దర్శకుడు. జూన్ 27న అంటే వచ్చే వారం నుంచి ఇది జీ5లో స్ట్రీమింగ్ కానుందని పోస్టర్ రిలీజ్ చేసి మరీ ప్రకటించారు. ఫస్ట్ లుక్ బట్టి చూస్తే ప్రధాన పాత్రధారి కానిస్టేబుల్, వెనక చాలామంది కొత్త పెళ్లి కూతుళ్లు, ఆ వెనక అమ్మవారి విగ్రహం ఉంది. చూస్తుంటే ఆసక్తికరంగానే ఉంది.1980ల నాటి మారుమూల, భయానక గ్రామమైన విరాటపాలెం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ ఊరికి ఉన్న శాపం, ప్రతి వధువు తన పెళ్లి రోజే మరణించడం, దీంతో దశాబ్ద కాలంగా ఏ వివాహం జరగకపోవడం లాంటి అంశాలతో కథ ముందుకు సాగుతుంది. అలా చివరకు పెళ్లిళ్లు అనేవి జరగకుండా గ్రామం భయంతో స్తంభించిపోతుంది. ఓ పోలీసు కానిస్టేబుల్ (అభిజ్ఞ) ఆ గ్రామానికి రావడం, అక్కడి శాపం గురించి తెలుసుకోవడం, ఆ రహస్యాన్ని ఛేదించడం అనే ఉత్కంఠభరితమైన కథనంతో అందరినీ ఆకట్టుకునేలా ఈ సిరీస్ ఉండబోతోంది.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. గ్రౌండ్ జీరో, డిటెక్టివ్ షెర్డిల్, ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ లాంటి పరభాషా సినిమాలతో పాటు కేరళ క్రైమ్ ఫైల్స్ వెబ్ సిరీస్, ద గ్రేట్ ఇండియన్ కపిల్ కామెడీ షో ఈ వీకెండ్లో స్ట్రీమింగ్ కానున్నాయి. ప్రస్తుతానికైతే స్ట్రెయిట్ తెలుగు మూవీస్ ఏం లేవు.. వారాంతంలో సడన్ సర్ప్రైజులు ఉండొచ్చు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 22 సినిమాలు రిలీజ్) -
ఓటీటీలో 'ఫైనల్ డెస్టినేషన్' చూడాలంటే..
హాలీవుడ్లో 'ఫైనల్ డెస్టినేషన్' ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన సినిమాలకు తెలుగులో భారీ క్రేజ్ ఉంది. తాజాగా ఈ సీక్వెల్ చిత్రాల నుంచి విడుదలైన కొత్త చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. అప్పట్లో అందరినీ ఈ సీక్వెల్స్ చిత్రాలు వణికించాయని చెప్పవచ్చు. అయితే, సుమారు 15 ఏళ్ల తర్వాత 'ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్ లైన్స్' పేరుతో ఆరో భాగమైన చివరి పార్ట్ ని తీశారు. మే 15న భారత్లో విడుదలైంది. ప్రేక్షకులను థియేటర్లో భయపెట్టిన ఈ చిత్రం సడెన్గా ఓటీటీలోకి వచ్చేసింది.ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్లైన్స్ సడెన్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. కానీ, ప్రస్తుతం భారత్ నెట్వర్క్లో అందుబాటులో లేదు. ఇతర దేశాల్లో ఉంటున్న ఈమెజాన్ ప్రైమ్ యూజర్స్కు మాత్రమే ఈ చిత్రాన్ని చూసే ఛాన్స్ ఉంది. అయితే, మరో వారంలోనే భారత్లో కూడా స్ట్రీమింగ్కు రావచ్చని తెలుస్తోంది. రూ. 430 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 2300 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. జాక్ లిపోవ్స్కీ, అడమ్ స్టేయిన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సుమారు గంట 49 నిమిషాల రన్టైమ్ ఉన్న ఈ చిత్రంలో బ్రెక్ బసింగర్, విలియమ్ బ్లడ్వర్త్, రిచర్డ్ హార్మోన్, క్యాథలీన్ శాంటా జువానా, టియో బ్రియోన్స్ తదితరులు నటించారు. 2000లో తొలి పార్ట్ రాగా.. 2003, 2006, 2009, 2011లో మిగతా పార్ట్స్ వచ్చాయి. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఆరోది రిలీజ్ అయింది. -
భారీ ధరకు ‘పెద్ది’ ఓటీటీ రైట్స్.. రిలీజ్కు ముందే రికార్డు!
రామ్ చరణ్(Ram Charan) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ (Peddi). ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రమిది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఆ మధ్య ఈ సినిమా నుంచి గ్లింప్స్ వచ్చింది. ఒకే ఒక షాట్తో సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాడు. ‘ఏదైనా ఈ నేల మీదున్నప్పుడే సేసేయాల, పుడతాం ఏటి మళ్లీ’ అంటూ కోస్తాంధ్ర యాసలో రామ్చరణ్ చెప్పిన డైలాగులకు అద్భుతమైన స్పందన లభించింది. ఈ ఒక్క గ్లింప్స్తోనే ఓటీటీ డీల్ క్లోజ్ చేసుకుంది ఈ చిత్రం. భారీ ధరకు ఓటీటీ రైట్స్ ఇచ్చేశాడట నిర్మాత వెంకట సతీష్. డిజిటల్ రైట్స్ కోసం రెండు భారీ ఓటీటీ సంస్థలు పోటీ పడగా.. చివరకు నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందట. అయితే ఈ డీల్లో కొన్ని కండీషన్స్ ఉన్నాయట. రూ. 105 కోట్లు తొలుత అందజేసి.. సినిమా రిజల్ట్ని బట్టి మరింత పెంచేస్తామని నెట్ఫ్లిక్స్ కండీషన్ పెట్టిందట. తెలుగు లో ఆడితే ఇంత.. హిందీలో ఈ స్థాయి కలెక్షన్స్ సాధిస్తే మరింత..అని ఒప్పందం కుదుర్చుకున్నారు. రిలీజ్ తర్వాత ఫలితాన్ని బట్టి రూ. 105 కోట్లతో పాటు మరింత అమౌంట్ నిర్మాతలకు వెళ్తుంది. షూటింగ్ అంతా పూర్తి చేసుకొని రిలీజ్కు రెడీ అయిన చిత్రాలకే ఓటీటీ డీల్ కావట్లేదు. ప్రభాస్ రాజాసాబ్, చిరంజీవి విశ్వంభర లాంటి చిత్రాలకు కూడా ఇంకా ఓటీటీ బిజినెస్ కాలేదు. అలాంటిది దాదాపు 50 శాతం షూటింగ్ పెండింగ్లో ఉన్న పెద్ది చిత్రానికి అప్పుడే ఓటీటీ డీల్ పూర్తి కావడం గొప్ప విషయమే. మల్టీస్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
ఓటీటీలో క్రేజీ సిరీస్.. ఇప్పుడు రెండో సీజన్ రెడీ
ఇప్పుడంటే వెబ్ సిరీసుల హవా కాస్త తగ్గింది. లాక్ డౌన్ టైంలో మాత్రం పలు హిందీ సిరీసులు తెగ క్రేజ్ సొంతం చేసుకున్నాయి. వాటిలో ఒకటి 'స్పెషల్ ఓపీఎస్'. 2020 మార్చిలో తొలి సీజన్ రిలీజ్ కాగా.. మధ్యలో 1.5 పేరుతో ఓ నాలుగు ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. వ్యూయర్స్ని ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఐదేళ్ల విరామం తర్వాత రెండో సీజన్ని సిద్ధం చేశారు. స్ట్రీమింగ్ డేట్ ప్రకటించడంతో పాటు ట్రైలర్ని కూడా విడుదల చేశారు.(ఇదీ చదవండి: 'కన్నప్ప' చూసిన రజినీకాంత్.. విష్ణుతో ఏం చెప్పారంటే?)కేకే మేనన్, కరణ్ థాకర్, వినయ్ పాఠక్, విపుల్ గుప్త తదితరులు కీలక పాత్రలు పోషించిన తొలి సీజన్కి నీరజ్ పాండే, శివమ్ నాయర్ దర్శకత్వం వహించారు. స్పై యాక్షన్ జానర్లో దీన్ని తెరకెక్కించారు. ఇప్పుడు రెండో భాగానికి నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తూనే నిర్మాతగానూ వ్యవహరించారు. హిమ్మత్ సింగ్, అతని టీమ్ ఈసారి.. 'ఏఐ', 'సైబర్ క్రైమ్' నుంచి భారత్కు ఎదురయ్యే సవాళ్లతో పోరాటం చేయనుంది. అందుకు తగ్గట్లే ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉంది. సిరీస్పై అంచనాలు పెంచుతోంది. జూలై 11 నుంచి హాట్స్టార్లో సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.రెండో సీజన్ కోసం ఇప్పటికే ఉన్నవాళ్లతో పాటు కొత్తగా పలువురు నటీనటులు చేరారు. అందులో సయామీఖేర్, ప్రకాశ్ రాజ్ తదితరులు ఉన్నారు. గతంలో వచ్చిన వాటితో పోలిస్తే ఈసారి మరింత థ్రిల్ పంచేలా సిరీస్ని తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది. ఇకపోతే ఈ వారం దాదాపు 22కి పైగా సినిమాలు-వెబ్ సిరీసులు పలు ఓటీటీల్లోకి రాబోతున్నాయి. వీటిలో స్ట్రెయిట్ తెలుగు మూవీస్ లేవు. కానీ పలు డబ్బింగ్, పరభాషా చిత్రాలు ఉండటం విశేషం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 22 సినిమాలు రిలీజ్) -
ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 22 సినిమాలు రిలీజ్
మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో ధనుష్-నాగార్జున 'కుబేర', '8 వసంతాలు' అనే తెలుగు సినిమాలు రాబోతున్నాయి. ఆమిర్ ఖాన్ చాలా గ్యాప్ తీసుకుని నటించిన 'సితారే జమీన్ పర్' కూడా ఈ వీకెండ్లోనే బిగ్ స్క్రీన్పై సందడి చేయనుంది. వీటితో పాటు పలు చిత్రాలు-వెబ్ సిరీసులు కూడా స్ట్రీమింగ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: 'ది రాజాసాబ్' టీజర్ రిలీజ్.. భయపెట్టడమే కాదు)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. గ్రౌండ్ జీరో, డిటెక్టివ్ షెర్డిల్, ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ లాంటి పరభాషా సినిమాలతో పాటు కేరళ క్రైమ్ ఫైల్స్ సిరీస్, ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో కూడా ఈ వీకెండ్లో స్ట్రీమింగ్ కానున్నాయి. ప్రస్తుతానికైతే స్ట్రెయిట్ తెలుగు మూవీస్ ఏం లేవు.. వారాంతంలో సడన్ సర్ప్రైజ్ ఉండొచ్చు. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏ మూవీ రిలీజ్ కానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జూన్ 16-22 వరకు)అమెజాన్ ప్రైమ్గ్రౌండ్ జీరో (హిందీ సినిమా) - జూన్ 20 (రెగ్యులర్ స్ట్రీమింగ్)హాట్స్టార్సర్వైవింగ్ ఓహియో స్టేట్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - జూన్ 18కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 20ఫౌండ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 20జీ5డిటెక్టివ్ షెర్డిల్ (హిందీ మూవీ) - జూన్ 20ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ (మలయాళ సినిమా) - జూన్ 20నెట్ఫ్లిక్స్జస్టిన్ విలియమ్: మ్యాజిక్ లవర్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 17కౌలిట్జ్ & కౌలిట్జ్ సీజన్ 2 (జర్మన్ సిరీస్) - జూన్ 17ట్రైన్ రెక్: మేయర్ ఆఫ్ మేహమ్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 17అమెరికాస్ స్వీట్ హార్ట్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 18రోషారియో టిజెరస్ సీజన్ 4 (స్పానిష్ సిరీస్) - జూన్ 18సమ్బడీ ఫీడ్ ఫిల్ సీజన్ 8 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 18యోలాంతే (డచ్ సిరీస్) - జూన్ 18ద వాటర్ ఫ్రంట్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 19కే-పాప్: ద డీమన్ హంటర్స్ (కొరియన్ సినిమా) - జూన్ 20గ్రెన్ ఫెల్ అన్ కవర్డ్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 20ఒలింపో (స్పానిష్ సిరీస్) - జూన్ 20సెమీ సొయిటర్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 20ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3 (హిందీ కామెడీ షో) - జూన్ 21సన్ నెక్స్ట్జిన్: ద పెట్ (తమిళ సినిమా) - జూన్ 20ఆపిల్ ప్లస్ టీవీద బుకనీర్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 18లయన్స్ గేట్ ప్లేకాబోల్ (ఫ్రెంచ్ సిరీస్) - జూన్ 20(ఇదీ చదవండి: కీర్తి సురేశ్ కొత్త సినిమా.. నేరుగా ఓటీటీలోనే రిలీజ్) -
కీర్తి సురేశ్ కొత్త సినిమా.. నేరుగా ఓటీటీలోనే రిలీజ్
తెలుగులో ఫేమస్ పద్యాల్లో 'ఉప్పు కప్పురంబు.. నొక్క పోలికనుండు' ఒకటి. ఈ పద్యాన్నే టైటిల్గా పెట్టుకుని ఓ సినిమా వచ్చేస్తోంది. హీరోయిన్ కీర్తి సురేశ్- హీరో సుహాస్ కాంబినేషన్లో వస్తున్న మూవీ ఉప్పు కప్పురంబు. ఈ చిత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ తన ఓటీటీ ప్లాట్ఫామ్ కోసం రూపొందించిన ఒరిజినల్ మూవీ ఇది.ఓటీటీలో..ఐవి శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎల్లనార్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై రాధికా లావు నిర్మించారు. సినిమా బండి ఫేమ్ వసంత్ కథ అందించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. జూలై 4న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. చిట్టి జయపురం గ్రామవాసులు అందించే వినోదాల విందుకు సిద్ధంగా ఉండమని ప్రైమ్ వీడియో ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. Get ready for this heartwarming ride with the citizens of Chitti Jayapuram 🌴🫰#UppuKappuRambuOnPrime, New Movie, July 4 pic.twitter.com/kzV6ssNucY— prime video IN (@PrimeVideoIN) June 16, 2025 -
రానా నాయుడు 2 రివ్యూ.. కుటుంబం కోసం 'యుద్దం'
వెబ్సిరీస్: రానా నాయుడు 2 నటీనటులు: వెంకటేశ్, రానా, అర్జున్ రాంపాల్, అభిషేక్ బెనర్జీ, రజత్ కపూర్, కృతి కర్బంద, సుర్విన్ చావ్లా, సుశాంత్ సింగ్ తదితరులు కథ: అనన్య మోదీ దర్శకత్వం: సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమన్ స్ట్రీమింగ్ : నెట్ఫ్లిక్స్ఎపిసోడ్స్: 8కుటుంబంతో చూడొచ్చా: ఇబ్బందికరమే. కానీ, సీజన్-1తో పోలిస్తే.. కాస్త బోల్డ్ కంటెంట్ తగ్గించారు.వెంకటేశ్, రానా నటించిన రానా నాయుడు(Rana Naidu) సీజన్-1కు సీక్వెల్గా తాజాగా సీజన్ -2 విడుదలైంది. నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మొదటి సీజన్ టైమ్లో ఈ వెబ్సిరీస్ భారీగా వివాదాస్పదమైంది. బూతులు, బోల్డ్ కంటెంట్ ఎక్కువ ఉందని విమర్శలు వచ్చాయి. అయితే, పార్ట్2లో అలాంటి కంటెంట్ తగ్గించారు. ఇందులో రానాకు పెద్దపీఠ వేస్తూ తెరకెక్కిచారు. వెంటకటేశ్ కీలకపాత్రలో మెప్పించారు. అయితే, ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో తెలుసుకుందాం.కథేంటంటే..రానా నాయుడు (రానా ) నగరంలోని టాప్ సెలబ్రిటీలకు ఎలాంటి సమస్య వచ్చిన పరిష్కారం చూపుతాడు. అందుకోసం అతను ఎంత రిస్క్ అయినా సరే చేస్తాడు. అయితే, భార్య కోరిక మేరకు తన చీకటి గతాన్ని వదిలేయడానికి రానా ప్రయత్నిస్తుంటాడు. కానీ, అతడు అంగీకరించిన చివరి డీల్ పూర్తిచేసే క్రమంలో చిక్కుల్లో పడుతాడు. ఈ క్రమంలోనే రానా కొడుకు కిడ్నాప్ అవుతాడు. దీంతో రానా ఈ నేర ప్రపంచంలో మరింతగా ఇరుక్కుపోతాడు. కొడుకుని విడిపించుకునేందుకు బాలీవుడ్కు చెందిన ఒక స్టూడియో ఓనర్ విరాజ్ ఒబెరాయ్ (రజత్ కపూర్) నుంచి సాయం తీసుకుంటాడు. అందుకు ప్రతిగా తన దగ్గర మాత్రమే రానా పనిచేయాలని విరాజ్ షరతు విధిస్తాడు. తన కొడుకుని కాపాడే క్రమంలో రావూఫ్ మీర్జా (అర్జున్ రాంపాల్) తమ్ముడిని చంపేస్తాడు రానా. తన సోదరుడి చావుకు కారణమైన రానాపై పగ తీర్చుకోవాలని రవూఫ్ నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో రానా కుటుంబాన్ని రావూఫ్ టార్గెట్ చేస్తాడు. రానా చుట్టూ ప్రమాదం పొంచివున్న విషయం నాగా నాయుడు (వెంకటేశ్)కు తెలుస్తోంది. అప్పుడు నాగా నాయుడు ఏం చేశాడు.? సెలబ్రిటీల కోసం రిస్క్ చేసే రానా తన ఫ్యామిలీ కోసం ఎలాంటి రిస్క్ చేశాడు..? రానాకు సాయిం చేస్తానని చెప్పిన విరాజ్ ఒబెరాయ్ (రజత్ కపూర్) చేసిన కుట్ర ఏంటి..? చివరికి తండ్రికొడుకులు తమ కుటుంబం కోసం ఎలాంటి పోరాటం చేస్తారు..? అనేది అసలు స్టోరీ.ఎలా ఉందంటే..రానా నాయుడు: సీజన్2 కిడ్నాప్తో మొదలౌతుంది. వెంటనే కథలోకి ప్రేక్షకులను తీసుకెళ్తాడు దర్శకుడు. సీజన్-1 తన క్లయింట్స్ కోసం పోరాటం చేసిన రానా.. సీక్వెల్లో తన కుటుంబం కోసం పెద్ద యుద్దమే చేస్తాడు. తొలి సీజన్లో ఎక్కువ బూతులు ఉండటంతో కాస్త ఇబ్బంది ఉంటుంది. ఇందులో అలాంటి సమస్య ఉండదు. ఒక మంచి థ్రిల్లర్ సినిమా చూస్తున్న ఫీల్ మనకు కలిగేలా మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. కుమారుడు కిడ్నాప్తో రానాకు మరోవైపు ఇంటి సమస్యలు పెరుగుతాయి. భార్య కూడా విడిపోయే స్థితికి వస్తుంది. తండ్రి నాగా నాయుడుతో పాటు, సోదరులతో సంబంధాలు పూర్తిగా దెబ్బతింటాయి. ఇలాంటి పరిస్థితిలో ఉన్న రానాకు నమ్మిన వాళ్లు కూడా కుట్రకు తెరలేపుతారు. ఇలా అనేక సంఘటనలు ప్రేక్షకులలో జోష్ నింపుతాయి. రానా, రావూఫ్ మీర్జా, విరాజ్ ఒబెరాయ్ కథలో కీలకం. ఈ మూడు పాత్రల చుట్టూ డ్రామా, యాక్షన్, థ్రిల్తో పాటు భారీ ట్విస్టులు మెప్పిస్తాయి. ఈ సీజన్లో రానా పాత్ర చాలా బలంగా ఉంటుంది. ఈ పాత్రను చాలా స్ట్రాంగ్గా డిజైన్ చేయడంలో దర్శకులు సుపర్ణ్ వర్మ, కరణ్ అంశుమన్ విజయం సాధించారు. ఓటమి అంచు వరకు వెళ్లి అతను గెలిచే తీరు అందరిలో థ్రిల్ పంచుతుంది.రానా నాయుడు తన సోదరుడిని చంపాడని రావూఫ్ మీర్జా (అర్జున్ రాంపాల్) తెలుసుకున్న సమయం నుంచి కథలో స్పీడ్ పెరుగుతుంది. వారిద్దరి మధ్య జరిగే వైరంతో పాటు అదే సమయంలో కుమారుడి కోసం రానా నాయుడు పడే తపన ప్రేక్షకులలో కంటతడి పెట్టిస్తుంది. అప్పుడు రానా ఫ్యామిలీలో కనిపించే ఎమోషన్స్.. వాటిని ప్రేక్షకులకు చూపించిన తీరు బాగుంటుంది. రానా నాయుడిని అంతం చేయాలని రావూఫ్ మీర్జా, విరాజ్ ఒబెరాయ్లు ప్లాన్ వేస్తున్న సమయంలో నాగా నాయుడు (వెంకటేశ్ ) ఎంట్రీ ఇస్తాడు. అప్పుడు మరింత ఆసక్తిగా కథ రన్ అవుతుంది. ఇలా సిరీస్లో కొన్ని బలమైన సన్నివేశాలు ఉన్నప్పటికీ.. వాటిని అక్కడక్కడ బలవంతంగా ఇరికించినట్టు అనిపిస్తుంది. కొన్ని చోట్ల అయితే తప్పని పరిస్థితిలో అతికించారనే ఫీల్ కలుగుతుంది. దర్శకులు కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ మంచి సన్నివేశాలే ప్లాన్ చేసుకున్నారు. అయితే, ఈ సిరీస్లో అన్ని ఎపిసోడ్స్లకు మధ్య ఉండాల్సిన లింక్ దెబ్బతిందేమోననే అభిప్రాయం కలుగుతుంది. భారీ యాక్టర్స్ ఉన్నప్పటికీ అక్కడక్కడగా పెద్దగా ఎమోషన్ పండలేదు. రానా నాయుడు ప్రతి ఫ్యామిలీని ఆలోచింప చేస్తాడు. భార్య భర్తల మధ్య ఉండాల్సిన నమ్మకం, పిల్లలను ఎలా పెంచాలి అనేది చాలా క్లారిటీగా ఉంటుంది.ఎవరెలా చేశారంటే..సీక్వెల్లో రానా పాత్ర చాలా బలంగా ఉంటుంది. కథలో ఆయనే కీలకం. ఇందులో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కొక్కటీ సుమారు 50 నిమిషాల నిడివితో ఉంటుంది. ఇందులో మహిళా పాత్రధారులకు కొంత స్కోప్ ఇచ్చారు. భర్తతో (రానా) ఇబ్బంది పడుతున్న భార్యగా సుర్వీన్ చావ్లా అద్భుతంగా నటించింది. సర్వీన్ చావ్లాకు కొన్ని బోల్డ్ సీన్లు ఉన్నప్పటికీ. ఆ సీన్లు సహజంగానే ఉంటాయి. ఆ ట్రాక్ మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్కు కాస్త ఇబ్బంది అనిపించవచ్చు. నాగా నాయుడిగా వెంకటేశ్కు పెద్దగా స్క్రీన్ స్పేస్ ఉండదు. రానాకు విసుగు తెప్పించే పాత్రలో ఆయన అదరగొట్టాడు. అర్జున్ రాంపాల్ విలనిజాన్ని చాలా బలంగా చూపించాడు. ఎపిసోడ్స్ నిడివి తగ్గించి ఉంటే ఇంకా బాగుండేది. నిర్మాణ విలువల విషయంలో నెట్ఫ్లిక్స్ ఎక్కడా కూడా రాజీపడలేదు. ఇందులో భారీ యాక్షన్ సీన్స్ సినిమా రేంజ్లో నిర్మించడం ఆశ్చర్యం కలిగిస్తాయి. మూడో సీజన్ కూడా ఉంటుందని హింట్ ఇచ్చారు. ఈ వెబ్ సిరీస్కు ప్రధాన బలం రానా, వెంకటేశ్, దర్శకత్వం అని చెప్పవచ్చు. కథను ఇంకాస్త బలంగా రాసుకుని ఉంటే రానా నాయుడు అదరగొట్టేవాడు. అయినప్పటికీ ఎంటర్టైన్ చేస్తాడు. -
ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ హారర్ సినిమా
మరో క్రేజీ హారర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. కాకపోతే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అందుకు తగ్గట్లే చాలా ఏళ్ల తర్వాత చివరి భాగాన్ని రిలీజ్ చేయగా, యావరేజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఆ చిత్రం నెలలోనే డిజిటల్ స్ట్రీమింగ్ అయిపోతోంది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో ఉంది?(ఇదీ చదవండి: ఓటీటీలో మస్ట్ వాచ్ థ్రిల్లర్.. నరాలు తెగే ఉత్కంఠ.. 'స్టోలెన్' రివ్యూ)సీక్వెల్స్, ఫ్రాంచైజీల ట్రెండ్ మన దగ్గర రీసెంట్ టైంలో బాగా పాపులర్ అయింది. కానీ హాలీవుడ్లో మాత్రం చాలా ఏళ్ల నుంచి ఈ ట్రెండ్ కొనసాగుతోంది. అలా 'ఫైనల్ డెస్టినేషన్' అనే భయానక చిత్రాల ఫ్రాంచైజీ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. చావులు ఎంత భయంకరంగా ఉంటాయో ఈ సినిమాలో చూపిస్తారు. 2000లో తొలి భాగం రిలీజ్ కాగా.. 2003, 2006, 2009, 2011లో వరసగా నాలుగు చిత్రాలు రిలీజయ్యాయి. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నాయి.ఈ ఫ్రాంచైజీలో భాగంగా చివరిదైన 'ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్ లైన్స్' మూవీ.. గత నెల అంటే మే 16న వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజైంది. ప్రస్తుతం ఇంకా ఆడుతోంది. అదే టైంలో ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ప్రస్తుతం ఉత్తర అమెరికాలో అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ఓటీటీ ఫ్లాట్ఫామ్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. కాకపోతే అద్దె విధానంలో చూడొచ్చు. జూన్ 17 నుంచి అంటే ఈ మంగళవారం ఉదయం నుంచి మన దేశంలో రెంట్ విధానంలో స్ట్రీమింగ్ కానుంది. ఒకవేళ హారర్, భయానక చిత్రాలంటే ఇష్టముంటే దీన్ని ఓసారి ప్రయత్నించండి. వీలైతే ఒంటరిగానే చూడండి.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్) -
ఓటీటీలో మస్ట్ వాచ్ థ్రిల్లర్.. నరాలు తెగే ఉత్కంఠ
ఓటీటీలో ఎప్పటికప్పుడు బోలెడన్ని కొత్త సినిమాలు వస్తుంటాయి. కొన్ని మాత్రమే నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. భాషతో సంబంధం లేకుండా మస్ట్ వాచ్ అనిపించుకుంటూ ఉంటాయి. అలాంటి ఓ మూవీ గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. కేవలం గంటన్నర నిడివితో రిలీజైన ఈ చిత్రం.. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియెన్స్ ఇస్తోంది? అదే 'స్టోలెన్'. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?ఓ చిన్న ఊరి రైల్వే స్టేషన్. జుంపా(మియా మేల్జర్) అనే మహిళ.. ఐదు నెలల తన కూతురితో ఫ్లాట్ఫామ్పై నిద్రపోతుంటుంది. మరో మహిళ సైలెంట్గా ఈ పాపని ఎత్తుకుపోతుంది. అదే టైంలో ట్రైన్ దిగి సోదరుడి కోసం ఎదురుచూస్తున్న రామన్(శుభం).. పాపని ఎత్తుకుపోయిన దొంగ అని జుంపా అనుమానిస్తుంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగుతారు. కేసు నమోదు చేస్తారు. కాసేపటి తర్వాత అక్కడికి వచ్చిన రామన్ సోదరుడు గౌతమ్(అభిషేక్ బెనర్జీ) కూడా.. ఈ వ్యవహారంలో ఇరుక్కుంటాడు. ఇంతకీ పాపని ఎత్తుకెళ్లింది ఎవరు? ఊరి ప్రజలు.. అన్నదమ్ములపై ఎందుకు దాడి చేశారు? చివరకు పాప దొరికిందా లేదా అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?సీట్ ఎడ్జ్ థ్రిల్లర్.. ఈ మాట గతంలో మీరు చాలాసార్లు వినే ఉంటారు. 'స్టోలెన్' చూస్తున్నంతసేపు మీరు కచ్చితంగా అదే ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎలాంటి అనవసర హంగామా లేకుండా స్ట్రెయిట్గా స్టోరీలోకి వెళ్లడంతో సినిమా మొదలవుతుంది. అక్కడి నుంచి 90 నిమిషాల పాటు నాన్స్టాప్గా కథ పరుగులు పెడుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే వచ్చే ట్విస్టులు మనకు మతిపోయేలా చేస్తాయి. చివరకు ఓ మంచి మూవీ చూసిన అనుభూతి కలుగుతుంది.2017లో అసోంలో జరిగిన నిజ జీవిత సంఘటన ఆధారంగా 'స్టోలెన్' సినిమా తీశారు. ఓ చిన్న ఊరిలోని రైల్వే స్టేషన్లో పాప కిడ్నాప్ కావడంతో మూవీ మొదలవుతుంది. పాపని ఎత్తుకుపోయిన కాసేపటికి నిద్రలేచిన తల్లి.. స్టేషన్లో ఓ వ్యక్తిని చూసి అనుమానిస్తుంది. కొంతసేపటి తర్వాత అసలు దొంగ ఎవరో ఆమెకు తెలుస్తుంది. కానీ అనుమానిత వ్యక్తి, అతడి సోదరుడు కూడా పోలీసుల దగ్గర ఇరుక్కుంటారు. సదరు వ్యక్తి అతి మంచితనం వల్ల.. గాలికి పోయే వ్యవహారాన్ని కాలికి తగిలించుకుంటాడు. అక్కడి నుంచి అన్మదమ్ములు ఎలాంటి కష్టాలు పడ్డారు? ఇంతకీ ఆ పాప.. సదరు మహిళ కూతురేనా? లేదంటే ఆమె కూడా దొంగతనంగా ఎత్తుకొచ్చిందా అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి.సినిమా చూస్తున్నప్పుడు మనం ఊహించింది జరగనప్పుడే థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. ఇందులో కేవలం నాలుగైదు పాత్రలే ఉంటాయి. అవి ప్రవరిస్తున్న విధానం చూసి వీడు మంచోడు, ఈమె చెడ్డది అని అనుకుంటాం. కానీ స్టోరీ ముందుకెళ్లేకొద్దీ మనం అనుకున్నది జరగదు. అదే టైంలో సాదాసీదాగా మొదలైన ఓ ఇన్వెస్టిగేషన్ డ్రామా కాస్త థ్రిల్లర్గా మారుతుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న పిల్లల అక్రమ రవాణా, సరోగసి గురించి సరికొత్త నిజం తెలుస్తుంది. కానీ చూస్తున్నంతసేపు మనం కూడా సినిమాలోని పాత్రలతో పాటు ఉన్నామా అనే అనుభూతి కలుగుతుంది. ఈ విషయంలో మాత్రం దర్శకనిర్మాతలు పూర్తిగా సక్సెస్ అయ్యారు.ఎవరెలా చేశారు?ఓటీటీలో సినిమాలు-వెబ్ సిరీసులతో పరిచయమైన అభిషేక్ బెనర్జీ ఇందులో గౌతమ్ పాత్రలో కనిపించాడు. ఇతడిదే మెయిన్ రోల్. రియలస్టిక్ ఫెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. రామన్గా చేసిన శుభం, జుంపా రోల్ చేసిన మియా మేల్జర్ కూడా జీవించేశారు. మిగిలిన పాత్రధారులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.టెక్నికల్గా చూస్తే చాలా బ్రిలియంట్ మూవీ. డైరెక్టర్ కరణ్ తేజ్పాల్కి ఇదే తొలి సినిమా. కానీ చూస్తున్నంతసేపు అలా ఎక్కడా అనిపించదు. సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే అయితే టాప్ నాచ్ ఉంటాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా మూడ్కి తగ్గట్లు భలే కుదిరిందని చెప్పొచ్చు. మిగిలిన టెక్నీషియన్స్ కూడా అదరగొట్టేశారు. ప్రస్తుతానికి ఇది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. ఒకవేళ మంచి రియలస్టిక్ థ్రిల్లర్ చూద్దామనుకుంటే మాత్రం 'స్టోలెన్' బెస్ట్ ఆప్షన్. -
Bhool Chuk Maaf Review: తెల్లారితే పెళ్లి.. కానీ రోజు మారదు.. ఇదేం ట్విస్ట్!
ఈ రోజుల్లో తాము చేసిన తప్పుని తెలుసుకొని సరిదిద్దుకునే వాళ్ళు అరుదుగా ఉంటారు. చాలామంది భయం లేకుండానే తప్పులు చేస్తుంటారు. మరి తప్పు చేసినవాడికి తన తప్పు తెలుసుకోవడానికి చిన్న పాటి భయం కలిగిస్తే అన్న ఆలోచనతోనే రూపుదిద్దుకున్న సినిమా భూల్ చుక్ మాఫ్. కరణ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వర్ధమాన బాలివుడ్ నటుడు రాజ్కుమార్ రావు హీరోగా నటించారు. ఈ సినిమా కథ చాలా గమ్మత్తుగా ఉంటుంది. అంతే సరదాగా సినిమా అంతా సాగిపోతుంది కూడా.అంతలా కథలో ఏముందంటే... వారణాసి నగరానికి చెందిన తితిలి మిశ్ర, రంజన్ తివారి ప్రేమించుకుంటుంటారు. తితిలి తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి తమ కూతురుని రంజన్ పెళ్ళాడాలంటే గవర్నమెంట్ ఉద్యోగం తప్పని సరి అని కండిషన్ పెడతారు. ఇది విన్న రంజన్ హమీద్ అంసారీ అనే బ్రోకర్ ద్వారా దొంగ దారిలో గవర్నమెంట్ ఉద్యోగం త్వరగానే సంపాదిస్తాడు. ఇంకేముంది ఇరు కుటుంబాలు కలిసి ఇద్దరికీ పెళ్ళి చేయాలని ఓ తేదీని నిర్ణయిస్తాయి. రేపు పెళ్ళి అనగా ఈ రోజు నిద్ర లేచి నలుగు కార్యక్రమానికి రెడీ అవుతుంటాడు రంజన్. రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపి రేపటి తన పెళ్ళి గురించి కలలు కంటూ మరుసటి రోజు నిద్ర లేస్తాడు.కాని ట్విస్ట్ ఏంటంటే మళ్ళీ నలుగు కార్యక్రమం రోజే రంజన్ నిద్ర లేస్తాడు. ఇలా ఎన్ని రోజులైనా అదే రోజు నిద్ర లేస్తూ ఉంటాడు. రంజన్ టైం లూప్ లో ఇరుక్కుపోయి ఇలా జరుగుతూ ఉంటుంది. ఏదో గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించి చక్కగా పెళ్ళి చేసుకుందామన్న సమయంలో ఈ సమస్య రంజన్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. మరి రంజన్ ఈ టైం లూప్ నుండి బయటపడి పెళ్ళి చేసుకోగలుగుతాడా, అసలు ఇలాంటి సమస్య రంజన్ కు ఎందుకు వచ్చింది. ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమ్ అవుతున్న భూల్ చుక్ మాఫ్ చూడాల్సిందే. ఈ సినిమా కథలో చిన్న కన్ఫ్యూజన్ ఉన్నా కామెడీతో దానిని ప్రేక్షకుడికి చక్కగా అర్ధమయ్యేలా తీశాడు దర్శకుడు. సినిమా ఆద్యంతం నవ్వులతో గిలిగింతలు పెడుతూ హాయిగా సాగుతుంది. వర్త్ ఫుల్ వాచ్ ఫర్ ది వీకెండ్. -
'స్క్విడ్ గేమ్ 3' హైస్పీడ్లో ఫైనల్ గేమ్ (ట్రైలర్)
నెట్ఫ్లిక్స్ వేదికగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందిన కొరియన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్క్విడ్గేమ్ (Squid Game) నుంచి ఫైనల్ సీజన్ వచ్చేస్తుంది. 'స్క్విడ్ గేమ్ 3' ఫైనల్ గేమ్ పేరుతో తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు. హ్యాంగ్ డాంగ్ హ్యుక్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన రెండు సీజన్లు మంచి విజయాన్ని అందుకున్నాయి. జూన్ 27 నుంచి నెట్ఫ్లిక్స్ (Netflix) వేదికగా ఫైనల్ గేమ్ స్ట్రీమింగ్ కానున్నట్లు టీమ్ తెలిపింది. తెలుగుతో పాటు సుమారు పదికి పైగా భాషలలో విడుదల అవుతుంది.ఈ సిరీస్ ప్రపంచాన్నే ఓ ఊపు ఊపేసింది. గేమ్లో గెలిస్తే చాలు.. కలలో కూడా ఊహించలేనంత డబ్బు మీ సొంతం అనడంతో వందలాది మంది గేమ్ ఆడేందుకు వెళ్తారు. తీరా అక్కడికి వెళ్లాక గేమ్లో ఓడినవారి ప్రాణాలు తీస్తారు. తమ గెలుపు కోసం కొందరు ప్లేయర్స్ పక్కవారి ప్రాణాలు తీయడానికీ వెనకాడరు. చివరకు ఒకే ఒక్కరు విజేతగా నిలిచి డబ్బు గెలుచుకుంటారు. అలా ప్లేయర్ 456 ఓసారి గేమ్లో గెలిచి కోట్లాది ధనం పొందుతాడు.ఫస్ట్ సీజన్లో రెడ్ లైట్- గ్రీన్ లైట్ అని గేమ్ ఆడించిన ఓ బొమ్మను మరోసారి ఈ సీజన్లో ప్రవేశపెట్టారు. ఈ సారి గేమ్ మరింత క్రూరంగా ఉండనున్నట్లు కనిపిస్తోంది. ప్లేయర్ 456.. పాశవికమైన ఆట ఆడిస్తున్న వ్యక్తిని నేరుగా కలిసినట్లు చూపించారు. మరి అతడు ఈ ఆటను ఆపగలిగాడా? లేదా? అనేది తెలియాలంటే ఈ నెలాఖరులో స్క్విడ్ గేమ్ చివరి సీజన్ చూసేయాల్సిందే! -
'కేరళ క్రైమ్ ఫైల్స్ 2' స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
మలయాళంలో తెరకెక్కిన 'కేరళ క్రైమ్ ఫైల్స్: ది సెర్చ్ ఫర్ సీపీవో అంబిలి రాజు' (kerala crime files season 2) నుంచి మరో ట్రైలర్ విడుదలైంది. ఇదే సమయంలో విడుదల తేదీని ప్రకటించారు. తెలుగు వర్షన్ కూడా అందుబాటులో ఉంది. 2023లో జియో హాట్స్టార్ వేదికగా 'కేరళ క్రైమ్ ఫైల్స్' వెబ్ సిరీస్కు సీక్వెల్గా దర్శకుడు అహ్మద్ కబీర్ తెరకెక్కించాడు. పార్ట్ 1లో ఒక్క మర్డర్ కేసుకు సంబంధించి చూపించాడు. పోలీసులకు సవాలుగా మారిన ఆ కేసును ఎలా పూర్తి చేస్తారనేది చాలా ఆసక్తిగా చెప్పాడు. అప్పుడు ఓటీటీలో మంచి ఆదరణ రావడంతో మేకర్స్ సీక్వెల్ను ప్లాన్ చేశారు. ఇప్పుడు పార్ట్2 కూడా క్రైమ్ కథాంశంతోనే నిర్మించారు. పలు మర్డర్ కేసులకు సంబంధించి పోలీసులు ఎలా చేధించారనేది దర్శకడు చెబుతున్నట్లు తెలుస్తోంది. అజు వర్గీస్, లాల్,నివాస్ వాలిక్కున్ను, జిన్జ్ షాన్, శ్రీజిత్ వంటి వారు ఇందులో నటించారు. జూన్ 20న జియోహాట్స్టార్లో ఈ వెబ్ సిరీస్ విడుదల కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడలో కూడా స్ట్రీమింగ్ కానుంది. -
ఓటీటీలోకి వచ్చేసిన మిస్టరీ థ్రిల్లర్ సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అయితే వాటిలో చాలామంది చూసేవి థ్రిల్లర్స్. అందుకు తగ్గట్లే ఇతర భాషల్లో అలరించిన కొన్ని మూవీస్ని డబ్బింగ్ చేసి తెలుగులోనూ రిలీజ్ చేస్తుంటారు. అలా ఇప్పుడు ఓ తమిళ చిత్రాన్ని దాదాపు మూడేళ్ల తర్వాత తెలుగులోకి తీసుకొచ్చారు. సడన్ సర్ప్రైజ్ అన్నట్లు మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకీ ఏంటా మూవీ? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్)2022లో తమిళంలో రిలీజై ఆకట్టుకున్న మిస్టరీ థ్రిల్లర్ మూవీ 'యుగి'. కథిర్, నరైన్, జోజూ జార్జ్, ఆనంది ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాని ఇప్పుడు 'కార్తీక: మిస్సింగ్ కేస్' పేరుతో తెలుగులోకి అనువదించారు. ఆహా ఓటీటీలోకి శుక్రవారం(జూన్ 13) నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. కార్తీక అనే అమ్మాయి మిస్సింగ్ కేసుని ఛేదించే క్రమంలో ఓ డిటెక్టివ్ బృందానికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? చివరకు ఆ అమ్మాయి దొరికిందా లేదా అనేదే మిగతా స్టోరీ.ఇకపోతే ఇదే వీకెండ్లో ఈ సినిమాతో పాటు మరో 22 సినిమాలు-వెబ్ సిరీసులు ఓటీటీల్లోకి వచ్చేయడం విశేషం. వీటిలో శుభం, కేసరి 2, ఏస్, ఎలెవన్, జింఖానా, బ్లైండ్ స్పాట్, సిన్, డియర్ ఉమ, డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవల్ చిత్రాలతో పాటు రానా నాయుడు 2 సిరీస్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీసే. ఈసారి థియేటర్లలో కొత్త సినిమాలేం రిలీజ్ కాలేదు కాబట్టి ఓటీటీ మూవీస్పై తెలుగు ప్రేక్షకులు లుక్కేయడం గ్యారంటీ.(ఇదీ చదవండి: ఆ హీరోయిన్ను సీక్రెట్గా ఫాలో అవుతున్నా: అల్లు అరవింద్) -
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలో చెప్పుకోదగ్గ మూవీ ఒక్కటీ రిలీజ్ కాలేదు. మరోవైపు ఓటీటీల్లో మాత్రం ఏకంగా 22 వరకు కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్లోకి వచ్చేశాయి. వీటిలో తొమ్మిది వరకు తెలుగు సినిమాలు ఉండటం విశేషం. వీటిలో ఏస్, ఎలెవన్, శుభం, జింఖానా తదితర చిత్రాలతో పాటు రానా నాయుడు 2 సిరీస్ ఉండటం విశేషం. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి వచ్చిందంటే?(ఇదీ చదవండి: ‘దేవికా అండ్ డానీ’ రివ్యూ : ఆత్మలతో మాట్లాడే టీచరమ్మ!)ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన మూవీస్ (జూన్ 13)అమెజాన్ ప్రైమ్బ్లైండ్ స్పాట్ - తెలుగు సినిమాఏస్ - తెలుగు డబ్బింగ్ మూవీఎలెవన్ - తెలుగు సినిమాఇన్ ట్రాన్సిట్ - హిందీ సిరీస్అమెరికన్ థండర్ - ఇంగ్లీష్ సినిమాద ట్రైటర్స్ - హిందీ రియాలిటీ షోడీప్ కవర్ - ఇంగ్లీష్ సినిమానెట్ఫ్లిక్స్కింగ్స్ ఆఫ్ జోబర్గ్ సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్రానా నాయుడు 2 - తెలుగు సిరీస్ఫ్యూబర్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ఫ్లాట్ గర్ల్స్ - థాయ్ మూవీగ్రేస్ అనాటమీ సీజన్ 21 - ఇంగ్లీష్ సిరీస్ (జూన్ 14)హాట్స్టార్కేసరి ఛాప్టర్ 2 - హిందీ సినిమాశుభం - తెలుగు మూవీఅండర్ డాగ్స్ - ఇంగ్లీష్ సిరీస్ (జూన్ 15)సోనీ లివ్అలప్పుళా జింఖానా - తెలుగు డబ్బింగ్ మూవీఆహాసిన్ - తెలుగు సినిమాసన్ నెక్స్ట్డియర్ ఉమ - తెలుగు మూవీజీ5డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవల్ - తెలుగు డబ్బింగ్ సినిమాఆపిల్ ప్లస్ టీవీఎకో వ్యాలీ - ఇంగ్లీష్ మూవీనాట్ ఏ బాక్స్ - ఇంగ్లీష్ సిరీస్మనోరమ మ్యాక్స్సూపర్ గర్ల్స్ - మలయాళ సిరీస్(ఇదీ చదవండి: లైఫ్ అంతా అల్లు అర్జున్కు కాపలా కాయడమే సరిపోయింది: బన్నీ వాసు) -
ఓటీటీలో 'కేసరి చాప్టర్ 2' స్ట్రీమింగ్
‘కేసరి చాప్టర్ 2’ (Kesari Chapter 2) సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. జలియన్ వాలాబాగ్ విషాదం నేపథ్యంలో అక్షయ్ కుమార్(Akshay Kumar) హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 18న బాలీవుడ్లో విడుదలైంది. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్ వాలాబాగ్ అనే ట్యాగ్లైన్ను చేర్చారు. మాధవన్, అనన్యపాండే, రెజీనా కీలక పాత్రలు పోషించారు. కరణ్ జోహార్ నిర్మించారు. 1919 ఏప్రిల్ 13న అమృత్సర్లోని జలియన్వాలా బాగ్లో జరిగిన కాల్పులు, తొక్కిసలాటలో ఎంతో మందిప్రాణాలు కోల్పోయారు. ఆ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. చరిత్ర గురించి తెలుసుకోవాలనే కోరిక ఉన్న వారికి ఈ మూవీ మంచి అవకాశం అని చెప్పవచ్చు. జియో హాట్స్టార్ (JioHotstar) వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. తెలుగు వర్షన్ మరో వారంలోపు విడుదల కావచ్చు.కథేంటంటే..స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా ఏప్రిల్ 13, 1919లో పంజాబ్లోని అమృత్సర్కు సమీపంలో ఉన్న జలియన్వాలా బాగ్లో సమావేశం అయిన భారతీయులపై అప్పటి పంజాబ్ జనరల్ డయ్యర్ విచక్షణారహితంగా కాల్పులు జరుపుతాడు. తనకున్న అధికార బలంతో ఈ మారణకాండ గురించి స్థానిక వార్తా పత్రికల్లో రాకుండా చేస్తాడు. ఈ ఘటనపై అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఓ కమిషన్ ఏర్పాటు చేస్తుంది.అందులో బ్రిటిష్ వైస్రాయ్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్న భారత న్యాయవాది శంకరన్ నాయర్(అక్షయ్ కుమార్) కూడా ఉంటాడు. తమకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వాలని శంకరన్పై ఒత్తిడి తెస్తారు. కానీ జలియన్వాలా బాగ్ ఘటన వెనుక పెద్ద కుట్ర ఉందని శంకరన్కు అర్థమవ్వడంతో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. యువ అడ్వకేట్ దిల్రీత్ సింగ్(అనన్య పాండే)తో జనరల్ డయ్యర్పై కోర్ట్లో కేసు వేయిస్తాడు. బాధితుల తరపున ఆయన వాధిస్తాడు.డయ్యర్ తరపున వాధించేందుకు ఇండో బ్రిటన్ న్యాయవాది నెవిల్లే మెక్కిన్లే (ఆర్.మాధవన్) రంగంలోకి దిగుతాడు. ఎలాంటి సాక్ష్యాలే లేని ఈ కేసును శంకరన్ ఎలా డీల్ చేశాడు? డయ్యర్ చేసిన కుట్రను ప్రపంచానికి తెలియజేసేక్రమంలో శంకరన్కు ఎదురైన సమస్యలు ఏంటి? యువ అడ్వకేట్ దిల్రీత్ సింగ్ ఆయనకు ఎలాంటి సహాయం చేసింది? చివరకు డయ్యర్ చేసిన తప్పులను సాక్ష్యాలతో సహా ఎలా బయటపెట్టాడు? అనేదే మిగతా కథ. -
‘దేవికా అండ్ డానీ’ రివ్యూ : ఆత్మలతో మాట్లాడే టీచరమ్మ!
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో వెబ్ సిరీస్ ‘దేవికా అండ్ డానీ’ ఒకటి. ఈ సిరీస్ గురించి తెలుసుకుందాం.సినిమాలైనా... వెబ్ సిరీస్లైనా... వాటిలో వచ్చే కథలు కొన్ని వాస్తవ రూపాలైతే మరికొన్ని కథలు దర్శకుని కాల్పనిక కళాకృతులు. రెండిటిలోను ప్రేక్షకుల నమ్మకం అనేది కీలకం. అది వాస్తవమైనా, కల్పన అయినా చూసే ప్రేక్షకుడికి నచ్చితే నెత్తిన పెట్టుకుంటాడు. అటువంటి కోవకి చెందినదే ‘దేవికా అండ్ డానీ’ వెబ్ సిరీస్. జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమ్ అవుతోంది. దీపక్ రాజ్ అందించిన ఈ సిరీస్ కథకు బి. కిరణ్ దర్శకత్వం వహించారు. ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. సబ్జెక్ట్ సీరియస్ అయినా చక్కటి హాస్యంతో చాలా జాగ్రత్తగా స్క్రీన్ప్లే రాసుకున్నారు దర్శకుడు. ‘పెళ్ళి చూపులు’ ఫేం రీతూ వర్మ ఈ సిరీస్లో ప్రధాన కథానాయిక. ఓ రకంగా కథంతా ఆమె చుట్టూనే తిరుగుతుంటుంది. దేవిక పాత్రలో రీతూ జీవించారనే చెప్పాలి. ఇక కథ విషయానికొస్తే... దేవిక ఆ ఊరి స్కూల్లో సంగీతం నేర్పించే టీచర్గా పని చేస్తుంటుంది. దేవిక తాత పెద్ద ఉపాసకుడు. ఆయనకు ఆత్మలతో మాట్లాడే అద్భుతమైన శక్తి ఉంటుంది. అదే శక్తి మనవరాలు దేవికకు కూడా ఉందన్న విషయం కథ మధ్యలో తెలుస్తుంది. దేవికకు ఓ పెళ్ళి సంబంధం ఖాయమవుతుంది. దేవిక స్కూల్కి వెళ్ళే సమయంలో ఓ రోజు డానీ అనే వ్యక్తి పరిచయమవుతాడు. డానీని దేవిక ఇష్టపడుతుంది. కానీ దేవిక దగ్గరకు డానీ ఓ సమస్యతో వస్తాడు. ఆ సమస్య వల్ల దేవిక చాలా పెద్ద ప్రమాదంలో ఇరుక్కుని ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటుంది. పుట్టి బుద్ధి ఎరిగిన నాటి నుండి ఇల్లు, స్కూలుకి పరిధిలోని 20 కిలోమీటర్లలోనే ప్రయాణిస్తున్న ఓ పెళ్ళి నిశ్చయమైన అమ్మాయి దారిలో కనబడ్డ అబ్బాయితో ప్రేమలో పడి ఆ అబ్బాయికి సంబంధించిన సమస్యను పరిష్కరించడానికి దాదాపు 300 కిలోమీటర్లు ప్రయాణించి తన ప్రాణాలను పణంగా పెడుతుంది. మరి... డానీ సమస్యను దేవిక తీర్చగలిగిందా? తనకు నిశ్చితార్థమైన అబ్బాయినే పెళ్ళి చేసుకుందా? అన్న విషయాలు తెలుసుకోవాలంటే మాత్రం ‘దేవికా అండ్ డానీ’ వెబ్ సిరీస్ చూసేయండి. సిరీస్ మొత్తం మంచి ట్విస్టులతో, చక్కటి హ్యూమర్తో ఎక్కడా బోర్ కొట్టదు. ఇంకెందుకు ఆలస్యం... చూసేయండి మరి.– హరికృష్ణ ఇంటూరు -
ఓటీటీలో సడెన్ సర్ప్రైజ్.. 'విజయ్ సేతుపతి' కొత్త సినిమా స్ట్రీమింగ్
కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) నటించిన కొత్త సినిమా 'ఏస్' (Ace) ఓటీటీలోకి వచ్చేసింది. మే 23న విడుదలైన ఈ చిత్రం కేవలం మూడు వారాల్లోనే స్ట్రీమింగ్కు అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ కీలక పాత్రలో నటించింది. రొమాంటిక్ క్రైమ్ కామెడీగా ఆకట్టుకున్న ఈ మూవీని ఆర్ముగ కుమార్ దర్శకత్వం వహించారు. తమిళంతో పాటు, తెలుగులోనూ విడుదలైన ఈ చిత్రంలో దివ్యా పిళ్లై, యోగిబాబు, అవినాశ్, పృథ్వీరాజ్, కీలక పాత్రలలో నటించారు. రీసెంట్గా మహారాజా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న విజయ్ సేతుపతి తర్వాత ఏస్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఈ వీకెండ్లో ఓటీటీలో మీరూ ఈ చిత్రాన్ని చూసేయండి.'ఏస్' (Ace) చిత్రం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎలాంటి ప్రకటన లేకుండానే ఈ చిత్రాన్ని జూన్ 13న అందుబాటులోకి తీసుకొచ్చారు. తమిళ్తో పాటు తెలుగు వర్షన్ను ఒకేసారి విడుదల చేశారు. దీంతో ఫ్యాన్స్ సోషల్మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు.కథబోల్ట్ కన్నన్ (విజయ్ సేతుపతి) జైలు నుంచి విడుదలై తన నేర గతాన్ని వదిలించుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని మలేసియాకు వస్తాడు. అక్కడ జ్ఞానందం (యోగిబాబు) ఆశ్రయం కల్పిస్తాడు. మలేషియాలో కల్పన (దివ్యా పిళ్లై) హోటల్ నడుపుతూ ఉంటుంది. ఆమె వద్దకు పనిలో చేరుతాడు బోల్డ్ కన్నన్.. ఈ క్రమంలో, తన పెంపుడు తండ్రి రాజా దొరై (బబ్లూ) నుండి ఇంటిని విడిపించుకోవడానికి డబ్బు కూడబెడుతున్న రుక్మిణి (రుక్మిణి వసంత్)తో కన్నన్ ప్రేమలో పడతాడు. అయితే, కల్పన తన హోటల్ కోసం తీసుకున్న లోన్ చెల్లించలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుంది. ఇలా తన ప్రేయసితో పాటు యజమాని కూడా డబ్బుల కోసం ఇబ్బందులు పడుతూ ఉంటారు. దీంతో తన స్నేహితుడు జ్ఞానందంతో కలిసి మలేసియాలో అక్రమ వ్యాపారాలు నడిపే ధర్మ (అవినాష్) వద్దకు డబ్బుల కోసం వెళ్తారు. అయితే, వడ్డీ కట్టడంలో ఆలస్యమైతే ప్రాణాలు తీసే ధర్మ ఉచ్చులో వారు చిక్కుకుంటారు. ఇంతటి ప్రమాదకరమైన పరిస్థితి నుంచి బోల్ట్ కన్నన్ ఎలా బయటపడతాడు..? నగరంలో జరిగిన అతిపెద్ద బ్యాంకు దోపిడీతో కన్నన్కు ఉన్న సంబంధం ఏంటి? ఎన్నో సమస్యలను దాటుకుని తాను ప్రేమించిన రుక్మిణిని కన్నన్ పెళ్లి చేసుకుంటాడా..? అసలు బోల్ట్ కన్నన్ గతం ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీలో 'నవీన్ చంద్ర' క్రైమ్ థ్రిల్లర్ సినిమా
టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర (Naveen Chandra), రాశీసింగ్ (Rashi Singh) జంటగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం 'బ్లైండ్ స్పాట్'(Blind Spot). తాజాగా ఓటీటీ విడుదలపై అధికారికంగా ప్రకటన వచ్చేసింది. మే 9న విడుదలైన ఈ చిత్రం పెద్దగా ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోయినప్పటికీ క్రైమ్ కథలను ఇష్టపడే వారిని మెప్పించింది. ఈ సినిమాకు రాకేశ్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను మ్యాంగో మాస్ మీడియా రామకృష్ణ వీరపనేని నిర్మించారు. ఈ మూవీలో ఆలీ రెజా, గాయత్రి భార్గవి, రవి వర్మ తదితరులు నటించారు.'బ్లైండ్ స్పాట్' చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానున్నట్లు ఒక పోస్టర్ను విడుదల చేశారు. జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని అందులో తెలిపారు. ఈ చిత్రంలో ఒక పాత్రే రెండు విభిన్న కోణాల్లో చాలా ఆసక్తిగా దర్శకుడు చూపారు. కథ రొటీన్గానే ఉన్నప్పటికీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా అక్కడక్కడ పండుతుంది. ఓటీటీలో చూడతగిన సినిమానే అని చెప్పవచ్చు.కథ ఏంటి..?హైదరాబాద్కు చెందిన మెన్ జైరాం (రవి వర్మ) ప్రముఖ వ్యాపారవేత్తగా ఉంటాడు. అయతే, తన భార్య దివ్య (రాశీ సింగ్)తో తరుచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఆమె అనుమానాస్పదంగా మరణిస్తుంది. అది హత్య లేక ఆత్మహత్యనా అనేది అంతుపట్టదు. దివ్య మరణించిన విషయాన్ని ఆ ఇంటి పనిమనిషి పోలీసులకు సమాచారం ఇస్తుంది. అప్పుడు ఆ ఏరియా పోలీస్ విక్రమ్ (నవీన్ చంద్ర) రంగంలోకి దిగుతాడు. ఇక ఇక్కడ నుంచి అసలు కథ మొదలౌతుంది. ఆమెది ఆత్మహత్య కాదు హత్య అని విక్రమ్ చెబుతాడు. మరి ఆ హత్యకు కారణాలు ఏంటి..? ఎవరు చేశారు..? ఆమెను చంపే అంత అవసరం ఎందుకు వచ్చింది..? ఇంట్లో ఉన్నవారితోనే ప్లాన్ వేశారా..? దివ్య మానసిక పరిస్థితి ఎలా ఉండేది? చివరికి హత్య చేసిన వారిని పోలీసులు ఎలా పట్టుకున్నారు..? అనేది తెలియాలంటే 'బ్లైండ్ స్పాట్' చూడాల్సిందే. -
ముందుగానే వచ్చేస్తోన్న పంచాయత్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
ఓటీటీలు వచ్చాక సినీ వినోదం ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. థియేటర్లలో కేవలం సినిమాలే కాదు.. ఓటీటీల్లో వచ్చే వెబ్ సిరీస్లకు ప్రత్యేకమై క్రేజ్ ఉంది. అలాంటి వాటిలో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్న సరికొత్త సిరీస్ పంచాయత్. ఇప్పటికే విడుదలైన మూడు సీజన్స్కు సినీ ప్రియుల నుంచి ఆదరణ దక్కింది. 2020లో మొదటి సీజన్ విడుదలైతే.. 2022లో రెండో సీజన్.. 2024లో మూడో భాగం ప్రేక్షకులను అలరించాయి. ఈ సిరీస్కు ప్రత్యేక ఆదరణ దక్కడంతో మేకర్స్ మరో సీజన్కు రెడీ అయిపోయారు. ఇప్పటికే స్ట్రీమింగ్ తేదీ ప్రకటించిన మేకర్స్.. ఇంకాస్తా తొందరగానే స్ట్రీమింగ్కు తీసుకొస్తున్నారు.విలేజ్ నేపథ్యంలో సాగే సరికొత్త కామెడీ డ్రామా సిరీస్గా వస్తోన్న నాలుగో సీజన్ ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. పంచాయత్ సీజన్- 4 జూన్ 24 నుంచే స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. మొదటి ప్రకటించిన తేదీ కంటే వారం రోజులు ముందుగానే రిలీజ్ చేస్తున్నారు. మొదట జూలై 2న స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. తాజాగా తేదీ మారడంతో ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో ఈనెలలోనే సినీ ప్రియులకు అందుబాటులోకి రానుంది.కాగా.. ఈ సిరీస్లో జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘుబీర్ యాదవ్, చందన్ రాయ్, సాన్వికా, ఫైసల్ మాలిక్, దుర్గేష్ కుమార్, సునీతా రాజ్వార్, పంకజ్ ఝా కీలక పాత్రల్లో నటించారు. ఈ కామెడీ-డ్రామా సిరీస్ను ఉత్తరప్రదేశ్లోని ఫూలేరా గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా చేరిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కథగా తెరకెక్కించారు. ఈ సిరీస్కు దీపక్ కుమార్ మిశ్రా, అక్షత్ విజయవర్గీయ దర్శకత్వం వహించారు. shuru ho chuka hai election🗳 Manju Devi ya Kranti Devi, kiski hogi selection 👀#PanchayatOnPrime, New Season, June 24@TheViralFever @StephenPoppins #ChandanKumar @Akshatspyro @uncle_sherry @vijaykoshy@Farjigulzar #RaghubirYadav @Neenagupta001 @malikfeb @chandanroy77… pic.twitter.com/dflHA71wbe— prime video IN (@PrimeVideoIN) June 11, 2025 -
ఓటీటీలోకి తెలుగమ్మాయి తీసిన లేటెస్ట్ సినిమా
తెలుగమ్మాయి సుమయ రెడ్డి హీరోయిన్గా చేస్తూ ఓ సినిమా నిర్మించింది. కథ కూడా ఈమెని సమకూర్చడం విశేషం. తొలి చిత్రంతోనే ఇలా ఇన్ని విభాగాలకు పనిచేసిన సుమయ.. మంచి ప్రయత్నం చేసిందనే ప్రశంసలు కూడా అందుకుంది. ఏప్రిల్లో ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కాగా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో స్ట్రీమింగ్ కాబోతుంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్)సుమయ రెడ్డి స్టోరీ అందించి హీరోయిన్-నిర్మాతగా చేసిన సినిమా 'డియర్ ఉమ'. కన్నడ నటుడు పృథ్వీ అంబర్ హీరోగా నటించాడు. రొమాంటిక్ థ్రిల్లర్గా మెడికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఏప్రిల్ 17న రిలీజై మంచి ప్రయత్నం చేశారనే ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ మూవీ.. సన్ నెక్స్ట్ ఓటీటీలో జూన్ 13 నుంచి అంటే ఈ శుక్రవారమే స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతానికైతే తెలుగులో మాత్రం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.'డియర్ ఉమ' విషయానికొస్తే.. పల్లెటూరిలో పుట్టి పెరిగిన ఉమ (సుమయ రెడ్డి) కష్టపడి ఎంబీబీఎస్ సీటు సాధిస్తుంది. హాస్పిటల్ కట్టి తన తండ్రి కల నెరవేర్చాలని అనుకుంటుంది. మరోవైపు దేవ్(పృథ్వీ అంబర్)కి మ్యూజిక్ అంటే ప్రాణం. కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. మ్యూజిక్ కారణంగానే ఆమె ఇతడికి బ్రేకప్ చెప్పి వెళ్లిపోతుంది. ఓ డైరీ ద్వారా ఉమ, దేవ్ జీవితంలోకి వస్తుంది. అలా డైరీ చదువుతూ ఉమతో ప్రేమలో పడతాడు. ఆమెకు లవ్ ప్రపోజ్ చేయాలనుకుంటున్న టైంలో షాకింగ్ నిజం ఒకటి తెలుస్తుంది. ఇంతకీ అదేంటి? కార్పొరేట్ మెడికల్ మాఫియాపై సాగించిన పోరాటంలో ఉమకు ఏమైంది? అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సంతానం కామెడీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
డిజాస్టర్ 'థగ్ లైఫ్'.. ఓటీటీ లెక్క మారుతోంది!
రీసెంట్ టైంలో ఓ మాదిరి అంచనాలతో థియేటర్లలోకి ఘోరమైన డిజాస్టర్ అయిన సినిమా 'థగ్ లైఫ్'. తొలిరోజు తొలి ఆటకే ఫలితం ఏంటో తెలిసిపోయింది. రిలీజ్కి కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యల వల్ల వార్తల్లో నిలిచిన ఈ చిత్రం.. థియేటర్లలోకి వచ్చిన తర్వాత తేలిపోయింది. ఇప్పుడు వీకెండ్ కూడా పూర్తి కావడంతో చాలాచోట్ల షోలు క్యాన్సిల్ అవుతున్నాయి. దీంతో టీమ్ పునరాలోచనలో పడిపోయింది. దీంతో ఓటీటీ లెక్క మారే సూచనలు కనిపిస్తున్నాయి.సాధారణంగా థియేటర్లలోకి వచ్చిన తర్వాత సదరు సినిమా.. ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ కావాలనేది ముందే మాట్లాడి అగ్రిమెంట్ చేసుకుంటారు. కమల్ హాసన్ 'థగ్ లైఫ్' చిత్రానికి కూడా నెట్ఫ్లిక్స్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎనిమిది వారాల తర్వాతే స్ట్రీమింగ్ ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. దీంతో ఉత్తరాదిలోనూ మల్లీప్లెక్స్ రిలీజ్ దక్కింది. తీరా చూస్తే తొలి వీకెండ్కే సినిమా ఫలితం ఏంటో తెలిసిపోయింది. దీంతో నిర్మాతలు.. ఓటీటీ సంస్థతో బేరాసారాలు మొదలుపెట్టారట.ఒప్పందం చేసుకున్నట్లు ఎనిమిది వారాలు కాకుండా నాలుగు వారాలకే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని అడుగుతున్నారట. తద్వారా కొంత మొత్తం ఎక్కువ రాబట్టుకోవాలని నిర్మాతల ఆలోచన. ప్రస్తుతం ఈ విషయమై చర్చలు నడుస్తున్నాయి. రీసెంట్ టైంలో థియేటర్లలో ఆడని సినిమాలు కూడా ఓటీటీలో హిట్ అవుతున్నాయి. కంగువ, విడామయూర్చి, రెట్రో ఈ కోవలోకే వస్తాయి. బహుశా 'థగ్ లైఫ్' కూడా అలానే ఓటీటీలోకి వచ్చిన తర్వాత ట్రెండ్ అవుతుందేమో చూడాలి? ఏదేమైనా మరికొన్ని రోజుల్లో ఓటీటీ రిలీజ్ విషయంలో క్లారిటీ రావొచ్చు.'థగ్ లైఫ్' విషయానికొస్తే.. రంగరాయ శక్తిరాజు (కమల్ హాసన్) ఓ గ్యాంగ్స్టర్. అనుకోకుండా తండ్రిని కోల్పోయిన అమర్ (శింబు) అనే కుర్రాడిని శక్తిరాజు పెంచుకుంటాడు. తన తర్వాత తన ముఠాకు అమర్ని నాయకుడిగా చేస్తాడు. దీన్ని అదే ముఠాలోని ఇతర సభ్యులు తీసుకోలేకపోతారు. ఇంతలోనే శక్తిరాజుపై హత్యాప్రయత్నం జరుగుతుంది. ఇంతకీ శక్తిరాజుని చంపాలనుకున్నది ఎవరు? ఈ మొత్తం వ్యవహారంలో ఇంద్రాణి, లక్ష్మీ పాత్రేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. -
ఓటీటీలోకి కాంట్రవర్సీ సినిమా.. తెలుగులోనూ
ఓటీటీలోకి మరో హారర్ కామెడీ సినిమా వచ్చేందుకు రెడీ అయింది. గత నెలలో ఓ పేరడీ పాట వల్ల వివాదాస్పదమైన ఈ చిత్రం.. తిరుమల వేంకటేశ్వర స్వామిని నమ్మే భక్తుల మనోభావాల్ని దెబ్బతీసింది. పలుచోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. అలా వార్తల్లో నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎప్పుడు రాబోతుంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్)తమిళ కమెడియన్ సంతానం హీరోగా నటించిన కామెడీ మూవీ 'డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవల్'. మే 16న తెలుగు, తమిళ భాషల్లో రిలీజైంది. కానీ కంటెంట్ తేలిపోవడంతో ఘోరమైన డిజాస్టర్గా నిలిచింది. అయితే గోవింద అంటూ సాగే దేవుడి పాటని ఇందులో పేరడీ చేయడం కాంట్రవర్సీకి కేరాఫ్ అయింది. తర్వాత దాన్ని తొలగించడంతో అందరూ సైలెంట్ అయిపోయారు.ఇక ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చి నెల కూడా అవ్వకుండానే ఓటీటీలోకి రాబోతుంది. జూన్ 13 నుంచి జీ5లో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా విషయానికొస్తే.. కిస్సా 47 అనే యూట్యూబ్ ఛానెల్ నడిపే కృష్ణ(సంతానం)కి ప్యారడైజ్ అనేది థియేటర్ నుంచి స్పెషల్ టికెట్ వస్తుంది. దీంతో కుటుంబంతో సహా కృష్ణ ఆ థియేటర్కి వెళ్తాడు. తర్వాత ఏమైంది? ఆ థియేటర్లో అసలేం జరుగుతుందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'విరూపాక్ష' డైరెక్టర్ నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే?) -
ఓటీటీలో మలయాళ ఫాంటసీ కామెడీ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
మలయాళంలో తెరకెక్కిన ఒక ఫాంటసీ కామెడీ చిత్రం 'పడక్కలం'.. మే 9న విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. నూతన దర్శకుడు మను స్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సూరజ్ వెంజరమూడు, షరాఫుద్దీన్, సందీప్ ప్రదీప్ నటించారు. ప్రేక్షకులకు క్లీన్ క్యాంపస్ సూపర్ నేచురల్ ఫాంటసీ కామెడీని దర్శకుడు అందించాడు. కానీ, పేలవమైన కథ ఎంపిక చేసుకోవడం వల్ల సినిమాను నిరాశపరిచింది.జూన్ 10న పడక్కలం జియోహాట్స్టార్ వేదికగా విడుదలైంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీలో స్ట్రీమింగ్ అవుతుంది. రూ. 10 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 18 కోట్లు రాబట్టింది. కామెడీ పరంగా సినిమా పర్వాలేదనిపించినా... కథ ఎంపిక విషయంలో దర్శకుడు తడబడ్డాడని చెప్పవచ్చు. అయితే, ఓటీటీలో ప్రేక్షకులను మెప్పించే ఛాన్స్ ఉంది.నలుగురు కాలేజీ అబ్బాయిల ప్రయాణమే పడక్కలం చిత్రం. వారికి కామిక్ పుస్తకాలు అంటే చాలా ఇష్టం. వారు ఊహించని సాహసయాత్రలో పాల్గొంటారు, వారి పాఠశాలలోని ఒక ప్రొఫెసర్కు ఉన్న అతీంద్రియ శక్తులతో వారి విద్యా ప్రపంచం తలకిందులు అవుతుంది. అనేక మలుపులతో వారి ప్రయాణం ఎలా ముగుస్తుంది అనేది ఈ చిత్రం. -
మా సినిమాల రిలీజ్ డేట్స్ను వాళ్లే నిర్ణయిస్తున్నారు: కుబేర నిర్మాత
కుబేర మూవీ నిర్మాత సునీల్ నారంగ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమా విడుదలపై ఓటీటీల ఆధిపత్యం కొనసాగుతోందని అన్నారు. తాము నిర్మించిన మూవీ రిలీజ్ డేట్ను ఓటీటీ ఫ్లాట్ఫామ్స్ నిర్దేశించే స్థాయికి చేరుకున్నాయని విమర్శించారు. మా సినిమాను జూలైలో విడుదల చేయాలని రిక్వెస్ట్ చేస్తే.. ఓటీటీ సంస్థ ఒప్పుకోలేదని అన్నారు. సినిమా విడుదల ఆలస్యమైతే అంగీకరించిన మొత్తంలో రూ. 10 కోట్ల రూపాయలు కోత విధిస్తామని హెచ్చరించందని నిర్మాత సునీల్ వెల్లడించారు. ఓటీటీలే సినిమాల విడుదల తేదీలను నిర్ణయిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోజు రోజుకు ఓటీటీలకు డిమాండ్ పెరిగిపోతోందని తెలిపారు.'కుబేరా' నిర్మాత సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. ' ఓటీటీ ప్లాట్ఫామ్స్ సినిమాల విడుదల తేదీని నిర్ణయిస్తున్నాయి. ఒకటి, రెండు వారాలు ఆలస్యమైతే వాళ్లు ఒప్పుకోవడం లేదు. నేను జూలైలో కుబేరా మూవీ రిలీజ్కు ఓటీటీ సంస్థను అభ్యర్థించా. కానీ మొదట అంగీకరించిన తేదీ జూన్ 20న విడుదల చేయాలని నన్ను కోరారు. ఆ డేట్లో రిలీజ్ చేయకపోతే అంగీకరించిన మొత్తంలో 10 కోట్లు తగ్గిస్తామని చెప్పారు.' అని వెల్లడించారు.తెలుగు చిత్ర పరిశ్రమలో పరిస్థితి గురించి మాట్లాడుతూ.. 'కొన్ని సంఘటనల కారణంగా పరిశ్రమ దెబ్బతింది. మేము సినిమా సర్వీస్ ప్రొవైడర్ అయిన క్యూబ్పై పూర్తిగా ఆధారపడి ఉన్నాం. శాటిలైట్ లేకుండా సినిమాను విడుదల చేయడం సాధ్యం కాదు. ఇక బుక్మైషో ఒక గంట పాటు ఇంటర్నెట్ ఆపేస్తే కలెక్షన్లు సున్నాకి పడిపోతాయి. అలా మేము వాటన్నిటిపైనే కాకుండా ఇప్పుడు ఓటీటీలపై ఆధారపడాల్సి వస్తోంది' అన్నారు.గతంలో శాటిలైట్, థియేటర్లను దృష్టిలో ఉంచుకుని సినిమాలు తీసేవాళ్లమని సునీల్ నారంగ్ తెలిపారు. అయితే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లను బట్టి మేము సినిమాలు తీస్తున్నామని వెల్లడించారు. మెల్లమెల్లగా వాళ్లే ఇప్పుడు పరిశ్రమకు కింగ్గా మారుతున్నారని.. సినిమా ఆడినా.. ఆడకపోయినా ఈ ముగ్గురూ సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. కాగా.. కుబేర మూవీలో కోలీవుడ్ హీరో ధనుశ్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రంజూన్ 20న విడుదల కానుంది. -
ఓటీటీలో లేటెస్ట్ హిట్ సినిమా.. డేట్ ఫిక్సయిందా?
ఓటీటీలోకి మరో మంచి సినిమా రాబోతుంది. అక్షయ్ కుమార్, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుని, రూ.150 కోట్ల మేర వసూళ్లు సాధించింది. చాన్నాళ్ల హిట్ లేక ఇబ్బంది పడుతున్న అక్షయ్ కుమార్.. కాస్త బూస్టప్ ఇచ్చింది. తర్వాత తెలుగులోనూ రిలీజ్ చేశారు. అలాంటి ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు స్ట్రీమింగ్ డేట్ వైరల్ అవుతోంది.జలియన్ వాలాబాగ్ ఉదంతం బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన సినిమా 'కేసరి చాప్టర్ 2'. అక్షయ్ కుమార్, మాధవన్, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటించారు. కోర్టు రూమ్ డ్రామాగా తీసిన ఈ మూవీని తొలుత హిందీలో ఏప్రిల్ 18న రిలీజ్ చేయగా మంచి టాక్ వచ్చింది. నెల తర్వాత అంటే మే 23న తెలుగులోనూ డబ్ చేసి విడుదల చేయగా ఓ మాదిరి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో జూన్ 13 నుంచి హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. త్వరలో ఈ విషయమై ప్రకటన రావొచ్చు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్)కేసరి 2 విషయానికొస్తే.. 1919లో జలియన్ వాలా బాగ్ మరణకాండ జరిగింది. దీనికి కారకుడు అప్పటి పంజాబ్ జనరల్ మైకేల్ డయ్యర్. తన అధికారం ఉపయోగించి ఈ సంఘటన గురించి వార్తాపత్రికల్లో ఎక్కడా రాకుండా మేనేజ్ చేస్తాడు. అలానే బ్రిటీష్ వైస్రాయ్ కౌన్సిల్ లో సభ్యుడిగా ఉన్న భారత న్యాయవాది శంకరన్ నాయర్ (అక్షయ్ కుమార్)తో ఓ కమిషన్ ఏర్పాటు చేసి, తమకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వాలని జనరల్ డయ్యర్ కోరాడు.కానీ జలియన్ వాలా బాగ్ ఘటన గురించి అర్థం చేసుకున్న శంకరన్.. తన ఉద్యోగానికి రాజీనామా చేసి జనరల్ డయ్యర్పై కేసు వేస్తాడు. దీంతో మైకేల్ డయ్యర్ తనని తాను కాపాడుకునేందుకు లాయర్ నెవిల్లే మెక్ కిన్లే (మాధవన్)ని అపాయింట్ చేసుకుంటాడు. మరి జలియన్ వాలా బాగ్ కేసులో శంకరన్ ఎలాంటి వాదనలు వినిపించాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: అందుకే నేను 'కన్నప్ప'లో నటించలేదు: మంచు లక్ష్మీ) -
ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్
మరో వారం వచ్చేసింది. లెక్క ప్రకారం ఈ వీకెండ్లో రావాల్సిన 'హరిహర వీరమల్లు' వాయిదా పడటంతో థియేటర్లన్నీ ఖాళీగానే ఉండనున్నాయి. మరోవైపు ఓటీటీల్లోకి ఏకంగా 20కి పైగా కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో కొన్ని చూడదగ్గవి ఉండటం విశేషం. (ఇదీ చదవండి: గ్రాండ్గా అక్కినేని అఖిల్ రిసెప్షన్)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. సమంత 'శుభం', ఎలెవన్ అనే తెలుగు మూవీస్తో పాటు 'జింఖానా' అనే డబ్బింగ్ సినిమాతో పాటు 'రానా నాయుడు' సీజన్ 2 సిరీస్ ఉన్నంతలో ఆసక్తి రేపుతున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ (జూన్ 9 నుంచి 15 వరకు)నెట్ఫ్లిక్స్ద క్రియేచర్ కేసెస్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 09ఫ్యామిలీస్ లైక్ అవర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 10ట్రైన్ రెక్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 10అనీలా (పోలీష్ సిరీస్) - జూన్ 11ఛీర్ టూ లైఫ్ (పోర్చుగీస్ మూవీ) - జూన్ 11కొకైన్ ఎయిర్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 11అవర్ టైమ్స్ (స్పానిష్ సినిమా) - జూన్ 11టైటాన్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 11ఫ్యూబర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 12రానా నాయుడు సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 13ఆహాఎలెవన్ (తెలుగు సినిమా) - జూన్ 13అమెజాన్ ప్రైమ్ద ట్రైటర్స్ (హిందీ రియాలిటీ షో) - జూన్ 12ఇన్ ట్రాన్సిట్ (హిందీ సిరీస్) - జూన్ 13హాట్స్టార్పడక్కలమ్ (మలయాళ సినిమా) - జూన్ 10ద రియల్ హౌస్వైవ్స్ ఆఫ్ మియామి సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 12శుభం (తెలుగు మూవీ) - జూన్ 13అండర్ డాగ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 15సోనీ లివ్జింఖానా (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 13ఆపిల్ ప్లస్ టీవీఎకో వ్యాలీ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 13నాట్ ఏ బాక్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 13మనోరమ మ్యాక్స్కర్ణిక (మలయాల సినిమా) - జూన్ 09(ఇదీ చదవండి: అందుకే నేను 'కన్నప్ప'లో నటించలేదు: మంచు లక్ష్మీ) -
ఓటీటీలో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ.. నెలలోనే స్ట్రీమింగ్
క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ 'లెవన్' (Eleven) ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. నవీన్ చంద్ర హీరోగా నటించిన ఈ చిత్రం తెలుగు, తమిళ వర్షన్లో మే 16న థియేటర్స్లోకి వచ్చేసింది. ప్రేక్షకులను మెప్పించిన ఈ మూవీని లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వం వహించారు. రేయా హరి కథానాయికగా నటించిన ఈ మూవీలో అభిరామి, రవి వర్మ కీలక పాత్రలు చేశారు. ఏఆర్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్పై అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మించారు.'ఆహా' (Aha) వేదికగా ఈ నెల 13 నుంచి 'లెవన్' మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఐఎమ్డిబి రేటింగ్లో కూడా ఈ చిత్రం 7.9 సాధించింది. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడేవారికి లెవన్ తప్పకుండా నచ్చుతుందని నెటిజన్లు చెబుతున్నారు. కథలో సీరియల్ కిల్లింగ్స్ జరుగుతూ ఉంటే వాటిని అడ్డుకునేందుకు పోలీసులు ఎలాంటి ప్లాన్ వేశారు అనేది మూవీలో చక్కగా చూపారు.'లెవన్' కథేంటంటే.. అరవింద్(నవీన్ చంద్ర) ) ఓ సిన్సియర్ పోలీసాఫీసర్. ఏసీపీ హోదాలో వైజాగ్కి ట్రాన్స్ఫర్ అవుతాడు. వచ్చీరావడంతోనే ఓ దొంగతనం కేసును ఈజీగా సాల్వ్ చేస్తాడు. అదే సమయంలో వైజాగ్లో వరుస హత్యలు జరుగుతుంటాయి. తొలుత ఈ కేసును ఏసీసీ రంజిత్ కుమార్ (శశాంక్) డీల్ చేస్తాడు. విచారణ మధ్యలోనే అతనికి యాక్సిడెంట్ అవుతుంది. దీంతో ఈ కేసు అరవింద్ చేతికి వస్తుంది. అతనికి సహాయంగా ఎస్సై మనోహర్ ఉంటాడు. వీరిద్దరు కలిసి చేసిన విచారణలో చనిపోయినవారంతా కవలలు అని, ఇద్దరిలో ఒకరిని మాత్రమే చంపుతున్నారని తేలుతుంది. ఈ హత్యలు చేస్తున్న సీరియల్ కిల్లర్ ఎవరు? ఎందుకు చేస్తున్నాడు? ట్విన్స్లో ఒకరిని మాత్రమే ఎందుకు చంపుతున్నాడు? వారితో సీరియల్ కిల్లర్కు ఉన్న సంబంధం ఏంటి? ఏసీపీ అరవింద్ ఈ కేసును ఎలా డీల్ చేశాడు? చివరకు హంతకుడిని పట్టుకున్నారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
రూ.10 కోట్లు కట్ చేస్తామన్నారు.. 'కుబేర' నిర్మాత ఆవేదన
ప్రస్తుతం టాలీవుడ్లో ఓటీటీల ఆధిపత్యం నడుస్తోంది. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వాలనేది సదరు సంస్థలే డిసైడ్ చేస్తున్నాయి. ఇప్పటివరకు దీని గురించి నిర్మాతలు పెద్దగా ఓపెన్ అయింది లేదు. కానీ త్వరలో రిలీజ్ కాబోతున్న 'కుబేర' నిర్మాత సునీల్ నారంగ్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్న సమస్యల గురించి తన అభిప్రాయాల్ని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: గ్రాండ్గా అక్కినేని అఖిల్ రిసెప్షన్)ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'కుబేర'. శేఖర్ కమ్ముల దర్శకుడు. జూన్ 20న థియేటర్లలోకి రాబోతుంది. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్ కాస్త హైప్ తీసుకొచ్చాయి. త్వరలో ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే చిత్ర నిర్మాతలైన సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. ఓటీటీల ఆధిపత్యం గురించి చెప్పుకొచ్చారు. 'మేం 'కుబేర' చిత్రానికి జూలైలో రిలీజ్ చేస్తామని అడిగాం. కానీ ప్రైమ్ వాడు మాత్రం జూన్ 20న విడుదల చేయండి లేదంటే ఓటీటీ డీల్ నుంచి రూ.10 కోట్లు కట్ చేస్తామని అన్నాడు' అని చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ఇండస్ట్రీలో క్యూబ్ సిస్టమ్, బుక్ మై షో, ఓటీటీల ఆధిపత్యం నడుస్తోందని సునీల్ నారంగ్ చెప్పుకొచ్చారు. అలానే 140 కోట్ల మంది జనాభాలో 40-50 మంది హీరోలు మాత్రమే ఉన్నారని.. దీంతో వాళ్లు దేవుళ్లతో సమానం అని చెప్పుకొచ్చారు. ఇకపోతే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్గా ఈయన శనివారం సాయంత్రం ఎన్నికయ్యారు. ఆదివారం సాయంత్రానికల్లా రాజీనామా చేశారు. తనకు సమాచారం ఇవ్వకుండా ఎవరికి వారు ప్రకటనలు జారీ చేస్తున్నారని, కొందరి వ్యాఖ్యలు తనని బాధించాయని చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో ప్రెసిడెంట్గా కొనసాగడం కష్టంగా ఉందని చెబుతూ ఓ లేఖని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: అందుకే నేను 'కన్నప్ప'లో నటించలేదు: మంచు లక్ష్మీ) -
నాకు ఆ ఫిగర్ నచ్చలేదు.. అందుకే 'కన్నప్ప'ని ఇంకా: మంచు విష్ణు
ప్రస్తుతం తెలుగు సినిమా వ్యవహారాలు దాదాపు ఓటీటీ సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయాయి. మూవీని ఏ తేదీన థియేటర్లలో విడుదల చేయాలనేది వారే నిర్ణయిస్తున్నారు. పాన్ ఇండియా మూవీస్కి పర్లేదు గానీ చాలామంది చిన్న, మీడియం బడ్జెట్ పెట్టే నిర్మాతలు.. తమ చిత్రాల్ని పూర్తి చేసినా సరే రిలీజ్ చేయలేకపోతున్నారు. ఈ క్రమంలోనే మంచు విష్ణు 'కన్నప్ప' ఓటీటీ గురించి పలు రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. వాటి గురించి అడగ్గా.. విష్ణు తాజా ఇంటర్వ్యూలో సమాధానమిచ్చాడు.'కన్నప్ప' ఓటీటీ డీల్ కుదిరిందా? అని అడగ్గా.. 'వాళ్లు ఓ ఫిగర్ చెప్పారు అది నాకు నచ్చలేదు. హిట్ అయ్యాక అమ్మితే ఎంత ఇస్తారని అడిగాను. అప్పుడు వాళ్లు చెప్పిన ఫిగర్ నాకు నచ్చింది. డబ్బులు రెడీ చేస్కోండి. విడుదలయ్యాక వస్తాను అని చెప్పాను' అని విష్ణు చెప్పుకొచ్చాడు. ఇతడి కాన్ఫిడెన్స్ చూస్తుంటే సినిమాపై చాలా నమ్మకంతోనే ఉన్నాడనిపిస్తుంది. చూడాలి మరి ఫలితం ఎలా వస్తుందో?(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు)మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'. గత చిత్రాలు సరిగా ఆడకపోవడంతో చాన్నాళ్ల పాటు గ్యాప్ తీసుకుని ఈ సినిమా చేశాడు. భారీ బడ్జెట్ పెట్టి స్వయంగా నిర్మించాడు. ఇందులో ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, కాజల్.. ఇలా చాలామంది స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. మార్కెట్ పరంగా చూసుకుంటే దక్షిణాది స్టార్స్ చాలామంది ఉన్నారు. సినిమా హిట్ అయితే ఓటీటీల నుంచి డిమాండ్ ఉండొచ్చు. ఒకవేళ తేడా కొడితే మాత్రం అంతే సంగతులు.జూన్ 27న 'కన్నప్ప' సినిమా థియేటర్లలోకి రానుంది. చాన్నాళ్ల క్రితం తొలుత ఓ టీజర్ రిలీజ్ చేయగా.. విపరీతమైన ట్రోలింగ్ వచ్చింది. కాస్త గ్యాప్ తీసుకుని మరో టీజర్ రిలీజ్ చేయగా, నెగిటివిటీ కాస్త తగ్గింది. ప్రస్తుతం ప్రమోషన్ల బాధ్యత విష్ణునే తీసుకున్నాడు. పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నాడు. త్వరలో తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్ చేయబోతున్నాడు. దీనికి ప్రభాస్ కూడా హాజరవుతాడని టాక్.(ఇదీ చదవండి: పవన్ 'హరిహర..' పరువు తీసిన యాంకర్!) -
ఓటీటీలో 'సమంత' సినిమా.. ట్రైలర్ విడుదల
టాలీవుడ్ నటి సమంత నిర్మాతగా తెరకెక్కించిన మొదటి సినిమా 'శుభం' ఓటీటీలోకి రానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో చిత్ర నిర్మాణంలోకి ఆమె ఎంట్రీ ఇచ్చారు. తన తొలి ప్రయత్నంలోనే కొత్తతరం నటులతో తెరకెక్కించడమే కాకుండా ఆమె ఇందులో మాయ అనే అతిథి పాత్రలోనూ మెప్పించారు. మే 9న విడుదలైన శుభం మూవీని ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. హర్షిత్రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి, వంశీధర్ గౌడ్, శ్రియ కొంతం, శర్వాణి లక్ష్మీ, షాలిని కొండెపూడి తదితరులు నటించారు. జియో హాట్స్టార్ వేదికగా జూన్ 13 నుంచి శుభం చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. అయితే, తాజాగా ఓటీటీకి సంబంధించిన ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. వైజాగ్లోని భీమిలీపట్నంలో నివసించే ముగ్గురు యువజంటల చుట్టూ ఈ సినిమా కథ ఉంటుంది. తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్నే రాబట్టింది. -
ఓటీటీలో ఐశ్వర్య రాజేశ్ డార్క్ కామెడీ మూవీ... 'సొప్పన సుందరి' ఎలా ఉందంటే?
టైటిల్: సొప్పన సుందరినటీనటులు: ఐశ్వర్య రాజేశ్, లక్ష్మీ ప్రియ, చంద్రమౌళి, దీపా శంకర్, కరుణాకరన్ తదితరులుడైరెక్టర్: ఎస్జీ ఛార్లెస్ఓటీటీ ప్లాట్ఫామ్: జియో హాట్స్టార్'సంక్రాంతికి వస్తున్నాం' మూవీతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన బ్యూటీ 'ఐశ్వర్య రాజేశ్'(Aishwarya Rajesh). ఇప్పుడు తెలుగువారికి సుపరిచితమైన పేరు. గతంలో ఆమె పలు తమిళ చిత్రాల్లో మెప్పించింది. ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రలో వచ్చిన డార్క్ కామెడీ ఎంటర్టైనర్ సొప్పన సుందరి (Soppana Sundari). 2023లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుంది. ప్రస్తుతం జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.'సొప్పన సుందరి' కథేంటంటే..అహల్య (ఐశ్వర్య రాజేశ్) తన తల్లి, అక్కతో కలిసి ఓ బస్తీలో నివసిస్తూ ఉంటుంది. తాను ఓ నగల దుకాణంలో పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉంటుంది. అయితే అహల్యకు ఉహించని విధంగా రూ.10 లక్షల విలువైన లక్కీ డ్రాలో బహుమతిగా లభిస్తుంది. అయితే కారు దక్కిందని సంతోషించేలోపే అసలు కథ మొదలవుతుంది. ఇంతకీ ఆ కారు అహల్య కుటుంబానికి దక్కిందా? నగలే కొనకుండా అసలు ఈ బహుమతి వీరికెలా వచ్చింది? అనే విషయాలు తెలియాలంటే సొప్పన సుందరి చూడాల్సిందే.ఎలా ఉందంటే..వీకెండ్ వచ్చిందంటే చాలు. సినీ ప్రియులు ఎక్కువగా ఓటీటీల వైపు చూస్తున్నారు. అలాంటి వారిని కడుపుబ్బా నవ్వించే డార్క్ కామెడీ చిత్రం సొప్పన సుందరి. అలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మంచి సందేశం కూడా ఇచ్చే మూవీ. అహల్య(ఐశ్వర్య రాజేశ్), అన్నయ్య దొర (కరుణాకరన్) పెళ్లి చేసుకుని కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోతాడు. దీంతో అహల్య తన అక్క పెళ్లి బాధ్యతను తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ప్రథమార్థంలో అహల్య కారు గెలుచుకోవడం, ఆ తర్వాత అహల్య అక్కకు కూడా పెళ్లి కుదురుతుంది. అయితే ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. కారు కోసం అన్నయ దొర ఎంట్రీ ఇవ్వడం.. ఆ తర్వాత జరిగే సన్నివేశాలు ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తాయి. అలా ఈ కథ చివరికీ పోలీస్ స్టేషన్కు చేరడంతో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది.పోలీసుల చేతికి కారు వెళ్లడంతో.. సెకండాఫ్ వచ్చేసరికి కథ మొత్తం కారు చుట్టే తిరుగుతుంది. ఆ కారును దక్కించుకునే క్రమంలో ఐశ్వర్య రాజేశ్.. ఆమె అన్నయ్య దొర తన టీమ్తో కలిసి చేసే ప్రయత్నాలు ఫుల్ కామెడీని తలపిస్తాయి. అయితే కొన్ని చోట్ల సన్నివేశాలు మరీ లాజిక్లెస్గా ఉంటాయి. అయితే కామెడీ కథ కోణంలో చూస్తే అలా ఉంటేనే సెట్ అవుతుంది. అందుకే డైరెక్టర్ ఎలాంటి లాజిక్ లేకుండా కథను రాసుకున్నాడు. కామెడీ ఎంటర్టైనర్ కావడంతో ప్రేక్షకుడికి ఆ ఫీలింగ్ కలగదు. చివర్లో కారును అడ్డం పెట్టుకుని ఎస్సై చేసే దుర్భుద్దిని చూపిస్తూ డైరక్టర్ ఆ కోణంలోనూ ఆడియన్స్కు మేసేజ్ ఇచ్చారు. అయితే ఈ మూవీతో మనది కానీ వస్తువును బలవంతంగా తీసుకెళ్తే మనిషికి మనశ్శాంతి ఉండదనే సందేమిచ్చారు. కక్లైమాక్స్లో దురాశ దుంఖానికి చేటు అనే సామెతతో కథను ముగించాడు. కామెడీతో పాటు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మంచి సందేశాన్నిచ్చే చిత్రం సొప్పన సుందరి. వీకెండ్లో మంచి కామెడీతో పాటు సందేశాత్మక చిత్రం చూడాలనుకుంటే సొప్పన సుందరి ట్రై చేయొచ్చు.ఎవరెలా చేశారంటే..ఐశ్వర్య రాజేశ్ ఈ కథకు ప్రధాన బలం. తన పాత్రలో సహజంగా నటించి అభిమానులను మెప్పించింది. ఐశ్వర్య రాజేశ్ మిడిల్ క్లాస్ అమ్మాయిలా తన పాత్రలో ఒదిగిపోయింది. ఐశ్వర్యకు తల్లి పాత్ర పోషించిన దీపా శంకర్, ఆమె అన్నయ్యగా దొరగా కరుణాకరన్ తమ పాత్రల్లో మెప్పించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. ఎడిటింగ్లో సాగదీత సన్నివేశాలు కట్ చేయాల్సింది. నేపథ్య సంగీతం అంతగా ఆకట్టుకోలేదు. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఫర్వాలేదనిపించాయి. -
ఓటీటీలోకి 'ప్రేమలు' హీరో స్పోర్ట్స్ కామెడీ మూవీ
'ప్రేమలు' సినిమాతో హీరోయిన్ మమిత బైజు గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సూర్య, ప్రదీప్ రంగనాథన్ లాంటి హీరోలతో మూవీస్ చేస్తోంది. ఇదే చిత్రంలో హీరోగా నటించిన నస్లేన్ కూడా వరస సినిమాలు చేస్తున్నాడు. అలా ఇతడు నటించిన లేటెస్ట్ మూవీ.. మలయాళంతో పాటు తెలుగులోనూ థియేటర్లలో రిలీజై హిట్ కొట్టింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇంతకీ ఆ చిత్రం సంగతేంటి? ఎందులో రానుంది?'ప్రేమలు' హీరో నస్లేన్ నటించిన లేటెస్ట్ మూవీ 'జింఖానా'. ఏప్రిల్ 10న మలయాళ వెర్షన్ రిలీజ్ కాగా.. ఇదే నెల చివర్లో తెలుగు వెర్షన్ థియేటర్లలోకి వచ్చింది. పాజిటివ్ టాక్తో పాటు ఓ మాదిరి కలెక్షన్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రం సోనీ లివ్ ఓటీటీలో జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుందని అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు)'జింఖానా' సినిమా విషయానికొస్తే.. అలప్పుజాకు చెందిన ఆకతాయి కుర్రాళ్లు జాన్సన్ (నస్లేన్)తో పాటు మరో ఐదుగురు ఫ్రెండ్స్. వీళ్లలో షణవాస్ అనే కుర్రాడు తప్పితే మిగిలిన వాళ్లంతా 12వ తరగతిలో ఫెయిల్. దీంతో డిగ్రీ చదవాలంటే స్పోర్ట్స్ కోటా ద్వారా వెళ్లాలనుకుంటారు. అలా బాక్సింగ్ నేర్చుకుంటారు. స్థానికంగా 'అలప్పుజా జింఖానా' అకాడమీలో శిక్షణ తీసుకోవడం ప్రారంభిస్తారు. స్థానిక పోటీల్లో ఎలాగో గెలిచిన కుర్రాళ్ల గ్యాంగ్.. కేరళ స్టేట్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొనేందుకు రెడీ అవుతుంది. ఫ్రొఫెషనల్ ఆటగాళ్లు ఉండే ఆ బాక్సింగ్ పోటీల్లో ఈ ఆకతాయి గ్యాంగ్కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? గెలిచారా లేదా అనేది మిగతా స్టోరీ.ఇక ఈ వీకెండ్ దాదాపు 30కి పైగా కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్లోకి వచ్చేశాయి. వీటిలో సింగిల్, జాట్, లాల్ సలామ్, గ్రౌండ్ జీరో, భోల్ చుక్ మాఫ్, జిగేల్, స్టోలెన్ సినిమాలు కాస్త చూడదగ్గవిగా అనిపిస్తున్నాయి. వడక్కన్, ఓ యుముడి ప్రేమకథ లాంటి డబ్బింగ్ చిత్రాలు కూడా వచ్చాయి. వీటితో పాటు 'దేవిక & డానీ' అనే తెలుగు సిరీస్ కూడా కాస్త ఆసక్తి కలిగిస్తోంది.(ఇదీ చదవండి: హిందీ హీరో చేసిన తెలుగు ఫ్లేవర్ సినిమా.. 'జాట్' ఓటీటీ రివ్యూ)Watch the group that trained for marks…and ended up fighting for much more.#AlappuzhaGymkhana streaming from 13th June on Sony LIV#AlappuzhaGymkhana #AlappuzhaGymkhanaOnSonyLIV#NaslenKGafoor #LukmanAvaran #AnaghaMayaRavi #GanapathiSPoduval #BabyJean #SandeepPradeep pic.twitter.com/oEikMxNAQ5— Sony LIV (@SonyLIV) June 6, 2025 -
హిందీ హీరో చేసిన తెలుగు ఫ్లేవర్ సినిమా.. ఓటీటీ రివ్యూ
తెలుగులో లెక్కలేనన్నీ మాస్ మసాలా కమర్షియల్ సినిమాలు వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. మరోవైపు ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ జోరుగా నడుస్తోంది. అలా తెలుగు దర్శకులు.. ఇతర భాషల్లోనూ మూవీస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తీసిన హిందీ సినిమా 'జాట్'. ఏప్రిల్లో హిందీ వెర్షన్ థియేటర్లలో రిలీజ్ కాగా.. ఇప్పుడు తెలుగు వెర్షన్ నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ మూవీ ఎలా ఉందంటే?(ఇదీ చదవండి: ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన సినిమా 'టూరిస్ట్ ఫ్యామిలీ'.. తెలుగు రివ్యూ)కథేంటి?శ్రీలంక నుంచి అక్రమంగా ఇక్కడికి వలసొచ్చిన రణతుంగ(రణదీప్ హుడా).. ప్రకాశం జిల్లాలోని మోటుపల్లితో పాటు చుట్టుపక్కన 30 గ్రామాల్ని తన ఆధీనంలో పెట్టుకుంటాడు. మరోవైపు అయోధ్య వెళ్తున్న జాట్(సన్నీ డియోల్).. ట్రైన్లో సాంకేతిక లోపం కారణంగా మోటుపల్లిలో దిగుతాడు. ఆకలేసి ఓ షాపులో ఇడ్లీ తినబోతుంటే.. కొందరు రౌడీలు జాట్ ప్లేట్ని తోసేస్తారు. దీంతో వాళ్లని సారీ చెప్పమంటాడు. వాళ్లు చెప్పరు. ఫలితంగా ఈ పంచాయతీ.. రణతుంగ దగ్గరకు చేరుతుంది. తర్వాత ఏమైంది? ఇంతకీ జాట్, రణతుంగ గతమేంటి అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?జాట్ గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. ఎందుకంటే ఇప్పటికే తెలుగు సినిమాల్లో అరిగిపోయిన పాత చింతకాయ పచ్చడి లాంటి స్టోరీ ఇది. కొన్ని గ్రామాల ప్రజల్ని ఇబ్బంది పెట్టే కరుడుగట్టిన విలన్.. అనుకోకుండా హీరో ఆ ఊరికి రావడం, సమస్య తెలుసుకుని విలన్తో తలపడటం.. చివరకు కథ సుఖాంతం. ఎన్నిసార్లో తెలుగు ప్రేక్షకులు ఈ తరహా సినిమాల్ని చూసి చూసి విసుగెత్తిపోయారు. బహుశా అందువల్లనేమో మన దగ్గర థియేటర్లలో నేరుగా రిలీజ్ చేయలేదు. హిందీలో రిలీజ్ చేస్తే ఓ మాదిరి రెస్పాన్స్ దక్కించుకుంది.ట్రైన్లో వెళ్తుండే హీరో.. అనుకోకుండా విలన్ ఉండే ఊరిలో దిగడం, తర్వాత కొందరు రౌడీలతో ఇడ్లీ పంచాయతీ. అది కాస్త మెయిన్ విలన్ దగ్గరకు వెళ్లడం.. ఇలా ఫస్టాప్ ముగుస్తుంది. ఊహించినట్లే సెకండాఫ్ పూర్తిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. మోటుపల్లి గ్రామస్థులని విలన్, అతడి తమ్ముడు హింసించడానికి కారణం ఏంటి? లాంటి సీన్స్ ఓకే ఓకే అనిపిస్తాయి. హీరో బ్యాక్ గ్రౌండ్ రివీల్ చేసి, విలన్ని చంపే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్తో క్లైమాక్స్ని రొటీన్గా ముగిస్తారు.రెండున్నర గంటల సినిమానే గానీ చూస్తున్నంతసేపు నెక్స్ట్ ఏం జరుగుతుందో ఊహించేలా సాగుతుంది. యాక్షన్ సీన్లలో డోస్ ఎక్కువైపోయింది. హీరో అడుగేస్తే భూమి బద్దలవడం, కొట్టగానే రౌడీలు గాల్లో అంతెత్తున ఎగరడం లాంటి సీన్స్ యాక్షన్ ప్రియులకు నచ్చుతాయేమో గానీ సగటు ప్రేక్షకుడికి మాత్రం నవ్వు తెప్పిస్తాయి.ఎవరెలా చేశారు?హీరోగా చేసిన సన్నీ డియోల్.. కొందరు తెలుగు ప్రేక్షకులకు తెలుసంతే. సినిమాలో ఆయన పాత్రని చూస్తున్నప్పుడు ఇది బాలకృష్ణ చేయాల్సిన రోల్ కదా అనిపిస్తుంది. విలన్గా రణదీప్ హుడా బాగానే చేశాడు. కాకపోతే తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఎక్కడు. మిగిలిన వాళ్లలో రెజీనా, సయామీ ఖేర్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన పాత్రధారులు ఓకే అనిపించారు.సినిమాని చాలా రిచ్గా తీశారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు బాగోలేవు. యాక్షన్ సీన్స్ హిందీ ప్రేక్షకులకు నచ్చొచ్చేమో గానీ తెలుగు ప్రేక్షకులు అయితే ఇదివరకే ఇలాంటి చాలా చూసేశాం కదా అని కచ్చితంగా అనుకుంటారు. దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా రొటీన్ రెగ్యులర్ మసాలా మూవీనే హిందీ హీరోతో తీసేశాడు. ఒకవేళ మీకు టైమ్ ఉండి, ఏదైనా రొటీన్ మాస్ మసాలా మూవీ చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు. నెట్ఫ్లిక్స్లో తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతోంది.-చందు డొంకాన(ఇదీ చదవండి: కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ మూవీ రివ్యూ) -
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. కాకపోతే ఈ వారం థియేటర్లలోకి వచ్చిన కమల్ హాసన్ 'థగ్ లైఫ్' తేలిపోయింది. పూర్తిగా నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. మరోవైపు శుక్రవారం.. బద్మాషులు, శ్రీ శ్రీ శ్రీ రాజావారు అనే చిన్న సినిమాలు వచ్చాయి. కాకపోతే వీటిపై ఏ మాత్రం బజ్ లేదు. కానీ ఓటీటీల్లోకి మాత్రం ఏకంగా 33 మూవీస్-వెబ్ సిరీసులు వచ్చేశాయి.(ఇదీ చదవండి: సడన్గా నిశ్చితార్థం చేసుకున్న 'బిగ్బాస్' శుభశ్రీ)ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే.. సింగిల్, జాట్, లాల్ సలామ్, గ్రౌండ్ జీరో, భోల్ చుక్ మాఫ్, జిగేల్ సినిమాలు కాస్త చూడదగ్గవిగా అనిపిస్తున్నాయి. వడక్కన్, ఓ యుముడి ప్రేమకథ లాంటి డబ్బింగ్ చిత్రాలు కూడా వచ్చాయి. వీటితో పాటు 'దేవిక & డానీ' అనే తెలుగు సిరీస్ కూడా కాస్త ఆసక్తి కలిగిస్తోంది. ఇంతకీ ఏ ఓటీటీల్లోకి ఏ మూవీ వచ్చిందంటే?ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన సినిమాలు (జూన్ 06)అమెజాన్ ప్రైమ్సింగిల్ - తెలుగు సినిమాసుశీల సుజిత్ - మరాఠీ మూవీబెంగాల్ 1947: ద అన్టోల్డ్ స్టోరీ - హిందీ సినిమామట్ లాక్ సీజన్ 1 - ఇంగ్లీష్ సిరీస్జొరకయ్యా తట్టుంగ - తమిళ సినిమాగ్రౌండ్ జీరో - హిందీ మూవీభోల్ చుక్ మాఫ్ - హిందీ సినిమాఅంటిల్ డాన్ - ఇంగ్లీష్ మూవీగుల్కండ్ - మరాఠీ సినిమాపారిస్ ఇన్ బాలీ - ఇండోనేసియన్ మూవీద అకౌంటెంట్ 2 - తెలుగు డబ్బింగ్ సినిమాహాట్స్టార్దేవిక & డానీ - తెలుగు సిరీస్గెట్ ఎవే - ఇంగ్లీష్ మూవీఫినీస్ అండ్ ఫెర్బ్ సీజన్ 5 - ఇంగ్లీష్ సిరీస్ప్రిడేటర్: కిల్లర్ ఆఫ్ కిల్లర్స్ - ఇంగ్లీష్ సినిమావై 2 కే - ఇంగ్లీష్ మూవీనెట్ఫ్లిక్స్కె.ఓ - ఇంగ్లీష్ సినిమామెర్సీ ఫర్ నన్ - కొరియన్ సిరీస్స్ట్రా - ఇంగ్లీష్ మూవీద సర్వైవర్స్ - ఇంగ్లీష్ సిరీస్గోల్డెన్ సిక్స్టీన్స్ సీజన్ 1 - జపనీస్ రియాలిటీ షోజాట్ - తెలుగు సినిమాజీ5ఛల్ కపట్ - హిందీ సిరీస్సన్ నెక్స్ట్లాల్ సలామ్ - తెలుగు డబ్బింగ్ సినిమాజిగేల్ - తెలుగు మూవీఆహావడక్కన్ - తెలుగు డబ్బింగ్ మూవీఒక యుమడి ప్రేమకథ - తెలుగు డబ్బింగ్ సినిమాలయన్స్ గేట్ ప్లేచౌర్య పాఠం - తెలుగు సినిమాకోడ్ 8 - ఇంగ్లీష్ మూవీహై ఫోర్సెస్ - చైనీస్ సినిమాఎమ్ఎక్స్ ప్లేయర్లఫంగే - హిందీ సిరీస్బుక్ మై షోద లాస్ట్ విష్ - తెలుగు డబ్బింగ్ మూవీమనోరమ మ్యాక్స్పట్త్ - మలయాళ సినిమా(ఇదీ చదవండి: అక్కినేని అఖిల్ వివాహం.. హాజరైన చిరంజీవి ఫ్యామిలీ) -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హిట్ బొమ్మ.. ఎక్కడంటే?
సామజవరగమన, ఓం భీమ్ బుష్, స్వాగ్ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న శ్రీవిష్ణు (Sree Vishnu).. ఈ ఏడాది సింగిల్తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. కామెడీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రాగా.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్సే రాబట్టింది. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ మూవీలో కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు.అల్లు అరవింద్ సమర్పణలో విద్య కొప్పినీడి, రియాజ్ చౌదరి, భాను ప్రతాప్ సంయుక్తంగా నిర్మించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించాడు. తాజాగా ఈ మూవీ సడన్గా ఓటీటీలోకి వచ్చేసింది. నేటి (జూన్ 6) నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతోంది. అయితే ఇక్కడ మరో సర్ప్రైజ్ ఉంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సింగిల్ అందుబాటులోకి రావడం విశేషం.సింగిల్ సినిమా కథేంటంటే?విజయ్ (శ్రీ విష్ణు) ఓ బ్యాంకులో పని చేస్తుంటాడు. 30 ఏళ్లు దాటినా సింగిల్గానే ఉంటాడు. ఓసారి మెట్రో రైలులో పూర్వ (కేతిక శర్మ)ను చూసి ప్రేమలో పడతాడు. స్నేహితుడు అరవింద్ (వెన్నెల కిశోర్) సాయంతో ఆమెను ఇంప్రెస్ చేసేందుకు రకరకాల ప్లాన్స్ వేస్తాడు. అదే సమయంలో విజయ్ జీవితంలో హరిణి (ఇవానా) వస్తుంది. పూర్వను పడేసేందుకు విజయ్ ఏమేం చేస్తాడో హరిణి కూడా అవన్నీ చేస్తుంది. అతడు ఛీ కొట్టినా అతడి వెనకాలే తిరుగుతుంది. అసలు విజయ్ ప్రేమను పూర్వ అంగీకరించిందా? లేదంటే హరిణి ప్రేమకు పడిపోతాడా? అదీకాక సింగిల్గానే మిగిలిపోయాడా? అన్నది తెలియాలంటే ఓటీటీలో సింగిల్ (Single Movie) చూడాల్సిందే!చదవండి: అక్కినేని అఖిల్ వివాహం.. హాజరైన చిరంజీవి ఫ్యామిలీ -
టూర్ బాగా జరిగిందా..?
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ‘టూరిస్ట్ ఫ్యామిలీ’(Tourist Family) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.మన ఇరుగు పొరుగు ఎవరున్నారో, ఏం చేస్తున్నారో అని తెలుసుకునే అవకాశం, తీరిక లేని బిజీ రోజుల్లో గడుపుతున్నాం. మన పొరుగింట్లో దొంగ దూరినా లేదా దొర వచ్చినా మనకు తెలిసే సమయానికి తెల్లారిపోతుంది. కానీ అదే ఇరుగు పొరుగు వారి కోసం ఓ కాలనీ వాళ్ళు ఏం చేశారన్నదే ఈ ‘టూరిస్ట్ ఫ్యామిలీ’(Tourist Family) సినిమా. జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాకు ప్రముఖుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణ కూడా బాగా దక్కింది. మరీ ముఖ్యంగా మన ప్రపంచ స్థాయి దర్శక జక్కన్న రాజమౌళి ఈ సినిమాని ప్రశంసించడం విశేషం. అంతలా ఏముందీ సినిమాలో ఓసారి చూద్దాం.శ్రీలంక దేశం నుండి ధర్మాన దాస్ కుటుంబం అక్రమంగా సముద్ర మార్గాన భారత్లోని తమిళనాడు తీర ప్రాంతానికి చేరుకుంటుంది. ధర్మాన దాస్ సతీమణి వాసంతి. వాళ్ళకిద్దరు పిల్లలు నితూషన్, ముల్లి. శ్రీలంకలో సంక్షోభం వల్ల భారత్లో సంపాదించడానికి వాసంతి సోదరుడు ప్రకాశ్ సహాయంతో కుటుంబం అంతా రామేశ్వరానికి వస్తారు. అదే ఊర్లో ఉన్న కేశవనగర్ కాలనీలో ఓ ఇంట్లోకి అద్దెకి చేరతారు. ఆ కాలనీ చాలా విచిత్రమైనది. ఎవ్వరి మార్గం వాళ్ళది అన్నట్టుగా ఉంటారు. ధర్మాన దాస్ తమ శ్రీలంక ఉనికి ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడుతుంటాడు. ఈ లోపల అదే ఊరిలోని ఓ చెత్త కుప్పలో భారీ బాంబు పేలుడు సంభవిస్తుంది. అంతకుముందే ధర్మాన దాస్ ఆ చెత్త తొట్టిలో తాము తిన్న పదార్థాల కవర్ వేస్తాడు. అది కాస్తా సీసీ టీవీలో రికార్డు అవుతుంది. దాంతోపోలీసులు ధర్మాన దాస్ కుటుంబం కోసం గాలిస్తుంటారు. ఓ పక్క తమ శ్రీలంక ఐడెంటీటీ ఇతరులకు తెలియనివ్వకుండా, మరో పక్క ఈపోలీస్ కేసును దర్మాన దాస్ కుటుంబం ఎలా ఎదుర్కొంటుందో ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమాలోనే చూడాలి. ఈ సినిమా ఓ ఫ్యామిలీ ఓరియంటెడ్ కామెడీ థ్రిల్లర్ అని చెప్పవచ్చు.ఈ సినిమాకి మూల కథ రాసుకుని అభిషన్ జీవింత్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నటుడు శశికుమార్ హీరో పాత్రలో నటించగా, ప్రముఖ నటి సిమ్రాన్ హీరోయిన్గా నటించి అలరించారు. ముఖ్యంగా ధర్మాన దాస్ చిన్న కొడుకు ముల్లి పెట్టే గిలిగింతలు మామూలుగా ఉండవు. సినిమా మంచి ఎంటర్టైనర్. హాట్ స్టార్లో తెలుగులోనూ లభ్యమవుతోంది. ఇంకెందుకు ఆలస్యం... ఈ ‘టూరిస్ట్ ఫ్యామిలీ’తో ఈ వారం టూర్కి వెళ్ళండి. – హరికృష్ణ ఇంటూరు -
ఓటీటీలో భారీ యాక్షన్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
హాలీవుడ్ భారీ యాక్షన్ మూవీ 'ది అకౌంటెంట్ 2' ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. 2016లో విడుదలైన అకౌంటెంట్ మూవీకి సిక్వెల్గా పార్ట్ 2 చిత్రాన్ని దర్శకుడు గావిన్ ఓ'కానర్ తెరకెక్కించారు. ఈ ఏడాది ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద రూ. 850 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఆపై ఎమ్డీబీలో 7 రేటింగ్ సాధించింది. బెన్ అఫ్లెక్, జోన్ బెర్నాల్, సింథియా అడ్డై-రాబిన్సన్, J. K. సిమన్స్ వంటి హాలీవుడ్ స్టార్స్ నటించారు.అకౌంటెంట్ 2 మూవీ అమెజాన్ ప్రైమ్లో జూన్ 5నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇంగ్లీష్తో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలైంది. భారీ యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుందని చెప్పవచ్చు. ఇంగ్లీష్ వర్షన్తో తెలుగు సబ్టైటిల్స్లో కూడా చూడవచ్చు. అత్యంత భారీ బడ్జెట్తో అమెజాన్ MGM స్టూడియోస్ (యునైటెడ్ స్టేట్స్), వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. -
మరో ఓటీటీకి వచ్చేస్తోన్న థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్!
ఓటీటీల్లో థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టపడని వారు దాదాపు ఉండరు. ముఖ్యంగా హారర్ మూవీలకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి వారికోసమే మరో సూపర్ హిట్ థ్రిల్లర్ వచ్చేస్తోంది. మలయాళంలో ఇప్పటికే అభిమానులను మెప్పించిన చిత్రం వడక్కన్. ఈ సూపర్ థ్రిల్లర్ మూవీ మార్చి 7, 2025న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ కిశోర్, శృతి మీనన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సజీద్ ఎ దర్శకత్వం వహించారు.ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలోనూ సందడి చేస్తోంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కేవలం మలయాళం, కన్నడ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే తాజాగా ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు.ఈ శుక్రవారం అంటే జూన్ 6వ తేదీ నుంచి నుంచి ఆహాలో స్ట్రీమింగ్కు రానుంది. ఆహాలో తెలుగు, తమిళం భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఇక కథ విషయానికొస్తే అతీంద్రీయ శక్తుల గురించి శోధించే ఇద్దరు వ్యక్తులు కేరళలోని ఓ చోట జరిగిన కొన్ని అంతు చిక్కని మరణాల గురించి తెలుసుకోవడానికి వస్తారు. అక్కడ వాళ్లకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అన్నదే వడక్కన్ స్టోరీ. Mattrum oru thriller🔥🔥on the way makkaley😉#Vadakkan premieres from June6 on @ahatamil @OffbeetStudios #Vadakkanonaha #ahatamil pic.twitter.com/OAobkRgUyB— aha Tamil (@ahatamil) June 3, 2025 -
ఆరేళ్ల తర్వాత ఓటీటీకి దుల్కర్ సల్మాన్ సినిమా.. ఎక్కడ చూడాలంటే?
గతేడాది లక్కీ భాస్కర్తో సూపర్ హిట్ కొట్టిన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన చిత్రం 'ఓరు యమండన్ ప్రేమకథ'. ఈ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్కు బీసీ నౌఫల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. 2019లో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మలయాళంలో అప్పట్లో సూపర్ హిట్గా నిలిచింది.తాజాగా ఈ మూవీని తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసింది. ఈ రోజు నుంచే ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో ఒక యముడి ప్రేమకథ టైటిల్తో ఓటీటీలో రిలీజ్ చేశారు. అయితే దాదాపు ఆరేళ్ల తర్వాత రావడంతో ఓటీటీ ప్రియులు ఆదరిస్తారో లేదో వేచి చూడాల్సిందే. -
ఓటీటీకి వచ్చేసిన రూ.120 కోట్ల సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్!
తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమా జాట్. ఈ సినిమాలో సన్నీ డియోల్ హీరోగా టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించారు. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ 'జాట్' ఏప్రిల్ 10న విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ను సొంతం చేసుకుంది. ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. రూ. 100 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన జాట్.. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.120 కోట్ల వరకు రాబట్టింది.తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేసింది. హిందీతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో రణదీప్ హుడా విలన్గా మెప్పించగా.. వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు.జాట్ అసలు కథేంటంటే..?ఆంధ్రప్రదేశ్లోని మోటుపల్లి గ్రామానికి దాదా రణతుంగ (రణ్దీప్ హుడా) శ్రీలంక నుంచి వస్తాడు. తన తమ్ముడితో కలిసి ఆ గ్రామంలో చేసే అరాచకాలు చాలా దారుణంగా ఉంటాయి. అయితే, అనుకోకుండా అదే ఊరి మీదుగా వెళ్తున్న రైలు సాంకేతిక లోపం కారణంగా అక్కడ ఆగిపోతుంది. అందులో ప్రయాణిస్తున్న జాట్ (సన్నీ డియోల్)కు ఆకలి వేయడంతో దగ్గరలో ఉన్న హోటల్కు వెళ్లి ఇడ్లీ తింటున్న సమయంలో కొందరు రౌడీ మూకలు అక్కడికి చేరుకుని హల్చల్ చేస్తారు. ఆ సమయంలో తన ప్లేటు నుంచి ఇండ్లీ కిందపడిపోతుంది. ఈ క్రమంలో వారిని సారీ చెప్పమని కోరుతాడు జాట్. కానీ, వారు మాత్రం గొడవకు దిగుతారు. అలా ఒక భారీ ఫైట్తో జాట్ రెచ్చిపోతాడు. ఈ విషయం కాస్త రణతుంగ వద్దకు చేరడంతో జాట్ గురించి ఆరా తీస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది..? రణతుంగను చూశాక జాట్కు తెలిసిన నిజం ఏంటి..? వారిద్దరి మధ్య గతంలో ఉన్న లింకేంటి..? రణతుంగపై ఎందుకు పోరుకు దిగుతాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.Don't fear, Jaat is finally here 💥 Iske jaisa na kabhi hua hai, na kabhi hoga 🔥💪Watch Jaat, out now in Hindi and Telugu on Netflix.#JaatOnNetflix pic.twitter.com/3IBxy7QNhi— Netflix India (@NetflixIndia) June 5, 2025 -
సడన్గా ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా అలా 20కి పైగా మూవీస్-సిరీస్లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో రజనీకాంత్ 'లాల్ సలామ్', సన్నీ డియోల్ 'జాట్' చిత్రాలు కాస్త చెప్పుకోదగ్గవిగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు వీటితో పాటు కొన్ని సడన్ సర్ప్రైజ్ అన్నట్లు డేట్ లాక్ చేసుకుంటున్నాయి. అలాంటి ఓ తెలుగు సినిమా దాదాపు మూడు నెలల తర్వాత ఓటీటీ రిలీజ్కి సిద్ధమైంది. ఇంతకీ ఏంటా మూవీ? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన 'టూరిస్ట్ ఫ్యామిలీ' తెలుగు రివ్యూ)తెలుగు, తమిళంలో సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న త్రిగుణ్.. అప్పుడప్పుడు హీరోగానూ పలు చిత్రాల్లో నటించారు. అలానే 'జిగేల్' అనే మూవీ.. ఈ మార్చి తొలివారంలో థియేటర్లలోకి వచ్చింది. పెద్దగా పేరున్న నటీనటులు లేకపోవడంతో ఎలా వచ్చిందో అలా కనుమరుగైపోయింది. ఇప్పుడు మూడు నెలల తర్వాత సన్ నెక్స్ట్ ఓటీటీలోకి రాబోతుందని ప్రకటించారు.జూన్ 5నుంచి అంటే రేపటి(గురువారం) నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో 'జిగేల్' మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ చిత్రం విషయానికొస్తే.. చిన్న చిన్న దొంగతనాలు చేసే ఓ ప్రేమ జంట కథతో ఈ మూవీ తెరకెక్కించారు. లాకర్లని చాకచక్యంగా తెరిచే టాలెంట్ ఉన్న నందు(త్రిగుణ్).. మీనా(మేఘా చౌదరి)తో ప్రేమలో పడతాడు. ఆమె కూడా చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటుంది. ఈ ఇద్దరూ కలిసి రాజాచంద్ర వర్మ ప్యాలెస్లో పాతకాలం నాటి లాకర్పై కన్నేస్తారు. ఈ క్రమంలో మీనా.. జేపీ(షాయాజీ షిండే) దగ్గర పీఏగా చేరుతుంది. మరి నందు-మీనా.. ఆ లాకర్ కొట్టేశారా? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి కొత్త సినిమా) -
ఓటీటీలో కోర్ట్ థ్రిల్లర్ 'గుడ్ వైఫ్'
కొన్నాళ్ల ముందు వరకు ప్రియమణి.. దక్షిణాది భాషల్లో హీరోయిన్ మాత్రమే. ఎప్పుడైతే 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ చేసిందో ఈమె దశ తిరిగిపోయింది. అటు ఓటీటీల్లో సినిమాలు,సిరీస్లు చేస్తూ మరోవైపు రెగ్యులర్ మూవీస్లోనూ ప్రధాన పాత్రలు చేస్తూ అలరిస్తోంది. ఇప్పుడు ఈమె కీ రోల్ చేస్తున్న కోర్ట్ థ్రిల్లర్ సిరీస్ని ప్రకటించారు. ఇంతకీ ఈ సిరీస్ సంగతేంటి? ఎందులో రాబోతుంది?(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి కొత్త సినిమా)ప్రియమణి, సంపత్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సిరీస్ 'గుడ్ వైఫ్'. అమెరికన్ సిరీస్ 'గుడ్ వైఫ్' అదే పేరుతో ఇక్కడ రీమేక్ చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతానికి డేట్ ప్రకటించలేదు గానీ త్వరలో హాట్ స్టార్లోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా పోస్టర్ రిలీజ్ చేశారు.'గుడ్ వైఫ్' సిరీస్ విషయానికొస్తే.. సెక్స్ కుంభకోణంలో చిక్కుకున్న భర్తని రక్షించుకునేందుకు ఓ మాజీ మహిళ లాయర్ ఏం చేసింది? అనేదే స్టోరీ పాయింట్. ఇందులో ప్రియమణి లాయర్గా కనిపించనుండగా.. ఆమె భర్త పాత్రలో సంపత్ రాజ్ నటించారు. వీళ్లకు ఓ కొడుకు, కూతురు కూడా ఉన్నట్లు పోస్టర్లో చూపించారు. త్వరలో ఇతర వివరాలు వెల్లడించనున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన 'టూరిస్ట్ ఫ్యామిలీ' తెలుగు రివ్యూ) -
OTT: టామ్ క్రూజ్ ‘మిషన్ ఇంపాజిబుల్–ది ఫైనల్ రికనింగ్’ రివ్యూ
హాలీవుడ్ సిరీస్లలో ‘మిషన్ ఇంపాజిబుల్’కి ప్రత్యేక క్రేజ్ ఉంది. ఈ సిరీస్లో ఎనిమిదో భాగం మిషన్ ఇంపాజిబుల్–ది ఫైనల్ రికనింగ్ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. ఓ సీరియల్ను ప్రేక్షకులకు అలవాటుగా మార్చడం కొంచెం సులభం. కానీ అదే కథను సిరీస్ రూపంలో సినిమాలుగా చేస్తూ ప్రేక్షకులను మెప్పించడం మాత్రం కాస్త కష్టమనే చెప్పాలి. ఆ విషయంలో పాశ్చాత్య సిరీస్లు చాలావరకు విజయం సాధించాయి. అది కూడా పాతికేళ్ళకు పైగా ఒకే సిరీస్లో సినిమాలు నడపడమంటే మాటలా... ఇంపాజిబుల్. కానీ ఆ ఇంపాజిబుల్ టాస్క్ని పాజిబుల్ చేసి, ప్రేక్షకులను అలరిస్తున్న సిరీస్ ‘మిషన్ ఇంపాజిబుల్’. ఇటీవల ఈ హాలీవుడ్ సిరీస్లో 8వ సినిమాగా రిలీజ్ అయిన ‘మిషన్ ఇంపాజిబుల్–ది ఫైనల్ రికనింగ్’ సూపర్ అనే చెప్పాలి. క్రిస్టోఫర్ మెక్ క్వారీ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈసారి కథానాయకుడైన ఇథన్ హంట్ స్టంట్స్ అదరహో అనేలా ఉన్నాయి. సిరీస్లోని అన్ని సినిమాలలో ఇథన్ హంట్ పాత్రలో ప్రముఖ హాలీవుడ్ కథానాయకుడు టామ్ క్రూజ్ నటించారు. ఆయన నిజమైన సూపర్ స్టంట్స్తో ఆకట్టుకుంటారు. అందుకే ఈ సిరీస్ అంత స్పెషల్. ముఖ్యంగా ఎనిమిదో భాగంలో వచ్చే రెండు స్టంట్ ఎపిసోడ్లలో ప్రేక్షకులకు మతి పోతుందనే చెప్పాలి. సిరీస్ మొత్తం ఒకే పరమైన కథాంశంతో ఉంటుంది. కథానాయకుడు తన టీమ్తో కలిసి ప్రపంచాన్ని రక్షించడానికి విలువైన డాక్యుమెంట్లు, ఆయుధాలు శత్రువుల చేతుల్లోకి వెళ్ళకుండా చూడడమే మిషన్ ఇంపాజిబుల్. సిరీస్ మొదటినుంచి ఒకే టీమ్ను మెయింటైన్ చేస్తూ ఈ సినిమాలో మాత్రం టీమ్లోని ఓ మెంబరైన లూథర్ పాత్రను చంపేశారు. అదే ఆడియన్స్ను కొంచెం ఆలోచనలో పడేస్తుంది. ఓవరాల్గా ‘మిషన్ ఇంపాజిబుల్–ది ఫైనల్ రికనింగ్’ సినిమా యాక్షన్ థ్రిల్లర్ను ఇష్టపడేవాళ్ళకి... అలాగే ఈ సిరీస్ను ఫాలో అయ్యేవాళ్ళకు విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి. సో... ‘ఎంజాయ్ మిషన్ ఇంపాజిబుల్–ది ఫైనల్ రికనింగ్’ ఇన్ థియేటర్స్. – హరికృష్ణ ఇంటూరు -
థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి కొత్త సినిమా
ఇప్పుడంతా ఓటీటీల జమానా నడుస్తోంది. వీళ్లు చెప్పిందే రాజ్యం అన్నట్లు నడుస్తోంది. కొత్త మూవీస్ ఎప్పుడు రిలీజ్ కావాలి? ఎప్పుడు ఓటీటీలో అందుబాటులోకి రావాలనేది సదరు సంస్థలు డిసైడ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఓ సినిమా విషయంలో అలానే జరిగినట్లు తెలుస్తోంది. థియేటర్లలో ఉండగానే స్ట్రీమింగ్లోకి తీసుకొచ్చేస్తున్నారట. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులోకి రానుంది?రాజ్ కుమార్ రావ్, వామికా గబ్బి హీరోహీరోయిన్లుగా నటించిన హిందీ సినిమా 'భోల్ చుక్ మాఫ్'. లెక్క ప్రకారం ఈ మూవీ గత నెల తొలి వారంలో రిలీజ్ కావాల్సింది. కానీ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో మే 16 నుంచి స్ట్రీమింగ్ చేస్తామని సడన్గా ప్రకటించారు. దీంతో ప్రముఖ మల్టీప్లెక్ సంస్థ.. కోర్టుని ఆశ్రయించింది. రూ.60 కోట్ల మేర దావా వేసింది. దీంతో నిర్మాతలు దిగిరాక తప్పలేదు. అలానే మే 23న థియేటర్లలో సినిమాను రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: కురచ దుస్తులపై కామెంట్స్.. సురేఖావాణి ఏమందంటే?)విడుదలై రెండు వారాలు కూడా కాలేదు. అప్పుడే 'భోల్ చుక్ మాఫ్' సినిమాని అమెజాన్ ప్రైమ్లోకి తీసుకొచ్చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. జూన్ 6 నుంచి అంటే ఈ వీకెండ్లో సినిమా ఓటీటీ ప్రేక్షకుల కోసం అందుబాటులోకి రానుందని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే గనక థియేటర్లలో ఉండగానే సినిమా.. డిజిటల్గా అందుబాటులోకి వచ్చేస్తున్నట్లే.భోల్ చుక్ మాఫ్ విషయానికొస్తే.. వారణాసిలో ఉండే రంజన్(రాజ్ కుమార్ రావ్).. టిట్లీ(వామికా గబ్బీ)ని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతాడు. కానీ శివుడికి ఇచ్చి మొక్కుని మరిచిపోతాడు. దీంతో టైమ్ లూప్లో చిక్కుకుని, పెళ్లికి ముందు జరిగే హల్దీ వేడుకకే మళ్లీ మళ్లీ వస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడే ఏం చేశాడనేదే మిగతా స్టోరీ. కామెడీని ఎంజాయ్ చేసే వాళ్లకు ఇదో టైమ్ పాస్ మూవీ అని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: మాజీ ప్రేమికులు మళ్లీ కలిశారు) -
రానా నాయుడు 2 ట్రైలర్ వచ్చేసింది
రానా నాయుడు 2 వెబ్ సిరీస్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇందులో వెంకటేష్, రానా దగ్గుబాటి నటిస్తున్నారు. ఇది అమెరికన్ క్రైమ్ డ్రామా సిరీస్ "రే డోనోవన్" (Ray Donovan) ఆధారంగా రూపొందించబడింది. గతేడాదిలో విడుదలైన రానా నాయుడు సిరీస్కు సీక్వెల్గా దీనిని రూపొందించారు. పార్ట్ 1కు మంచి ఆదరణ రావడంతో ఇప్పుడు సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. నెట్ఫ్లిక్స్ వేదికగా జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం వంటి భాషలలో విడుదల కానుంది. నాగా నాయుడి పాత్రలో వెంకటేష్ చాలా అద్భుతంగా మెప్పించాడు. తన కుటుంబం కోసం ఎంత వరకైనా వెళ్లే పవర్ఫుల్ వ్యక్తిగా ఆయన కనిపించనున్నారు. అయితే, పార్ట్ 1లో కాస్త బోల్డ్ కంటెంట్ ఉందని విమర్శలు రావడంతో సీక్వెల్ దానిని కాస్త తగ్గించారు. ప్రస్తుతం ట్రైలర్ కట్లో కూడా అలాంటి సీన్స్ లేవు. -
ఓటీటీలో 'జాట్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని(GopiChand malineni) బాలీవుడ్లోకి జాట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మెప్పించాడు. హీరో సన్నీ డియోల్తో(Sunny Deol) తెరకెక్కించిన 'జాట్' సినిమా ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. భారీ మాస్ యాక్షన్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఏప్రిల్ 10న విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో రణదీప్ హుడా విలన్గా మెప్పించగా.. వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కీలకపాత్రల్లో నటించారు. తమన్ సంగీతం అందించారు.బాలీవుడ్ను మెప్పించిన మాస్ యాక్షన్ సినిమా 'జాట్' జూన్ 6న ఓటీటీలోకి రానుంది. ఈమేరకు నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. అయితే, ప్రస్తుతం హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. త్వరలో తెలుగు వర్షన్ కూడా అందుబాటులోకి తీసుకురావచ్చని సమాచారం. రూ. 100 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన జాట్.. బాక్సాఫీస్ వద్ద టాక్ బాగున్నప్పటికీ పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. కేవలం రూ. 120 కోట్లు మాత్రమే రాబట్టినట్లు ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, జాట్ సినిమాతో బాలీవుడ్ మాస్ ప్రేక్షకుల పల్స్ను దర్శకుడు గోపీచంద్ మలినేని పట్టేసుకున్నాడు. అందుకే జాట్ చిత్రానికి సీక్వెల్ కూడా ఆయన ప్లాన్ చేస్తున్నాడు.కథేంటంటే..?ఆంధ్రప్రదేశ్లోని మోటుపల్లి గ్రామానికి దాదా రణతుంగ (రణ్దీప్ హుడా) శ్రీలంక నుంచి వస్తాడు. తన తమ్ముడితో కలిసి ఆ గ్రామంలో చేసే అరాచకాలు చాలా దారుణంగా ఉంటాయి. అయితే, అనుకోకుండా అదే ఊరి మీదుగా వెళ్తున్న రైలు సాంకేతిక లోపం కారణంగా అక్కడ ఆగిపోతుంది. అందులో ప్రయాణిస్తున్న జాట్ (సన్నీ డియోల్)కు ఆకలి వేయడంతో దగ్గరలో ఉన్న హోటల్కు వెళ్లి ఇడ్లీ తింటున్న సమయంలో కొందరు రౌడీ మూకలు అక్కడికి చేరుకుని హల్చల్ చేస్తారు. ఆ సమయంలో తన ప్లేటు నుంచి ఇండ్లీ కిందపడిపోతుంది. ఈ క్రమంలో వారిని సారీ చెప్పమని కోరుతాడు జాట్. కానీ, వారు మాత్రం గొడవకు దిగుతారు. అలా ఒక భారీ ఫైట్తో జాట్ రెచ్చిపోతాడు. ఈ విషయం కాస్త రణతుంగ వద్దకు చేరడంతో జాట్ గురించి ఆరా తీస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది..? రణతుంగను చూశాక జాట్కు తెలిసిన నిజం ఏంటి..? వారిద్దరి మధ్య గతంలో ఉన్న లింకేంటి..? రణతుంగపై ఎందుకు పోరుకు దిగుతాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. -
ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన సినిమా.. తెలుగు రివ్యూ
ఎప్పుడూ అదే థ్రిల్లర్, యాక్షన్ సినిమాలు చూసి చూసి బోర్ కొట్టేసిందా? కాసేపు మనసారా నవ్వుకుని, కాస్త ఫీల్ అవుదామని అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఓటీటీలోకి ఓ అద్భుతమైన సినిమా వచ్చేసింది. అదే 'టూరిస్ట్ ఫ్యామిలీ'. గత నెలలో తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన ఈ చిత్రం.. ఇప్పుడు హాట్స్టార్లోకి వచ్చేసింది. మరి అంతగా ఈ సినిమాలో ఏముంది? అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?శ్రీలంకకు చెందిన ధర్మదాస్ (శశికుమార్).. సొంత దేశంలో బతుకు కష్టమైపోవడంతో భార్య వాసంతి(సిమ్రన్), ఇద్దరు కొడుకులతో కలిసి మన దేశానికి అక్రమంగా వలస వస్తాడు. చెన్నైలోని ఓ కాలనీలో అద్దెకు దిగుతాడు. ఇతడికో బావమరిది (యోగిబాబు) సాయం చేస్తాడు. ఎవరితోనూ పెద్దగా మాడ్లడొద్దు, మీ గతం గురించి చెప్పొద్దని ధర్మదాస్కి సలహా ఇస్తాడు. కానీ ధర్మదాస్ కుటుంబం.. సదరు కాలనీ వాసులతో కలిసి పోతారు. తమ గురించి నిజం చెప్పేస్తారు. మరోవైపు రామేశ్వరం పోలీసులు.. ధర్మదాస్ కుటుంబం కోసం ఎందుకు వెతుకుతున్నారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?మనుషులు మంచోళ్లు.. అసలు మనుషులు అంటేనే మంచోళ్లు అని 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో డైలాగ్ ఉంటుంది. అలా మనుషుల్లో ఉండే మానవతా విలువలని తట్టి లేపే ప్రయత్నమే ఈ మూవీ. శ్రీలంక నుంచి అక్రమంగా మన దేశానికి వలస వచ్చిన ఓ కుటుంబం ఎన్ని ఇబ్బందులు పడింది? నిజం చెప్పినా సరే మనవాళ్లు వారికి ఎలా సహాయపడ్డారు. ఒకరికి ఒకరు ఎందుకు సాయం చేసుకోవాలి అనే అంశాల్ని మనసుకు హత్తుకునేలా ఈ చిత్రంలో చూపించడం విశేషం.శ్రీలంక నుంచి ధర్మదాస్ కుటుంబం.. ఓ పడవలో అక్రమంగా రామేశ్వరం వస్తారు. అక్కడ పోలీసులకు దొరికిపోతారు. కానీ ఎలాగోలా మేనేజ్ చేసి చెన్నైకి వచ్చేస్తారు. ఓ కాలనీలో అద్దెకు దిగాతారు. నిజానికి ఆ కాలనీలో పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా తెలియనంతంగా ఫాస్ట్ లైఫ్కి జనాలు అలవాటు పడిపోయి ఉంటారు. అలాంటి కాలనీలో ఉండేవాళ్లతో.. ధర్మదాస్ కుటుంబం ఎలా మార్పులు తీసుకొచ్చింది. అనేదే మిగతా స్టోరీ. సినిమా చూస్తున్నంతసేపు మనం కూడా ఆ ప్రపంచంలోకి వెళ్లిపోతాం.ఓవైపు సరదాగా సున్నితమైన హస్యంతో నవ్విస్తూనే, మరోవైపు గుండెని పిండేసే ఎమోషన్స్ ఈ సినిమాలో ఉంటాయి. చెప్పాలంటే హ్యుమర్ విత్ హ్యుమానిటీ అనే సరికొత్త జానర్ సినిమాలా అనిపిస్తుంది. ఈ రెండు అంశాల్ని మూవీలో బ్యాలెన్స్ చేసిన విధానం చూస్తే తెగ ముచ్చటేస్తుంది. సినిమాలో కొన్ని సీన్లు అయితే భలే కనెక్ట్ అవుతాయి. ఓ ముసలావిడ చనిపోతే కాలనీ అంతా ఒక్కటైన తీరు మనల్ని కంటతడి పెట్టేలా చేస్తుంది.తాను ప్రేమించిన అమ్మాయికి పెళ్లి అయిపోయిందని ధర్మదాస్ పెద్ద కొడుకు బాధపడుతుంటాడు. ఈ సీన్ చూస్తున్న మనకు కూడా అయ్యో అనిపిస్తుంది. వెంటనే చిన్న కొడుకు చేసే హంగామా వల్ల మొత్తం సీనే మారిపోయి ఫుల్ నవ్వొచ్చేస్తుంది. చర్చిలో అదే కాలనీకి చెందిన ఓ తాగుబోతు కుర్రాడు తన జీవితం గురించి చెప్పే సీన్ హైలెట్. ధర్మదాస్ పెద్ద కొడుకు, వాళ్ల ఇంటి యజమాని కూతురు మధ్య క్యూట్ ప్రపోజల్ సీన్కి యూత్ కచ్చితంగా కనెక్ట్ అవుతారు. రెండు గంటల సినిమానే కానీ చూస్తున్నంతసేపు అసలు సమయమే తెలియనంత వేగంగా అయిపోతుంది. ఇంకాసేపు ఉండుంటే బాగుండు అనిపిస్తుంది.ఎవరెలా చేశారు?ధర్మదాస్గా శశి కుమార్ సెటిల్డ్ యాక్టింగ్తో ఆకట్టుకున్నాడు. ఇతడి భార్యగా సిమ్రన్.. వాసంతి అనే పాత్రలో ఒదిగిపోయింది. వీళ్ల పెద్ద కొడుకు పాత్ర ఓకే. కానీ చిన్న కొడుకు మురళిగా చేసిన పిల్లాడైతే ఇరగదీశాడు. ఓ రకంగా సినిమాలో కామెడీ సీన్లన్నీ ఇతడి మీదే ఉంటాయి. కచ్చితంగా ఈ పాత్ర మీకు నచ్చేస్తుంది. మిగిలిన వారిలో తాగుబోతు కుర్రాడు, ఓ కుక్కపిల్ల.. ఇలా ప్రతి పాత్ర సినిమాలో కీలకమే. ఎవరూ తక్కువ కాదు ఎవరూ ఎక్కువ కాదు అనేలా జీవించేశారు.టెక్నికల్ విషయాలకొస్తే సినిమా అంతే ఓ కాలనీలో తీశారు. చూస్తున్నంతసేపు మనం కూడా అక్కడే ఉన్నామా అనేలా సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. మిగతా అన్నీ విభాగాలు తమ తమ పనిని పక్కాగా చేశాయి. చివరగా డైరెక్టర్ అభిషణ్ జీవింత్ గురించి చెప్పుకోవాలి. స్వతహాగా ఇతడో యూట్యూబర్. వయసులోనే చిన్నోడు. కానీ ఇలాంటి సినిమా తీసి అందరి మనసులు గెలుచుకున్నాడు. రాజమౌళి, నాని కూడా ఈ మూవీ చూసి మెచ్చకున్నారంటే మనోడి సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు.ఓటీటీలో 'టూరిస్ట్ ఫ్యామిలీ' తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది. మీ కుటుంబం అంతా కలిసి కచ్చితంగా సినిమా చూడండి. అస్సలు మిస్ కావొద్దు.-చందు డొంకాన -
ఓటీటీల్లో సినిమాల సందడి.. ఈ వారం ఏకంగా 22 చిత్రాలు!
చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. ఈ నెలలోనే పెద్ద సినిమాలన్నీ థియేటర్లకు క్యూ కడుతున్నాయి. ఈ వారం బాక్సాఫీస్ సందడి చేసే వాటిలో కమల్ హాసన్ థగ్ లైఫ్ ఒక్కటే కాస్తా బజ్ ఉన్న సినిమా. ఆ తర్వాత తెలుగులో వస్తోన్న శ్రీ శ్రీ రాజావారు, గ్యాంబ్లర్స్, బద్మాషులు లాంటి చిత్రాలు ఆసక్తిగా పెంచుతున్నాయి. బాలీవుడ్ నుంచి హౌస్ఫుల్-5 కూడా థియేటర్లలోకి వస్తోంది. ఈ ఐదు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి.అయితే ఈ వారం ఓటీటీల విషయానికొస్తే రజినీకాంత్ లాల్ సలామ్, జింఖానా, టూరిస్ట్ ఫ్యామిలీ లాంటి వచ్చేస్తున్నాయి. తెలుగులో తెరకెక్కించిన వెబ్ సిరీస్ దేవిక అండ్ డానీ వచ్చేస్తోంది. ఈ సిరీస్లో రీతూ వర్మ, సుబ్బరాజు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇవీ మినహయిస్తే ఓటీటీల్లో అంతగా చెప్పుకొదగ్గ సినిమాలేవీ రావడం లేదు. బాలీవుడ్, హాలీవుడ్తో పాటు దాదాపు 18 సినిమాలు, వెబ్ సిరీస్లు ఈ వారం ఓటీటీ ప్రియులను అలరించనున్నాయి. ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్..ది మార్టిషియన్- డాక్యుమెంటరీ చిత్రం- జూన్ 02క్రిమినల్ కోడ్- సీజన్ 4- జూన్ 04వన్ ఆఫ్ దెమ్ డేస్- (హాలీవుడ్ మూవీ) - జూన్ 04జిన్నీ అండ్ జార్జియా- సీజన్-3 - జూన్ 05టైర్స్ - సీజన్-2- జూన్ 05జాట్ (హిందీ మూవీ) - జూన్ 05 (రూమర్ డేట్)మెర్సీ ఫర్ నన్- హాలీవుడ్ మూవీ- జూన్ 06స్ట్రా- హాలీవుడ్ మూవీ- జూన్ 06ది సర్వైవర్స్- వెబ్ సిరీస్- జూన్ 06అమెజాన్ ప్రైమ్స్టోలెన్- జూన్ 04సన్ నెక్ట్స్లాల్ సలామ్- జూన్ 06జియో హాట్స్టార్టూరిస్ట్ ఫ్యామిలీ(తమిళ మూవీ)- జూన్ 02గజానా (హిందీ) - జూన్ 02దేవిక అండ్ డానీ- (తెలుగు వెబ్ సిరీస్)- జూన్ 06జీ5చాట్ కపట్- ది డిసెప్షన్ (హిందీ)- జూన్ 06సోనీ లివ్..అల్లప్పుజా జింఖానా- జూన్ 05మహారాణి- సీజన్-4- జూన్ 06లయన్స్గేట్ ప్లేరెడ్-2- అడ్వంచర్ మూవీ- జూన్ 0612 స్ట్రాంగ్- హాలీవుడ్ మూవీ- జూన్ 06హై ఫోర్సెస్- హాలీవుడ్ మూవీ- జూన్ 06కోడ్ 8- హాలీవుడ్ మూవీ- జూన్ 06యాపిల్ టీవీ ప్లస్స్టిక్- కామెడీ వెబ్ సిరీస్- జూన్ 04 -
ఓటీటీలో టాప్ వెబ్ సిరీస్.. ఫైనల్లీ గుడ్ న్యూస్
గత నాలుగైదేళ్లుగా ఓటీటీల వాడకం చాలా పెరిగిపోయింది. అన్ని భాషల సినిమాలు, వెబ్ సిరీసులు తెగ చూసేస్తున్నారు. మూవీస్ సంగతి కాసేపు పక్కనబెడితే ఇంగ్లీష్లో అదిరిపోయే సిరీసులు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి 'స్ట్రేంజర్ థింగ్స్'. నెట్ఫ్లిక్స్ అంటే గుర్తొచ్చే సిరీస్ల్లో ఇది కచ్చితంగా టాప్లో ఉంటుంది. దీనికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్నారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పేశారు.ఇప్పటివరకు 'స్ట్రేంజర్ థింగ్స్' నుంచి నాలుగు సీజన్లు రిలీజయ్యాయి. ఇవి వేటికవే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకున్నాయి. చివరగా 2022లో నాలుగో సీజన్ వచ్చింది. అప్పటినుంచి ఐదో సీజన్ ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ వెయిటింగ్. కొన్నాళ్ల క్రితం 2025లోనే వస్తుందని అన్నారు గానీ డేట్ ప్రకటించారు. ఇప్పుడు ఆ విషయమై క్లారిటీ ఇచ్చేశారు.(ఇదీ చదవండి: శ్రీలీల పెళ్లి కాదు.. అసలు నిజం ఇది)ఐదో సీజన్ని మూడు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నారు. నవంబర్ 26న 'వాల్యూమ్ 1', క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న 'వాల్యూమ్ 2', న్యూఇయర్ కానుకగా జనవరి 1న 'ఫైనల్ ఎపిసోడ్' స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఈ క్రమంలోనే ఓ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో పాత్రధారుల లుక్, సీన్స్ ఆసక్తి కలిగించేలా ఉన్నా.యి.'స్ట్రేంజర్ థింగ్స్' విషయానికొస్తే.. అమెరికాలోని హాకిన్స్ అనే ఓ ఊరిలో నలుగురు పిల్లలు స్నేహితులుగా ఉంటారు. ఓరోజు అనుకోకుండా అతీంద్రయ శక్తులున్న ఎలెవన్ అనే అమ్మాయి వీళ్ల దగ్గరకొస్తుంది. ఈమె రాకతో సదరు ఊరిలో ఎలాంటి వింతలు, విడ్డూరాలు జరిగాయి? ఏమైందనేదే సింపుల్గా స్టోరీ. చూడటానికి చిన్నపిల్లలా సినిమాల ఉంటుంది గానీ విజువల్స్, స్టోరీ అన్నీ టాప్ నాచ్ ఉంటాయి.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు) -
ఓటీటీలోకి సమంత ‘శుభం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సమంత నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం శుభం(Subham). ఇటీవల థియేటర్లో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ మూవీలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి నటించారు. మే 09న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీకి తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ సినిమాలో సమంత అతిథి పాత్రలో మెరిసింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ నెల 13 నుంచి జియో హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓటీటీ సంస్థ పోస్టర్ను షేర్ చేసింది. శుభం కథేంటంటే..వైజాగ్లోని భీమిలీపట్నంలో నివసించే ముగ్గురు యువజంటల కథ ఇది. శ్రీను(హర్షిత్రెడ్డి)‘మన టౌన్ కేబుల్ టీవీ’ ఆపరేటర్. అతని స్నేహితులు(గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరీ)లకు అల్రేడీ పెళ్లి అయిపోతుంది. భార్యలను ఫరిదా, గాయత్రి(శ్రావణి లక్ష్మి, శాలిని కొండెపూడి) చెప్పుచేతల్లో పెట్టుకోవడమే కాకుండా.. బ్యాచిలర్ అయిన శ్రీనుకి కూడా అదే విషయాన్ని ఎక్కిస్తారు. శ్రీనుకి అదే ప్రాంతానికి చెందిన శ్రీవల్లీ(శ్రియ కొంతం)తో పెళ్లి జరుగుతుంది. స్నేహితులు చెప్పిన మాటలతో పెళ్లాన్ని హద్దుల్లో పెట్టుకోవాలని శ్రీను కూడా డిసైడ్ అయిపోతాడు. ఫస్ట్నైట్ రోజు శ్రీవల్లీ శోభనం గదిలోకి రాగానే అసలు ట్విస్ట్ మెదలవుతుంది. రాత్రి 9గంటలు కాగనే శ్రీవల్లి టీవీ ఆన్ చేసి ‘జన్మజన్మల బంధం’ సీరియల్ చూస్తుంది.ఈ టైంలో సీరియల్ చూడడం ఏంటని శ్రీను అడిగితే..దెయ్యం పట్టినట్లుగా ప్రవర్తిస్తుంది. మరుసటి రోజు కూడా ఇలానే వింతగా ప్రవర్తిసుంది. ఇది తన ఒక్కడి సమస్యే అనుకుంటాడు. కానీ తన స్నేహితులిద్దరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నట్లు తర్వాత తెలుసుకుంటాడు. ఈ ముగ్గురు మాత్రమే కాదు.. ఊరు మొత్తం ఇదే సమస్య ఉందనే విషయం బయటపడుతుంది. అసలు ఆ సీరియల్కి ఊర్లోని ఆడవాళ్లకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? సీరియల్ టైం కాగానే ఎందుకు వాళ్లు దెయ్యం పట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు? మాతాజీ మాయ(సమంత) వాళ్ల సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపింది? అనేది తెలియాలంటే ‘శుభం’ సినిమా చూడాల్సిందే. This June 13th, katha aarambham on JioHotstar 💫 Chacchina choodalsindhe 👀 #SubhamOnJioHotstar #Subham @Samanthaprabhu2 @TralalaPictures #JioHotstar pic.twitter.com/If7zN9utiY— JioHotstar Telugu (@JioHotstarTel_) June 1, 2025 -
ప్రాణాలతో చెలగాటమాడే గేమ్.. ఫైనల్ సీజన్ ట్రైలర్ చూశారా?
ఈ రోజుల్లో డబ్బు ఎలా సంపాదించాలన్న దానికన్నా ఎలాగోలా సొంతం చేసుకోవాలన్న ఆశే ఎక్కువవుతోంది. ఇందుకోసం అడ్డదారులు తొక్కేవారు కొందరైతే అత్యాశకు పోయి ఉన్నది పోగొట్టుకునేవాళ్లు మరికొందరు. ఈ డబ్బు కోసం ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. డబ్బు మనిషి ఆలోచనలను ఎలా ప్రభావితం చేస్తుంది? డబ్బు కోసం మనిషి ఎంతదూరం వెళ్తాడన్న అంశంపై తెరకెక్కిన సిరీస్ స్క్విడ్ గేమ్.ప్రాణాంతక గేమ్ఈ సిరీస్ ప్రపంచాన్నే ఓ ఊపు ఊపేసింది. గేమ్లో గెలిస్తే చాలు.. కలలో కూడా ఊహించలేనంత డబ్బు మీ సొంతం అనడంతో వందలాది మంది గేమ్ ఆడేందుకు వెళ్తారు. తీరా అక్కడికి వెళ్లాక గేమ్లో ఓడినవారి ప్రాణాలు తీస్తారు. తమ గెలుపు కోసం కొందరు ప్లేయర్స్ పక్కవారి ప్రాణాలు తీయడానికీ వెనకాడరు. చివరకు ఒకే ఒక్కరు విజేతగా నిలిచి డబ్బు గెలుచుకుంటారు. అలా ప్లేయర్ 456 ఓసారి గేమ్లో గెలిచి కోట్లాది ధనం పొందుతాడు. కోట్లు గెలిచినా దక్కని సంతోషంకానీ అందరి చావులను కళ్లారా చూసిన అతడికి ఆ విజయం సంతోషాన్నివ్వకపోగా మరింత బాధపడతాడు. అమాయకుల ప్రాణాలు బలితీసుకుంటున్న ఈ ఆటకు ఎలాగైనా ముగింపు పలకాలని మరోసారి గేమ్లో అడుగుపెడతాడు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుండగా రెండో సీజన్ ముగుస్తుంది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు మూడో సీజన్ వచ్చేస్తోంది. జూన్ 27న నెట్ఫ్లిక్స్లో ఈ ఫైనల్ సీజన్ ప్రసారం కానుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు.ఆటకు ముగింపు?ఫస్ట్ సీజన్లో రెడ్ లైట్- గ్రీన్ లైట్ అని గేమ్ ఆడించిన ఓ బొమ్మను మరోసారి ఈ సీజన్లో ప్రవేశపెట్టారు. ఈ సారి గేమ్ మరింత క్రూరంగా ఉండనున్నట్లు కనిపిస్తోంది. ప్లేయర్ 456.. పాశవికమైన ఆట ఆడిస్తున్న వ్యక్తిని నేరుగా కలిసినట్లు చూపించారు. మరి అతడు ఈ ఆటను ఆపగలిగాడా? లేదా? అనేది తెలియాలంటే ఈ నెలాఖరులో స్క్విడ్ గేమ్ చివరి సీజన్ చూసేయాల్సిందే! చదవండి: కుమారుడి కోసం కలిసొచ్చిన ధనుష్-ఐశ్వర్య.. రజనీ ఏమన్నారంటే? -
ఓటీటీలో అదరగొడుతున్న చిన్న సినిమా
చిన్న చిత్రాలకు ఓటీటీలు వరంగా మారుతున్నాయి. థియేటర్స్లో ఆడని కొన్ని చిత్రాలు ఓటీటీలో మంచి విజయం సాధిస్తున్నాయి. బడా సినిమాలను పక్కకునెట్టి టాప్లో దూసుకెళ్తున్నాయి. అలా ఓటీటీలో అదరగొడుతున్న మరో చిన్న చిత్రమే ‘టుక్ టుక్’.తెలుగమ్మాయి శాన్వి మేఘన, ‘కోర్ట్’ఫేం హర్ష్ రోషన్, సలార్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ దేవ్, సోషల్ మీడియా ఫేమ్ స్టీవెన్ మధు, నిహాల్ కోదాటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ ఏడాది మార్చిలో థియేటర్లో విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది. ఇక ఇటీవల అమెజాన్ ప్రైమ్లోకి వచ్చిన ఈ చిత్రం..అక్కడ టాప్ వ్యూస్తో దూసుకెళ్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండ్ అవుతున్న టాప్ 10 చిత్రాల్లో టుక్ టుక్ మూడో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి 100 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. ఒక్క చిన్న చిత్రానికి ఈ స్థాయిలో వ్యూస్ రావడం గొప్ప విషయమే. వీక్షకులు ఈ సినిమాను అంతగా ఆదరించడమే కాకుండా, ప్రతి క్యారెక్టర్ను, ప్రతి నటుడి నటనను ప్రశంసిచడం సంతోషంగా ఉందని చిత్రబృందం పేర్కొంది. మంచి కంటెంట్తో వస్తే ఆదరణ ఉంటుందనే ఈ చిత్రం మరోసారి నిరూపించిందని అన్నారు.టుక్ టుక్ కథేంటి?ముగ్గురు టీనేజ్ కుర్రాళ్ళు(హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు) డబ్బుల కోసం వినాయకుడి విగ్రహం పెట్టి వినాయకచవితి చేస్తారు. ఆ ఊళ్ళో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ ఉండటం, నిమజ్జనానికి బండి దొరకకపోవడంతో ఈ ముగ్గురు కలిసి ఒక పాత స్కూటర్ ని ముగ్గురు కూర్చునే టుక్ టుక్ బండిలా తయారుచేస్తారు. ఆ బండిలోనే వినాయకుడి నిమజ్జనం ఊరేగింపు చేస్తారు. ఆ తెల్లారి నుంచి ఆ బండి దానంతట అదే ఆపరేట్ అవుతుండటంతో అందులో దేవుడు వచ్చాడు అనుకుంటారు. దీంతో స్కూటర్ లో దేవుడు ఉన్నాడు, ఏం అడిగినా హ్యాండిల్ అటు ఇటు ఊపి అవునా, కదా అని సమాధానాలు చెప్తాడు అని ఊళ్ళో ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించుకుంటారు.ఈ క్రమంలో ఆ స్కూటర్ లో ఉంది దేవుడు కాదు ఆత్మ అని తెలుస్తుంది. ఈ ముగ్గురు కుర్రాళ్ళని కాస్త భయపెడుతుంది కూడా. మరి ఆ స్కూటర్ లో ఉన్న ఆత్మ ఎవరిది? ఆ స్కూటర్ లో ఎందుకు ఉంది? ఈ ముగ్గురు కుర్రాళ్ళు అందులో ఆత్మ ఉందని తెలిసాక ఏం చేసారు? నవీన్(నిహాల్ కోదాటి) - శిల్ప(శాన్వి మేఘన)ల ప్రేమ కథేంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీలో దూసుకెళ్తోన్న టాలీవుడ్ మూవీ.. టాప్ టెన్లో ట్రెండింగ్!
ఇంద్రరామ్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటించిన టాలీవుడ్ చిత్రం చౌర్యపాఠం. ఓ సినిమా డైరెక్టర్.. బ్యాంక్ దొంగతనానికి ప్రయత్నిస్తే ఏమైందనే కాన్సెప్ట్తో తెరకెక్కించారు. ఈ చిత్రం ఏప్రిల్ 24న థియేటర్లలో సందడి చేసింది. అయితే ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన దక్కించుకుంది. డైరెక్టర్ నక్కిన త్రినాథరావు నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది.అమెజాన్ ప్రైమ్లోకి వచ్చేసిన 'చౌర్య పాఠం (Chaurya paatam) ఓటీటీలో దూసుకెళ్తోంది. ఏకంగా టాప్ టెన్లో ట్రెండ్ అవుతోంది. ఈ మూవీ అమెజాన్లో టాప్-7లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని చౌర్యపాఠం మూవీ టీమ్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇంకెందుకు ఆలస్యం థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.(ఇది చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)ఈ సినిమా కథేంటంటే..చౌర్యపాఠం విషయానికొస్తే.. వేదాంత్ రామ్(ఇంద్రరామ్)కి దర్శకుడు కావాలనేది కల. నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోయేసరికి బ్యాంక్ దొంగతనం చేసి ఆ డబ్బులతో సినిమా తీయాలని ఫిక్స్ అవుతాడు. బబ్లూ, జాక్ డాన్ అనే ఇద్దరిని తన ప్లాన్ లో భాగం చేస్తాడు. అదే బ్యాంకులో పనిచేస్తున్న అంజలి(పాయల్ రాధాకృష్ణ) వీళ్లకు తోడవుతుంది. తర్వాత ఏం జరిగిందనేదే మిగతా స్టోరీ. -
వారానికే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
మరో తెలుగు సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. కాకపోతే గత వారం థియేటర్లలో రిలీజ్ కాగా.. ఇప్పుడు వారం తిరగకుండానే స్ట్రీమింగ్ అయిపోతోంది. ఈ వీకెండ్లో 30కి పైగా చిత్రాలు-వెబ్ సిరీసులు రిలీజ్ కాగా.. ఇప్పుడు ఈ లిస్టులో ఈ మూవీ కూడా చేరింది. రూరల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా సంగతేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందనేది చూద్దాం.రుద్ర వీరాజ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా 'వీరరాజు 1991'. అర్జన, అజయ్ ఘోష్, బెనర్జీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మే 22న థియేటర్లలో మూవీ రిలీజ్ కాగా.. అక్కడికి వారం తర్వాత అంటే మే 30న ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. రెండు గంటల కంటే తక్కువ నిడివితో ఉన్న ఈ చిత్రం సముద్ర తీర ప్రాంతంలో జరిగే ఓ కథతో తీశారు. థియేటర్లలో అనుకున్నంత రీచ్ లేకపోవడంతో త్వరగానే ఓటీటీలోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు)ఈ సినిమాలో హీరోగా నటించి, దర్శకత్వం వహించిన రుద్ర వీరాజ్ది ఆదోని. ఇక మూవీ విషయానికొస్తే.. నెల్లూరు కృష్ణలంకలో చేపలు పట్టే వీరరాజు.. అదే ఊరిలోని అన్యాయాలు చేస్తున్న రాజకీయ నాయకుడికి ఎదురుతిరుగుతాడు. చివరకు ఏమైంది? వీరరాజు ఏం చేశాడనేదే మిగతా స్టోరీ. ఇందులో అజయ్ ఘోష్ తప్పితే సగటు ప్రేక్షకుడికి తెలిసిన నటీనటులు పెద్దగా లేరు.ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే హిట్ 3, రెట్రో, తుడరుమ్, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, డీమన్ తదితర స్ట్రెయిట్-డబ్బింగ్ చిత్రాలు పలు ఓటీటీల్లోకి వచ్చాయి. వీటిలో చాలావరకు రీసెంట్ టైంలో రిలీజై ప్రేక్షకుల్ని అలరించడం విశేషం.(ఇదీ చదవండి: శిరీషతో పెళ్లి ఎప్పుడంటే.. ప్రకటించిన నారా రోహిత్) -
బక్రీద్ కానుకగా ఓటీటీలో 'లాల్ సలామ్'.. అధికారిక ప్రకటన
సౌత్ ఇండియాలో భారీ అంచనాలతో రజనీకాంత్ 'లాల్ సలామ్'(Lal salaam) (2024) విడుదలైంది. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా చతికిలపడింది. అయినప్పటికీ రజనీ (Rajinikanth) అభిమానులు ఈ చిత్రం ఓటీటీ విడుదల కోసం చాలారోజులుగా ఎదురుచూస్తున్నారు. తాజాగా లాల్సలామ్ ఓటీటీ రిలీజ్ గురించి అధికారికంగా ప్రకటించారు. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య (Aishwarya Rajinikanth) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రల్లో నటించిగా రజనీకాంత్ అతిథి పాత్రలో కనిపించారుబక్రీద్ పండుగ కానుకగా జూన్ 6న ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు సన్ నెక్ట్స్(Sun NXT) ప్రకటించింది. ఎదురుచూపులకు తెర పడింది అంటూ ఒక పోస్టర్ను విడుదల చేశారు. తెలుగు, తమిళ్ వర్షన్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. సుమారు రూ. 90 కోట్ల బడ్జెట్తో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై సుభాస్కరన్ నిర్మించారు. అయితే, బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 52 కోట్లు మాత్రమే రాబట్టి భారీ డిజాస్టర్గా మిగిలిపోయింది. ఈ సినిమా ఓటీటీ ఢీల్స్ మొదట నెట్ఫ్లిక్స్తో కుదుర్చుకుంది. అయితే, సినిమా విడుదల సమయంలో నెట్ఫ్లిక్స్ సూచించిన సీన్స్ కలపకపోవడంతో ఆ ఢీల్ను క్యాన్సల్ చేసుకున్నారు. దీంతో లాల్ సలామ్ ఓటీటీ విడుదల ఆలస్యానికి ప్రధాన కారణం అయింది.కథేంటంటే'లాల్ సలామ్' కథ మొత్తం 1990ల కాలం బ్యాక్డ్రాప్తో నడుస్తోంది. మొయిదీన్ భాయ్ (రజనీకాంత్) కుమారుడు సంషి (విక్రాంత్), గురు (విష్ణు విశాల్) స్నేహితులు. షంషుద్దీన్ (విక్రాంత్)ను క్రికెటర్ను చేయాలన్నది తండ్రి కల. అనుకున్నట్లు గానే సంషి రాష్ట్ర రంజీ జట్టుకు ఆడటానికి ఎంపికవుతాడు. ఈ క్రమంలో ఆ ఊళ్లో త్రీస్టార్ - ఎంసీసీ టీమ్స్ మధ్య జరిగే క్రికెట్ ఆటతో రెండు మతాల మధ్య గొడవ మొదలౌతుంది. ఆ గొడవలోనే షంషుద్దీన్ చేతిని నరికేస్తాడు గురు అలియాస్ గురునాథం (విష్ణు విశాల్).. దాడి చేసిన గురు కూడా మొయిదీన్ భాయ్కి ప్రాణ స్నేహితుడు అయిన (ఫిలిప్ లివింగ్స్టోన్) కుమారుడు కావడం విశేషం. హిందూ ముస్లింలు ఐకమత్యంగా ఉండే ఆ ఊరిలో క్రికెట్ వల్ల మత కల్లోలంగా మారుతుంది. ముంబైలో వ్యాపారావేత్తగా రాణిస్తున్న మొయిద్దీన్ అ గ్రామానికి తిరిగొస్తాడు. కుమారుడి చేయి నరికిన స్నేహితుడి కుటుంబాన్ని మొయిదీన్ ఏం చేస్తాడు..? క్రికెట్లో గొడవలకు కారణం ఏంటి..? సంషి, గురు ప్రాణ స్నేహితుల మధ్య చిచ్చు ఎలా మొదలైంది..? తన కొడుకు చేయి నరికిన గురును మొయిద్దీన్ ఏం చేశాడు..? అనేది తెలియాలంటే జూన్ 6న సన్ నెక్ట్స్లో లాల్ సలామ్ చూడాల్సిందే. -
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలో భైరవం, షష్టిపూర్తి లాంటి చిన్న చిత్రాలు వచ్చాయి. మరోవైపు ఓటీటీల్లో మాత్రం ఏకంగా 30 వరకు కొత్త మూవీస్, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్లోకి రావడం విశేషం. వీటిలో హిట్ 3, రెట్రో, తుడరుమ్ లాంటి క్రేజీ మూవీస్ అందుబాటులోకి వచ్చాయి.(ఇదీ చదవండి: NIA అదుపులో యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్)వీటితో పాటు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, చంద్రహాస, డీమన్ లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ చిత్రాలతో పాటు క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 అనే వెబ్ సిరీస్ కూడా కచ్చితంగా చూడాలి అనే ఆత్రుత కలిగిస్తున్నాయి. ఒకవేళ ఈ వీకెండ్ ఇంట్లోనే మూవీస్ చూద్దామనుకుంటే వీటిలో ఆప్షన్ చూసుకోండి. ఇంతకీ ఏ ఓటీటీలోకి ఏ మూవీ వచ్చిందంటే?ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజైన మూవీస్ (మే 30)నెట్ఫ్లిక్స్రెట్రో - తెలుగు డబ్బింగ్ సినిమాఏ విడోస్ గేమ్ - స్పానిష్ మూవీలాస్ట్ ఇన్ స్టార్ లైట్ - కొరియన్ సినిమాద హార్ట్ నోస్ - స్పానిష్ మూవీహిట్ 3 - తెలుగు సినిమాడిపార్ట్మెంట్ క్యూ - తెలుగు డబ్బింగ్ సిరీస్మ్యాడ్ యునికార్న్ - థాయ్ సిరీస్ద బెటర్ సిస్టర్ - తెలుగు డబ్బింగ్ సిరీస్మాన్స్టర్ హై సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్యా బాయ్ కాంగ్ మింగ్ - జపనీస్ సిరీస్అమెజాన్ ప్రైమ్అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి - తెలుగు మూవీవీర చంద్రహాస - కన్నడ సినిమాచోర్ చోర్ - గుజరాతీ మూవీమై హీరో - కన్నడ సినిమాద లాస్ట్ స్టాప్ ఇన్ యమ కంట్రీ - ఇంగ్లీష్ మూవీట్రెజర్ - ఇంగ్లీష్ సినిమాఏన్ ఎండ్ లెస్ వెడ్డింగ్ - ఫ్రెంచ్ మూవీహాట్స్టార్తుడరుమ్ - తెలుగు డబ్బింగ్ మూవీక్రిమినల్ జస్టిస్: ఏ ఫ్యామిలీ మేటర్ - హిందీ సిరీస్ఫైండ్ ద ఫర్జీ విత్ కరీష్మా - హిందీ గేమ్ షోఏ కంప్లీట్ అన్ నోన్ - ఇంగ్లీష్ సినిమా (మే 31)ఆహానిళర్ కుడై - తమిళ సినిమావానిళ్ తెడినన్ - తమిళ సిరీస్డీమన్ - తెలుగు డబ్బింగ్ మూవీసోనీ లివ్కంఖజురా - తెలుగు డబ్బింగ్ సిరీస్సన్ నెక్స్ట్బిగ్ బెన్ - మలయాళ సినిమానిమిత్త మాత్ర - కన్నడ మూవీజీ5ఇంటరాగేషన్ - హిందీ మూవీఆపిల్ ప్లస్ టీవీబోనో: స్టోరీస్ ఆఫ్ సరండర్ - ఇంగ్లీష్ సినిమాలులు ఈజ్ ఏ రైనోసిరోస్ - ఇంగ్లీష్ మూవీ(ఇదీ చదవండి: సందీప్ రెడ్డి వంగాకు రామ్ చరణ్ దంపతుల సర్ప్రైజ్) -
గద్దర్ అవార్డ్స్ లో సత్తా చాటిన ఆహా ఓటీటీ మూవీస్
తెలంగాణ ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక గద్దర్ అవార్డ్స్లో ఆహా ఓటీటీ సినిమాలు తమ సత్తా చాటాయి. పలు కీలక విభాగాల్లో ఆహా చిత్రాలు అవార్డులు సాధించాయి. 'పొట్టేల్' సెకండ్ బెస్ట్ ఫిల్మ్గా, '35 ఇది చిన్న కథ కాదు' బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్గా అవార్డులు గెలుచుకున్నాయి. '35 ఇది చిన్న కథ కాదు' చిత్రంలో నటనకు నివేదా థామస్ బెస్ట్ హీరోయిన్గా, 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు'లో నటనకు శరణ్య ప్రదీప్ ఉత్తమ సహాయ నటిగా, 'రజాకార్' చిత్రానికి సంగీతం అందించిన భీమ్స్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా గద్దర్ అవార్డులు అందుకున్నారు.'35 ఇది చిన్న కథ కాదు'లో నటించిన మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల, 'మెర్సీ కిల్లింగ్'లో నటించిన బేబీ హారిక ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంపికయ్యారు. 'రాజు యాదవ్' చిత్రానికి చంద్రబోస్ బెస్ట్ లిరిసిస్ట్గా, 'రజాకార్'కు నల్ల శ్రీను బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్గా అవార్డులు పొందారు. 'పొట్టేల్'లో నటనకు అనన్య నాగళ్ల, 'రాజు యాదవ్' నిర్మాతలు ప్రశాంత్ రెడ్డి, రాజేశ్ కల్లేపల్లి స్పెషల్ జ్యూరీ అవార్డులు సాధించారు.ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు ప్రధాన విభాగాల్లో గద్దర్ అవార్డులు గెలవడంపై ఆహా టీమ్ సంతోషం వ్యక్తం చేసింది. ప్రేక్షకుల అభిరుచికి తగ్గ చిత్రాలు, సిరీస్లు, షోలతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే కంటెంట్ అందించడమే తమ లక్ష్యమని ఆహా టీమ్ పేర్కొంది. -
'కేరళ క్రైమ్ ఫైల్స్ 2' ఆసక్తిగా తెలుగు ట్రైలర్
మలయాళంలో తెరకెక్కిన 'కేరళ క్రైమ్ ఫైల్స్: ది సెర్చ్ ఫర్ సీపీవో అంబిలి రాజు' (kerala crime files season 2) ట్రైలర్ విడుదలైంది. తెలుగు వర్షన్ కూడా అందుబాటులో ఉంది. 2023లో జియో హాట్స్టార్ వేదికగా 'కేరళ క్రైమ్ ఫైల్స్' వెబ్ సిరీస్కు సీక్వెల్గా దర్శకుడు అహ్మద్ కబీర్ తెరకెక్కించాడు. పార్ట్ 1లో ఒక్క మర్డర్ కేసుకు సంబంధించి చూపించి ఆపై పోలీసుల విచారణ సమయంలో మీడియా ఫోకస్, రాజకీయ జోక్యం అనేవి లేకుండా కథ చెప్పాడు. అలాంటి కేసును పోలీసులు సవాలుగా తీసుకుని ఎలా పూర్తి చేస్తారనేది చాలా ఆసక్తిగా చెప్పాడు. అప్పుడు ఓటీటీలో మంచి ఆదరణ రావడంతో మేకర్స్ సీక్వెల్ను ప్లాన్ చేశారు. ఇప్పుడు పార్ట్2 కూడా క్రైమ్ కథాంశంతోనే నిర్మించారు. అజు వర్గీస్, లాల్,నివాస్ వాలిక్కున్ను, జిన్జ్ షాన్, శ్రీజిత్ వంటి వారు ఇందులో నటించారు. త్వరలో విడుదల కానున్నట్లు ప్రకటించారు. -
ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హారర్ చిత్రాలకు ఓటీటీలో మంచి ఆదరణ ఉంటుంది. థియేటర్స్లో ఆడని చిత్రాలు కూడా ఓటీటీలో హిట్ అవుతున్నాయి. అందుకే పలు ఓటీటీ సంస్థలు హారర్ చిత్రాలపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నాయి. ఇక హారర్ థ్రిల్లర్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించడంతో ఆహా ముందుంటుంది. ఇప్పటికే పలు తమిళ, మలయాళ హారర్ చిత్రలను తెలుగులో ప్రేక్షకుల ముందుకు తెచ్చిన ఆహా..మరోసారి బ్లాక్ బస్టర్ హారర్ చిత్రంతో అలరించేందుకు రెడీ అయింది. తమిళ్ బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ "డీమన్"(Demon ) నేటి(మే 29) నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. రమేశ్ పళనీవేల్ దర్శకత్వంలో, నిర్మాత ఆర్. సోమసుందరం నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం, భవాని మీడియా ద్వారా Aha ఓటీటీలో ప్రసారం కానుంది. సచిన్ మణి , అబర్నతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో, సురుతి పేరియసామి, కుంకి అశ్విన్, రవీనా కీలక పాత్రల్లో అదరగొట్టారు. హారర్, సస్పెన్స్, ట్విస్ట్ లతో కూడిన కథనంతో డీమన్ ప్రేక్షకులను ఉర్రూతలూగించబోతున్నది. ఊహించని మలుపుతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా చేస్తుంది. చిత్రానికి రోనీ రాఫెల్ అందించిన సంగీతం, ఆర్.ఎస్. ఆనందకుమార్ చేసిన ఛాయాగ్రహణం, రవికుమార్ ఎం. చేసిన ఎడిటింగ్ మరింత అద్భుతంగా తీర్చిదిద్దాయి. -
ఏడాది తర్వాత ఓటీటీకి వస్తోన్న మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలో క్రైమ్ జోనర్ చిత్రాలకు ఫుల్ డిమాండ్ ఉంటోంది. ముఖ్యంగా క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రాలకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. అందువల్లే అభిమానుల అభిరుచికి తగినట్లుగానే అలాంటి సినిమాలే ఎక్కువ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇక మలయాళ సినిమాలకు ఓటీటీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అందుకే మాలీవుడ్ సినిమాలు ఓటీటీల్లో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటున్నాయి.తాజాగా మరో మలయాళ మిస్టరీ థ్రిల్లర్ ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఈ నెలలోనే ఓటీటీలో సందడి చేయనుంది. బినో అగస్టీన్ దర్శకత్వం వహించిన బిగ్బెన్ మూవీ ఈనెల 30 నుంచే సన్ నెక్స్ట్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ థ్రిల్లర్ సినిమాలో అనుమోహన్, వినయ్ పోర్ట్, అదితి రవి, మియా జార్జ్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను యధార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించారు.కాగా.. ఈ ఏడాది మార్చిలోనే ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లు సన్ నెక్స్ట్ ప్రకటించింది. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. చివరికీ ఈ శుక్రవారం బిగ్బెన్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. గత ఏడాది జూన్ నెలాఖరున ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీలో హీరోయిన్గా నటించిన మియా జార్జ్ తెలుగులోనూ నటించింది. ఉంగరాల రాంబాబు మూవీలో సునీల్కు జోడీగా కనిపించింది. ఆమె నటించిన పలు తమిళ, మలయాళ సినిమాలు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చాయి. A ticking clock. ⏰A missing child.And a truth that may shatter everything.Find out what else unravels when a botched kidnapping brings everything to light!!Big Ben - Coming soon, on SunNXT !#SunNXT #BigBenOnSunNXT #Mollywood pic.twitter.com/tDyPGQY9TN— SUN NXT (@sunnxt) May 27, 2025 -
ఓటీటీలోకి తమిళ బ్లాక్ బస్టర్ మూవీ.. తెలుగులో స్ట్రీమింగ్
కొన్నిసార్లు ఏ మాత్రం అంచనాల్లేకుండా విడుదలై అద్భుతాలు సృష్టిస్తుంటాయి కొన్ని చిన్న సినిమాలు. అలాంటి వాటిలో 'టూరిస్ట్ ఫ్యామిలీ' ఒకటి. సూర్య రెట్రో చిత్రానికి పోటీగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. ప్రేక్షకుల నుంచి విశేషాదరణ దక్కించుకుంది. కేవలం తమిళం వరకే రిలీజ్ ఉండటంతో తెలుగు ఆడియెన్స్.. ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూశారు. ఇప్పుడు వాళ్లకోసమా అన్నట్లు గుడ్ న్యూస్ వచ్చేసింది.తమిళంలో మే 1న థియేటర్లలోకి వచ్చి సూపర్ హిట్ అయిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా.. జూన్ 2 నుంచి హాట్స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఓవర్సీస్ ఆడియెన్స్ కోసం సింప్లీ సౌత్ ఓటీటీలో అదే రోజు నుంచి మూవీ అందుబాటులోకి రానుంది. సాధారణంగా వీకెండ్లో కొత్త మూవీస్ని ఓటీటీల్లో రిలీజ్ చేస్తుంటారు. కానీ దీన్ని మాత్రం సోమవారం స్ట్రీమింగ్ చేస్తుండటం విశేషమనే చెప్పాలి. ఈ చిత్రం తెలుగులో రిలీజ్ కానప్పటికీ డైరెక్టర్ రాజమౌళి, హీరో నాని లాంటి వాళ్ల మెప్పు పొందింది. స్వయంగా వీళ్లు ట్వీట్స్ కూడా చేయడం విశేషం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 14 సినిమాలు రిలీజ్)శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో నటించగా.. అభిషాన్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమా తీశాడు. గతంలో ఇతడు యూట్యూబర్ కావడం ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం. సినిమా చాలా సాదాసీదాగా ఉంటూనే సగటు ప్రేక్షకుడు మనసు గెలుచుకుంది. దీంతో ఈ మూవీకి తెలుగులోనూ ఓటీటీలోకి రాకముందే కాస్త బజ్ ఏర్పడింది. మరి స్ట్రీమింగ్ అయిన తర్వాత మన దగ్గర ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి?టూరిస్ట్ ఫ్యామిలీ విషయానికొస్తే.. ధర్మదాస్ (శశికుమార్).. అతడి భార్య వాసంతి (సిమ్రాన్), ఇద్దరు కొడుకులతో కలిసి శ్రీలంక నుంచి అక్రమంగా మన దేశానికి వలస వస్తాడు. వీళ్ల గురించి ఎవరికీ తెలియకుండా ధర్మదాస్ బావమరిది మేనేజ్ చేస్తుంటాడు. ఎవరితోనూ మాట్లాడొద్దని, ఏ విషయాలు చెప్పొద్దని దాస్ కుటుంబానికి చెప్పినా.. దానికి భిన్నంగా వాళ్లు ప్రవర్తిస్తారు. దీంతో అనుకోని చిక్కుల్లో పడతారు. మరి చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మోహన్ లాల్ రీసెంట్ హిట్ మూవీ) View this post on Instagram A post shared by JioHotstar Tamil (@jiohotstartamil) -
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
గత నెలలో థియేటర్లలో రిలీజైన ఓ తెలుగు సినిమా.. ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. రిలీజైన మూడు వారాలకే ఓవర్సీస్ ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం.. ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. బ్యాంక్ రాబరీ థ్రిల్లర్ స్టోరీతో తీసిన ఈ మూవీ సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనేది ఇప్పుడు చూద్దాం.డైరెక్టర్ నక్కిన త్రినాథరావు నిర్మించిన సినిమా 'చౌర్యపాఠం'. ఇంద్రరామ్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటించారు. ఓ సినిమా డైరెక్టర్.. బ్యాంక్ దొంగతనానికి ప్రయత్నిస్తే ఏమైందనే కాన్సెప్ట్తో తీసిన ఈ చిత్రం.. ఏప్రిల్ 24న థియేటర్లలోకి వచ్చింది. కానీ వచ్చినంత వేగంగానే మాయమైపోయింది. ఇప్పుడు ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 14 సినిమాలు రిలీజ్)చౌర్యపాఠం విషయానికొస్తే.. వేదాంత్ రామ్(ఇంద్రరామ్)కి దర్శకుడు కావాలనేది కల. నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోయేసరికి బ్యాంక్ దొంగతనం చేసి ఆ డబ్బులతో సినిమా తీయాలని ఫిక్స్ అవుతాడు. బబ్లూ, జాక్ డాన్ అనే ఇద్దరిని తన ప్లాన్ లో భాగం చేస్తాడు. అదే బ్యాంకులో పనిచేస్తున్న అంజలి(పాయల్ రాధాకృష్ణ) వీళ్లకు తోడవుతుంది. తర్వాత ఏం జరిగిందనేదే మిగతా స్టోరీ.ఇకపోతే ఈ వారం దాదాపు 15కి పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో హిట్ 3, రెట్రో, తుడరమ్ లాంటి స్ట్రెయిట్-డబ్బింగ్ చిత్రాలతో పాటు 'అజ్ఞాతవాసి' అనే కన్నడ థ్రిల్లర్ మూవీ చాలా ఆసక్తి కలిగిస్తున్నాయి. మూవీ లవర్స్కి అయితే ఈ వీకెండ్ పండగే పండగ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ లిస్టులోకే 'చౌర్యపాఠం' కూడా వచ్చి చేరింది.(ఇదీ చదవండి: కొత్తింట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' కాజల్) -
ఓటీటీల విషయంపై అమిర్ ఖాన్ సంచలన నిర్ణయం
బాలీవుడ్ ఆగ్ర నటుడు అమిర్ ఖాన్ (Aamir Khan) నటిస్తోన్న కొత్త చిత్రం 'సితారే జమీన్ పర్' (Sitaare Zameen Par) థియేటర్లో విడుదలైన తర్వాత డైరెక్ట్గా యూట్యూబ్లో విడుదల చేసే యోచనలో ఉన్నారు. సినిమాలపై ఓటీటీల ప్రభావం తగ్గించేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం ఆయన ఒక ఇంటర్వ్యూలో ఇదే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. ఓటీటీల ప్రభావం థియేటర్లపై పడుతోందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. థియేటర్లలో విడుదలైన సినిమాలు ఎనిమిది వారాల్లోనే ఓటీటీల్లోకి వచ్చే విధానాన్ని ఆయన తప్పు పట్టారు. ఇలాంటి డీల్ వ్యాపారంలో సరైంది కాదన్నారు.అమీర్ ఖాన్ కొత్త సినిమా 'సితారే జమీన్ పర్' జూన్ 20న విడుదల కానుంది. సాధారణంగా థియేటర్ రన్ 8వారాలు పూర్తి అయిన తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి రావాల్సిందే. అయితే, దానిని అమీర్ బ్రేక్ చేయనున్నారు. ఓటీటీలో కాకుండా యూట్యూబ్లో విడుదల చేయనున్నారు. అది కూడా చాలా రోజుల తర్వాతే అందుబాటులోకి తీసుకోస్తామన్నారు. ఆ సమయంలో సినిమా చూడాలనుకునే వారు చిత్ర నిర్మాతలు సూచించిన రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు నిర్మాతలకు నష్టం వాటిల్లదని ఆయన అభిప్రాయ పడుతున్నారు. అయితే, ఈ నిర్ణయంపై కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అమీర్ చెప్పిన మాట ప్రకారం ఇలా ఓటీటీని బాయ్కాట్ చేస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు.అమిర్ ఖాన్ తాజాగా మాట్లాడుతూ.. 'థియేటర్లలో విడుదలైన సినిమాలు తక్కువ సమయంలోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. దీంతో సినిమా థియేటర్స్ తీవ్రంగా నష్టపోతున్నాయిని నేను నమ్ముతున్నాను. ఇక నుంచి నేను నటించే సినిమాలు ఓటీటీలో విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నాను. వాటిని థియేటర్స్లో మాత్రమే విడుదల చేస్తాను. అభిమానులు కూడా నా సినిమాను పెద్ద స్క్రీన్ మీదే చూడాలని కోరుకుంటారు. అందుకే నా మూవీని థియేటర్స్లో విడుదల చేస్తాను. దీంతో సినిమా వ్యాపారం బలం పుంజుకుంటుందని నమ్ముతున్నాను.' అని అన్నారు. ఓటీటీల వల్ల ఆడియన్స్ను థియేటర్లకు రావొద్దని మనమే పరోక్షంగా చెబుతున్నామని, అందుకే సినిమాలు విజయవంతం కావడం లేదని ఆయన పేర్కొన్నారు. 2007లో వచ్చిన 'తారే జమీన్ పర్' సినిమాకు సీక్వెల్గా ‘సితారే జమీన్ పర్’ చిత్రాన్ని తెరకెక్కించారు. స్పోర్ట్స్ కామిడీ డ్రామాగా ఈ చిత్రం రానుంది. -
ఓటీటీలోకి మోహన్ లాల్ రీసెంట్ హిట్ మూవీ
రీసెంట్ టైంలో ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమా 'తుడరుమ్'. మోహన్ లాల్, శోభన జంటగా నటించిన ఈ చిత్రం ఊహించని వసూళ్లు సాధించింది. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? ఎప్పుడెప్పుడు చూద్దామా? అని ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ ఎదురుచూశారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు.మోహన్ లాల్ హీరోగా నటించిన 'ఎల్ 2: ఎంపురాన్' సినిమా మార్చి చివరన రిలీజైంది. చాలా హడావుడి చేశారు గానీ జస్ట్ ఓకే అనిపించుకుంది. సరిగ్గా నెల తర్వాత మోహన్ లాల్ నుంచే 'తుడరుమ్' రిలీజైంది. ప్రమోషన్ లాంటివేం లేకుండానే దీన్ని రిలీజ్ చేశారు. బడ్జెట్ కూడా చాలా తక్కువే. అలాంటిది ఇది బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సొంతం చేసుకుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 14 సినిమాలు రిలీజ్)పెట్టిన బడ్జెట్ వచ్చిన వసూళ్ల బట్టి చూస్తే చాలా లాభాలు అందుకున్నట్లే. ఇప్పుడీ ఈ చిత్రాన్ని హాట్స్టార్లో మే 30 నుంచి తెలుగు, తమిళ,కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇదే వీకెండ్ లో రీసెంట్ చిత్రాలు హిట్ 3(మే 29), రెట్రో (మే 30) ఓటీటీల్లో అందుబాటులోకి రానుండటం విశేషం. అంటే ఈ వీకెండ్ మూవీ లవర్స్కి పండగే పండగ.తుడరుమ్ విషయానికొస్తే.. షణ్ముగం అలియాస్ బెంజ్(మోహన్ లాల్) ఓ ట్యాక్సీ డ్రైవర్. భార్య(శోభన), ఇద్దరు పిల్లలతో ఆనందంగా బతికేస్తుంటాడు. ఊహించని విధంగా ఓ పోలీసు కేసులో ఇరుక్కుంటాడు. దీన్నుంచి బయటపడేసరికి కొడుకు కనిపించకుండా పోతాడు. దీంతో వెతకడం మొదలుపెడతాడు. ఈ క్రమంలో బెంజ్కి ఊహించని విషయాలు తెలుస్తాయి? ఇంతకీ ఏంటవి? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలో వచ్చేస్తున్న థ్రిల్లర్ సినిమా) -
నేరుగా ఓటీటీలో వచ్చేస్తున్న థ్రిల్లర్ సినిమా
ఓటీటీలో థ్రిల్లర్ సినిమాలకు డిమాండ్ ఎక్కువ. భాషతో సంబంధం లేకుండా చూస్తుంటారు. అందుకు తగ్గట్లే దర్శకులు కూడా డిఫరెంట్ స్టోరీలతో ఈ తరహా మూవీస్ తీస్తుంటారు. అలా ఇప్పుడు ఓ హిందీ చిత్రం.. గతంలో పలు ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రదర్శితమై మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు దీన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.మీర్జాపుర్, పాతాళ్ లోక్ తదితర వెబ్ సిరీసులతో అభిషేక్ బెనర్జీ ఫేమ్ తెచ్చుకున్నాడు. ఇతడు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'స్టోలెన్'. దీన్ని జూన్ 4వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ టీజర్ కూడా రిలీజ్ చేశారు. చూచాయిగా స్టోరీ ఏంటనేది బయటపెట్టారు.(ఇదీ చదవండి: కొంతమంది చాలా నీచంగా ప్రవర్తిస్తున్నారు: దిల్ రాజు)స్టోలెన్ విషయానికొస్తే.. ఓ రైల్వే స్టేషన్లో ఉన్న తల్లి దగ్గరున్న పాపని దుండగులు ఎత్తుకుపోతారు. దీన్ని చూసిన గౌతమ్, రామన్ అనే అన్నదమ్ములు.. ఆ పాపని వెతికిపెట్టాలని నిర్ణయించుకుంటారు. ఈ క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది.ఇకపోతే ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. దాదాపు 14 కొత్త చిత్రాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో హిట్ 3, రెట్రో, అజ్ఞాతవాసి అనే కన్నడ సినిమా చూడదగ్గ వాటిలో ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని సడన్ రిలీజయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయి.(ఇదీ చదవండి: లగ్జరీ కారు కొన్న టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష.. ఎన్ని కోట్లో తెలుసా?) -
ఈ వారం ఓటీటీల్లో 14 సినిమాలు రిలీజ్
మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో భైరవం, షష్టిపూర్తి సినిమాలు మాత్రమే రానున్నాయి. వీటిపై పెద్దగా అంచనాల్లేవు. మరోవైపు ఓటీటీలో మాత్రం 14 మూవీస్-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో మూడు మాత్రం కచ్చితంగా చూడాల్సిన జాబితాలో ఉంటాయి.(ఇదీ చదవండి: బాలకృష్ణతో పవన్ పోరు.. వార్ తప్పదు)ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోయే చిత్రాల విషయానికొస్తే.. నాని 'హిట్ 3', సూర్య 'రెట్రో' సినిమాలతో పాటు అజ్ఞాతవాసి అనే కన్నడ డబ్బింగ్ మూవీని మాత్రం అస్సలు మిస్ కావొద్దు. వీటితో పాటు వీకెండ్లో మరికొన్ని సడన్ రిలీజ్లు ఉండొచ్చు. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు (మే 26 నుంచి జూన్ 01 వరకు)నెట్ఫ్లిక్స్మైక్ బిర్బిగిలియా (ఇంగ్లీష్ సినిమా) - మే 26కోల్డ్ కేస్: ద టైలీనాల్ మర్డర్స్ (డాక్యుమెంటరీ సిరీస్) - మే 26హిట్ 3 (తెలుగు సినిమా) - మే 29ఏ విడోస్ గేమ్ (స్పానిష్ మూవీ) - మే 30లాస్ట్ ఇన్ స్టార్ లైట్ (కొరియన్ సినిమా) - మే 30ద హార్ట్ నోస్ (స్పానిష్ మూవీ) - మే 30రెట్రో (తెలుగు సినిమా) - మే 31హాట్స్టార్కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్ (ఇంగ్లీష్ మూవీ) - మే 28క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 29ఏ కంప్లీట్ అన్నోన్ (ఇంగ్లీష్ సినిమా) - మే 31జీ5అజ్ఞాతవాసి (కన్నడ సినిమా) - మే 28సోనీ లివ్కంఖజురా (హిందీ సిరీస్) - మే 30ఆపిల్ ప్లస్ టీవీబోనో: స్టోరీస్ ఆఫ్ సరండర్ (ఇంగ్లీష్ మూవీ) - మే 30లులు ఇన్ రైనోసిరోస్ (ఇంగ్లీష్ సినిమా) - మే 30(ఇదీ చదవండి: కన్నప్పలో ప్రభాస్.. రెబల్ స్టార్ పాత్రపై మంచు విష్ణు ఆసక్తికర కామెంట్స్) -
Aishwarya Rajesh: ఐశ్వర్య రాజేశ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఓటీటీలో టాప్లో ట్రెండింగ్!
సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గరుడ 2.0. గతంలో తమిళంలో బ్లాక్బస్టర్గా నిలిచి.. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.50 కోట్ల వసూళ్లు సాధించిన రికార్డు సృష్టించిన ఆరత్తు సీనం (Aarathu Sinam) కు రీమేక్గా తెరకెక్కించారు. తెలుగు భాషలో గరుడ 2.0 గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ మూవీ ఆహా ఓటీటీలో దూసుకెళ్తోంది. ఈ సినిమా అదేస్థాయిలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది.ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సూపర్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఓటీటీలో ఏకంగా టాప్ వన్లో ట్రెండ్ అవుతోంది. సినిమా విజయవంతంగా నడుస్తూ నిర్మాతకు కాసుల వర్షం కురిపిస్తోంది. హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ ఈ చిత్రంలో అద్భుతమైన నటన హైలైట్గా నిలిచింది. ఈ సినిమాకు అరివాజగన్ వెంకటాచలం దర్శకత్వం వహించారు. ఇప్పటికే సినిమా చూసినవారు పలువురు ప్రశంసలు అందిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గరుడ 2.0. గతంలో తమిళంలో బ్లాక్బస్టర్గా నిలిచి.. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.50 కోట్ల వసూళ్లు సాధించిన రికార్డు సృష్టించిన ఆరత్తు సీనం (Aarathu Sinam) కు రీమేక్గా తెరకెక్కించారు. తెలుగు భాషలో గరుడ 2.0 గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ మూవీ ఆహా ఓటీటీలో దూసుకెళ్తోంది. ఈ సినిమా అదేస్థాయిలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది.ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సూపర్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఓటీటీలో ఏకంగా టాప్ వన్లో ట్రెండ్ అవుతోంది. సినిమా విజయవంతంగా నడుస్తూ నిర్మాతకు కాసుల వర్షం కురిపిస్తోంది. హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ ఈ చిత్రంలో అద్భుతమైన నటన హైలైట్గా నిలిచింది. ఈ సినిమాకు అరివాజగన్ వెంకటాచలం దర్శకత్వం వహించారు. ఇప్పటికే సినిమా చూసినవారు పలువురు ప్రశంసలు అందిస్తున్నారు. -
ఓటీటీలో ప్రేమలు హీరో కొత్త సినిమా 'జింఖానా'
గతేడాదిలో 'ప్రేమలు' సినిమాతో తెలుగు యూత్కు బాగా దగ్గరయ్యాడు యువ నటుడు నస్లేన్ కె. గఫూర్. మలయాళ పరిశ్రమకు చెందిన ఆయన రీసెంట్గా మరో చిత్రం 'జింఖానా'తో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించాడు. ఏప్రిల్ 25న విడుదలైన ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. ఈమేరకు ప్రకటన కూడా వచ్చేసింది. బాక్సింగ్ నేపథ్యంలో కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం యూత్కు బాగా కనెక్ట్ అయింది. దర్శకుడు ఖలీద్ రెహమాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్లాన్ బి మోషన్ పిక్చర్స్, రీలిస్టిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.జింఖానా సినిమా సోనిలివ్ (SonyLIV)లో జూన్ 5నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటన వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ వర్షన్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈమేరకు ఒక పోస్టర్ను కూడా విడుదల చేశారు. లుక్మాన్ అవరన్, గణపతి, సందీప్ ప్రదీప్ ముఖ్య తారలుగా నటించారు. మొదట మలయాళంలో ‘అలప్పుజ జింఖానా’ పేరుతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ రావడంతో తెలుగులో కూడా తర్వాత రిలీజ్ చేశారు. శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్పై సుబ్బారెడ్డి తెలుగులో ‘జింఖానా’ పేరుతో విడుదల చేశారు.కథఊరిలో ఆకతాయి కుర్రాళ్లుగా ఉన్న జోజో జాన్సన్ (నస్లేన్), షిఫాస్ అలీ (ఫ్రాంకో ఫ్రాన్సిస్), షిఫాస్ అహ్మద్ (సందీప్ ప్రదీప్), డీజే జాన్ (బేబీ జీన్), దీపక్ పణిక్కర్ (గణపతి), షణవాస్ (శివ హరిచరణ్) వీరందరూ మంచి స్నేహితులు. అయితే, వారిలో షణవాస్ మినహా మిగతా వాళ్లంతా 12వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ కావడంతో డిగ్రీలో అడుగు పెట్టే అవకాశం కోల్పోతారు. కానీ, స్పోర్ట్స్ కోటాలో అడ్మిషన్ పొందేందుకు వారు బాక్సింగ్ ఆటలో ఎంట్రీ ఇస్తారు. అందుకోసం స్థానికంగా ఉన్న 'అలప్పుజా జింఖానా' అకాడమీలో శిక్షణ తీసుకుంటారు. అలా బాక్సింగ్ రింగ్లోకి అడుగుపెడుతారు. ప్రొఫెషనల్ ఆటగాళ్లతో ఈ ఆకతాయి గ్యాంగ్ ఎలా ఎదుక్కొంటుంది. ఈ క్రమంలో వారికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి..? అనేది సినిమాలో చూడాల్సిందే. -
ఓటీటీలో నాని 'హిట్ 3' సినిమా.. స్ట్రిమింగ్ వివరాలు ఇవే
నాని 'హిట్3: ది థర్డ్ కేస్'(HIT: The Third Case) ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. హీరో నాని కెరీర్లో వంద కోట్ల క్లబ్లో ఈ సినిమా చేరిపోయింది. శైలేష్ కొలను దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రోడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదలైంది. ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీకి పెద్దగా పోటీ లేకపోవడం ఆపై సినిమా పట్ల పాజిటీవ్ టాక్ రావడంతో థియేటర్స్ వద్ద అర్జున్ సర్కార్ దుమ్మురేపాడు. ఇప్పుడు ఓటీటీలో కూడా తన సత్తా ఏంటో చూపించనున్నాడు.'హిట్3: ది థర్డ్ కేస్' సినిమా మే 29 నుంచి నెట్ఫ్లిక్స్ (Netflix)లో విడుదల కానుంది. రాబోవు సినిమాల జాబితాలో హిట్3ని నెట్ఫ్లిక్స్ చేర్చించి. గురువారం (మే 29)న స్ట్రీమింగ్ తీసుకురానున్నట్లు అందులో పేర్కొంది. హిట్3 మూవీలో కాస్త వయెలెన్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ నాని అద్భుతమైన నటనతో దుమ్మురేపాడు. ఈ మూవీకి నిర్మాత కూడా నానినే కావడం విశేషం. ఇప్పటికే 'ప్యారడైజ్' షూటింగ్లో నాని జాయిన్ అయిపోయాడు. ఆ తర్వాత సుజీత్తో సినిమా చేస్తాడు. ఇదే కాకుండా మెగాస్టార్ చిరంజీవి-శ్రీకాంత్ ఓదెల చిత్రానికి నిర్మాత కూడా నానినే. ఇలా నాని లైనప్ స్ట్రాంగ్ గా ఉంది.కథేంటంటే..ఎస్పీ అర్జున్ సర్కార్(నాని) జమ్ము కశ్మీర్ నుంచి ఏపీకి బదిలీపై వస్తారు. డ్యూటీలో జాయిన్ అయ్యే కంటే ముందే అడవిలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేస్తారు. తర్వాత ఆ కేసును ఆయనే విచారణ చేస్తారు. అలా రెండో హత్య చేస్తున్న సమయంలో అర్జున్ సర్కార్ టీం సభ్యురాలు వర్ష(కోమలి ప్రసాద్) అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటుంది. దీంతో అర్జున్ సర్కార్ హత్యలు ఎందుకు చేస్తున్నాడో ఆమెకు వివరిస్తూ.. సీటీకే(కాప్చర్ టార్చర్ కిల్) డార్క్ వెబ్సైట్ గురించి చెబుతాడు. అసలు సీటీకే ఉద్దేశం ఏంటి? ఆ డార్క్ వెబ్సైట్ రన్ చేస్తున్నదెవరు? వారి లక్ష్యం ఏంటి? అర్జున్ సర్కార్ సీటీకే గ్యాంగ్ ఆటలకు ఎలా అడ్డుకట్ట వేశాడు? ఈ క్రమంలో ఆయనకు ఎదురైన సవాళ్లు ఏంటి? తల్లిలేని అర్జున్ సర్కార్ జీవితంలోకి మృదుల (శ్రీనిధి శెట్టి) ఎలా వచ్చింది? ఆమె నేపథ్యం ఏంటి? అర్జున్ సర్కార్ ఆపరేషన్కి ఆమె ఎలా సహాయపడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
The Diplomat Review: మాయ మాటలు నమ్మి పాకిస్తాన్ వెళితే..
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం డిప్లొమాట్ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. వాస్తవ కథలను సినిమాగా తీయడం ఓ సవాల్ అనే చెప్పాలి. అందులోనూ నిజంగా జరిగిన సున్నిత ఘటనలను సినిమా రూపంలో తీయాలంటే దర్శకుడికి కత్తి మీద సామే. అలాంటి ప్రయత్నమే ‘డిప్లొమాట్’( Diplomat Movie Review ) సినిమాలో చేశారు దర్శకుడు శివమ్ నాయర్. ఈ మూవీ చూస్తున్నంతసేపూ ఆ కథను మనం దగ్గరగా చూస్తున్న అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే ఈ సినిమాలో దర్శకుడు నటీనటులతో జీవింపచేశారు. జాన్ అబ్రహాం ప్రధాన పాత్రలో నటించగా సాధియా కతీబ్ మరో పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాలో ఏం ఉందో చూద్దాం. ఇదో యథార్థ గాథ. 2017లో ఉజ్మా అహ్మద్ అనే భారతీయ వివాహితను పాకిస్తాన్కు చెందిన తాహిర్ అనే యువకుడు మాయ మాటలతో తమ దేశం రప్పించుకుంటాడు. కేన్సర్ బారిన పడ్డ ఉజ్మా కూతురు వేరే దేశంలో ఉంటుంది. తన కూతురి ఆరోగ్యం కోసం డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో తాహిర్ వలలో పడుతుంది ఉజ్మా. పాకిస్తాన్ వెళ్లాక ఉజ్మాకు అతని అసలు రంగు తెలుస్తుంది. తరువాత తాహిర్ ఆమెపై అత్యాచారం జరిపి, చిత్రహింసలు పెడుతుంటాడు. ఈ దశలో ఆ అమ్మాయి అతని దగ్గర నుండి తప్పించుకుని పాకిస్తాన్లోని ఇండియన్ ఎంబసీలోకి శరణార్థిగా ప్రవేశిస్తుంది. అక్కడ ఉన్న ఇండియన్ ఎంబసీ అధికారి అయిన జేపీ సింగ్కు తన గోడు వెళ్ళబోసుకుంటుంది. ఇంతలో తాహిర్ నానా రకాలుగా ఎంబసీలోకి రావడానికి ప్రయత్నించి చివరకు ఉజ్మా మీద, ఇండియన్ ఎంబసీ మీద కేసు పెడతాడు. అక్కడ నుండి కథ పలు మలుపులు తిరిగి, చివర్లో ఉజ్మాను భారతదేశానికి జేపీ సింగ్ ఎలా క్షేమంగా చేర్చాడన్నదే సినిమా. ఇక్కడ ఉజ్మా వల్ల భారత్–పాకిస్తాన్ మధ్య దౌత్యపరమైన ఇబ్బందులు చాలానే వస్తాయి. వాటిని అధిగమించి ఈ భారతదేశ బిడ్డను పాకిస్తాన్ నుండి ఎలా చేర్చాడు అన్నది కళ్ళకు కట్టినట్టు చూపించారు దర్శకుడు. సినిమా చివర్లో నిజమైన ఉజ్మాతో పాటు అప్పటి ఎంబసీ అధికారిని... వారి చిత్రాలతో చూపించడం చాలా బావుంది. నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ ‘డిప్లొమాట్’ నిజంగా సూపర్ థ్రిల్లర్. వర్త్ఫుల్ వాచ్ ఫర్ వీకెండ్. – హరికృష్ణ ఇంటూరు -
గరుడన్ తెలుగు రీమేకె 'భైరవం'.. ఏ ఓటీటీలో ఉందంటే
'భైరవం' సినిమా మే 30న విడుదల కానుంది. ఇప్పుడు ఈ సినిమా పరిస్థితి ఎలా ఉందంటే ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా ఉంది. ఈ సినిమా ఓరిజినల్ కాపీ అమెజాన్ ప్రైమ్లో ట్రెండ్ అవుతుంది. అలాంటప్పుడు రీమేక్ భైరవం కోసం జనాలు థియేటర్కు వస్తారా అనే సందేహాలు వస్తున్నాయి. మరోవైపు ఈ సినిమా దర్శకుడు విజయ్ కనకమేడల నోటిదురుసు వల్ల బాయ్కాట్ భైరవం (#BoycottBhairavam) అనే హ్యాష్ట్యాగ్ నెట్టింట వైరల్ అవుతుంది. ఒకవైపు వైఎస్సార్సీసీ ఫ్యాన్స్..మరోవైపు మెగా అభిమానులు భైరవం సినిమా చూడొద్దని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న ప్రచారం చేస్తున్నారు.తమిళ సినిమా 'గరుడన్'కు రీమేక్గా 'భైరవం' సినిమాను విజయ్ కనకమేడల తెరకెక్కించాడు. గతేడాదిలో తమిళ్లో మాత్రమే విడుదలైన గరుడన్ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది.తమిళ నటుడు సూరి లీడ్ రోల్లో నటించగా అతని స్నేహితులుగా శశికుమార్, ఉన్నిముకుందన్ కీలకపాత్రలు పోషించారు. ఈ రూరల్ యాక్షన్ డ్రామాను ఆర్ఎస్ దురైసెంథిల్ కుమార్ డైరెక్ట్ చేశాడు. రూ. 20 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తే.. రూ. 50 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించింది. వెట్రిమారన్ కథ అందించాడు.భైరవంలో కూడా ముగ్గురు హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ నటించారు. గరుడన్ కథ నచ్చే తెలుగు ప్రేక్షకులకు కూడా చూపించాలని భైరవం తీస్తున్నట్లు దర్శకుడు విజయ్ కనకమేడల ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే, మాతృకతో పోలిస్తే మన ప్రేక్షకులకు నచ్చేలా అవసరమైన మార్పులు చేసి ఈ సినిమాను తెరకెక్కించామన్నారు. ఒరిజినల్ వర్షన్ చూసిన వాళ్లకి కూడా కొత్త అనుభూతిని అందించేలా ఈ కథలో మార్పులు చేసినట్లు ఆయన అన్నారు. -
ఓటీటీలో 'సారంగపాణి జాతకం'.. ఎలా ఉందో తెలుసుకోండి..?
'సారంగపాణి జాతకం' సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. అధికారికంగా ప్రకటన అయితే రాలేదు కానీ.. ఈ అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ కానుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ప్రియదర్శి, రూపా కొడువాయూర్ జంటగా నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్25న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను కడుపుబ్బా నవించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ద్వారా తన జాతకం చూసుకోనుంది.ప్రియదర్శికి ఈ సినిమా మరింత గుర్తింపును తెచ్చింది. మల్లేశం, బలగం, కోర్ట్ సినిమా తరహా భావోద్వేగాలతో సాగే ఓ సాధారణ వ్యక్తి కథే 'సారంగపాణి జాతకం' అని చెప్పవచ్చు. మే 23 నుంచి అమెజాన్ ప్రైమ్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ మూవీ అందుబాటులో ఉండనుంది. థియేటర్లో విడుదలైన నెలరోజుల్లోనే ఓటీటీలోకి ఈ చిత్రం రానున్నడంతో కాస్త ఆసక్తిని కలిగించే అంశం అని చెప్పవచ్చు. కథలో అనవసరమై డబుల్ మీనింగ్ డైలాగ్స్ చేర్చకుండా మంచి కామెడీతో ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంది. అయితే, స్టోరీని ముందే అంచనా వేసేలా ఉండటంతో ఆశించినంత విజయాన్ని అందుకోలేదని చెప్పవచ్చు.సారంగపాణి జాతకం కథ ఇదేసారంగ(ప్రియదర్శి) ఓ కార్ల కంపెనీలో సేల్స్ మెన్. చిన్నప్పటి నుంచి యావరేజ్ మార్కులతో పాసైన సారంగకు ఆ జాబ్ సాధించడం గొప్పే అని సారంగ తల్లిదండ్రుల ఫీలింగ్. ముఖ్యంగా ఇదంతా మనోడి జాతకం తెగ నమ్మేస్తుంటారు. అలా చిన్నప్పటి నుంచి జాతకాలపై సారంగకు పూర్తి నమ్మకం ఏర్పడుతుంది. అయితే అదే కంపెనీలో మేనేజర్గా పనిచేస్తోన్న మైథిలి(రూప కొడువాయూర్)తో మన సారంగకు లవ్ మొదలవుతుంది. ఆమెకు సారంగ ప్రపోజ్ చేద్దాం అనుకునేలోపే మైథిలినే ఊహించని సర్ప్రైజ్ ఇస్తుంది. అలా ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ మొదలై చివరికీ పెళ్లి వరకు తీసుకెళ్తుంది. అంతా ఓకే అనుకుంటుండగానే సారంగకు చేతి రేఖలు చూసి భవిష్యత్తును డిసైడ్ చేసే జిగ్గేశ్వర్(అవసరాల శ్రీనివాస్)ను అనుకోకుండా కలుస్తాడు. ఆయన చేతిరేఖల జాతకంలో ఫేమస్ కావడంతో అతని వద్దకు సారంగ వెళ్తాడు. ఆ తర్వాత సారంగ చేయి చూసిన జిగ్గేశ్వర్ (అవసరాల శ్రీనివాస్) చేతి రేఖలు చూసి అతని జాతకంలో ఉన్న ఓ షాకింగ్ విషయం చెప్తాడు. ముందు నుంచి జాతకాలు తెగ నమ్మే సారంగ ఆ విషయం తెలుసుకుని తెగ బాధపడిపోతుంటాడు. ఆ పని పూర్తయ్యాకే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ విషయంలో తన ఫ్రెండ్ చందు(వెన్నెల కిశోర్) సాయం కోరతాడు. ఇద్దరు కలిసి సారంగ జాతకం ప్రకారం ఆ పని కోసం తమ మాస్టర్ మైండ్స్తో స్కెచ్ వేస్తారు. మరి అది వర్కవుట్ అయిందా? అసలు సారంగ జాతకంలో ఉన్న ఆ షాకింగ్ విషయం ఏంటి? దాని కోసం చందుతో కలిసి వేసిన ప్లాన్స్ సక్సెస్ అయ్యాయా? చివరికీ సారంగ.. తన ప్రియురాలు మైథిలిని పెళ్లి చేసుకున్నాడా? అనేది తెలియాలంటే సారంగపాణి జాతకం చూడాల్సిందే. -
సడన్లో ఓటీటీకి వచ్చేసిన టాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి, స్వాతి మందల్ జంటగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'ది డెవిల్స్ చైర్'(the devil's chair). ఈ సినిమాకు గంగ సప్తశిఖర దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. విడుదలైన మూడు నెలల తర్వాత ఎలాంటి ప్రకటన లేకుండానే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రోజు నుంచే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ ఆహాలో ది డెవిల్స్ ఛైర్ స్ట్రీమింగ్ అవుతోంది.ది డెవిల్స్ చైర్ కథేంటంటే..ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేసే విక్రమ్(అదిరే అభి) బెట్టింగ్కు బానిసగా మారుతాడు. కంపెనీకి చెందిన కోటి రూపాయాలను కొట్టేసి బెట్టింగ్లో పెడతాడు. ఈ విషయం తెలిసి యాజమాన్యం అతన్ని ఉదోగ్యంలో నుంచి తీసేవేయడంతో పాటు కేసు కూడా పెడుతుంది. లీగల్ కేసు ఎదుర్కొంటున్న విక్రమ్ని ప్రియురాలు రుధిర(స్వాతి మందల్) చేరదీస్తుంది. తన ఇంట్లోనే ఉంచుకుంటూ ఆర్థికంగా ఆదుకుంటుంది. ఓ సారి రుధిర ఇష్టపడి ఓ యాంటిక్ చైర్ని కొని తెచ్చుకుంటుంది. ఆ చైర్లో ఓ డెవిల్ శక్తి ఉంటుంది. అది విక్రమ్కి మాత్రమే కనిపిస్తూ.. కండిషన్స్పై అతనికి అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తుంటుంది. రూ. కోటి కట్టాలని యాజమాన్యం ఒత్తిడి తేవడంతో ఆ డబ్బు కోసం మళ్లీ డెవిల్ని శక్తినే సంప్రదిస్తాడు. ప్రియురాలు రుధిరను చంపేస్తే రూ.5 కోట్లు ఇస్తానని ఆ డెవిల్ చైర్ ఆఫర్ ఇస్తుంది. మరి పీకల్లోతు అప్పుల్లో ఉన్న విక్రమ్ డబ్బు కోసం ప్రియురాలిని చంపేశాడా? అసలు ఆ చైర్లో ఉన్నది ఎవరు? విక్రమ్ని వశం చేసుకునేందుకు ఎందుకు ప్రయత్నిస్తుంది? అసలు ఆ చైర్ వెనుక ఉన్న రహస్య స్టోరీ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ప్రసాద్ ఐమ్యాక్స్ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్ ఈవెంట్ రానా సందడి (ఫొటోలు)
-
రానా నాయుడు సీజన్-2.. టీజర్ వచ్చేసింది
విక్టరీ వెంకటేశ్ (Venkatesh), రానా దగ్గుబాటి (Rana Daggubati) నటించిన డార్క్ కామెడీ వెబ్ సిరీస్ రానా నాయుడు. గతంలో విడుదలైన ఈ సిరీస్ సూపర్ హిట్గా నిలిచింది. ఈ వెబ్ సిరీస్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్కు కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్.వర్మ దర్శకత్వం వహించారు. కాగా.. సీజన్-1 సూపర్ హిట్ కావడంతో మేకర్స్ సీజన్-2ను కూడా తెరకెక్కించారు.తాజాగా రానా నాయుడు సీజన్-2 టీజర్ను విడుదల చేశారు. ప్రసాద్ ఐమ్యాక్స్లో నిర్వహించిన ఈవెంట్లో టీజర్ను రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్లో హీరో రానా సందడి చేశారు. ప్రసాద్ ఐమ్యాక్స్కు విచ్చేసిన రానాకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలతున్నాయి. కాగా.. ఈ వెబ్ సిరీస్ను జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ తన ట్విటర్ ద్వారా తెలియజేస్తూ రానా నాయుడు పోస్టర్ను పంచుకుంది. తాజాగా రిలీజైన రానా నాయుడు సీజన్-2 అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా.. అమెరికన్ టీవీ సిరీస్ రే డొనోవన్కు రీమేక్గా రానా నాయుడు వెబ్ సిరీస్ను రూపొందించారు. -
రానా నాయుడు సీజన్-2 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
విక్టరీ వెంకటేశ్ (Venkatesh), రానా దగ్గుబాటి (Rana Daggubati) నటించిన డార్క్ కామెడీ వెబ్ సిరీస్ రానా నాయుడు. గతంలో విడుదలైన ఈ సిరీస్ సూపర్ హిట్గా నిలిచింది. ఈ వెబ్ సిరీస్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్కు కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్.వర్మ దర్శకత్వం వహించారు. ఇందులో వెంకటేశ్.. నాగ నాయుడు (తండ్రి), రానా.. రానా నాయుడు (కొడుకు) పాత్రలు పోషించారు. సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయిన సంగతి తెలిసిందే.(ఇది చదవండి: వెంకటేశ్- రానా సూపర్ హిట్ కాంబో.. టీజర్ వచ్చేసింది)సీజన్-1 సూపర్ హిట్ కావడంతో మేకర్స్ సీజన్-2ను కూడా తెరకెక్కించారు. తాజాగా రానా నాయుడు సీజన్-2 స్ట్రీమింగ్ తేదీని రివీల్ చేశారు. ఈ వెబ్ సిరీస్ను జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ తన ట్విటర్ ద్వారా తెలియజేస్తూ రానా నాయుడు పోస్టర్ను పంచుకుంది. ఇప్పటికే రానా నాయుడు సీజన్-2 టీజర్ను విడుదల చేశారు. ఈ టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. కాగా.. అమెరికన్ టీవీ సిరీస్ రే డొనోవన్కు రీమేక్గా రానా నాయుడు వెబ్ సిరీస్ను రూపొందించారు. ఈ సిరీస్తో రానా, వెంకటేశ్ మొదటి సారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. యాక్షన్, క్రైమ్ డ్రామాగా వచ్చిన ఈ సిరీస్లో వీరిద్దరూ తండ్రీ కొడుకులుగా కనిపించారు. Jab baat parivaar ki ho, Rana harr line cross karega ❤️🔥Watch Rana Naidu Season 2, out 13 June, only on Netflix. #RanaNaiduOnNetflix pic.twitter.com/NwhRM3MQcE— Netflix India (@NetflixIndia) May 20, 2025 -
సడన్గా ఓటీటీకి వచ్చేసిన దెయ్యం సినిమా.. ఎక్కడ చూడాలంటే?
ఈ మధ్య ఓటీటీల్లో సినిమాలు తెగ సందడి చేసేస్తున్నాయి. ఎప్పుడో రిలీజైన చిత్రాలు ఉన్నట్లుండి ఓటీటీల్లో దర్శనమిస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ థ్రిల్లర్ సినిమా భవానీ వార్డ్ 1997 సడన్గా ఓటీటీలోకి వచ్చేసింది. గాయత్రీ గుప్తా, గణేశ్ రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలో సందడి చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాలో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది.అయితే ప్రస్తుతానికి ఈ మూవీ చూడాలంటే అద్దె చెల్లించాల్సిందే. రూ.99 అదనంగా చెల్లించి వీక్షించాల్సి ఉంటుంది. మనిషి చనిపోయిన తరువాత ఆత్మ దేవుడి దగ్గరకు వెళ్లాలి.. కానీ, అలా వెళ్లకుండా అదే ఆత్మ ఈవిల్ స్పిరిట్గా మారిపోతుందనే కాన్సెప్ట్తో ఈ మూవీని తెరకెక్కించారు. ఆద్యంతం ఆడియన్స్ను భయపెట్టేలా ఈ సినిమా ఉండనుంది. కాగా.. ఈ సినిమాకు జీడీ నరసింహా దర్శకత్వం వహించారు. జీడీఆర్ మోషన్ పిక్చర్, విభూ మీడియా సమర్పణలో చంద్రకాంత సోలంకి, జీడీ నరసింహా నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలైంది. హారర్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందని చెప్పొచ్చు. -
ఓటీటీలోకి 'హిట్ 3'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయిందా?
నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'హిట్ 3'. ఈనెల మొదట్లో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. మంచి టాక్ తెచ్చుకుంది కానీ అనుకున్నంత స్థాయిలో మాత్రం వసూళ్లు సాధించలేకపోయింది. ప్రస్తుతం అక్కడక్కడ ప్రదర్శితమవుతోంది. ఇకపోతే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ డేట్ లాక్ అయిందని అంటున్నారు. ఇంతకీ దీని సంగతేంటి?హిట్ ఫ్రాంచైజీలో వచ్చిన మూడో సినిమా ఇది. తొలి రెండు పార్ట్స్ సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకోగా.. ఇందులో మాత్రం సస్పెన్స్ తో పాటు యాక్షన్, రక్తపాతాన్ని కాస్త గట్టిగానే దట్టించారు. దీంతో ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ మూవీకి కాస్త దూరం జరిగారు. రూ.100 కోట్ల కలెక్షన్స్ మార్క్ దాటేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు)ఈ మూవీ డిజిటల్ హక్కుల్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. థియేటర్లలోకి వచ్చిన నాలుగు వారాలకే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేలా ఒప్పందం జరిగింది. ఈ క్రమంలోనే వచ్చే వారం చివర్లో లేదంటే జూన్ 5న ఓటీటీలోకి ఈ సినిమా రావొచ్చని తెలుస్తోంది. దీనితో పాటు సూర్య 'రెట్రో' కూడా కాస్త అటుఇటుగా ఇదే తేదీల్లో స్ట్రీమింగ్ అవ్వొచ్చు.హిట్ 3 విషయానికొస్తే.. అర్జున్ సర్కార్ (నాని) స్ట్రిక్ట్ పోలీస్. విచిత్రమైన మర్డర్ జరిగితే దాన్ని దర్యాప్తు చేస్తుంటాడు. అయితే ఇలాంటి హత్యలు దేశంలో చాలా చోట్ల జరుగుతున్నాయని తెలుస్తుంది. దీంతో ఆ టాస్క్ మీద అర్జున్ పూర్తిగా దృష్టిపెడతాడు. ఇంతకీ ఈ మర్డర్స్ వెనక ఉన్నది ఎవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: తెరపైకి తెలంగాణ అమర జవాన్ బయోపిక్!) -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు
మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో కేసరి 2, ఏస్, భోల్ చుక్ మాఫ్ తదితర సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇవి తప్పితే తెలుగు స్ట్రెయిట్ మూవీస్ ఏం రావట్లేదు. మరోవైపు ఓటీటీలో 30కి పైగా సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: నటుడు మాస్టర్ భరత్ ఇంట్లో విషాదం)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే చాలా వరకు ఇంగ్లీష్ మూవీస్-సిరీసులు రానున్నాయి. వీటితో పాటు అర్జున్ సన్నాఫ్ వైజయంతి, అభిలాషం చిత్రాలతో పాటు హార్ట్ బీట్ సీజన్ 2 సిరీస్ ఉన్నంతలో కాస్త చూడదగ్గవిగా అనిపిస్తున్నాయి. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాల లిస్ట్ (మే 19-23 వరకు)నెట్ ఫ్లిక్స్సారా సిల్వర్ మన్: పోస్ట్ మార్టమ్ (ఇంగ్లీష్ మూవీ) - మే 20ఎయిర్ ఫోర్స్ ఎలైట్ (ఇంగ్లీష్ సినిమా) - మే 23బిగ్ మౌత్ సీజన్ 8 (ఇంగ్లీష్ సిరీస్) - మే 23ఆఫ్ ట్రాక్ 2 (స్వీడిష్ మూవీ) - మే 23అన్ టోల్డ్: ద ఫాల్ ఆఫ్ ఫవ్ర్ (ఇంగ్లీష్ సినిమా) - మే 23అవర్ అన్ రిటిన్ సియోల్ (కొరియన్ సిరీస్) - మే 24ద వైల్డ్ రోబో (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 24అమెజాన్ ప్రైమ్మోటర్ హెడ్స్ (ఇంగ్లీష్ సినిమా) - మే 20అభిలాషం (మలయాళ మూవీ) - మే 23హాట్ స్టార్ట్రూత్ ఆర్ ట్రబుల్ (హిందీ రియాలిటీ షో) - మే 19టక్కీ ఇన్ ఇటలీ (ఇంగ్లీష్ సిరీస్) - మే 19ల్యాండ్ మ్యాన్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 21హార్ట్ బీట్ సీజన్ 2 (తెలుగు సిరీస్) - మే 22ఫైండ్ ద ఫర్జీ (హిందీ సిరీస్) - మే 23ఆహాఅర్జున్ సన్నాఫ్ వైజయంతి (తెలుగు సినిమా) - మే 23బుక్ మై షోఏ మైన్ క్రాఫ్ట్ మూవీ (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 20చెక్ మేట్స్ (స్పానిష్ సినిమా) - మే 20కూప్ (ఇంగ్లీష్ మూవీ) - మే 20డాగ్ మ్యాన్ (ఇంగ్లీష్ సినిమా) - మే 20డ్రాప్ (ఇంగ్లీష్ మూవీ) - మే 20యూఫస్ (ఇంగ్లీష్ సినిమా) - మే 20ఎల్లిప్సిస్ (స్పానిష్ మూవీ) - మే 20ఫెయిల్యూర్ (ఇంగ్లీష్ సినిమా) - మే 20ఫిల్మ్ లవర్స్ (ఫ్రెంచ్ మూవీ) - మే 20ఐ యామ్ నెవెంకా (స్పానిష్ సినిమా) - మే 20జూలియట్ ఇన్ స్ప్రింగ్ (ఫ్రెంచ్ మూవీ) - మే 20నార్బెర్ట్ (స్పానిష్ సినిమా) - మే 20ఓడిటీ (ఇంగ్లీష్ మూవీ) - మే 20రీటా (స్పానిష్ సినిమా) - మే 20విష్ యూ వర్ హియర్ (ఇంగ్లీష్ మూవీ) - మే 23ఆపిల్ ప్లస్ టీవీఫౌంటెన్ ఆఫ్ యూత్ (ఇంగ్లీష్ మూవీ) - మే 23(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్) -
ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్
ఈ వీకెండ్ ఓటీటీల్లో దాదాపు 25కి పైగా కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజయ్యాయి. మరికొన్ని సడన్ స్ట్రీమింగ్ అయ్యాయి. అలాంటి వాటిలో 'లవ్ డేల్' అనే సస్పెన్స్ థ్రిల్లర్ ఒకటి. పేరుకే మలయాళ సినిమా అయినప్పటికీ ఇప్పుడు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులో రిలీజైంది?(ఇదీ చదవండి: ఓటీటీలోకి కన్నడ మిస్టరీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్) ఫిబ్రవరిలో మలయాళంలో థియేటర్లలో రిలీజైన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'లవ్ డేల్'. కాస్త హారర్ టచ్ ఇచ్చిన ఈ మూవీలో అందరూ కొత్త నటీనటులే ఉండటంతో ఓ మాదిరి రెస్పాన్స్ మాత్రమే సొంతం చేసుకుంది. ఇప్పుడీ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ యూకేలో స్ట్రీమింగ్ లోకి వచ్చింది.ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో మన దగ్గర కూడా అందుబాటులోకి రానుంది. 'లవ్ డేల్' అనేది ఊటీలోని ఓ ఊరి పేరు. ఈ మూవీ విషయానికొస్తే మోడల్ కమ్ ఫొటోగ్రాఫర్ అయిన ఓ అమ్మాయి.. తన ఫ్రెండ్స్ తో కలిసి ఈ ఊరికి వస్తుంది. ఓ బంగ్లాలో వీళ్లంతా ఉంటారు. కానీ ఓ రోజు ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. ఇంతకీ వీళ్లని చంపుతున్నది ఎవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి కల్యాణ్ రాణ్ కొత్త సినిమా) -
యూట్యూబ్లో కొత్త సినిమా.. ఉచితంగానే స్ట్రీమింగ్
ప్రముఖ దర్శక కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ (Amma Rajasekhar) డైరెక్షన్లో ఆయన కుమారుడు అమ్మ రాగిన్ రాజ్ (Raagin Raj) హీరోగా నటించిన చిత్రం తల. తాజాగా ఈ చిత్రం యూట్యూబ్లో విడుదలైంది. అంకిత నస్కర్ హీరోయిన్గా యాక్ట్ చేసింది. రోహిత్, ఎస్తర్ నోరోన్హా, సత్యం రాజేష్, అజయ్, ముక్కు అవినాష్, రాజీవ్ కనకాల, ఇంద్రజ తదితరులు కీలకపాత్రలో నటించారు. నిర్మాత శ్రీనివాస్ గౌడ్.మదర్ సెంటిమెంట్తో అమ్మ రాజశేఖర్ ఈ మూవీని తెరకెక్కించాడు. ఆయన కుమారుడు రాగిన్ రాజ్కు ఇదే ఫస్ట్ సినిమా.. అయినప్పటికీ ఎలాంటి బెరుకు లేకుండా నటించాడు. ఈ మూవీలో రెండు పాటలకు తమన్ మ్యూజిక్ అందించడం విశేషం. అయితే, ఈ సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. మొదట్లో అద్దె ప్రాతిపదికన అందుబాటులో ఉన్న ఈ చిత్రం ప్రస్తుతం ఉచితంగానే రన్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ లేకుంటే యూట్యూబ్లో 'తల' సినిమాను చూడొచ్చు.కథహీరో రాగిన్ రాజ్ తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. ఆమె కోరిక మేరకు హీరో తండ్రి కోసం వెతుక్కుంటూ వెళ్తాడు. ఈ క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని దాటుకుని తండ్రిని కలుస్తాడు. తండ్రిని కలిసిన తర్వాత ఏం జరుగుతుంది? తండ్రి కుటుంబంలోని సమస్య ఏంటి? ఆ సమస్యను వారు ఎలా పరిష్కరిస్తారు? తనకు పరిచయమైన అమ్మాయి చివరిగా హీరోకు ఏమవుతుంది? అసలు హీరో తల్లిదండ్రులు కలుస్తారా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే! -
ఓటీటీలోకి కన్నడ మిస్టరీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
రీసెంట్ టైంలో ప్రతి భాషలోనూ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాల్ని తీస్తున్నారు. చాలా వరకు అవి హిట్ అవుతున్నాయి. ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి కూడా. అలా ఇప్పుడు కన్నడ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. స్ట్రీమింగ్ తేదీని ఫిక్స్ చేశారు. ఇంతకీ ఏంటా సినిమా? ఎప్పుడు రిలీజ్ కానుంది?సాధారణంగా థ్రిల్లర్స్ అంటే ఎక్కువగా మలయాళ ఇండస్ట్రీ పేరు వినిపిస్తుంది. తాజాగా కన్నడ చిత్రసీమ నుంచి వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ 'అజ్ఞాతవాసి'. ఏప్రిల్ 11న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. ప్రశంసలతో పాటు మంచి కలెక్షన్స్ కూడా అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని జీ5 ఓటీటీలోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి కల్యాణ్ రాణ్ కొత్త సినిమా) మే 28 నుంచి కన్నడతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ చేయనున్నారు. 25 ఏళ్లుగా అసలు నేరాలే జరగని ఓ ఊరిలో అనుమానాస్పద రీతిలో ఓ వ్యక్తిని చంపేస్తే ఏమైందనే కాన్సెప్ట్ తో 'అజ్ఞాతవాసి' తీశారు. థ్రిల్లర్స్ అంటే ఆసక్తి ఉంటే దీన్ని అస్సలు మిస్ కావొద్దు.అజ్ఞాతవాసి విషయానికొస్తే.. ఓ ఊరిలో గత 25 ఏళ్లుగా ఒక్క క్రైమ్ కూడా జరగదు. అలాంటి ఊరికి గోవిందు అనే పోలీస్.. బదిలీపై వస్తాడు. అంతా ప్రశాంతంగా ఉంది అనుకున్న టైంలో ఊరి పెద్ద హత్యకు గురవుతాడు. పంకజ, రోహిత్, శ్రీనివాసయ్య అనే ముగ్గురిపై గోవిందు అనుమానం వ్యక్తం చేస్తాడు. ఇంతకీ హంతకుడు ఎవరు? 1970లో ఇదే ఊరిలో జరిగిన సంఘటనకు ఈ హత్యకు సంబంధమేంటి? అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి :రెండు రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) -
మరో ఓటీటీలోకి కల్యాణ్ రాణ్ కొత్త సినిమా
ఒకే సినిమా రెండు మూడు ఓటీటీల్లోనూ రిలీజ్ అయిన సందర్భాలు అడపాదడపా ఉండనే ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్టులోకి చేరిపోయింది లేటెస్ట్ తెలుగు మూవీ. కల్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రలు చేసిన ఈ మూవీ ఇప్పటికే ఒకదానిలో రిలీజ్ కాగా.. ఇప్పుడు మరో దానిలోకి కూడా రాబోతుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.కల్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'. రిలీజ్ కి ముందు చాలా హడావుడి చేశారు గానీ సినిమాలో అంత సీన్ లేకపోయేసరికి ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. కట్ చేస్తే థియేటర్లలోకి వచ్చిన నెలలోపే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు (మే 16) నుంచి అందుబాటులోకి వచ్చింది.(ఇదీ చదవండి: 'బిగ్ బాస్'తో బలుపు పెరిగింది.. నా ఫ్రెండ్సే నన్ను..: సొహెల్) ఇప్పుడు ఆహా ఓటీటీలోనూ వచ్చే శుక్రవారం (మే 23) నుంచి స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు. తల్లికొడుకుల బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ ఎమోషనల్ డ్రామా మరి ఓటీటీలో ఏ మేరకు రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి?అర్జున్ సన్నాఫ్ వైజయంతి విషయానికొస్తే.. వైజయంతి (విజయశాంతి) సిన్సియర్ పోలీసాఫీసర్. ఈమె కొడుకు అర్జున్ కూడా పోలీస్ అయ్యేందుకు కష్టపడుతుంటారు. కానీ ఓ సందర్భంలో తన తండ్రిని చంపిన హంతకుడిని అందరూ చూస్తుండానే అర్జున్ చంపేస్తాడు. దీంతో తల్లికొడుకుల మధ్యం దూరం పెరుగుతుంది. మరి వీళ్లిద్దరూ కలిశారా? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి :రెండు రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) -
శవంతో కామెడీ.. క్రేజీ డార్క్ కామెడీ మూవీ రివ్యూ (ఓటీటీ )
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అలానే తాజాగా సోనీ లివ్ లోకి వచ్చిన డార్క్ కామెడీ మూవీ 'మరణమాస్'. మలయాళ నటుడు బాసిల్ జోసెఫ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో శవంతో కామెడీ చేయడం క్రేజీ అనే చెప్పొచ్చు. ఇంతకీ సినిమా ఎలా ఉంది? దీని సంగతేంటనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి :రెండు రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) కథేంటి?ముసలివాళ్లని మాత్రమే టార్గెట్ చేసే సీరియల్ కిల్లర్.. వారిని చంపేసి, నోటిలో అరటిపండు పెట్టి వెళ్లిపోతుంటాడు. అదే ఊరిలో ఉంటున్న ల్యూక్ (బాసిల్ జోసెఫ్).. బనానా కిల్లర్ అనే అనుమానంతో పోలీసులు అరెస్ట్ చేస్తారు. జెస్సీ(అనీష్మా) అనే అమ్మాయిని ల్యూక్ ప్రేమిస్తుంటాడు. ఓ రోజు జెస్సీ బస్సులో ఇంటికి తిరిగొస్తున్నప్పుడు ఓ ముసలివాడు ఈమెతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. కోపమొచ్చి అతడి ముఖంపై పెప్పర్ స్ప్రే కొడుతుంది. దీంతో చనిపోతాడు. అదే టైంకి ల్యూక్.. జెస్సీ కోసం బస్సు ఎక్కుతాడు. వీళ్లతో పాటే సదరు సీరియల్ కిల్లర్ కూడా బస్సులోనే ఉంటాడు. మరి సీరియల్ కిల్లర్ గురించి జెస్సీ, ల్యూక్ కి తెలిసిందా? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఎలా ఉందంటే?మన దగ్గర కొందరు దర్శకులు.. తీసిన కథలతోనే సినిమాలు తీసి తీసి ప్రేక్షకులకు చిరాకొచ్చేలా చేస్తుంటారు. ఏమంటే స్టోరీల్లేవు అని అంటుంటారు. అదే మలయాళంలో మాత్రం చాలా చిన్న పాయింట్ తీసుకుని వాటితో ఏకంగా మూవీస్ తీసేస్తుంటారు. అలా తీసిన చిత్రమే ఇది.మసలివాళ్లని మాత్రమే చంపి, వాళ్ల నోటిలో అరటిపండు పెట్టే సీరియల్ కిల్లర్. సినిమా మొదట్లోనే ఇతడెవరో చూపించేస్తారు. మరోవైపు హీరోహీరోయిన్ ప్రేమకథ, ఇంకోవైపు బస్సు డ్రైవర్, కండక్టర్ స్టోరీలు. దీనికి తోడు ఓ శవం. అసలు ఓ మనిషి చనిపోయాడని బయటకు తెలియకుండా ఉండేందుకు ఈ ఐదుగురు ఎలాంటి పాట్లు పడ్డారు. ఎలా నవ్వించారనేదే స్టోరీ.ఒకదానికి ఒకటి ఏ మాత్రం సంబంధం లేని పాత్రల్ని తీసుకొచ్చి ఓ వృద్ధుడి మరణంతో లింక్ చేయడం థ్రిల్లింగ్ గా ఉంటుంది. మరీ పగలబడి నవ్వేంత సీన్లు అయితే ఉండవు కానీ టైమ్ పాస్ అయిపోతుంది. చూస్తున్నంతసేపు సినిమా అలా నడిచేస్తూ ఉంటుంది. బనానా కిల్లర్ ఎందుకు ముసలి వాళ్లని మాత్రమే చంపుతున్నాడనే విషయాన్ని చివర్లో రివీల్ చేస్తారు గానీ అదేమంత ఇంట్రెస్టింగ్ గా అనిపించదు.శవంతో కామెడీ చేయడం ఏంటా అనిపిస్తుంది గానీ సినిమా చూస్తున్నప్పుడు అదేమంత ఇబ్బందిగా అనిపించదు. చివరలో ఓ ట్విస్ట్తో నవ్వులు పంచే ప్రయత్నం చేశారు. కథను కామెడీగా చెప్పినప్పటికీ.. అంతర్లీనంగా మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అమ్మాయిల ఆత్మరక్షణ లాంటి అంశాలు కూడా ఆలోచించేలా చేస్తాయి. ఎవరెలా చేశారు?డబ్బింగ్ చిత్రాలతో మనకు బాగా పరిచయమైన బాసిల్ జోసెఫ్.. ఎప్పటిలానే మరో డిఫరెంట్ పాత్రలో ఆకట్టుకున్నాడు. జట్టుకి కలర్ తో భలే వెరైటీగా కనిపిస్తాడు. హీరోయిన్ గా చేసిన అనీష్మా, సీరియల్ కిల్లర్ గా చేసిన శ్రీకుమార్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన పాత్రధారులు ఓకే.టెక్నికల్ గానూ సినిమా బాగుంది. పాటలేం లేవు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. సింపుల్ పాయింట్ ని వీలైనంత ఫన్నీగా తీయడానికి దర్శకుడు కష్టపడ్డాడు. ఈ ప్రయత్నంలో కొంతమేర సక్సెస్ అయ్యాడు. ఈ వీకెండ్ ఏదైనా కాస్త ఫన్, కాస్త థ్రిల్ ఉండే మూవీ చూద్దామనుకుంటే దీన్ని ప్రయత్నించండి. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. సోనీ లివ్ లో ప్రస్తుతం తెలుగులోనూ అందుబాటులో ఉంది.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఈ రోజుని ఎప్పటికీ గుర్తుంచుకుంటా.. అనసూయ పోస్ట్ వైరల్) -
మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా.. కానీ
ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేస్తుంటాయి. కొన్నిసార్లు థియేటర్లలో రిలీజైన కొన్ని వారాలకే స్ట్రీమింగ్ అయిపోతుంటాయి. ఇప్పుడు కూడా ఓ తెలుగు మూవీ అలానే ఓటీటీలోకి వచ్చింది. కాకపోతే ఇక్కడే ఓ ట్విస్ట్. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది?గత నెల 24న థియేటర్లలో రిలీజైన తెలుగు మూవీ 'చౌర్యపాఠం'. బ్యాంక్ దొంగతనం నేపథ్య కథతో తీశారు. బాగానే ప్రమోట్ చేశారు కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో మూడు వారాలకే ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ప్రస్తుతం ఓవర్సీస్ (విదేశాల్లో) తెలుగు వెర్షన్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.(ఇదీ చదవండి: ఈ రోజుని ఎప్పటికీ గుర్తుంచుకుంటా.. అనసూయ పోస్ట్ వైరల్) బహుశా వచ్చే వారం మన దేశంలో తెలుగు వెర్షన్ అందుబాటులోకి రావొచ్చు అనిపిస్తుంది. ప్రముఖ దర్శకుడు నక్కిన త్రినాథరావు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. నిఖిల్ దర్శకత్వం వహించాడు. ఇంద్రరామ్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లు కాగా మస్త్ అలీ, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటించారు. చౌర్యపాఠం విషయానికొస్తే.. వేదాంత్ రామ్(ఇంద్రరామ్)కి దర్శకుడు కావాలనేది కల. నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోయేసరికి బ్యాంక్ దొంగతనం చేసి ఆ డబ్బులతో సినిమా తీయాలని ఫిక్స్ అవుతాడు. బబ్లూ, జాక్ డాన్ అనే ఇద్దరిని తన ప్లాన్ లో భాగం చేస్తాడు. అదే బ్యాంకులో పనిచేస్తున్న అంజలి(పాయల్ రాధాకృష్ణ) వీళ్లకు తోడవుతుంది. తర్వాత ఏం జరిగిందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి :రెండు రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) -
ఓటీటీలో 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'.. ఉచితంగానే స్ట్రీమింగ్
విజయశాంతి (Vijayashanthi), నందమూరి కల్యాణ్రామ్ (Nandamuri Kalyan Ram) తల్లీ కుమారులుగా నటించిన సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ (Arjun son of Vyjayanthi) తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. భారీ యాక్షన్ కాన్సెప్ట్తో నూతన దర్శకుడు ప్రదీప్ చిలుకూరి(Pradeep Chilukuri) ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్పై అశోక్ వర్ధన్, సునీల్ నిర్మించారు. అమ్మ కోసం మనం ఎన్ని త్యాగాలైనా చేయొచ్చు అని చెప్పే అర్జున్ సన్నాఫ్ వైజయంతిని ఈ వీకెండ్లో ఇంట్లోనే చూసేయండి.ఏప్రిల్ 18న విడుదలైన అర్జున్ సన్నాఫ్ వైజయంతి తాజాగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు భారత్లో ఉచితంగానే స్ట్రీమింగ్ అవుతుంది. కొద్దిరోజుల క్రితం యూకేలో ఉన్నవాళ్లు అద్దె విధానంలో మాత్రమే చూసే అవకాశం కల్పిస్తూ ఓటీటీలో విడుదల చేశారు. అయితే, ఇప్పుడు సడెన్గా భారత్లో కూడా అందుబాటులోకి వచ్చేసింది. దీంతో అభిమానులు నెట్టింట షేర్ చేస్తున్నారు.అర్జున్ సన్నాఫ్ వైజయంతి కథ విషయానికొస్తే.. సీన్సియర్ పోలీస్ ఆఫీసర్ వైజయంతి (విజయశాంతి). ఈమెకు ఓ కొడుకు అర్జున్ (కల్యాణ్ రామ్). ఐపీఎస్ అవ్వడానికి రెడీగా ఉన్న ఇతడు.. తండ్రిని ఓ క్రిమినల్ చంపేశాడని పగతో రగిలిపోతుంటాడు. తల్లికి ఇదంతా ఇష్టముండదు. అనుకోని పరిస్థితిలో అర్జున్ ఆ హంతకుడిని అందరూ చూస్తుండగా చంపుతాడు. అప్పటి నుంచీ తల్లీకొడుకుల మధ్య దూరం పెరుగుతుంది. చివరకు వారిద్దరూ ఎలా కలుసుకున్నారు..? తల్లి కోసం కొడుకు చేసిన త్యాగం ఏంటి? అనేదే మిగతా స్టోరీ. -
రెండు రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలో 'ఎలెవన్' అనే చిన్న సినిమా తప్పితే చెప్పుకోదగ్గ రిలీజులు ఏం లేవు. మరోవైపు ఓటీటీలో మాత్రం 24 కొత్త మూవీస్-వెబ్ సిరీసులు వచ్చేశాయి. ఇవన్నీ రెండు రోజుల్లోనే స్ట్రీమింగ్ కావడం విశేషం.(ఇదీ చదవండి: డేటింగ్లో సమంత.. స్పందించిన మేనేజర్)ఓటీటీల్లోకి వచ్చిన వాటిలో మరణమాస్, అర్జున్ సన్నాఫ్ వైజయంతి, గేంజర్స్, జాలీ ఓ జింఖానా చిత్రాలు ఉన్నంతలో చూడదగ్గవి. ఇవి కాకుండా మరికొన్ని ఇంగ్లీష్, హిందీ మూవీస్ కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలోకి ఏ మూవీ వచ్చిందంటే?ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చిన సినిమాలు (మే 16)అమెజాన్ ప్రైమ్అర్జున్ సన్నాఫ్ వైజయంతి - తెలుగు మూవీభోల్ చుక్ మాఫ్ - హిందీ సినిమాఏ వర్కింగ్ మ్యాన్ - తెలుగు డబ్బింగ్ మూవీగేంజర్స్ - తెలుగు డబ్బింగ్ సినిమాలవ్ ఆఫ్ రెప్లికా సీజన్ 1 - చైనీస్ సిరీస్వైట్ ఔట్ - ఇంగ్లీష్ మూవీ (రెంట్)వన్ ఆఫ్ దెమ్ డేస్ - ఇంగ్లీష్ సినిమాసలాటే సలనాటే - మరాఠీ మూవీవన్ లైఫ్ - ఇంగ్లీష్ సినిమామనడ కడలు - కన్నడ మూవీసోనీ లివ్ మరణమాస్ - తెలుగు డబ్బింగ్ సినిమానెట్ ఫ్లిక్స్ద క్విల్టర్స్ - ఇంగ్లీష్ మూవీబెట్ - తెలుగు డబ్బింగ్ సిరీస్ఐ సా ద టీవీ గ్లో - ఇంగ్లీష్ మూవీజానెట్ ప్లానెట్ - ఇంగ్లీష్ సినిమాసాసాకీ అండ్ పీప్స్ - జపనీస్ సిరీస్వినీ జూనియర్ - పోర్చుగీస్ మూవీహాట్ స్టార్డస్టర్ - ఇంగ్లీష్ సిరీస్హే జునూన్ - హిందీ సిరీస్వుల్ఫ్ మ్యాన్ - ఇంగ్లీష్ మూవీ (మే 17)సన్ నెక్స్ట్నెసిప్పయ - తమిళ మూవీఆపిల్ ప్లస్ టీవీడియర్ ప్రెసిడెంట్ నౌ - ఇంగ్లీష్ సినిమామర్డర్ బాట్ - ఇంగ్లీష్ సిరీస్ఆహాజాలీ ఓ జింఖానా - తెలుగు డబ్బింగ్ సినిమా(ఇదీ చదవండి: 'పద్మ భూషణ్' చేయాల్సిన పనులేనా..? బాలకృష్ణపై విమర్శలు) -
ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లింగ్ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
కోలీవుడ్ స్టార్ కమెడియన్ వడివేలు, దర్శకుడు సుందర్ సి కలిసి నటించిన 'గ్యాంగర్స్' చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన మూడు వారాల్లోనే ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. సుమారు 15 ఏళ్ల తరువాత వీరిద్దరూ కలిసి నటించడంతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. అయితే, బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించేలా కలెక్షన్స్ రాబట్టింది. ఖుష్బు సుందర్ నిర్మించిన ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహించారు.'గ్యాంగర్స్' తమిళ యాక్షన్ కామెడీ మూవీ తాజాగా 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో సడెన్గా స్ట్రీమింగ్కు వచ్చేసింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలో స్ట్రీమింగ్ అవుతుంది. సినిమా విడుదలైన మూడు వారాల్లోనే ఓటీటీలోకి ఈ చిత్రం రావడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమాలో కేథరిన్ థ్రెసా, మునిష్కాంత్, భగవతి పెరుమాల్ నటించగా వెంకట్ రాఘవన్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు.వినోదభరిత కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో వడివేలు సింగారన్ అనే పాత్రలో నటించారు. ఒక చిన్న పట్టణంలో ఉండే పాఠశాలలో ఒక బాలిక తప్పిపోతుంది, ఉపాధ్యాయురాలు సుజిత (కేథరిన్ థ్రెసా) ఆమెను కనుగొనమని పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. ఈ కేసును పూర్తి చేసేందుకు ఓ పోలీసు అధికారి రహస్యంగా అదే స్కూల్లో పీటీగా అండర్ కవర్లో నియమించబడతారు. పోలీస్ అధికారి రాకతో అసలు పీటీ (వడివేలు) పరిస్థితి ఏంటి..? ఇన్వెస్టిగేషన్ సాగుతున్న క్రమంలోనే కథ మరో మలుపు తిరుగుతుంది. స్థానికంగా ఉండే ముగ్గురు రౌడీల వద్ద ఉన్న డబ్బును దోచుకోవడానికి కొందరు ప్రయత్నిస్తారు. వీరికి, తప్పిపోయిన బాలికకు ఉన్న లింక్ ఏంటి..? వంటి అంశాలు చాలా ఆసక్తిగా ఉంటాయి. -
6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. స్టార్ హీరోలు, యంగ్ హీరోల నటించిన చిత్రాలు వీలైనంత త్వరగా వచ్చేస్తాయి. కానీ కొన్ని చిన్న మూవీస్ కి మాత్రం చాన్నాళ్లకు స్ట్రీమింగ్ అవుతుంటాయి. అలా ఓ తెలుగు సినిమా దాదాపు ఆరు నెలల తర్వాత సడన్ గా వచ్చేసింది.గతేడాది నవంబర్ లో రిలీజైన తెలుగు మూవీ 'సినిమా పిచ్చోడు'. కుమారస్వామి హీరోగా నటించి దర్శకత్వం వహించాడు. పెద్దగా ఆకట్టుకోని స్టోరీ, తక్కువ బడ్జెట్ తో తీసిన చిత్రం కావడంతో థియేటర్లలోకి వచ్చి వెళ్లిన సంగతి కూడా చాలామందికి తెలియదు. ఇప్పుడు ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి రెంట్ విధానంలో అందుబాటులోకి వచ్చింది.(ఇదీ చదవండి: రోజుకు రూ.20 జీతానికి పనిచేశా.. హీరో ఎమోషనల్ వీడియో) సినిమా పిచ్చోడు విషయానికొస్తే.. జోష్ అలియాస్ కుమారస్వామి గ్రామంలో పాలు అమ్ముతుంటాడు. కానీ సినిమాలంటే పిచ్చి. అందుకే ఊరిలో వాళ్లని పేరుతో కాకుండా సినిమా పేర్లతో పిలుస్తుంటాడు. ఓసారి భాను.. డెమో ఫిల్మ్ తీసేందుకు జోష్ ఉంటున్న ఊరికి వస్తుంది. ఈ క్రమంలో అనుకోకుండానే జోష్ కి నటించే అవకాశమొస్తుంది. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ విషయానికొస్తే.. మరణమాస్, భోల్ చుక్ మాఫ్, నెసిప్పయ అనే సినిమాలు రాబోతున్నాయి. గత వీకెండ్ లో రాబిన్ హుడ్, గుడ్ బ్యాడ్ అగ్లీ, జాక్, ఓదెల 2, కాలమే కరిగింది తదితర తెలుగు చిత్రాలు వచ్చాయి. ఈ వీకెండ్ మరి ఏమేం తెలుగు మూవీస్ ఓటీటీలోకి వస్తాయో చూడాలి?(ఇదీ చదవండి: గుడ్ న్యూస్.. సుడిగాలి సుధీర్ ఇంట్లో సంబరాలు) -
ఓటీటీలోకి మరింత లేటుగా రీసెంట్ హిట్ సినిమా
కొన్ని సినిమాలు ఊహించిన దానికంటే సూపర్ హిట్ అవుతుంటాయి. అదిరిపోయే కలెక్షన్స్ సాధిస్తుంటాయి. రీసెంట్ టైంలో అలా ఏ మాత్రం అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చి బ్లాక్ బస్టర్ అయిన మూవీ 'తుడరమ్'. మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ చిత్ర ఓటీటీ రిలీజ్ మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది.మార్చి చివర్లో ఎల్ 2:ఎంపురాన్ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించిన మోహన్ లాల్ కాస్త నిరాశపరిచాడు. ఇది వచ్చిన నెలరోజులకే 'తుడరమ్' చిత్రంతో వచ్చారు. ఊహించని విధంగా ఇది సక్సెస్ అయింది. ప్రస్తుతం రూ.200 కోట్లకు పైగా వసూళ్లుతో ఇంకా థియేటర్లలో రన్ అవుతూనే ఉంది.(ఇదీ చదవండి: తిరుమల శ్రీవారికి అవమానం? వివాదంపై స్పందించిన హీరో)అసలు ప్రచారమే లేకుండా తెలుగులోనూ రిలీజ్ చేస్తే రూ.2 కోట్ల మేర వసూళ్లు వచ్చాయట. దీంతో ఓటీటీ రిలీజ్ విషయంలో ప్లాన్ మారిందట. లెక్క ప్రకారం గత వారం స్ట్రీమింగ్ కావాలి. కానీ థియేటర్లలో ఇంకా ఆదరణ వస్తున్న దృష్ట్యా ఓటీటీ రిలీజ్ మరికొన్నాళ్లు ఆలస్యం కానుందట. అంటే జూన్ లో స్ట్రీమింగ్ కావొచ్చని తెలుస్తోంది.తుడరమ్ విషయానికొస్తే.. బెంజ్ అనే ట్యాక్సీ డ్రైవర్. అతడి భార్య లలిత. రన్ని అనే ఓ చిన్న ఊళ్లో వీళ్లు తమ ఇద్దరు పిల్లలో హాయిగా జీవిస్తుంటారు. బెంజ్ కు ఓ బ్లాక్ అంబాసిడర్ కారు ఉంటుంది. అదంటే అతనికి ఎంతో ఇష్టం. ఒకరోజు బెంజ్ కొడుకు ఫ్రెండ్స్ ఆ కారును చెన్నైకి తీసుకెళ్తారు. అదే కథని మలుపు తిప్పుతుంది. ఆ కారులో గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారంటూ పోలీసులు సీజ్ చేస్తారు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: రాంగ్ రూట్ లో తెలుగు హీరో.. నిలదీసిన కానిస్టేబుల్) -
ఓటీటీలోకి సస్పెన్స్, థ్రిల్లర్ ‘కన్ఖజురా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
మలయాళ నటుడు రోషన్ మాథ్యూ,బాలీవుడ్ నటుడు మోహిత్ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘కన్ఖజురా’ టీజర్ తాజాగా రిలీజైంది. ఈ సిరీస్ గోవాలో జరిగే నేరాల చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందింది. నిశ్శబ్దం మోసపూరితంగా, బయటకు కనిపించే దానికంటే ప్రమాదకరంగా ఉంటుందనే ట్యాగ్లైన్తో ఈ సిరీస్ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. విమర్శకుల ప్రశంసలు పొందిన ఇజ్రాయెల్ సిరీస్ ‘మాగ్పీ’ ఆధారంగా ఈ సిరీస్ను హిందీ ప్రేక్షకుల కోసం అనువదించగా, భారతీయ ప్రేక్షకుల సంస్కృతికి తగ్గట్టు స్థానికీకరణ చేసి తెరకెక్కించారు.‘కన్ఖజురా’ కథ విడిపోయిన ఇద్దరు సోదరుల మధ్య జరిగే సంఘర్షణ, వారి చీకటి గతంతో పోరాటం, జ్ఞాపకశక్తి మరియు వాస్తవికత మధ్య నలిగిపోయే సంఘటనల చుట్టూ నడుస్తుంది. ఈ కథలో భావోద్వేగ తీవ్రత, గందరగోళం, మరియు నిశ్శబ్దంలో దాగి ఉన్న తుఫాను వంటి అంశాలు ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉన్నాయి.సిరీస్లో కీలక పాత్ర పోషించిన నటుడు రోషన్ మాథ్యూ మాట్లాడుతూ, “‘కన్ఖజురా’ ఒక ఎమోషనల్ రోలర్కోస్టర్. ఈ కథలోని భావోద్వేగ తీవ్రత, నిశ్శబ్దంలో దాగి ఉన్న గందరగోళం నన్ను ఈ పాత్రలో నటించేలా ప్రేరేపించాయి. నా పాత్ర ‘అషు’లో బహుముఖీయత ఉంది. ఒక్కో క్షణంలో ఒక్కోలా మారుతూ, లోపల నిశ్శబ్ద తుఫానును మోస్తుంది. ఈ సిరీస్ ప్రేక్షకుల హృదయాలను కదిలించడమే కాకుండా, వారిని వెంటాడుతుంది” అని అన్నారు.ఈ చిత్రానికి అరోరా దర్శకత్వం వహించగా, అజయ్ రాయ్ నిర్మాతగా వ్యవహరించాడు. సారా జేన్ డయాస్, మహేష్ శెట్టి, నినాద్ కామత్, త్రినేత్ర హల్దార్, హీబా షా ఇతర కీలక పాత్రలు పోషించారు. మే 30 నుంచి ఈ వెబ్ సిరీస్ సోనీ లివ్లో స్ట్రీమింగ్ కానుంది. View this post on Instagram A post shared by Sony LIV (@sonylivindia) -
థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో టాప్-2లో ట్రెండింగ్!
సిద్ధు జొన్నలగడ్డ (siddhu jonnalagadda) నటించిన జాక్ సినిమా ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఇందులో వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు ఈ మూవీని నిర్మించారు. ఏప్రిల్ 10న విడుదలైన థియేటర్లలో విడుదలై భారీ డిజాస్టర్గా మిగిలిపోయింది.అయితే జాక్ మూవీ ఓటీటీలో మాత్రం దూసుకెళ్తోంది. మే 8 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న జాక్ ఏకంగా ట్రెండింగ్లోకి వచ్చేసింది. నెట్ఫ్లిక్స్లో ప్రస్తుతం జాక్ మూవీ టాప్-2లో ట్రెండ్ అవుతోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళంలో అందుబాటులో ఉంది.డీజే టిల్లు, టిల్లు స్వ్కేర్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సిద్ధు.. జాక్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని అనుకున్నాడు. కానీ అంచనాలు తప్పడంతో అంతా రివర్స్ అయింది. ఈ చిత్రానికి మొదటి రోజు కేవలం రూ.కోటిన్నర నుంచి రూ.2 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. సుమారు రూ. 36 కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తే బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 7 కోట్లు మాత్రమే రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి.#Jack is back… and he’s trending! 💥Now streaming and sitting pretty at #2 on @NetflixIndia!❤️🔥Watch now in Telugu, Tamil, Hindi, Kannada & Malayalam!🔗 https://t.co/PjBIjRjVYv#JackOnNetflix #SidduJonnalagadda @iamvaishnavi04 @baskifilmz @Prakashraaj #AchuRajamani… pic.twitter.com/HZotUC59tU— SVCC (@SVCCofficial) May 13, 2025 -
ఓటీటీలోకి వచ్చేసిన ప్రభుదేవా కామెడీ ఎంటర్టైనర్!
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు డబ్బింగ్ చిత్రాలు నేరుగా తెలుగు స్ట్రీమింగ్ అయిపోతుంటాయి. ఇప్పుడు అలానే ఓ తమిళ కామెడీ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు తేదీని అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఏంటా మూవీ? ఎందులో స్ట్రీమింగ్ కానుంది?కొరియోగ్రాఫర్ గా మనకు తెలిసిన ప్రభుదేవా.. గత కొన్నాళ్ల నుంచి పూర్తిస్థాయి నటుడిగా మారిపోయాడు. హీరో, సహాయ పాత్రల్లో నటిస్తున్నాడు. ఇతడు హీరోగా నటించిన మూవీ 'జాలీ ఓ జింఖానా'. గతేడాది నవంబరులో తమిళంలో థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు తెలుగు వెర్షన్ ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.(ఇదీ చదవండి: కొత్తింట్లోకి అడుగుపెట్టిన అనసూయ.. ఇంటికి పేరు కూడా)నేటి(మే 15) నుంచి ఆహా ఓటీటీలో ఈ కామెడీ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కానుంది. శవం బ్యాక్ డ్రాప్ కథతో తీసిన ఈ చిత్రం తమిళంలో జనాల్ని ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు తెలుగు వెర్షన్ ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. 'జాలీ ఓ జింఖానా' విషయానికొస్తే.. తంగసామి అనే వ్యక్తి కొందరు మహిళలతో కలిసి హోటల్ నడుపుతుంటాడు. అనుకోకుండా ఆ ప్రాంత ఎమ్మెల్యేతో వీళ్లకు గొడవ అవుతుంది. దీని తర్వాత మరో సమస్య వస్తుంది. దీన్ని నుంచి గట్టెక్కిస్తాడని ఓ లాయర్ దగ్గరకు వీళ్లంతా వెళ్తారు. అతడికి కలవడానికి వెళ్లేసరికి అతడు శవమై కనిపిస్తాడు. ఇంతకీ ఎలా చనిపోయాడు? బతికున్నాడని కవర్ చేయడానికి ఎలాంటి పాట్లు పడ్డారనేదే స్టోరీ.(ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' సినిమా)They packed bags, snacks… and a dead body? 🚗💀Discover the most unexpected family journey in #JollyOGymkhana on aha!Watch #jollyogymkhana from May 15 on #aha#prabhudeva #Pujithaponnada #yogibabu #MadonnaSebastian pic.twitter.com/LGhsS1qCCW— ahavideoin (@ahavideoIN) May 13, 2025 -
ఓటీటీల్లో వెబ్ సిరీస్లు.. మోస్ట్ అవైటేడ్ ఇవే!
ఓటీటీలు వచ్చాక సినిమాలు, వెబ్ సిరీస్లకు కొదవే లేదు. థియేటర్లలో రిలీజైన నెలలోపే కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. ఇకపోతే వెబ్ సిరీస్లు సైతం ఓటీటీ ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. మిస్టరీ, క్రైమ్ సిరీస్లతో పాటు కామెడీ వెబ్ సిరీస్లు సైతం వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్లో వెబ్ సిరీస్లకు ఫుల్ డిమాండ్ ఉంది. అందుకే వరుస సీజన్లతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. గతేడాది మెప్పించిన సిరీస్లు.. కొత్త ఏడాదిలోనూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. వాటిలో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్న వాటిపై మనం ఓ లుక్కేద్దాం పదండి.రానా నాయుడు సీజన్-2..విక్టరీ వెంకటేశ్, రానా దగ్గుబాటి నటించిన డార్క్ కామెడీ వెబ్ సిరీస్ రానా నాయుడు. గతంలో విడుదలైన ఈ సిరీస్ సూపర్ హిట్గా నిలిచింది. ఈ వెబ్ సిరీస్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్కు కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్.వర్మ దర్శకత్వం వహించారు. ఇందులో వెంకటేశ్ నాగ నాయుడు (తండ్రి), రానా.. రానా నాయుడు (కొడుకు) పాత్రలు పోషించారు. సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయిన సంగతి తెలిసిందే. రానా నాయుడు సీజన్-2 త్వరలోనే నెట్ఫ్లిక్స్లో ప్రసారం కానుంది.పంచాయత్ సీజన్-4..పంచాయత్ వెబ్ సిరీస్కు ఆడియన్స్లో విపరీతమైన క్రేజ్ను సొంతం చేసుకుంది. జితేంద్ర కుమార్, నీనా గుప్తా ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సిరీస్ ఇప్పటికే మూడూ సీజన్స్ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ ఏడాది పంచాయత్ సీజన్ 4 కూడా స్ట్రీమింగ్కు వస్తోంది. జూలై 2వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి రానుంది.ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్-3బాలీవుడ్లో అభిమానుల క్రేజ్ దక్కించుకున్న మరో వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్. మనోజ్ భాజ్పేయి కీలక పాత్రలో వచ్చిన ఈ సిరీస్ ఇప్పటికే రెండు సీజన్స్ సూపర్ హిట్గా నిలిచాయి. ఈ నేపథ్యంలోనే మూడో సీజన్ కూడా అలరించేందుకు వస్తోంది. ఈ సంవత్సరం నవంబర్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.అసుర్ సీజన్-3..మరో బాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ అసుర్ మూడవ సీజన్ కూడా వస్తోంది. అర్షద్ వార్సీ, బరున్ సోబ్తి, అనుప్రియ గోయెంకా నటించిన ఈ సిరీస్ ఈ ఏడాది చివర్లో ప్రముఖ ఓటీటీ జియో హాట్స్టార్లో ప్రసారం కానుంది.మిర్జాపూర్ సీజన్- 4..మరో సూపర్ హిట్ వెబ్ సిరీస్ మీర్జాపూర్. ఇప్పటికే మూడు సీజన్స్ హిట్కాగా.. మీర్జాపూర్ సీజన్-4 కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే కొత్త సీజన్ రిలీజ్ ఎప్పడనేది ఇప్పటివరకు ప్రకటించలేదు.ఫర్జీ సీజన్-2..విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్ కీలక పాత్రల్లో వచ్చిన సూపర్ హిట్ సిరీస్ ఫర్జీ. సీజన్ -1 హిట్ కావడంతో అభిమానులు రెండవ సీజన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్ సీజన్ 2 డిసెంబర్ ప్రారంభంలో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సుంది. -
ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఇవే
మరో వారం వచ్చేసింది. కాకపోతే ఈసారి థియేటర్లలో పెద్దగా సినిమాలు రిలీజ్ కావట్లేదు. దీంతో గతవారం రిలీజైన సింగిల్, శుభం చిత్రాలే ఉండనున్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ చెప్పుకోదగ్గర మూవీస్ ఏం లేవు.(ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' సినిమా) ఉన్నంతలో 8 సినిమాలు-సిరీసులు మాత్రమే ప్రస్తుతానికి స్ట్రీమింగ్ కానున్నాయి. వీకెండ్ వచ్చేసరికి సడన్ సర్ ప్రైజ్ అన్నట్లు రిలీజులు ఉండొచ్చు. ఈ వారం చూడదగ్గ వాటిలో మరణమాస్, నెసిప్పయ, భోల్ చుక్ మాఫ్ చిత్రాలు ఉన్నంతలో చూడొచ్చని అనిపిస్తున్నాయి.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (మే 12-18 వరకు)నెట్ ఫ్లిక్స్సీ4 సింటా (తమిళ సినిమా) - మే 12హాట్ స్టార్ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్: ద వార్ ఆఫ్ ద రోహ్రిమ్ (ఇంగ్లీష్ సినిమా) - మే 13హై జునూన్ (హిందీ సిరీస్) - మే 16వూల్ఫ్ మ్యాన్ (ఇంగ్లీష్ సినిమా) - మే 17అమెజాన్ ప్రైమ్భోల్ చుక్ మాఫ్ (హిందీ మూవీ) - మే 16సోనీ లివ్మరణమాస్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 15సన్ నెక్స్ట్ నెసిప్పయ (తమిళ సినిమా) - మే 16బుక్ మై షో స ల టే స ల న టే (మరాఠీ సినిమా) - మే 13మనోరమ మ్యాక్స్ప్రతినిరపరాధి యానో (మలయాళ మూవీ) - మే 12(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'రాబిన్ హుడ్' సినిమా) -
హార్ట్ బీట్ పెంచే వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
కోలీవుడ్ వెబ్ ప్రపంచంలో హార్ట్బీట్ సిరీస్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆస్పత్రి నేపథ్యంలో సాగే ఈ వెబ్ సిరీస్లో కుటుంబ అంశాలు, ప్రేమ, ఒక తల్లి ప్రేమ కోసం యువతి పడే ఆరాటం కనిపిస్తుంది. సెంటిమెంట్, పదవి కోసం పోరాటం అంటూ పలు ఆసక్తికరమైన అంశాలతో ఈ సిరీస్ను తెరకెక్కించారు. జియో హాట్ స్టార్లో స్ట్రీమింగ్ అయినా హార్ట్బీట్ వెబ్ సిరీస్కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.ఈ వెబ్ సిరీస్ సూపర్ హిట్ కావడంతో దీనికి కొనసాగింపుగా సీజన్–2 రూపొందించారు మేకర్స్. ఈ సిరీస్కు దీపక్ సుందర రాజన్ దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. రెజిమల్ సూర్య థామస్ ఛాయాగ్రహణం, చరణ్ రాఘవన్ సంగీతాన్ని అందించారు. ఏ టెలీ ఫ్యాక్టరీ ప్రొడక్షన్స్ పతాకంపై రాజవేలు నిర్మించిన ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు.ఈనెల 22 నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. తెలుగు, తమిళం, హిందీలో భాషల్లో అందుబాటులో ఉండనుందని ప్రకటించాకరు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పాటను విడుదల చేశారు. కాగా.. ఈ సిరీస్లో దీపా బాలు, అనుమోన్, యోగలక్ష్మీ, శర్వ, శబరీశ్, చారుకేశ్, రామ్, చంద్రశేఖర్, గిరి ద్వారకేశ్, రేయ ముఖ్య పాత్రలు పోషించారు. వీరితోపాటు అక్షిత, శివం, అబ్దుల్, అమైయ, టీఎం కార్తీక్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. The wait ends with a beat.. Save the date May 22 ❤️❤️🩺#HotstarSpecials Heart Beat Season 2 Streaming from May 22 only on JioHotstar#HotstarSpecials #HeartBeatSeason2 #HeartBeatS2 #HB2 #HB2ComingSoon #LubDubOnHotstar #HeartBeatS2OnHotstar #HeartBeatS2onJioHotstar… pic.twitter.com/cLIci1QpOb— JioHotstar Tamil (@JioHotstartam) May 10, 2025 -
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త తెలుగు సినిమా
మరో కొత్త తెలుగు సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ వీకెండ్ దాదాపు 30కి పైగా మూవీస్-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ లోకి వచ్చాయి. వీటిలో ఓదెల 2, గుడ్ బ్యాడ్ అగ్లీ, జాక్ తదితర తెలుగు చిత్రాలు ఉన్నాయి. వీటితో పాటు కల్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ కూడా ఎలాంటి హడావుడి లేకుండా డిజిటల్ గా అందుబాటులోకి వచ్చింది.కల్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'. తల్లి కొడుకు సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ తో తీసిన ఈ చిత్రం ఏప్రిల్ 18న థియేటర్లలోకి వచ్చింది. రిలీజ్ కి ముందు చాలా హడావుడి చేశారు గానీ మూవీలో అంత సీన్ లేకపోయేసరికి ఓ మాదిరి కలెక్షన్స్ సొంతం చేసుకుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'రాబిన్ హుడ్' సినిమా) ఇకపోతే ఇప్పుడు మూడు వారాల్లోనే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ.. యూకేలో ఉన్నవాళ్లు అద్దె విధానంలో మాత్రమే చూడొచ్చు. రాబోయే శుక్రవారం లేదా గురువారం ఇండియాలో అందుబాటులోకి రావొచ్చేమో?అర్జున్ సన్నాఫ్ వైజయంతి విషయానికొస్తే.. సీన్సియర్ పోలీస్ ఆఫీసర్ వైజయంతి (విజయశాంతి). ఈమెకు ఓ కొడుకు అర్జున్ (కల్యాణ్ రామ్). ఐపీఎస్ అవ్వడానికి రెడీగా ఉన్న ఇతడు.. తండ్రిని ఓ క్రిమినల్ చంపేశాడని పగతో రగిలిపోతుంటాడు. తల్లికి ఇదంతా ఇష్టముండదు. అనుకోని పరిస్థితిలో అర్జున్ ఆ హంతకుడిని అందరూ చూస్తుండగా చంపుతాడు. అప్పటి నుంచీ తల్లీకొడుకుల మధ్యలో ఒక గ్యాప్. చివరకు ఏమైంది? తల్లికొడుకులు కలిశారా? అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఒక్క వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన 32 మూవీస్) -
రూ.60 కోట్ల దావా.. ఓటీటీ రిలీజ్ పై హైకోర్ట్ జోక్యం
ఇప్పుడంతా ఓటీటీ ట్రెండ్ నడుస్తోంది. థియేటర్లలో రిలీజైన చాలా సినిమాలు.. తక్కువ రోజుల్లోనే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. మరికొన్ని నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. కానీ రీసెంట్ గా 'భోల్ చుక్ మాఫ్' అనే హిందీ చిత్రం మాత్రం విడుదలకు మరోరోజు ఉందనగా.. ఓటీటీలోకి వచ్చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు కోర్టుకెక్కింది.లెక్క ప్రకారం 'భోల్ చుక్ మాఫ్' సినిమా మే 09న థియేటర్లలో రిలీజ్ అవ్వాలి. అందుకు తగ్గట్లే ప్రమోషన్స్ చేశారు. థియేటర్లలో బుకింగ్స్ ఓపెన్ చేశారు. చాలామంది టికెట్స్ కూడా కొనుకున్నారు. కానీ రిలీజ్ కి ఒకరోజు ముందు నిర్మాతలు అందరికీ షాకిచ్చారు. మే 16 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో మూవీ స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించారు.(ఇదీ చదవండి: ఒక్క ఫ్రేమ్ లో 19 మంది తెలుగు యంగ్ డైరెక్టర్స్.. ఏంటి విశేషం?) దీంతో ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్.. బాంబే హైకోర్టుని ఆశ్రయించింది. ఈ సినిమా కోసం తాము చాలా ఖర్చు చేశామని, ఇప్పుడు ఇలా ఓటీటీలో రిలీజ్ చేయడం సరికాదని రూ.60 కోట్ల దావా వేసింది. కట్ చేస్తే ఇప్పుడు ఓటీటీ రిలీజ్ పై హైకోర్ట్ స్టే ఇచ్చింది. అంటే తదుపరి ఆర్డర్ వచ్చేంతవరకు మూవీని ఎక్కడా విడుదల చేయడానికి వీల్లేదనమాట. రాజ్ కుమార్ రావ్, వామికా గబ్బి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాలో భారత క్రికెటర్ చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ ఐటమ్ సాంగ్ చేయడం విశేషం. ప్రస్తుతం కోర్టులో ఉన్న ఈ వ్యవహారంలో తర్వాత ఏం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: దర్శకుడి డ్రీమ్ కార్.. గిఫ్ట్ ఇచ్చిన సూర్య-కార్తీ) -
ఓటీటీలోకి వచ్చేసిన 'రాబిన్ హుడ్' సినిమా
హీరో నితిన్ లేటెస్ట్ మూవీ 'రాబిన్ హుడ్' ఓటీటీలోకి వచ్చేసింది. మార్చిలో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిలైంది. కామెడీ మూవీ అన్నారు గానీ ప్రేక్షకుల్ని పూర్తిస్థాయిలో నవ్వించలేకపోయింది. ఇప్పుడీ చిత్రం అటు టీవీ, ఇటు ఓటీటీలోకి ఒకేసారి వచ్చింది.(ఇదీ చదవండి: భార్యకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన డాక్టర్ బాబు) నితిన్-శ్రీలీల జంటగా నటించిన రాబిన్ హుడ్.. ఉగాది కానుకగా మార్చి 28న థియేటర్లలోకి వచ్చింది. ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. ఇక డిజిటల్ హక్కులు దక్కించుకున్న జీ5 సంస్థ.. తాజాగా శనివారం నాడు సాయంత్రం 6 గంటలకు టీవీలో టెలికాస్ట్ చేసింది. అదే టైంలో ఓటీటీలోకి కూడా తీసుకొచ్చేసింది. గతంలో సంక్రాంతి వస్తున్నాం చిత్రానికి ఇలానే చేసి మంచి వ్యూయర్ షిప్ సొంతం చేసుకున్నారు. రాబిన్ హుడ్ విషయానికొస్తే.. రామ్ అలియాస్ రాబిన్ హుడ్ (నితిన్) చిన్నప్పుడే దొంగగా మారతాడు. ధనవంతుల నుంచి డబ్బులు దొంగిలించి అనాథ శరణాలయాలకు దానం చేస్తుంటాడు. మరోవైపు రుద్రకొండలో కరుడుగట్టిన విలన్ ఉంటాడు. తన వ్యాపారాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనుకుంటాడు. ఇంకోవైపు ఆస్ట్రేలియాలో ఉన్న వాసుదేవ్ కుమార్తె రీనా (శ్రీలీల) తాతని చూసేందుకు ఇండియా వస్తుంది. ఈ మూడు పాత్రలు ఎలా కలిశాయి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: హీరో జయం రవి భార్య- ప్రియురాలి మధ్య మాటల యుద్ధం!) -
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అలా ఈ శుక్రవారం 30కి పైగా కొత్త చిత్రాలు స్ట్రీమింగ్ లోకి వచ్చాయి. శనివారం నాడు సడన్ గా మరో తెలుగు మూవీ ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలోకి వచ్చింది. ఇంతకీ ఏంటా? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనేది చూద్దాం.(ఇదీ చదవండి: ప్రెగ్నెంట్ అయ్యాక పెళ్లి చేసుకున్నా.. హీరోయిన్ అమలాపాల్)గతేడాది డిసెంబరు 27న థియేటర్లలో రిలీజైన తెలుగు సినిమా 'కర్ణ పిశాచి'. ఈ హారర్ థ్రిల్లర్ చిత్రాన్ని భరత్ సిగిరెడ్డి నిర్మించగా, విజయ్ మల్లాది దర్శకత్వం వహించారు. ప్రణవి, రమ్యశ్రీ, నిఖిల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాని నిర్మించిన భరత్ సిగిరెడ్డి.. కీలక పాత్రలోనూ నటించారు. ఇప్పుడు ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం అద్దె ప్రాతిపదికన అందుబాటులో ఉంది.కర్ణ పిశాచి విషయానికొస్తే.. ప్రేమతో పాటు జీవితంలోనూ ఓ యువకుడు ఫెయిల్ అవుతాడు. దీంతో తాగుబోతుగా మారిపోతాడు. ఓ సందర్భంలో అనుకోకుండా తన పూర్వీకులకు సంబంధించిన ఓ గ్రంథం ఈ కుర్రాడికి దొరుకుతుంది. ఆ పుస్తకం కారణంగా యువకుడి జీవితం ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఒక్క వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన 32 మూవీస్) -
ఆహాలో 'మదర్స్ డే 'కానుక.. ఉచితంగానే నివేదా థామస్ హిట్ సినిమా
‘హ్యాపీ మదర్స్ డే అమ్మా!’ అంటూ.. మే 11న కొంత సమయం అయినా సరే అమ్మతో సంతోషంగా గడుపుతారు. ఆమ్మ ప్రేమ గురించి వెండితెరపై ఎన్నో సినిమాలు వచ్చాయి. అవన్నీ సూపర్ హిట్ అందుకున్నాయి కూడా.. అయితే, ఈ మాతృదినోత్సవం (Mother's Day) సందర్భంగా కుటుంబం మొత్తం కలిసి '35–చిన్న కథ కాదు' సినిమాను చూసేయండి. ఉచితంగానే ఈ చిత్రాన్ని చూడొచ్చని ఆహా తెలుగు ప్రకటించింది. మే 10, 11 తేదీలలో మాత్రమే ఈ ఛాన్స్ ఉంటుందని ఆ సంస్థ తెలిపింది.'35–చిన్న కథ కాదు' సినిమా టైటిల్కు తగ్గట్టుగానే ప్రేక్షకులను మెప్పించింది. ప్రియదర్శి, నివేదా థామస్, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం గతేడాదిలో తెలుగు, తమిళ, మలయాళంలో విడుదలయింది. అయితే, ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలో విడుదలైంది. మదర్స్డే (మే 11) కానుకగా ఉచితంగా చూసేందుకు ఆహా సంస్థ అవకాశం కల్పించింది. నందకిశోర్ ఇమాని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై రానా, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు. తిరుపతి నేపథ్యంలో సాగే ఈ కథలో నివేదా మొదటిసారి తల్లి పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది.కథేంటంటే..తిరుపతికి చెందిన ప్రసాద్(విశ్వదేవ్ రాచకొండ) ఓ బస్ కండక్టర్. భార్య సరస్వతి(నివేదా థామస్), పిల్లలు అరుణ్, వరుణ్లతో కలిసి వెంకటేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో నివాసం ఉంటాడు. సరస్వతికి భర్త, పిల్లలే ప్రపంచం. ఇద్దరి పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేయాలని తపన పడతారు. చిన్నోడు వరుణ్ బాగానే చదువుతాడు కానీ, పెద్దోడు అరుణ్కి మాత్రం వెనకబడతాడు. అలా అని వాడు తెలివి తక్కువ వాడేం కాదు. లెక్కలు తప్ప అన్ని సబ్జెక్టుల్లోనూ మంచి మార్కులు తెచ్చుకుంటాడు.కానీ లెక్కల విషయానికొచ్చేసరికి మనోడికి చాలా డౌట్స్ వస్తాయి. సున్నాకి ఏమీ విలువ లేనప్పుడు దానిపక్కన ఒకటి వచ్చి నిలబడితే పది ఎందుకవుతుందంటూ ఫండమెంటల్స్నే ప్రశ్నిస్తాడు. దీంతో అరుణ్కి ‘జీరో’అని పేరు పెట్టి ఆరో తరగతి నుంచి డిమోట్ చేసి తమ్ముడు చదువుతున్న ఐదో తరగతి క్లాస్ రూమ్కి పంపిస్తారు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల అరుణ్ ఆ స్కూల్లో చదవాలంటే.. ఈ సారి లెక్కల్లో కనీసం పాస్ మార్కులు 35 అయినా సాధించాల్సి వస్తుంది. ఆ కండీషన్ పెట్టిందెవరు? ఎందుకు పెట్టారు? లెక్కలపై అరుణ్కి ఉన్న సందేహాలకు సరైన సమాధనం చెప్పిందెవరు? పదో తరగతి ఫెయిల్ అయిన తల్లి సరస్వతి కొడుక్కి లెక్కల గురువుగా ఎలా మారింది? చివరకు అరుణ్ లెక్కల్లో కనీసం పాస్ మార్కులు 35 అయినా తెచ్చుకున్నాడా? లేదా? అనేది మిగతా కథ. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
ఓటీటీల్లోకి వచ్చేసిన 32 సినిమాలు.. అవి మిస్ అవ్వొద్దు
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలో సమంత నిర్మించిన 'శుభం', శ్రీ విష్ణు 'సింగిల్' సినిమాలు థియేటర్లలో రిలీజయ్యాయి. వీటికి టాక్ పర్వాలేదనిపించేలా వచ్చింది. మరోవైపు ఓటీటీల్లో ఈ ఒకటి రెండు రోజుల్లో ఏకంగా 30కి పైగా సినిమాలు-సిరీసులు అందుబాటులోకి వచ్చాయి.(ఇదీ చదవండి: ‘#సింగిల్’ మూవీ రివ్యూ)ఓటీటీల్లో ఈ వీకెండ్ చూడదగ్గ వాటిలో గుడ్ బ్యాడ్ అగ్లీ, రాబిన్ హుడ్, ద డిప్లమాట్, ఓదెల 2, కాలమే కరిగింది చిత్రాలు కనిపిస్తున్నాయి. వీటితోపాటు మరికొన్ని డబ్బింగ్ మూవీస్ కూడా ఉన్నాయండోయ్. ఇంతకీ ఏ చిత్రం ఏ ఓటీటీలోకి వచ్చిందంటే?ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన మూవీస్ (మే 09)నెట్ ఫ్లిక్స్ద డిప్లమాట్ - హిందీ సినిమాద రాయల్స్ - హిందీ మూవీటూ హ్యాండిల్ టూ ఇటాలియన్ సీజన్ 1 - ఇటాలియన్ సిరీస్నోన్నాస్ - ఇంగ్లీష్ సినిమాబ్యాడ్ ఇన్ఫ్లూయెన్స్ - స్పానిష్ మూవీజాక్ - తెలుగు సినిమాగుడ్ బ్యాడ్ అగ్లీ - తెలుగు డబ్బింగ్ మూవీబ్లడ్ ఆఫ్ జ్యూస్ సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్ఫరెవర్ - తెలుగు డబ్బింగ్ సిరీస్హోల్డ్ మీ క్లోజ్ - తగలాగ్ మూవీకరోల్ జీ - ఇంగ్లీష్ సినిమాఅమెజాన్ ప్రైమ్ఓదెల 2- తెలుగు సినిమాగ్రామ చికిత్సాలయ్ - హిందీ సిరీస్ఏ బిట్టర్ స్వీట్ లైఫ్ - కొరియన్ సినిమాఆఫ్టర్ 30 - నైజీరియన్ మూవీనడికలిల్ సుందరి యమున - మలయాళ సినిమావామన - కన్నడ సినిమాఔసెప్పింటే ఒసియాతు - మలయాళ మూవీఆక్టోపస్ - ఇంగ్లీష్ సిరీస్టెన్ అవర్స్ - తమిళ సినిమాసన్ నెక్స్ట్కాలమే కరిగింది - తెలుగు సినిమాహాట్ స్టార్ఎమర్జెన్సీ డిక్లరేషన్ - హిందీ మూవీకొనన్ ఒబ్రియన్ మస్ట్ గో సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్పోకర్ ఫేస్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్జీ5బొహురూపీ - బెంగాలీ మూవీ రాబిన్ హుడ్ - తెలుగు సినిమా (మే 10)ఆహాఅస్త్రం - తమిళ మూవీబుక్ మై షోబ్లాక్ బ్యాగ్ - ఇంగ్లీష్ మూవీలాస్ట్ స్విమ్ - ఇంగ్లీష్ సినిమాఇట్స్ కమింగ్ - ఇంగ్లీష్ సినిమా (మే 10)హూ బై ఫైర్ - ఫ్రెంచ్ మూవీ (మే 10)ఆపిల్ ప్లస్ టీవీలాంగ్ వే హోమ్ సీజన్ 1 - ఇంగ్లీష్ సిరీస్(ఇదీ చదవండి: Subham Review: సమంత ‘శుభం’ మూవీ రివ్యూ) -
పాకిస్థాన్కు భారత్ మరో షాక్.. ఇకపై అవన్నీ బంద్
పాకిస్థాన్కు భారత్ వరుస షాక్లు ఇస్తోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత దాయాది దేశం పాకిస్తాన్కు భారత్ చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేసిన భారత్.. బాగ్లిహార్ ఆనకట్ట నుంచి కూడా పాక్కు నీటి సరఫరాను నిలిపివేసింది. ఇప్పటికే పాకిస్థాన్పై పలు ఆంక్షలు విధించగా.. ఆ దేశంపై డిజిటల్ యుద్ధం కూడా ప్రారంభించింది. పాకిస్థాన్ ఓటీటీ, వెబ్సీరీస్లు, సినిమా పాటలపై నిషేధం విధించింది. పాడ్కాస్ట్లు, మీడియా కంటెంట్పై కూడా నిషేధం విధించాలని నిర్ణయించింది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని భారత సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ వెల్లడించింది.పాక్ను అన్ని వైపుల నుంచి భారత్ దిగ్బంధిస్తోంది. ముప్పేట దాడి చేసేందుకు ఉన్న ఏ అవకాశాన్నీ విడిచి పెట్టడం లేదు. తాజాగా, వినోద రంగం విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ వెబ్ సిరీస్లు, సినిమాలు, పాటలు, పాడ్కాస్ట్లు సహా మీడియా కంటెంట్ ఏదీ కూడా ఇక భారత్లో అందుబాటులో ఉండదు. సబ్స్క్రిప్షన్, సహా ఇతర మార్గాల ద్వారా కంటెంట్ పొందుతున్న వారికీ ఇందులో ఏ మినహాయింపు లేదు. ఓటీటీలు పాకిస్థాన్ కంటెంట్ను భారత్లో స్ట్రీమింగ్ చేయడానికి వీల్లేదు’ అని కేంద్రం స్పష్టం చేసింది.కాగా, దేశవ్యాప్తంగా 27 ఎయిర్ పోర్టులను మూసివేశారు. భద్రతా కారణాల దృష్ట్యా విమానాల రాకపోకలు రద్దు చేశారు. ఢిల్లీకి వచ్చే, వెళ్లే 90 విమానాలను రద్దు చేశారు. రద్దయిన విమానాల్లో ఐదు అంతర్జాతీయ విమాన సర్వీసులు ఉన్నాయి. -
'ఆపరేషన్ సిందూర్' ఎఫెక్ట్.. డైరెక్ట్గా ఓటీటీలోకి రానున్న భారీ సినిమా
బాలీవుడ్లో రాజ్కుమార్ రావ్ (Rajkummar Rao) హీరోగా నటించిన మూవీ 'భూల్ చుక్ మాఫ్' (Bhool Chuk Maaf) డైరెక్ట్గా ఓటీటీలో విడుదల కానుంది. మే 9న థియేటర్స్లో విడుదల చేస్తామని ప్రకటించిన మేకర్స్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిల వల్ల డైరెక్ట్గా ఓటీటీలో విడుదల చేయనున్నారు. ఇందులో వామికా గబ్బి హీరోయిన్గా నటించగా.. ధనశ్రీ వర్మ స్పెషల్ సాంగ్లో దుమ్మురేపింది. ఈ చిత్రాన్ని కరణ్ శర్మ తెరకెక్కించారు. స్త్రీ 2 మూవీతో భారీ విజయాన్ని అందుకున్న రాజ్కుమార్ రావ్ 'భూల్ చుక్ మాఫ్' ద్వారా మరో హిట్ కొట్టాలని ప్లాన్ వేశాడు. కానీ, అది ఫలించలేదు.'భూల్ చుక్ మాఫ్' థియేట్రికల్ రిలీజ్ క్యాన్సిల్ అయ్యిందని మేకర్స్ ప్రకటించారు. మే 16 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా (Amazon Prime Video) స్ట్రీమింగ్ కానున్నట్లు ఒక పోస్టర్ను విడుదల చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెరిగిన భద్రతా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. భారీ ఆశలతో ఈ సినిమాను థియేటర్లో ప్రేక్షకులతో పాటుగా చూడాలని తాము అనుకున్నాం. కానీ, దేశ స్ఫూర్తి, భద్రతకు తాము మొదటి ప్రాధాన్యం ఇస్తామంటూ.. జై హింద్ అని ఒక పోస్ట్ ద్వారా తెలిపారు.భూల్ చుక్ మాఫ్ మూవీ పూర్తిగా ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ కథ. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆమె తండ్రి పెట్టిన పరీక్షలో ఒక యువకుడు ఎలా నెగ్గాడు. కొన్ని గంటల్లో పెళ్లి జరిగిపోతుందని అనుకుంటే.. యువతి తండ్రికి ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. దాని వల్ల మొదలైన ఇబ్బందులు ఏంటి..? అనేది సినిమాలో తెలుసుకోవాలి. ‘టింగ్ లింగ్ సజా మే’ అనే పాటలో ధనశ్రీ స్టెప్పులు అదుర్స్ అనేలా ఉంటాయి. క్రికెటర్ చాహల్తో విడిపోయాక ఆమె నటించిన సినిమా కావడంతో ప్రేక్షకులలో కాస్త ఆసక్తి కలిగిస్తుంది. -
OTT: ఒకరోజు వ్యవధిలోనే 4 ట్రెండింగ్ సినిమాలు
ఏప్రిల్ నెలలో బాక్సాఫీస్ వద్ద ట్రెండింగ్ చిత్రాల జాబితాలో ఉన్న నాలుగు సినిమాల్లో 'జాక్, గుడ్ బ్యాడ్ అగ్లీ, ఓదెల2 నేడు (మే8) ఓటీటీలోకి రాగా.. రాబిన్హుడ్ సినిమా మాత్రం మరో 24 గంటల్లో స్ట్రీమింగ్కు రానుంది. దీంతో ఈ సమ్మర్లో ఇంట్లోనే కూర్చొని సందడి చేయవచ్చు. వీటిలో కొన్ని థియేటర్ వద్ద ప్రేక్షకులను మెప్పించగా మరికొన్ని మాత్రం తీవ్రంగా నిరాశపరిచాయి. అయితే, ఓటీటీ ఫ్యాన్స్ను ఏమేరకు ఆకట్టుకుంటాయో చూడాలి.నెట్ఫ్లిక్స్లో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’- మే8కోలీవుడ్ హీరో అజిత్ హీరోగా నటించిన యాక్షన్ కామెడీ చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’(Good Bad Ugly) నెట్ఫ్లిక్స్లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళ్ వర్షన్లో ఈ చిత్రాన్ని చూడొచ్చు. అజిత్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ (రూ. 250 కోట్లు)సాధించిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. నెట్ఫ్లిక్స్ (NetFlix) వేదికగా మే 8 నుంచి స్ట్రీమింగ్ కానుందని ప్రకటన వచ్చిన సమయం నుంచి ఆయన ఫ్యాన్స్ ఎదురుచూశారు. అజిత్ సరసన త్రిష నటించిన ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు.నెట్ఫ్లిక్స్లో 'జాక్'- మే8టాలీవుడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జోడీగా నటించిన చిత్రం ‘జాక్’ (Jack). ఈ సినిమా భారీ డిజాస్టర్గా మిగిల్చింది. అయితే, ఓటీటీలో చూడొచ్చని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. చాలా ఏళ్ల తర్వాత దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్పై, యాక్షన్ కామెడీ థ్రిల్లర్గా ఆయన ప్లాన్ చేశాడు కానీ, ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేదు. ఏప్రిల్ 10న విడుదలైన ఈ చిత్రం మే 8న ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఓదెల 2’- మే8సౌత్ ఇండియా పాపులర్ హీరోయిన్ తమన్నా (Tamannaah Bhatia) ప్రధాన పాత్రలో నటించిన ల్ హారర్ థ్రిల్లర్ సినిమా ‘ఓదెల 2’ (Odela 2).. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను భయపెట్టలేదు. ‘ఓదెల రైల్వేస్టేషన్’కు సీక్వెల్గా దర్శకుడు అశోక్ తేజ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.. అయితే, మరో దర్శకుడు సంపత్ నంది ఈ ప్రాజెక్ట్కు కథ అందించారు. ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ (Amazon Prime Video)లో నేడు (మే8 ) స్ట్రీమింగ్కు వచ్చేసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో అందుబాటులో ఉంది.జీ5లో 'రాబిన్హుడ్'- మే 10నితిన్- శ్రీలీల జంటగా నటించిన 'రాబిన్హుడ్' మరో 24గంటల్లోనే ఓటీటీలోకి రానుంది. ఈమేరకు ‘జీ 5’ (Zee 5) సంస్థ ఇప్పటికే ప్రకటించింది. మే 10న సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా ‘జీ తెలుగు’ ఛానల్లో ప్రసారం కానుంది. అదే సమయంలో జీ5 ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ కానుంది. గతంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా విషయంలో కూడా ఈ సంస్థ ఇదే స్ట్రాటజీని అనుసరించిన విషయం తెలిసిందే. నితిన్తో భీష్మ చిత్రం ద్వారా హిట్ అందుకున్న దర్శకుడు వెంకీ కుడుముల ఈ ప్రాజెక్ట్ను తెరకెక్కించారు. అయితే బాక్సాఫీస్ డిజాస్ట్ర్గా నిలిచింది. -
సడన్ సర్ ప్రైజ్.. ఓటీటీలోకి తమన్నా 'ఓదెల 2'
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు చాలారోజుల ముందే అనౌన్స్ మెంట్స్ ఇస్తారు. మరికొన్నిసార్లు మాత్రం సడన్ సర్ ప్రైజ్ అన్నట్లు ఎలాంటి ప్రకటనలు లేకుండానే స్ట్రీమింగ్ చేసేస్తారు. ఇప్పుడు కూడా ఓ చిత్రాన్ని అలానే ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు.తమన్నా ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ఓదెల 2. గత నెల 17న థియేటర్లలోకి వచ్చింది. రిలీజ్ కి ముందు మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే దేశమంతా సినిమాకు ప్రచారం చేశారు. కానీ విడుదల తర్వాత టాక్ తేడా కొట్టేసింది. రెండు మూడు రోజులకే సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని మూడు వారాలకే ఓటీటీలోకి తీసుకొచ్చేస్తున్నారు.(ఇదీ చదవండి: 'న్యూ బిగినింగ్స్'.. మళ్లీ జంటగా కనిపించిన సమంత) మరికొన్ని గంటల్లో అంటే రేపటి(మే 08) నుంచి ఓదెల 2 చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది.ఓదెల 2 విషయానికొస్తే.. ఓదెల అనే ఊరిలో తిరుపతి(వశిష్ఠ) అనే కామాంధుడు కొత్తగా పెళ్లయిన అమ్మాయిల్ని రేప్ చేసి చంపేస్తుంటాడు. ఓ రోజు అతడి భార్య అతడి నరికి చంపేసి జైలుకి వెళ్తుంది. కానీ తిరుపతి ఆత్మకు శాంతి కలగకుండా ఉండాలని సమాధి చేస్తారు. కానీ తిరుపతి ప్రేతాత్మ తిరిగి సమాధిలో నుంచి బయటకొచ్చి ఊరిపై పడుతుంది. దాన్ని నిలువరించడానికి శివశక్తి (తమన్నా) ఓదెలకు వస్తుంది. తర్వాత ఏమైంనేదే స్టోరీ.(ఇదీ చదవండి: 'రెట్రో'ని దెబ్బ కొట్టిన చిన్న సినిమా.. ఓటీటీకి అప్పుడేనా?) -
'రెట్రో'ని దెబ్బ కొట్టిన చిన్న సినిమా.. ఓటీటీకి అప్పుడేనా?
కొన్నిసార్లు చిన్న సినిమానే కదా ఏమవుతుందిలే అనుకుంటాం. కానీ అదే భారీ దెబ్బ కొట్టొచ్చు. తమిళ ప్రేక్షకుల్ని ప్రస్తుతం ఎంటర్ టైన్ చేస్తున్న 'టూరిస్ట్ ఫ్యామిలీ'ని చూస్తే అదే అనిపిస్తుంది. ఎందుకంటే సూర్య 'రెట్రో'కి పోటీగా రిలీజ్ అనేసరికి చాలామంది.. బాక్సాఫీస్ దగ్గర నిలబడుతుందా అనుకున్నారు. కానీ ఇప్పుడదే సూపర్ రెస్పాన్స్ సంపాదించుకుంది.చాలా తక్కువ బడ్జెట్, సింపుల్ కథతో తీసిన ఈ సినిమా మే 01న రిలీజైతే ఇప్పటివరకు రూ.20 కోట్ల కలెక్షన్స్ కూడా రాలేదు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో టికెట్ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. పోటీలో ఉన్న రెట్రో కంటే దీన్ని చూసేందుకే ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) అసలు విషయానికొస్తే ఈ సినిమాని త్వరలో తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేస్తారనే టాక్ వినిపిస్తుంది కానీ అది జరిగే పనిలా అనిపించట్లేదు. ఎందుకంటే ఇది తమిళ ఫ్లేవర్ తో తెరకెక్కిన కథ. దీన్ని తెలుగులో ఆదరిస్తారా అంటే సందేహమే. అదే టైంలో ఓటీటీలో రావడానికి నాలుగు వారాల ఒప్పందాన్ని కుదుర్చుకున్నారట.ఈ లెక్కన చూసుకుంటే 'టూరిస్ట్ ఫ్యామిలీ' సినిమా ఓటీటీలోకి మే 31న వచ్చే సూచనలు గట్టిగా ఉన్నాయి. తెలుగు వెర్షన్ కూడా అప్పుడే అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ మూవీలో సిమ్రాన్ తప్పితే మనకు తెలిసిన ముఖం లేదు.(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరం ఇంట్లో సీమంతం వేడుక) -
ఒకేసారి ఓటీటీ, టీవీలో ‘రాబిన్ హుడ్’.. ఎప్పుడంటే?
నితిన్ హీరోగా నటించిన రాబిన్ హుడ్(Robinhood).. ఈ ఏడాది మార్చిలో విడుదలై డిజాస్టర్ టాక్ సంపాదించుకుంది. శ్రీలీల గ్లామర్, క్రికెటర్ డేవిడ్ వార్నర్ క్యామియో, కేతికా శర్మ ఐటమ్ సాంగ్..ఏవి సినిమాను రక్షించలేకపోయాయి. ఛలో, భీష్మ లాంటి బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందుకున్న వెంకీ కుడుముల ఈ చిత్రంలో అపజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఓటీటీలో అయినా ఈ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం చిత్రబృందంలో బలంగా ఉంది. అయితే ఓటీటీ కంటే ముందే ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ని కొనుగోలు చేసిన జీ5(ZEE5) సంస్థ.. మే 10న ఈ చిత్రాన్ని టీవీలో టెలికాస్ట్ చేయనుంది. ఆ తర్వాతే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫార్ములా అప్లై‘సంక్రాంతి వస్తున్నాం’సినిమాను అటు ఛానల్లో, ఇటు ఓటీటీలోకి ఓకేసారి తీసుకోచ్చింది జీ5 సంస్థ. ఇప్పుడు ‘రాబిన్హుడ్’ విషయంలోనూ అదే ఫాలో అవుతోంది. ఓటీటీ రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు కానీ.. మే 10వ తేదినే ఓటీటీలో కూడా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని ఒకేసారి టీవీలోనూ, ఓటీటీలో రిలీజ్ చేయడం వల్ల.. జీ చానల్కి మంచి టీఆర్పీ వచ్చింది. అందుకే రాబిన్ హుడ్ చిత్రానికి కూడా అదే ఫార్ములా అప్లై చేస్తున్నారు. మరి ఈ రాబిన్హుడ్ కనీసం బుల్లితెర మనసులను అయినా దోచుకుంటాడో లేదో చూడాలి.రాబిన్ హుడ్ కథేంటంటే..?రామ్ (నితిన్) అనాథ. చిన్నప్పుడు అతన్ని ఓ పెద్దాయన హైదరాబాద్లోని ఓ అనాథ ఆశ్రమంలో చేర్పిస్తాడు. అక్కడ తినడానికి తిండిలేక ఇబ్బందిపడుతున్న తోటి పిల్లల కోసం దొంగగా మారతాడు. పెద్దయ్యాక ‘రాబిన్హుడ్’ పేరుతో ధనవంతుల ఇళ్లలో చోరీలు చేస్తుంటాడు. అతన్ని పట్టుకోవడం కోసం రంగంలోకి దిగిన పోలీసు అధికారి విక్టర్(షైన్ చాం టాకో) ఈగోని దెబ్బతీస్తూ ప్రతిసారి దొరికినట్లే దొరికి తప్పించుకుంటాడు. దీంతో విక్టర్ రాబిన్ని పట్టుకోవడమే టార్గెట్గా పెట్టుకుంటాడు. రాబిన్కి ఈ విషయం తెలిసి..దొంగతనం మానేసి జనార్ధన్ సున్నిపెంట అలియాస్ జాన్ స్నో(రాజేంద్రప్రసాద్) నడిపే ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో జాయిన్ అవుతాడు. అదే సమయంలో ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ఇండియన్ ఫార్మా కంపెనీ అధినేత కుమార్తె నీరా వాసుదేవ్ (శ్రీలీల) ఇండియాకు వస్తుంది. ఆమెకు సెక్యూరిటీగా రాబిన్ వెళ్తాడు. ఇండియాకు వచ్చిన నీరాను గంజాయి దందా చేసే రౌడీ సామి(దేవదత్తా నాగే) మనుషులు బంధించి రుద్రకొండ అనే ప్రాంతానికి తీసుకెళ్తారు? సామి వలలో చిక్కుకున్న నీరాను రాబిన్హుడ్ ఎలా రక్షించాడు? నిరాను రుద్రకొండకు ఎందుకు రప్పించారు? రాబిన్హుడ్ సడెన్గా సెక్యూరిటీ ఏజెన్సీలో ఎందుకు చేరాల్సివచ్చింది? ఈ కథలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.Full of laughs, packed with thrills, and loaded with chills – Robinhood ! Don't miss 🌟🎬Robinhood World Television Premiere On May 10th, Saturday at 6 PM On #ZeeTelugu#ZeeTeluguPromo #WorldTelevisionPremiereRobinhood #RobinhoodOnZeeTelugu pic.twitter.com/SjA5ShGdPX— ZEE TELUGU (@ZeeTVTelugu) May 6, 2025 -
నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి వస్తున్న థ్రిల్లర్ సినిమా
పుష్ప సినిమాతో తెలుగు వారికి బాగా దగ్గరైన నటుడు ఫహాద్ ఫాజిల్.. ఆయన విలన్గా నటించిన 'ఇరుల్' మలయాళ సినిమా ఇప్పుడు తెలుగులో విడుదల కానుంది. అపరాధి టైటిల్తో డైరెక్ట్గా ఓటీటీలోకి రానుంది. 2021లో విడుదలైన ఈ మిస్టరీ థ్రిల్లర్ చిత్రానికి నసీఫ్ యూసుఫ్ ఇజుద్దీన్ దర్శకత్వం వహించారు. ఫహద్ ఫాసిల్తో పాటు సౌబిన్ షాహిర్, దర్శన రాజేంద్రన్ వంటి వారు ఇందులో నటించారు. ఈ చిత్రాన్ని ఆంటో జోసెఫ్ ఫిల్మ్ కంపెనీ, ప్లాన్ జె స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే మలయాళ వర్షన్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది.అపరాధి పేరుతో డైరెక్ట్గా ఆహా తెలుగు ఓటీటీలో ఈ చిత్రం మే 8న విడుదల కానుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ను విడుదల చేసింది. అపరాధి సినిమా మొత్తం ఒకే ఇంట్లో కేవలం మూడు పాత్రలతోనే చాలా సస్పెన్స్గా జరుగుతుంది. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్ నెగెటివ్ షేడ్స్తో కూడిన క్యారెక్టర్లో కనిపించాడు. 2021లో కొవిడ్ కారణంగా ఈ చిత్రం డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో మలయాళ వర్షన్ విడుదలైంది. అప్పట్లో చాలామంది సబ్టైటిల్స్తో ఈ మూవీని చూశారు. ఈ సినిమా రన్టైమ్ కేవలం 91 నిమిషాలే కావడం విశేషం.ఒక ప్రేమజంట జీవితంలోకి ఓ సీరియల్ కిల్లర్ ఎంటర్ అయితే ఎలా ఉంటుందో ఈ చిత్రం చెబుతుంది. కేవలం 30 రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ను పూర్తిచేసి ఓటీటీలో విడుదల చేశారు. ప్రేక్షకులను ప్రతి క్షణం సస్పెన్స్కు గురిచేసే ఈ చిత్రం సుమారు నాలుగేళ్ల తర్వాత తెలుగులో విడుదల కానుంది. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
ఓటీటీలోకి వచ్చేస్తున్న లేటెస్ట్ తెలుగు సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా అలా 15కి పైగా మూవీస్-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో తెలుగు యాడ్ అయింది. అస్సలు ఇంగ్లీష్ పదాలే వాడకుండా తీసిన ఈ చిత్రం సంగతేంటి? ఎందులోకి రానుందని ఇప్పుడు చూద్దాం?అందరూ కొత్తవాళ్లతో తీసిన సినిమా 'కాలమే కరిగింది?'. మార్చి 21న ఈ తెలుగు మూవీ థియేటర్లలోకి వచ్చింది. కాకపోతే పెద్దగా పేరున్న నటీనటులు ఎవరూ లేకపోవడంతో ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. ఈ మూవీలో సారీ, థ్యాంక్స్ తప్ప మరే ఇంగ్లీష్ పదాలు ఉపయోగించలేకపోవడం విశేషం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) కథంతా స్కూల్ లవ్స్టోరీ నేపథ్యంలో సాగుతుంది. దర్శకుడు ఎంచుకున్న లవ్స్టోరీ పాయింట్ కొత్తదేమి కాదు. కానీ అప్పటి ప్రేమకథల్లో ఉండే మాధుర్యాన్ని, అమాయకత్వాన్ని కవితాత్మకంగా సరికొత్తగా చూపించారు. స్కూల్ డేస్ లోని బాల్యప్రేమను మధురంగా మలిచారు. ఇప్పుడీ చిత్రం మే 09 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలోకి రానుందని అధికారికంగా ప్రకటించారు.'కాలమే కరిగింది?' విషయానికొస్తే.. ఫణి (వినయ్ కుమార్-అరవింద్) బాగా చదువుకుని జీవితంలో సెటిల్ అయ్యింటాడు. తొలి ప్రేమ గుర్తొచ్చి ప్రియురాలు బిందు (శ్రావణి-నోమిన తార) కోసం సొంతూరు వెళ్తాడు. అసలు బిందు ఎక్కడ ఉంది? ఇన్నేళ్ల తర్వాత వచ్చిన ఫణికి బిందు కలిసిందా లేదా? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: స్నానం కూడా చేయలేదు.. అమ్మ జీవితాంతం నన్ను..: రష్మీ) -
ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు స్పెషల్
మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి సమంత నిర్మించిన 'శుభం', శ్రీ విష్ణు కామెడీ సినిమా '#సింగిల్', బ్లైండ్ స్పాట్, కలియుగమ్ 2064 తదితర చిత్రాలు రానున్నాయి. మరోవైపు చిరంజీవి-శ్రీదేవి క్లాసిక్ మూవీ 'జగదేకవీరుడు అతిలోక సుందరి' రీ రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ డార్క్ కామెడీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్)మరోవైపు ఓటీటీల్లోనూ ఈ వారం 15కి పైగా సినిమాలు- సిరీసులు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో గుడ్ బ్యాడ్ అగ్లీ, జాక్, ది డిప్లమాట్ చిత్రాలతో పాటు గ్రామ చికిత్సాలయ్ అనే సిరీస్ ఉన్నంతలో కాస్త ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏయే ఓటీటీల్లో ఏ మూవీస్ రాబోతున్నాయంటే?ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ (మే 05-11వ తేదీ వరకు)నెట్ ఫ్లిక్స్బ్రిటైన్ అండ్ ద బ్లిట్జ్ (ఇంగ్లీష్ మూవీ) - మే 05కొనన్ ఓ బ్రయన్ (ఇంగ్లీష్ సినిమా) - మే 05మైటీ మానస్టర్ వీలీస్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మే 05ద సీట్ (ఇంగ్లీష్ సినిమా) - మే 05ది మ్యాచ్ (ఇంగ్లీష్ చిత్రం) - మే 07లాస్ట్ బులెట్ (ఇంగ్లీష్ సినిమా) - మే 07గుడ్ బ్యాడ్ అగ్లీ (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 08జాక్ (తెలుగు సినిమా) - మే 08ది డిప్లమాట్ (హిందీ మూవీ) - మే 09ద రాయల్స్ (హిందీ సిరీస్) - మే 09అమెజాన్ ప్రైమ్గ్రామ చికిత్సాలయ్ (హిందీ సిరీస్) - మే 09హాట్ స్టార్యువ క్రైమ్ ఫైల్స్ సీజన్ 1 (హిందీ సిరీస్) - మే 05యెల్లో స్టోన్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - మే 05పోకర్ ఫేస్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 09జీ5బోహుర్పీ (బెంగాలీ సినిమా) - మే 09(ఇదీ చదవండి: తెలుగు డైరెక్టర్ అని తొక్కేశారు.. లేదంటే విజయ్ తో సినిమా!) -
ఓటీటీలోకి మలయాళ డార్క్ కామెడీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో మలయాళ చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మరీ ముఖ్యంగా బాసిల్ జోసెఫ్ నుంచి వస్తున్న ప్రతి సినిమా ఆకట్టుకుంటోంది. రీసెంట్ టైంలో పలు చిత్రాల డబ్బింగ్ లతో తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు మరో మూవీతో ఓటీటీలో రచ్చ చేసేందుకు సిద్ధమైపోయాడు. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో స్ట్రీమింగ్?(ఇదీ చదవండి: ఓటీటీలో 'జాక్' సినిమా.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..) స్వతహాగా డైరెక్టర్ అయిన బాసిల్ జోసెఫ్ గత కొన్నాళ్ల నుంచి హీరోగా వరస సినిమాలు చేస్తున్నాడు. గత ఏడాది కాలంలో నూనక్కుళి, సూక్ష్మదర్శిని, ప్రావింకుడు షప్పు, పొన్ మన్ తదితర చిత్రాలతో వచ్చాడు. ఇప్పుడు 'మరణమాస్' మూవీతో రాబోతున్నాడు. మలయాళ పండగ విషు సందర్భంగా ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా మే 15 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుందని క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాని ప్రముఖ హీరో టొవినో థామస్ నిర్మించడం విశేషం.(ఇదీ చదవండి: ‘బుల్లెట్ ట్రైన్ ఎక్స్ప్లోజన్’ మూవీ రివ్యూ) 'మరణమాస్' విషయానికొస్తే.. ఓ రాత్రి అనుకోకుండా సీరియల్ కిల్లర్ తోపాటు ఓ శవం ఉన్న బస్సులో కొందరు వ్యక్తులు చిక్కుకుంటారు. ఆ శవాన్ని వాళ్లు ఏం చేశారు? ఆ సీరియల్ కిల్లర్ నుంచి ఎలా తప్పించుకున్నారనేదే స్టోరీ. ఈ సినిమాలో లూక్ పీపీ అనే ఇన్ ఫ్లూయెన్సర్ గా బాసిల్ జోసెఫ్ నటించాడు. ఓ అమ్మాయి తన ప్రేమని అంగీకరించకపోవడంతో లూక్.. ఆమెను వేధిస్తూ ఉంటాడు. అదే ఊరిలోని వృద్ధులను చంపి నోటిలో అరటిపండు పెడుతుంటాడు సీరియల్ కిల్లర్. డార్క్ కామెడీగా తీసిన ఈ సినిమా వచ్చే వారాంతంలో రిలీజ్ అవుతుంది.(ఇదీ చదవండి: 'కిర్రాక్ ఆర్పీ మోసాన్ని నా జీవితంలో మర్చిపోను'.. జబర్దస్త్ తన్మయ్) Welcome to a world where nothing makes sense, but everything will crack you up!Watch #Maranamass on SonyLIV From 15 May #MaranamassOnSonyLIV pic.twitter.com/s3GTEM5YEz— Sony LIV (@SonyLIV) May 5, 2025 -
ఓటీటీలో 'జాక్' సినిమా.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..
సిద్ధు జొన్నలగడ్డ (siddhu jonnalagadda) నటించిన జాక్ సినిమా ఓటీటీ ప్రకటన వచ్చేసింది. చాలారోజుల తర్వాత బొమ్మరిల్లు భాస్కర్(Bommarillu Bhaskar) ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇందులో వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు ఈ మూవీని నిర్మించారు. ఏప్రిల్ 10న విడుదలైన జాక్ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్గా మిగిలిపోయింది. అయితే, తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుదల వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.'జాక్' సినిమా మే 8న ఓటీటీలో విడుదల కానుందని 'నెట్ఫ్లిక్స్'(Netflix) ప్రకటించింది. తెలగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ, మలయాళంలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుందని ఒక పోస్టర్ను షేర్ చేశారు. డీజే టిల్లు, టిల్లు స్వ్కేర్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట అందుకొని ఫుల్ జోష్లో ఉన్న సిద్ధు.. జాక్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని అనుకున్నాడు. అయితే, ఆయన అంచనాలు తప్పడంతో భారీ నష్టాలను ఈ మూవీ మిగిల్చింది. సిద్ధు గత సినిమా 'టిల్లు స్క్వేర్'కి రూ.23 కోట్లు తొలిరోజే రాబట్టింది. అయితే 'జాక్' చిత్రానికి మాత్రం రూ.కోటిన్నర నుంచి రూ.2 కోట్ల కలెక్షన్స్ మాత్రమే ఫస్ట్ డే వచ్చాయి. సుమారు రూ. 36 కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తే బాక్సాఫీస్ వద్ద ఫైనల్గా కేవలం రూ. 7 కోట్లు మాత్రమే రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి.కథేంటంటే.. పాబ్లో నెరుడా అలియాస్ జాక్ (సిద్ధు జొన్నలగడ్డ) రా (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఏజెంట్ కావాలని కలలు కంటాడు. తనకున్న టాలెంట్ అంతా ఉపయోగించి ఇంటర్వ్యూ వరకు వెళ్తాడు. ఆ రిజల్ట్ రాకముందే ఖాలీగా ఉండడం ఎందుకని దేశాన్ని కాపాడేందుకు రంగంలోకి దిగుతాడు. ఉగ్రవాదులు, హైదారాబాద్తో పాటు భారత్లోని ఇతర ప్రధాన నగరాల్లో విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నారనే విషయం తెలుసుకొని వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. మరోవైపు జాక్ ఏం పని చేస్తున్నాడో కనుక్కోమని ప్రైవేట్ డిటెక్టివ్ అఫిషాన్ బేగం (వైష్ణవి చైతన్య)కు లక్ష రూపాయలు ఇస్తాడు అతని తండ్రి పాన్ ఇండియా ప్రసాద్(నరేశ్). అఫిషాన్ బేగం భానుమతి పేరుతో జాక్కి దగ్గరై జాక్ పనిపై నిఘా పెడుతుంది. టెర్రరిస్టులను పట్టుకునే క్రమంలో పొరపాటున ‘రా’ఏజెంట్ మనోజ్(ప్రకాశ్ రాజ్)ని కిడ్నాప్ చేస్తాడు జాక్. ఆ తర్వాత ఏం జరిగింది? టెర్రరిస్ట్ గ్యాంగ్ని జాక్ పట్టుకోగలిగాడా లేదా? అసలు జాక్ ‘రా’ ఏజెంట్ కావాలని ఎందుకు అనుకున్నాడు? చివరకు తను కోరుకున్న ఉద్యోగం పొందగలిగాడా లేదా? అనేదే తెలియాలంటే జాక్(Jack Movie Review) సినిమా చూడాల్సిందే. -
‘బుల్లెట్ ట్రైన్ ఎక్స్ప్లోజన్’ మూవీ రివ్యూ
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో జపనీస్ చిత్రం బుల్లెట్ ట్రైన్ ఎక్స్ప్లోజన్ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. భాష ఏదైనా సరైన భావం పలికించి చూపించేది సినిమా. అందులో డబ్బింగ్ వల్ల ప్రపంచంలోని ఏ మూల సినిమా అయినా మన భాషలో చూస్తుంటే మన చుట్టూ జరిగిన కథే అన్న భావన కలుగుతుంది. మరీ ముఖ్యంగా థ్రిల్లర్ జోనర్ చిత్రాలు ఇట్టే ఆకట్టుకుం టాయి. ఆ కోవకి చెందినదే ఇటీవల నెట్ఫ్లిక్స్ వేదికగా విడుదలైన జపనీస్ సినిమా ‘బుల్లెట్ ట్రైన్ ఎక్స్ప్లోజన్’(Bullet Train Explosion). ఈ సినిమా ఓ బ్లాక్ బస్టర్ పేలుడు అనొచ్చు. ఈ మూవీ వల్ల మనకు రెండు అనుభూతులు కలుగుతాయి. (చదవండి: ఇండియా ఫస్ట్ ఐటమ్ గర్ల్ ఓ పాకిస్తానీ.. ఆ బ్యూటీ ఎవరో తెలుసా?)ఇండియాలో త్వరలో బుల్లెట్ ట్రైన్ పరిగెత్తబోతోంది. ఆ బుల్లెట్ ట్రైన్ అనుభూతిని ఈ చిత్రం ద్వారా అనుభవించవచ్చు. అలాగే జపాన్ దేశంలోని ట్రైన్ స్టేషన్, ట్రైన్ నంబర్లు కూడా మనం ఈ సినిమా ద్వారా గుర్తు పెట్టుకోవచ్చు. బుల్లెట్ ట్రైన్ ఎంత స్పీడ్ ఉంటుందో అంతకు రెండింతలు ప్రేక్షకులు ఈ సినిమాని చూసి థ్రిల్ ఫీలవుతారు. అంతలా ఈ సినిమాలో ఏముందంటే... కథ ప్రకారం ట్రైన్ నెంబర్ 5060బి షిన్ అమోరి నగరం నుండి జపాన్ రాజధాని టోక్యోకి బయలుదేరుతుంది. ఈ ట్రైన్లో కజుయాతకైచి ఫస్ట్ లైన్ మేనేజర్గా ఉంటాడు. ట్రైన్ బయలుదేరిన కొద్ది నిమిషాలకే ఓ అగంతకుడు స్టేషన్కు ఫోన్ చేసి, ట్రైన్లో బాంబు పెట్టామని, ట్రైన్ 120 కిలోమీటర్ల స్పీడ్ తగ్గకుండా వెళితేనే బాంబు పేలకుండా ఉంటుందని బెదిరిస్తాడు. ఆ బాంబు తీయాలంటే తనకు 100 బిలియన్ల డబ్బు అప్పజెప్పాలని కండిషన్ పెడతాడు. 2 గంటల 14 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా దాదాపు ట్రైన్లోనే నడుస్తుంది. మరి... ఆగకుండా వెళుతున్న ట్రైన్ పేలిపోతుందా లేదా మేనేజర్ ఆపగలుగుతాడా అన్నది తెలియాలంటే ‘బుల్లెట్ ట్రైన్ ఎక్స్ప్లోజన్’ సినిమా చూడాలి. 1994వ దశకంలో వచ్చిన హాలీవుడ్ సినిమా ‘స్పీడ్’ని పోలి ఉంటుందీ సినిమా. కానీ ఈ చిత్రం క్లైమాక్స్ సూపర్ హైలైట్. ప్రేక్షకులకు మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా ఈ సినిమా ఉంటుంది. – హరికృష్ణ ఇంటూరు -
'పెళ్లి చేసుకుంటానని వాడుకున్నాడు'.. అజాజ్ ఖాన్పై నటి తీవ్ర ఆరోపణలు!
బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్ వివాదానికి కేరాఫ్ అడ్రస్గా మారిపోయాడు. అతను హోస్ట్గా వ్యవహరిస్తోన్న హౌస్ అరెస్ట్ అనే షోలో విపరీతమైన, అసభ్యకరమైన కంటెంట్తో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. ఈ షోపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ షోను ఇప్పటికే సదరు ఓటీటీ సంస్థ బ్యాన్ చేసింది. ఈ అసభ్యకరమైన కంటెంట్ ప్రసారం చేస్తోన్న అజాజ్ ఖాన్పై సినీ, రాజకీయ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ వివాదంలో నడుస్తుండగానే అజాజ్ ఖాన్పై ఓ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను వివాహం చేసుకుంటానని లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అజాజ్ ఖాన్పై చార్కోప్ పీఎస్లో కంప్లైంట్ ఇచ్చింది. దీంతో అతనిపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు.అజాజ్ ఖాన్ తన ఓటీటీ షో 'హౌస్ అరెస్ట్'లో తనకు ఓ పాత్ర ఆఫర్ చేశాడని ఆమె తెలిపింది. ఆ తరువాత పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి తనకు లవ్ ప్రపోజ్ చేశాడని నటి ఆరోపించింది. మార్చి 25న తన నివాసంలోనే నాపై అత్యాచారం చేశాడని.. రెండు సార్లు తనను పెళ్లి చేసుకుంటానని హామీ కూడా ఇచ్చాడని చార్కోప్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మాకు నాలుగు వివాహాలకు అనుమతి ఉందని తనకు చెప్పాడని నటి ప్రస్తావించింది. ఆమె ఆరోపణలతో కేసు నమోదు చేసిన చార్కోప్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఓటీటీ షో 'హౌస్ అరెస్ట్'లో మహిళలను అసభ్యకరంగా చూపించినందుకు అజాజ్ ఖాన్పై అంబోలి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
ఓటీటీకి తమన్నా దెయ్యం సినిమా.. నెల రోజుల్లోపే!
తమన్నా, వశిష్ఠ, హెబ్బా పటేల్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం 'ఓదెల 2'. సంపత్ నంది సూపర్ విజన్లో అశోక్ తేజ దర్శకత్వంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. గతంలో సూపర్ హిట్గా నిలిచిన ఓదెల రైల్వేస్టేషన్కు సీక్వెల్గా ఈ మూవీ తెరకెక్కించారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్పై డి. మధు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 17న విడుదలైంది.బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించినా.. ఆశించిన స్థాయిలో వసూళ్లు మాత్రం రాబట్టలేకపోయింది. మూడు రోజుల్లో కేవలం రూ.6.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో ఈ మూవీ ఓటీటీ విడుదల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓదెల-2 ఓటీటీ రిలీజ్ డేట్పై టాక్ వినిపిస్తోంది. ఈ నెలలోనే డిజిటల్ ఫ్లాట్ఫామ్లో సందడి చేయనున్నట్లు సమాచారం. మే 17వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానున్టన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.ఓదెల-2 కథేంటంటే..ఓదెల 2 విషయానికొస్తే.. ఓదెలలో తిరుపతి(వశిష్ట సింహ) అనే కామాంధుడు.. కొత్తగా పెళ్లయిన అమ్మాయిల్ని మానభంగం చేస్తుంటాడు. దీంతో తిరుపతి భార్య అతడి తల నరికి జైలుకెళ్తుంది. కానీ తిరుపతి ఆత్మకు శాంతి కలగకుండా ఉండాలని.. సమాధిశిక్ష వేస్తారు. కొన్ని సంఘటనల వల్ల ఇతడి ప్రేతాత్మ తిరిగి ఊరిపై పడుతుంది. దీంతో శివశక్తి అలియాస్ భైరవి (తమన్నా) అనే ఓదెల ఊరికి వస్తుంది. ఆ తర్వాత దుష్టసంహారమే మిగిలిన స్టోరీ. -
భార్య, సవతి కలిసి భర్తని మాయం చేస్తే.. ఓటీటీ రివ్యూ
ఓటీటీలు అనగానే చాలామందికి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలే గుర్తొస్తాయి. అందుకు తగ్గట్లే ఎప్పటికప్పుడు ఈ తరహా మూవీస్ రిలీజ్ అవుతుంటాయి. తాజాగా అలానే ఓటీటీలోకి వచ్చిన చిత్రం 'జెంటిల్ ఉమన్'. ట్రెండింగ్ టాపిక్ బేస్ చేసుకుని ఈ మూవీ తీయడం విశేషం. ఇంతకీ దీని సంగతేంటి అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే) కథేంటి?పల్లెటూరిలో పుట్టి పెరిగిన పూర్ణిమ అలియాస్ పూర్ణి (లిజోమోల్ జోస్) అరవింద్(హరికృష్ణన్)ని పెళ్లి చేసుకుని నగరానికి వస్తుంది. మూడు నెలలుగా ఉదయం లేవడం, పూజ చేయడం, భర్తకు వంట చేసి పెట్టడం, అతడి శారీరక అవసరాలని తీర్చడం. ఇదే ఈమె రొటీన్. అలాంటిది ఓ సందర్భంలో భర్తకు ఆని(లోస్లియా) అనే మహిళతో అక్రమ సంబంధం ఉందని తెలుస్తోంది. దీంతో భర్తని నిర్ధాక్షిణ్యంగా చంపేస్తుంది. తర్వాత ఏమైంది? పోలీసులకు దొరికిందా లేదా? ఆని.. పూర్ణిని ఎందుకు కలవాల్సి వచ్చిందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?పొద్దున్న లేస్తే చాలు.. ప్రియుడితో కలిసి భర్తని చంపిన భార్య, ప్రియురాలి కోసం భార్యని అడ్డు తొలిగించిన భర్త.. ఇలాంటి వార్తలే చూస్తున్నాం. సరిగ్గా ఇలాంటి కాన్సెప్ట్ తో తీసిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా 'జెంటిల్ ఉమన్'. సినిమా మొదలవడమే చాలా కూల్ గా మొదలవుతుంది. పూర్ణిమ అనే గృహిణి. ఆమెకు రోజూ ఒకేలాంటి దినచర్య. మరోవైపు రోజూ దేవుడికి పూజ చేస్తూ ఫిలాసఫీ పుస్తకాలు చదివే భర్త. కట్ చేస్తే సరిగ్గా సినిమా అరగంట గడిచేసరికి మొదటి ట్విస్ట్. భర్త అక్రమ సంబంధం గురించి తెలిసి అప్పటివరకు శాంతంగా కనిపించిన పూర్ణిమ ఒక్కసారి వయలెంట్ అవుతుంది. భర్తని నరికి చంపి ఫ్రిజ్ లో పెడుతుంది.మరోవైపు సదరు భర్త.. మరో మహిళతో ఎఫైర్ నడిపిస్తుంటాడు కదా. తన ప్రియుడు కనిపించట్లేదని ఆమె పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తుంది. అక్కడ నుంచి పోలీసుల దర్యాప్తు. పూర్ణిమని పిలిచి విచారించడం. చివరకు ఏమైందనేదే స్టోరీ.చాలా సాదాసీదాగా మొదలయ్యే సినిమా ఆద్యంతం నిదానంగానే వెళ్తుంది. కాకపోతే ప్రస్తుతం సమాజంలో పోకడల్ని కొంతవరకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఒకప్పటిలా భర్తలు అక్రమ సంబంధాలు అంటూ నడిపితే అరిచి గీ పెట్టడాలు, గొడవ పడటం లాంటివి కాకుండా భార్యలు ఎంతకు తెగిస్తున్నారు అనే చెప్పే స్టోరీ ఇది.సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే ఆసక్తి ఉంటే ఈ సినిమా చూడొచ్చు. మరీ అంచనాలు పెట్టుకుంటే నిరాశపరచొచ్చు. రెండు గంటల్లోపే నిడివి కాబట్టి ఇలా మొదలుపెడితే అలా ముగించేయొచ్చు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్, ఆహాలో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎవరెలా చేశారు?'జై భీమ్' సినిమాలో చినతల్లిగా అలరించిన లిజోమోల్.. ఇందులో పూర్ణిమగా అదరగొట్టేసిందని చెప్పొచ్చు. ఈమె భర్తగా చేసిన హరికృష్ణన్ ది చిన్న రోల్. ఉన్నంతలో ఓకే. ప్రియురాలిగా చేసిన లోస్లియా కూడా పాత్రకు తగ్గట్లు చేసింది. మిగిలిన పాత్రధారులు ఓకే.టెక్నికల్ విషయాలకొస్తే ఇందులో పాటలేం లేవు. కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మూవీ మూడ్ కి తగ్గట్లు ఉంది. కెమెరా వర్క్ బాగుంది. దర్శకత్వం మాత్రం మీద కంప్లైంట్ ఉంది. చిన్న పాయింట్ నే చాలా సేపు సాగదీసినట్లు అనిపించింది. ఓవరాల్ గా చెప్పుకొంటే మాత్రం ఓసారి చూడొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలోకి అజిత్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్) -
ఓటీటీలోకి వచ్చేసిన కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. మొన్నీమధ్యే వీకెండ్ సందర్భంగా మే 01-02 తేదీల్లో ఏకంగా 30 చిత్రాలకు పైగా స్ట్రీమింగ్ లోకి వచ్చాయి. ఇప్పుడు మరో కన్నడ కామెడీ మూవీ అందుబాటులోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ దీని సంగతేంటి?'పుష్ప' జాలిరెడ్డి డాలీ ధనంజయ అతిథి పాత్రలో నటించిన కన్నడ సినిమా 'విద్యాపతి'. నాగభూషణ, మలైకా వాసుపాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. యాక్షన్ కామెడీగా తీసిన ఈ చిత్రం ఏప్రిల్ 11న థియేటర్లలోకి రాగా డీసెంట్ టాక్ అందుకుంది. ఇప్పుడు మూడు వారాలు తిరిగేసరికల్లా అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసింది. కన్నడతో పాటు తెలుగులో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది.(ఇదీ చదవండి: నవ్వులతో కాసులు కురిపించే బ్రహ్మానందం రెమ్యునరేషన్ తెలుసా?)'విద్యాపతి' విషయానికొస్తే.. సిద్ధు అనే కుర్రాడు సులభంగా డబ్బు సంపాదించి జీవితంలో సెటిలైపోవాలని అనుకుంటాడు. దీంతో అబద్ధాలాడి సినిమా హీరోయిన్ విద్యకు దగ్గరవుతాడు. కొన్నాళ్లకు ఇతడి గుణగణాలు నచ్చి విద్య పెళ్లి చేసుకుంటుంది. దీని తర్వాత సిద్ధుకు మేనేజర్ గా సిద్ధు సెటిలైపోతాడు.ఓ సందర్భంలో జగ్గు అనే వ్యక్తితో విద్య గొడవపడుతుంది. అదే సమయంలో సిద్ధు గురించి విద్యకు నిజం తెలిసిపోతుంది. దీంతో ఇంట్లో నుంచి గెంటేస్తుంది. తర్వాత ఏమైంది? సిద్ధు-విద్య ఒక్కటయ్యారా అనేదే స్టోరీ.(ఇదీ చదవండి: 'హిట్3' కలెక్షన్స్ ప్రకటన.. రూ. 100 కోట్లకు చేరువలో నాని) -
సంకెళ్ళ నుంచి స్వేచ్ఛ వచ్చింది!
ఓటీటీ వేదికలు వచ్చాక వినోద రంగంలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. నటుడు సైఫ్ అలీ ఖాన్ ఆ మాటే అంగీకరించారు. ముంబైలో జరుగుతున్న ‘వరల్డ్ ఆడియో – విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్’ (వేవ్స్)లో మూడో రోజైన శనివారం సైఫ్ మెరిశారు. స్ట్రీమింగ్ వేదికలతో ఆవిర్భవించిన నవభారతం గురించి జరిగిన చర్చావేదికలో ఆయన పాల్గొన్నారు. ‘‘సినీ రంగానికి చెందిన మేము గతంలో గిరి గీసుకొని నిర్ణీత విధానాలకే కట్టుబడాల్సి వచ్చేది. కానీ, స్ట్రీమింగ్ వేదికలు అందుబాటులోకి వచ్చాక నటీనటులకూ, సినీ రూపకర్తలకూ మునుపటి సంకెళ్ళ నుంచి స్వేచ్ఛ లభించింది. మా కథలను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జనం చూసే వీలు చిక్కింది. సాంప్రదాయిక సినిమా మీడియమ్లో అయితే ఆ వీలుండేది కాదు’’ అని సైఫ్ అభి్రపాయపడ్డారు. నెట్ఫ్లిక్స్ కో–సీఈఓ టెడ్ సరండోస్ సైతం, ‘‘స్ట్రీమింగ్ వేదికల వల్ల భారత్లో సినీ రూపకల్పనలో ప్రజాస్వామ్యం సాధ్యమైంది’’ అన్నారు. డిజిటల్ యుగంలో కథాకథనంలో వస్తున్న మార్పులు, సృజనాత్మక స్వేచ్ఛపై స్ట్రీమింగ్ ప్రభావం, ప్రపంచ వినోదపటంలో పెరుగుతున్న భారత్ స్థానం లాంటి పలు అంశాలపై ఈ గోష్ఠిలో దృష్టి సారించారు.‘‘ఇప్పుడు ప్రేక్షకులు చూసేందుకు విభిన్నమైన కథలు అనేకం ఏకకాలంలో అందుబాటులో ఉన్నాయి. అంతటి వైవిధ్యమైన కథలను తెరపై చెప్పే స్వేచ్ఛ సృజనశీలురకు దక్కింది. సినిమా రూపకల్పనలో ప్రజాస్వామ్యమంటే ఇదే’’ అని సైఫ్ అన్నారు. ‘‘ఎన్ని మార్పులు వచ్చినా, సినిమాలకు కాలం చెల్లదు. ఇంకా చె΄్పాలంటే, స్ట్రీమింగ్, థియేటర్లు... రెండూ పరస్పరం పోటీదారులు కావు. ముందున్న మార్కెట్ పెద్దది గనక, రెండూ ఏకకాలంలో కొనసాగుతాయి’’ అని టెడ్ విశ్లేషించారు. కోవిడ్ అనంతరం భారతదేశ వ్యాప్తంగా వందకు పైగా పట్టణాలు, నగరాల్లో, దాదాపు పాతిక వేల మంది స్థానిక నటీనటులు, సాంకేతిక వర్గంతో నెట్ఫ్లిక్స్ చిత్రీకరణ సాగించిందనీ, తద్వారా ఎందరికో ఉపాధి కల్పించిందనీ ఆయన వివరించారు.నటించే ముందు ఊహించుకోవాలి! – హీరో ఆమిర్ ఖాన్ ‘‘పాత్రను పూర్తిగా అవగాహన చేసుకొని, దానిలోకి పరకాయ ప్రవేశం చేయాలి. నా వరకు నేను స్క్రిప్టుతో చాలా సమయం గడుపుతాను. పదే పదే స్క్రిప్టు చదువుతాను. స్క్రిప్టు బాగుంటే, ఆ పాత్ర, దాని రూపురేఖలు, మానసిక వైఖరి అన్నీ దాని నుంచే అర్థమైపోతాయి. పాత్ర, కథ గురించి దర్శకుడితో చర్చల వల్ల కూడా ఓ అవగాహన వస్తుంది’’ అన్నారు ఆమిర్ ఖాన్. ‘వేవ్స్’లో భాగంగా శనివారం ఆయన తన సుదీర్ఘ నటనా జీవితం నుంచి కొత్తవాళ్ళకు పనికొచ్చే పలు సూచనలు చె΄్పారు. ‘‘నాకు జ్ఞాపకశక్తి తక్కువ. అందుకే, చేతితో డైలాగులు రాసుకుంటా.కష్టమైన సీన్లు ముందుగా చేస్తా. డైలాగులు కంఠస్థం చేస్తా. డైలాగులు నోటికి వచ్చాక, వాటిని నాదైన పద్ధతిలో సొంతం చేసుకుంటా. అదే డైలాగును వల్లె వేస్తున్నప్పుడు దాన్ని అనేక విధాలుగా ఎలా చేయవచ్చో మనకే అర్థమవుతుంది’’ అని ఆమిర్ వివరించారు. ‘‘చేస్తున్న పనిలో ఎంత నిజాయతీగా ఉంటే, అంత బాగా నటించగలుగుతాం. సీన్లుప్రాక్టీస్ చేసేటప్పుడు నేను అద్దంలో చూస్తూ చేయను. నటించే ముందు ఆ సన్నివేశాన్ని మనసులో ఊహించుకుంటా’’ అని చె΄్పారు. ‘‘సన్నివేశం డిమాండ్ చేసింది చేయాలే తప్ప, అందులో నా వంతు ఏమిటి, నాకెంత పేరొస్తుందని చూస్తే దెబ్బతింటాం’’ అని విశ్లేషించారు.70 కోట్ల మంది చూస్తున్నారు!గత పాతిక ఏళ్ళ పైచిలుకు కాలంలో భారత మీడియా సాధించిన పురోగతి, మరీ ముఖ్యంగా వీడియో కంటెంట్ సృష్టి, ఆ కంటెంట్ను జనం చూడడం పెరిగిన తీరు అనూహ్యమని మీడియా నిపుణుడు, జియో స్టార్ వైస్ఛైర్మన్ ఉదయ్ శంకర్ విశ్లేషించారు. ఒకప్పుడు టీవీకే పరిమితమైతే... ఇప్పుడు 4జీ విప్లవం, హాట్స్టార్ సహా వివిధ వేదికల ఆవిర్భావంతో దాదాపు 70 కోట్ల మంది స్ట్రీమింగ్ కంటెంట్ చూస్తున్నారని అంచనా వేశారు.‘వేవ్స్’లో ఆయన మాట్లాడుతూ, ‘‘హిందీ సినిమా ఇప్పటికీ పాతకాలంలోనే ఆగిపోవడం వల్ల థియేటర్లలో వసూళ్ళు తగ్గాయనీ, తమిళ – తెలుగు సహా దక్షిణాది సినీ పరిశ్రమల్లో సృజనాత్మక ప్రయోగాలు, వాటితో పాటు వసూళ్ళు పెరిగాయనీ గుర్తు చేశారు. ‘‘అన్ని తెరలూ ఒకటే కావు. వెండితెర, బుల్లితెర, డిజిటల్ ... దేనికవే భిన్నమైనవి. ఒక్కోటీ ఒక్కో పరిణామ దశలో ఉన్నాయి. దేని ప్రయోజనం దానిదే. అది తెలుసుకోకుండా అన్నిటితో ఒకేలా వ్యవహరిస్తే వ్యాపారంలో దెబ్బ తింటాం’’ అని ఆయన వివరించారు.నాగపూర్లో ప్రపంచపు అతి పెద్ద స్క్రీన్‘‘ఇండియన్ ఎంటర్టైన్మెంట్ని ప్రపంచ స్థాయిలోకి తీసుకెళ్లాలన్నది ప్రధాని మోదీగారి లక్ష్యం. ఈ దిశలో వరల్డ్స్ బిగ్గెస్ట్ సినిమా స్క్రీన్ నిర్మించే అవకాశం మాకు దక్కడం గర్వకారణం. మా విజన్ని అర్థం చేసుకుని, నమ్మిన ముఖ్యమంత్రి ఫడ్నవీస్గారికి కృతజ్ఞతలు’’ అని అభిషేక్ అగర్వాల్ అన్నారు. నాగపూర్లో వరల్డ్స్ బిగ్గెస్ట్ సినిమా స్క్రీన్ప్రాజెక్ట్ను రూపకల్పన చేయనున్నట్లు ‘వేవ్స్–2025’ వేదికగా నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. ‘‘గొప్ప సినిమాలు తీయడమే కాదు, అద్భుతమైన థియేటర్లు నిర్మించాలన్నది మా ధ్యేయం. సినిమాను మరింత గొప్పగా మార్చడమే మా యూవీ క్రియేషన్స్ లక్ష్యం. ప్రపంచపు అతిపెద్ద స్క్రీన్ ని నాగపూర్లో నిర్మించ నున్నాం. మా సామర్థ్యాలపై నమ్మకం ఉంచిన మోదీగారికి కృతజ్ఞతలు’’ అన్నారు విక్రమ్ రెడ్డి. – సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
ఓటీటీలో సూపర్ హిట్ సిరీస్.. కొత్త సీజన్ పై ప్రకటన
ఓటీటీలో ఎప్పటికప్పుడు రిలీజయ్యే సినిమాలు చూసే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. కానీ వీటిలోనే ఉంటే వెబ్ సిరీసులు మాత్రం కొందరే చూస్తుంటారు. అయితే లాక్ డౌన్ టైంలో రిలీజై సూపర్ హిట్ అయిన సిరీస్ ల్లో 'పంచాయత్'. ఇదివరకే మూడు సీజన్లు రాగా ఇప్పుడు నాలుగో సీజన్ డేట్ ఫిక్స్ అయింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి అజిత్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్) పంచాయత్ సిరీస్ గురించి చెప్పుకుంటే చాలా సింపుల్ స్టోరీ. సిటీలో పుట్టి పెరిగిన ఓ కుర్రాడు.. ఓ మారుమూల పల్లెలోకి పంచాయతీ సెక్రటరీగా అడుగుపెడతాడు. జాబ్ అయితే చేస్తుంటాడు గానీ అస్సలు ఇష్టముండదు. విదేశాలకు వెళ్లిపోవాలనేదే ఇతడి డ్రీమ్. అలాంటిది ఇతడిని పల్లెలోని ఉంటే కొందరు మనుషులు మార్చేస్తారు. తర్వాత ఏమైందనేదే స్టోరీ.ఇదివరకు మూడు సీజన్లు స్ట్రీమింగ్ కాగా అవన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు నాలుగో సీజన్ ని ఈ జూలై 02 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈ సీజన్ అంతా కూడా పంచాయతీ ఎన్నికల బ్యాక్ డ్రాప్ లో ఉండనుంది. కామెడీ ప్లస్ ఎమోషనల్ గా ఉండే ఈ సిరీస్ ని తెలుగులోనూ 'సివరపల్లి' పేరుతో రీమేక్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే) Phulera mein elections ki garma garmi shuru hone wali hai 👀🗳️#PanchayatOnPrime, New Season, July 2 pic.twitter.com/bsVMojSUEk— prime video IN (@PrimeVideoIN) May 3, 2025 -
ఓటీటీలోకి అజిత్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
రీసెంట్ గా పద్మ భూషణ్ అవార్డ్ అందుకున్న తమిళ హీరో అజిత్. ఈయన నటించిన లేటెస్ట్ మూవీ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly Movie). యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం.. గత నెలలో రిలీజై హిట్ అయింది. ఇప్పుడు నెల తిరిగేసరికల్లా ఓటీటీ(OTT) స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. అధికారిక తేదీ కూడా ప్రకటించారు.తమిళ హీరోల్లో అజిత్(Ajith Kumar) కాస్త డిఫరెంట్. సినిమాలు, కారు రేసింగ్ అని తన పనేదో తాను చూసుకుంటూ ఉంటాడు. ఈ మధ్య కాలంలో అజిత్ సినిమాలు చేస్తున్నాడు హిట్ అవుతున్నాయి గానీ ఫ్యాన్స్ ఎందుకో పూర్తిగా సంతృప్తి చెందడం లేదు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు పూర్తిగా ఫ్యాన్ మూమెంట్స్ తో 'గుడ్ బ్యాడ్ అగ్లీ' తీశారు.(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే) ఈ మూవీలో అజిత్ పాత సినిమా పాటలు, వింటేజ్ స్టైల్ తదితర అంశాలు అజిత్ అభిమానులకు తెగ నచ్చేశాయి. దీంతో హిట్ చేసేశారు. నిర్మించింది మైత్రీ మూవీ మేకర్స్ కావడంతో తెలుగులోనూ రిలీజ్ చేశారు. కానీ ఏమంత గొప్పగా ఆడలేదు. ఇప్పుడు ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్ లో మే 08 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.'గుడ్ బ్యాడ్ అగ్లీ' విషయానికొస్తే.. ఏకే అలియాస్ రెడ్ డ్రాగన్ (అజిత్) తన గ్యాంగ్ స్టర్ జీవితాన్ని వదిలేసి కుటుంబంతో హ్యాపీగా ఉండాలనుకుంటాడు. అందుకోసం జైలుకి కూడా వెళ్తాడు. కొడుకు కోసం ఏడాది ముందే జైలు నుంచి బయటకొస్తాడు. అంతలోనే కొడుకుని ఎవరో కిడ్నాప్ చేశారనే సంగతి తెలుస్తుంది. అలానే డ్రగ్స్ కేసులోనూ ఇరుక్కున్నాడనే సంగతి తెలుస్తుంది. దీంతో ఏకే మళ్లీ గ్యాంగ్ స్టర్ అవుతాడు? తర్వాత కొడుకుని ఎలా కాపాడుకున్నాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలో రాబిన్హుడ్.. ప్రకటనతో క్లారిటీ)He's done being good. Now he's going to be bad and things are about to get ugly 👀🔥Watch Good Bad Ugly on Netflix, out 8 May in Tamil, Hindi, Telugu, Kannada and Malayalam#GoodBadUglyOnNetflix pic.twitter.com/HJVKYBxybl— Netflix India (@NetflixIndia) May 3, 2025 -
ఓటీటీలో రాబిన్హుడ్.. ప్రకటనతో క్లారిటీ
నితిన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన రాబిన్హుడ్ మూవీ ఓటీటీలోకి రానుంది. ఈ ఏడాదిలో మార్చి 28న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్గా నిలిచింది. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి అంచనాలతో థియేటర్స్లోకి వచ్చింది. అయితే, మొదటిరోజే మిక్స్డ్ టాక్ రావడంతో అనుకున్నంత కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేనీ, రవిశంకర్ ఈ మూవీని నిర్మించారు. ఇందులో నితిన్, శ్రీలీలతో పాటు రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్, కేతిక శర్మ మెప్పించగా.. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ క్యామియో రోల్తో కనిపించారు.రాబిన్హుడ్ సినిమా జీ తెలుగు టీవీ ఛానెల్లో మే 10వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానున్నట్లు ఒక పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. అయితే, జీ5 ఆప్కమింగ్ సినిమాల విభాగంలో మే 10న ఓటీటీ విడుదల కానుందని ఒక ప్రకటన ఉంది. కొద్దిరోజులుగా జీ నెట్వర్క్ ఇలాంటి స్ట్రాటజీనే అమలు చేస్తోంది. కొత్త సినిమాలను టీవీ ప్రీమియర్, ఓటీటీ స్ట్రీమింగ్కు ఒకేసారి విడుదల చేస్తుంది. గతంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా విషయంలో కూడా ఇదే ప్లాన్ను జీ తెలుగు అమలు చేసింది. ఇప్పుడు రాబిన్హుడ్ చిత్రం విషయంలోనూ దానిని అమలు చేస్తున్నట్లు అర్థం అవుతుంది. మే 10 నుంచి జీ తెలుగు ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు ఫైనల్ అయింది. సుమారు రూ. 50కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 10 కోట్లు కూడా రాబట్టలేదని టాక్.కథేంటంటే.. రామ్ (నితిన్) అనాథ. చిన్నప్పుడు అతన్ని ఓ పెద్దాయన హైదరాబాద్లోని ఓ అనాథ ఆశ్రమంలో చేర్పిస్తాడు. అక్కడ తినడానికి తిండిలేక ఇబ్బందిపడుతున్న తోటి పిల్లల కోసం దొంగగా మారతాడు. పెద్దయ్యాక ‘రాబిన్హుడ్’ పేరుతో ధనవంతుల ఇళ్లలో చోరీలు చేస్తుంటాడు. అతన్ని పట్టుకోవడం కోసం రంగంలోకి దిగిన పోలీసు అధికారి విక్టర్(షైన్ చాం టాకో) ఈగోని దెబ్బతీస్తూ ప్రతిసారి దొరికినట్లే దొరికి తప్పించుకుంటాడు. దీంతో విక్టర్ రాబిన్ని పట్టుకోవడమే టార్గెట్గా పెట్టుకుంటాడు.రాబిన్కి ఈ విషయం తెలిసి..దొంగతనం మానేసి జనార్ధన్ సున్నిపెంట అలియాస్ జాన్ స్నో(రాజేంద్రప్రసాద్) నడిపే ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో జాయిన్ అవుతాడు.(Robinhood Review). అదే సమయంలో ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ఇండియన్ ఫార్మా కంపెనీ అధినేత కుమార్తె నీరా వాసుదేవ్ (శ్రీలీల) ఇండియాకు వస్తుంది. ఆమెకు సెక్యూరిటీగా రాబిన్ వెళ్తాడు. ఇండియాకు వచ్చిన నీరాను గంజాయి దందా చేసే రౌడీ సామి(దేవదత్తా నాగే) మనుషులు బంధించి రుద్రకొండ అనే ప్రాంతానికి తీసుకెళ్తారు? సామి వలలో చిక్కుకున్న నీరాను రాబిన్హుడ్ ఎలా రక్షించాడు? నిరాను రుద్రకొండకు ఎందుకు రప్పించారు? రాబిన్హుడ్ సడెన్గా సెక్యూరిటీ ఏజెన్సీలో ఎందుకు చేరాల్సివచ్చింది? ఈ కథలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి శుక్రవారం కాకుండా గురువారం (మే 01) పబ్లిక్ హాలీ డే కావడంతో హిట్ 3, రెట్రో, రైడ్ 2 తదితర చిత్రాలు థియేటర్లలో రిలీజయ్యాయి. వీటిలో హిట్ 3కి తెలుగులో పాజిటివ్ టాక్ వచ్చింది. మరోవైపు ఓటీటీల్లోనూ ఏకంగా 30 సినిమాలు స్ట్రీమింగ్ లోకి వచ్చేశాయి.(ఇదీ చదవండి: నానికి బిగ్ షాక్.. ఆన్లైన్లో హిట్ 3 హెచ్డీ ప్రింట్ లీక్!)ఓటీటీలోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే చాలావరకు తెలుగు కంటే హిందీ, తమిళ, మలయాళ చిత్రాలే ఈ వీకెండ్ అందుబాటులోకి వచ్చాయి. ఏకంగా 29 వరకు సినిమాలు ఈ రెండు రోజుల్లోనే రావడం విశేషం. ఇంతకీ ఆ మూవీస్ ఏంటి? ఏయే ఓటీటీల్లో ఏది స్ట్రీమింగ్ అవుతుందనేది చూద్దాం.ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చిన మూవీస్ (మే 01-02)అమెజాన్ ప్రైమ్ఈఎమ్ఐ - తమిళ మూవీఈడీ (ఎక్స్ ట్రా డిస్కౌంట్) - మలయాళ చిత్రంవలియంట్ వన్ - ఇంగ్లీష్ సినిమా ఇంపీరియల్ లైవ్ టూర్ - కన్సర్ట్ మూవీస్కూల్ స్పిరిట్ - ఇంగ్లీష్ సిరీస్బడ్డీ - హిందీ డబ్బింగ్ సినిమాఎనదర్ సింపుల్ ఫేవర్ - తెలుగు డబ్బింగ్ మూవీకరెబెటే - కన్నడ సినిమామాన్ సూన్ బేబీ - జర్మన్ మూవీఔసిప్పింటే ఒసీయాతు - మలయాళ సినిమాశ్రీ గణేశ - మరాఠీ మూవీనెట్ ఫ్లిక్స్బ్యాడ్ బాయ్ - ఇజ్రాయెలీ సిరీస్పారా రెస్క్యూ జంపర్ - జపనీస్ సిరీస్జీఏటీఏఓ - మాండరిన్ మూవీద బిగ్గెస్ ఫ్యాన్ - స్పానిష్ సినిమాద క్లీసే - థాయ్ మూవీద రాంగ్ వే టూ హీలింగ్ మ్యూజిక్ - జపనీస్ సిరీస్ద ఫోర్ సీజన్స్ - తెలుగు డబ్బింగ్ సిరీస్హాట్ స్టార్కుల్: ద లెగసీ ఆఫ్ రైజింగ్స్ - హిందీ సిరీస్ 100 ఫుట్ వేవ్ సీజన్ 3 - ఇంగ్లీష్ డాక్యుమెంట్ సిరీస్ద బ్రౌన్ హార్ట్ - ఇంగ్లీష్ డాక్యుమెంటరీ (మే 03)ఆహావేరే లెవల్ ఆఫీస్ సీజన్ 2 - తెలుగు సిరీస్వరుణన్ - తమిళ సినిమాజీ5కోస్టాకో - హిందీ మూవీసన్ నెక్స్ట్కాలా పత్తర్ - కన్నడ సినిమాబ్లూ స్టార్ - తమిళ మూవీపరమణ్ - తమిళ సినిమాసోనీ లివ్బ్రొమాన్స్ - తెలుగు డబ్బింగ్ సినిమాబ్లాక్, వైట్ అండ్ గ్రే - హిందీ సిరీస్లయన్స్ గేట్ ప్లేద బాయు - తెలుగు డబ్బింగ్ మూవీ(ఇదీ చదవండి: 'హిట్ 3' ఫస్ట్ డే కలెక్షన్స్.. నాని కెరీర్లో ఇదే టాప్) -
అజిత్ కుమార్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. నెల రోజుల్లోపే ఓటీటీకి..!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ గుడ్ బ్యాడ్ అగ్లీ. స్టార్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. విదాముయార్చి తర్వాత ఈ ఏడాదిలోనే వచ్చిన రెండో చిత్రానికి తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మించారు.తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్కు సంబంధించిన వార్త నెట్టింట వైరల్గా మారింది. ఈ నెలలోనే స్ట్రీమింగ్కు రానున్నట్లు తెలుస్తోంది. ఈనెల 8వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుందని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.కాగా.. ఈ చిత్రంలో అజిత్ కుమార్ గ్యాంగ్స్టర్ పాత్రలో మెప్పించారు. గుడ్ బ్యాడ్ అగ్లీలో త్రిష హీరోయిన్గా నటించగా.. అర్జున్ దాస్ విలన్ పాత్రలో అలరించారు. ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు సునీల్, కార్తికేయ దేవ్, ప్రియా ప్రకాష్ వారియర్, ప్రభు, ప్రసన్న, టిన్ను ఆనంద్, రఘు రామ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. -
నాని 'హిట్ 3' వచ్చేది ఆ ఓటీటీలోనే..
హీరో నాని (Nani) స్పీడుమీదున్నాడు. హీరోగా, నిర్మాతగా వరుస విజయాలు అందుకుంటున్నాడు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం చిత్రాలతో హిట్లు అందుకుంటున్న ఈ హీరో.. నిర్మాతగా కోర్ట్ చిత్రంతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఇతడు ప్రధాన పాత్రలో నటించిన హిట్: ద థర్డ్ కేస్ మూవీ (HIT: The Third Case) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.హిట్ 3కి పాజిటివ్ టాక్మే1న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. హిట్ 1, 2 కంటే కూడా ఈ మూవీలో వయొలెన్స్ మూడు రెట్లు ఎక్కువగా ఉంది. యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారికి హిట్ 3 బాగా ఎక్కేసిందట! ఈ టాక్ చూస్తుంటే నాని బ్లాక్బస్టర్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. హిట్ 3 సినిమాలో నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటించారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. నాని, ప్రశాంతి తిపిర్నేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏ ఓటీటీలో అంటే?ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఏకంగా రూ.54 కోట్లు పెట్టి ఈ హక్కుల్ని సొంతం చేసుకుందని టాక్. థియేటర్లో రిలీజైన నాలుగు వారాల తర్వాత ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారట. ఈ లెక్కన మే చివరి వారం, లేదా జూన్ మొదటివారంలో హిట్ 3 ఓటీటీలో వచ్చే అవకాశాలున్నాయి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ప్రవాహం వారాల తరబడి కొనసాగితే మాత్రం ఓటీటీ రిలీజ్ ఆలస్యమయ్యే ఆస్కారం ఉంది.హిట్ 3 రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఓటీటీకి డేవిడ్ వార్నర్ చిత్రం... ఆ రోజు నుంచే స్ట్రీమింగ్!
నితిన్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం రాబిన్హుడ్. ఉగాది కానుకగా మార్చి 28న థియేటర్లలోకి వచ్చిన చిత్రం.. ఆశించిన స్థాయిలో అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టడంలో తేలిపోయింది. ఈ మూవీ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సైతం కెమియో పాత్రలో మెరిశారు. వార్నర్ కోసమైనా థియేటర్లకు వస్తారనుకున్నప్పటికీ అది కూడా పెద్దగా వర్కవుట్ అవ్వలేదు.ఇప్పటికే ఈ సినిమా విడుదలై నెలరోజులు పూర్తవ్వడంతో ఈ మూవీ ఓటీటీకి ఎప్పుడొస్తుందా అభిమానులు ఎదురు చూస్తున్నారు. గతంలో మే 4న ఓటీటీ వస్తుందని వార్తలొచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. మరోవైపు వచ్చేనెల 10 నుంచి స్ట్రీమింగ్ కానుందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ హక్కులను జీ5 సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సంక్రాంతికి వస్తున్నాం తరహాలో ఓకేరోజు టీవీలతో పాటు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.రాబిన్హుడ్ కథేంటంటే..'రాబిన్ హుడ్' విషయానికొస్తే.. రామ్ (నితిన్) ఓ అనాథ. అనాథశ్రమాల కోసం రాబిన్ హుడ్ పేరుతో దొంగతనాలు చేస్తుంటాడు. కొన్ని కారణాల వల్ల ఓ సెక్యూరిటీ ఏజెన్సీలో చేరుతాడు. ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు వచ్చిన నీరా (శ్రీలీల)కు సెక్యూరిటీగా ఉంటాడు. ఓరోజు నీరాని ఎవరో కిడ్నాప్ చేస్తారు. మరి రామ్, నీరాని ఎలా రక్షించాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. -
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
ఓటీటీలో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. మిగతా భాషలతో పాటు తెలుగు చిత్రాలు కూడా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. దీంతో టైమ్ కుదిరినప్పుడల్లా ప్రేక్షకులు వీటిని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రెండు తెలుగు మూవీస్.. సడన్ గా ఓటీటీలో ప్రత్యక్షమయ్యాయి. వేటిలో స్ట్రీమింగ్ అవుతున్నాయంటే?గతేడాది అక్టోబరు చివరి వారంలో 'సముద్రుడు' అనే సినిమా రిలీజైంది. ఇది ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చింది. రమాకాంత్, అవంతిక, భాను శ్రీ హీరోహీరోయిన్లుగా నటించారు. మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయి? వాళ్ళ కష్టాలు ఏంటి? దళారులు.. మత్స్యకారులను ఎలా మోసం చేస్తున్నారు లాంటి అంశాలతో ఈ మూవీ తీశారు. (ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్) అలానే 2022లో రిలీజైన 'రుద్రవీణ'.. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ ఇందులో హీరోయిన్ గా చేసింది. ఇదో రొటీన్ యాక్షన్ మూవీ. ఊరిని ఇబ్బంది పెట్టే రౌడీ. దీంతో హీరో రంగంలోకి దిగుతాడు. చివరకు విలన్ ని హీరో ఎలా చంపాడనేదే స్టోరీ.పై రెండు సినిమాలు కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో ఇలా థియేటర్లలోకి వచ్చి అలా వెళ్లిపోయాయి. ఇవి ఇప్పుడు రెంట్ విధానంలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చాయి. గత కొన్ని వారాలుగా ఈ ఓటీటీ సంస్థ ఇలానే పలు తెలుగు చిన్న చిత్రాల్ని స్ట్రీమింగ్ చేస్తోంది. ఆసక్తి ఉంటే వీటిపై ఓ లుక్కేయండి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో) -
ఓటీటీలోకి వచ్చేసిన ఆంథాలజీ.. తెలుగులో స్ట్రీమింగ్
ఒకప్పటితో పోలిస్తే వారంతో సంబంధం లేకుండా ఓటీటీలోకి కొత్త సినిమాలు, సిరీసులు రిలీజ్ అవుతున్నాయి. ఇతర భాషల్లో రిలీజైనవి కూడా కొన్నాళ్ల గ్యాప్ తర్వాత తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలా ఓ సిరీస్ తెలుగు వెర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటి సంగతి? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది.సోనియా అగర్వాల్, శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ సిరీస్ 'ష్'. ఇది నాలుగు కథల సమాహారం. లస్ట్, రొమాన్స్ తదితర అంశాలని బోల్డ్ గానే చూపించే ప్రయత్నం చేశారు. స్కూల్ ఏజ్ లో సె*క్స్ ఎడ్యుకేషన్.. పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత శృంగార జీవితం తదితర స్టోరీలతో ఈ ఆంథాలజీ తీశారు. పృథ్వీ ఆదిత్య, వాలి మోహన్ దాస్, హరీష్, కార్తీకేయన్ దర్శకత్వం వహించారు. (ఇదీ చదవండి: అల్లు అర్జున్ కోసం ఫ్లాపుల హీరోయిన్?)గతేడాది తమిళంలో రిలీజ్ కాగా.. దీని తెలుగు వెర్షన్ ఇప్పుడు(ఏప్రిల్ 30 నుంచి) ఆహా ఓటీటీలోకి వచ్చింది. ఒరిజినల్ వెర్షన్ అయితే ఆహా, అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. నెట్ ఫ్లిక్స్ లో అప్పట్లో సెన్సేషన్ సృష్టించిన 'లస్ట్ స్టోరీస్' స్ఫూర్తితో ఈ ఆంథాలజీని తెరకెక్కించారు. ట్రైలర్ చూస్తే మీకు ఇది అర్థమైపోతుంది. ఇందులో మరీ అంత బోల్డ్ సీన్స్ లేవని, క్లైమాక్స్ ని ఓపెన్ ఎండింగ్ తో ముగించడం కాస్త అసంతృప్తిని కలిగించిందని తమిళంలో రిలీజైనప్పుడు అన్నారు. మరి తెలుగు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్) -
ఓటీటీ జోరు... డిజిటల్ మీడియా హోరు
సాక్షి, అమరావతి: సినిమా చూడాలంటే థియేటర్కే వెళ్లాలనే రోజులకు కాలం చెల్లుతోంది. ఓటీటీ (ఓవర్ ద టాప్)ల్లో సినిమాలకే ఆదరణ పెరుగుతోంది. వినోదమంటే టీవీ చానళ్లు చూడాలనే రోజులు ఇక గతమే. వినోదం కోసం ప్రజలు డిజిటల్ మాధ్యమాలవైపే మొగ్గు చూపుతున్నారు. సినిమాలు, టీవీ చానళ్ల స్థానాన్ని డిజిటల్ మీడియా కబళిస్తోంది. ఆధునిక సమాచార సాంకేతిక విప్లవంతో డిజిటల్ మీడియా ప్రజల ఇళ్లల్లోకే దూసుకువస్తోంది. ఇది స్మార్ట్ ఫోన్లలోకి అందుబాటులోకి వచ్చేస్తోంది. డిజిటల్ మీడియా ఏటా సగటున 7 శాతం వృద్ధి సాధిస్తోంది. రానున్న కాలంలో వినోద రంగం అంటే డిజిటల్ మీడియాదేనని ‘ఫిక్కీ–ఎర్నెస్ట్ యంగ్ ఇండియా’ తాజా నివేదిక వెల్లడించింది. వీక్షకుల ఆదరణే కాదు ప్రకటనల ఆదాయంలోనూ డిజిటల్ మీడియా ఆధిపత్యం సాధిస్తోందని తెలిపింది. టీవీని అధిగమిస్తున్న స్మార్ట్ ఫోన్ దేశంలో టీవీల ద్వారా వినోద కార్యక్రమాల వీక్షణం కంటే స్మార్ట్ ఫోన్ల ద్వారానే అధికంగా వినోద కార్యక్రమాలను వీక్షిస్తున్నారు. సినిమాలు, సీరియల్స్, రియాల్టీ షోలు, క్రికెట్, ఇతర స్పోర్ట్స్ మొదలైవన్నీ కూడా టీవీల్లో కంటే స్మార్ట్ ఫోన్లలోనే వీక్షించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితి మున్ముందు మరింతగా పెరుగుతుంది.ఓటీటీ విప్లవం సినిమాలను థియేటర్ల కంటే ఓటీటీల్లో చూసేందుకే ఆసక్తి పెరుగుతోంది. 2024లో దేశంలో 1,600 సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో 500 సినిమాలు కేవలం ఓటీటీల్లోనే విడుదల కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రానున్న కాలంలో ఓటీటీల్లో మాత్రమే విడుదలయ్యే సినిమాల సంఖ్య మరింతగా పెరుగుతుంది. 2027 నాటికి దేశంలో 6.50 కోట్ల ఇళ్లల్లో ఓటీటీ చానళ్లు చూస్తారు. ఆదాయంలోనూ డిజిటల్ మీడియా జోరు వీక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే ప్రకటనల ఆదాయంలోనూ డిజిటల్ మీడియా ఆధిపత్యం సాధిస్తోంది. టీవీల్లోకంటే డిజిటల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చేందుకు పారిశ్రామిక, వ్యాపార సంస్థలు మొగ్గుచూపుతున్నాయి. డిజిటల్ మీడియా, టీవీలు, షార్ట్ వీడియోలు, సోషల్ మీడియా మొదలైన వాటిని కలిపి వీడియో వినోద రంగంగా పరిగణిస్తారు. వాటిలో అత్యధిక ప్రకటనల ఆదాయం ఎన్నో దశాబ్దాలుగా టీవీ రంగానికే దక్కేది. కానీ.. ఐదేళ్లుగా డిజిటల్ మీడియా అనూహ్యంగా దూసుకువస్తోంది. 2019లో దేశంలో మీడియా, వినోద రంగం ప్రకటనల ద్వారా రూ.1.90 లక్షల కోట్లు ఆదాయం సాధించింది. 2024లో అది మరింత పెరిగి రూ.2.50 లక్షల కోట్ల ఆదాయం రాబట్టింది. 2027 నాటికి రూ.3.1 లక్షల కోట్లు రాబడి సాధించవచ్చని అంచనా. -
ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా చూశారుగా. అందులో భాగ్యంగా తనదైన యాక్టింగ్ చేసిన ఐశ్వర్య రాజేశ్.. గత కొన్నాళ్లుగా తెలుగులో మూవీస్ చేస్తోంది. అయితే ఈమె నటించిన ఓ తమిళ చిత్రాన్ని ఇప్పుడు నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది.(ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్) 1980ల్లో పలు తెలుగు సినిమాలు చేసిన రాజేశ్ అనే నటుడి కూతురే ఐశ్వర్య రాజేశ్. స్వతహాగా తెలుగమ్మాయి అయినప్పటికీ తమిళ నటిగా కెరీర్ ప్రారంభించింది. 2010 నుంచి అక్కడ వరస చిత్రాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. మలయాళం, హిందీలోనూ ఒకటి రెండు మూవీస్ చేసింది.కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగులోకి వచ్చిన ఈమె.. తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్, రిపబ్లిక్ తదితర చిత్రాలు చేసింది. అసలు విషయానికొస్తే ఈమె హీరోయిన్ గా చేసిన తమిళ మూవీ ఆరతు సీనం 2016లో రిలీజైంది. దీని తెలుగు వెర్షన్ ని ఇప్పుడు ఆహా ఓటీటీలో నేరుగా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా) దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఐశ్వర్య రాజేశ్ సినిమాని గరుడ 2.0 పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. దీన్ని థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ కథతో తీశారు. అరివళగన్ అనే దర్శకుడు దీన్ని తెరకెక్కించారు. అరుణ్ నిధి, ఐశ్వర్య దత్త, రోహిణి తదితరులు కీలక పాత్రలు పోషించారు.గరుడ 2.0 విషయానికొస్తే.. హీరో సీన్సియర్ పోలీస్ ఆఫీసర్. భార్య కూతురితో సంతోషంగా ఉంటాడు. కానీ కొందరు క్రిమినల్స్.. హీరో భార్య కూతురిని చంపేస్తారు. దీంతో మందుకి బానిస అవుతాడు. పై అధికారి చెప్పడంతో చాన్నాళ్ల తర్వాత మళ్లీ డ్యూటీలోకి వస్తాడు. అలా వరస హత్యల కేసు ఇతడికి అప్పగిస్తారు. మరి హీరో.. హంతకుడిని పట్టుకున్నాడా లేదా అనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఈవారం ఓటీటీలో 20 చిత్రాలు) -
మరో ఓటీటీకి టాలీవుడ్ కామెడీ ఎంటర్టైనర్.. కేవలం వారి కోసమే!
శ్రీవిష్ణు హీరోగా, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటించిన టాలీవుడ్ కామెడీ ఎంటర్టైనర్ 'ఓం భీమ్ బుష్'. గతేడాది మార్చి 22న థియేటర్స్లో రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. లాజిక్తో సంబంధం లేకుండా మంచి కథతో పాటు అంతకు మించిన కామెడీతో ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాకు శ్రీహర్ష దర్శకత్వం వహించారు. అయితే ఈ సూపర్ హిట్ మూవీఇప్పటికే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ టాలీవుడ్ కామెడీ ఎంటర్టైనర్ దాదాపు ఏడాది తర్వాత మరో ఓటీటీలో సందడి చేయనుంది. మే నెల 2వ తేదీ నుంచి సింప్లీ సౌత్ అనే ఓటీటీలోనూ స్ట్రీమింగ్ కానుంది. అయితే కేవలం ఈ ఓటీటీలో విదేశాల్లో నివసించే వారు మాత్రమే చూడొచ్చు. ఇండియాలో ఉండే వారికి సింప్లీ సౌత్లో స్ట్రీమింగ్ కాదు. తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. #OmBheemBush, streaming in Telugu, Tamil and Malayalam on Simply South from May 2 worldwide, excluding India., pic.twitter.com/km7om16Zlf— Simply South (@SimplySouthApp) April 29, 2025