breaking news
Paradha Movie
-
కారులో కూర్చుని ఏడ్చేశా..: అనుపమ పరమేశ్వరన్
‘‘సినిమా అంటే ఒక సెలబ్రేషన్. కమర్షియాలిటీ కూడా. అయితే ఈ తరహా చిత్రాలతో పాటు ఒక్కొక్కసారి మనల్ని ఆలోచింపజేసే ‘పరదా’లాంటి చిత్రాలు కూడా రావాలి. ‘పరదా’ చాలా కొత్త కథ. నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేశాం. ప్రేక్షకులు మా సినిమాను ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఫ్యామిలీస్తో కలిసి చూడాల్సిన సినిమా ఇది’’ అని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) అన్నారు. అనుపమ సంగతులుఅనుపమ పరమేశ్వరన్ కథానాయికగా, సంగీత, దర్శన, రాజేంద్రప్రసాద్, రాగ్ మయూర్ ఇతర కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘పరదా’. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ మేకర్స్ రాజ్ అండ్ డీకే సపోర్ట్తో ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకాడ నిర్మించిన ఈ చిత్రం నేడు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం విలేకరుల సమావేశంలో అనుపమా పరమేశ్వరన్ చెప్పిన సంగతులు. కనెక్ట్ అయ్యా..‘పరదా’లాంటి కథలు తెలుగులోనే కాదు... భారతీయ సినిమాలోనూ చాలా అరుదు. ఈ తరహా ఫ్రెష్ కాన్సెప్ట్తో కూడిన కథ నా దగ్గరకు రాలేదు. అందుకే దర్శకుడు ప్రవీణ్ కథ చెప్పినప్పుడు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను. ఒక అమ్మాయి మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలదు. ‘పరదా’ ఒక బోల్డ్ అటెంప్ట్. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఎవరైనా ఒక్క సెకండ్ ఆలోచించగలిగినా అది సక్సెస్గా భావిస్తాను. సవాల్గా తీసుకున్నా..ఈ చిత్రంలో చాలావరకు నేను పరదా ధరించిన సన్నివేశాల్లోనే కనిపిస్తాను. కొన్ని సీన్స్లో సైలెంట్గానే ఉంటాను. అయితే నా పరదా వెనక నా క్యారెక్టర్ తాలూకు భావోద్వేగం కనిపిస్తుంది. నా కళ్లతో, నా బాడీ లాంగ్వేజ్, నా వాయిస్తో నేను నటించగలిగానని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది. ఓ సవాల్గా తీసుకుని ఈ సినిమా చేశాను. ‘పరదా’ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కారులో కూర్చుని ఏడ్చేశా..నిజానికి నేను స్విచ్చాన్, స్విచ్చాఫ్ యాక్టర్ని. అయితే ‘పరదా’ మాత్రం వెంటాడింది. నా పాత్రకు ఆత్మహుతి సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీన్లో వచ్చే మ్యూజిక్ అవన్నీ నన్ను కదిలించేశాయి. కారులో కూర్చుని ఏడ్చేశాను. సోషల్ మీడియాలో ‘పరదా’ సినిమా పురుషులకు కాస్త వ్యతిరేకంగా ఉందన్నట్లుగా ఎవరో పోస్ట్ చేశారు. అది చూసి బాధగా అనిపించింది. కానీ ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. ఏదైనా మనం చూసే దృష్టి కోణాన్ని బట్టి ఉంటుంది. విద్యాబాలన్పై ముద్రఓ హీరోయిన్ నటించిన ఫ్లాప్ అయితే ఐరన్ లెగ్ అనే ముద్ర వేస్తారు. గతంలో మోహన్లాల్గారితో విద్యాబాలన్గారు చేయాల్సిన సినిమా ఒకటి ఇలాంటి కారణం (ఐరన్ లెగ్) వల్లే క్యాన్సిల్ అయ్యిందట. ఆ తర్వాత విద్యాబాలన్ చేయాల్సిన తొమ్మిది సినిమాల నుంచి ఆమెను తప్పించారట. ఇది ఎంతవరకు కరెక్ట్?అదెందుకు పట్టించుకోరు?‘పరదా’లో డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను. ‘డీజే టిల్లు 2’ సినిమాలో మరో విభిన్నమైన పాత్ర చేశాను. ‘డీజే టిల్లు 2’లో నేను గ్లామరస్గా కనిపించిన విషయాన్నే మాట్లాడుతున్నారు. కానీ, అందులో నేను గన్ పట్టుకుని, యాక్షన్ చేశాను. కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశాను. ఈ అంశాలు హైలైట్ కావడం లేదు. ఏదైనా మనం ఆలోచించేదాన్ని బట్టి ఉంటుంది.చదవండి: వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్.. చిరుకు అల్లు అర్జున్ బర్త్డే విషెస్ -
అనుపమ 'పరదా' సినిమా రివ్యూ
'రివ్యూలు నచ్చితేనే మా సినిమా చూడండి'.. రీసెంట్గా ప్రమోషన్లలో హీరోయిన్ అనుపమ చెప్పిన మాట ఇది. చాలా నమ్మకంతో ఆగస్టు 22న రిలీజ్ పెట్టుకుని, రెండు రోజుల ముందే ప్రీమియర్లు వేశారు. ఆ చిత్రమే 'పరదా'. లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్తో తీసిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్ర పోషించింది. సంగీత, మలయాళ నటి దర్శన రాజేంద్రన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?పడతి అనే గ్రామంలో ఈడుకొచ్చిన ప్రతి ఆడపిల్ల ముఖానికి పరదా కప్పుకొని తిరుగుతుంటుంది. దానికి ఓ కారణం ఉంటుంది. పొరపాటున ఎవరైనా పరదా తీస్తే వాళ్లు.. గ్రామదేవత జ్వాలమ్మకు ఆత్మాహుతి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇదే ఊరిలో ఉండే సుబ్బు(అనుపమ), రాజేశ్ (రాగ్ మయూర్) ప్రేమలో ఉంటారు. వీళ్లకీ పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయిస్తారు. సరిగ్గా నిశ్చితార్థం రోజున సుబ్బు ఫొటో కారణంగా.. ఈమె ఆత్మాహుతి చేసుకోవాలని ఊరి పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. తన తప్పు లేదని చెబుతున్నా సరే వినరు. దీంతో అనుకోని పరిస్థితుల మధ్య సుబ్బు తన ఊరి దాటి ధర్మశాల వెళ్లాల్సి వస్తుంది. ఈమెకు తోడుగా రత్న(సంగీత), అమిష్ట(దర్శన రాజేంద్రన్) కూడా వెళ్తారు. ఇంతకీ ధర్మశాల ఎందుకు వెళ్లారు? చివరకు సుబ్బు.. పరదా తీసిందా లేదా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?గత కొన్నాళ్లలో హీరో సెంట్రిక్ మూవీస్ ఎక్కువగా వస్తున్నాయి. అయితే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కాస్త తగ్గాయని చెప్పొచ్చు. ఆ లోటుని భర్తీ చేసేందుకు వచ్చిన చిత్రమే 'పరదా'. ఇందులో హీరోహీరోయిన్లు అంటూ ఎవరూ ఉండరు. కథే మెయిన్ హీరో.పడతి గ్రామంలో జ్వాలమ్మ జాతరతో సినిమా మొదలవుతుంది. ఈ ఊరిలోని ఈడొచ్చిన అమ్మాయిలు, మహిళలు ఎందుకు పరదా కప్పుకోవాల్సి వచ్చిందనేది మొదటి పది నిమిషాల్లోనే తోలుబొమ్మలాట కథతో చెప్పేస్తారు. తర్వాత సుబ్బు, రాజేశ్ ప్రేమ.. నిశ్చితార్థం.. అనుకోని అవాంతరం వల్ల అది ఆగిపోవడం.. ఇలా కథలో సంఘర్షణ ఏర్పడుతుంది. తన తప్పు లేదని చెబుతున్నా సరే సుబ్బుని ఆత్మాహుతి చేసుకోవాలని ఊరి పెద్దలు ఆదేశించడం.. తర్వాత అనుకోని పరిస్థితుల్లో సుబ్బు.. మరో ఇద్దరు మహిళలతో కలిసి హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల వెళ్లాల్సి రావడం జరుగుతుంది. తర్వాత ఏమైంది? ఈ ప్రయాణంలో ఏం తెలుసుకున్నారనేది తెలియాలంటే మూవీ చూడాలి.ఒకప్పటితో పోలిస్తే అమ్మాయిల్లో చైతన్యం పెరిగింది. మగాళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా భిన్న రంగాల్లో రాణిస్తున్నారు. అయినా సరే కొన్ని ప్రాంతాల్లో మూఢ నమ్మకాల పేరుతో మహిళలని ఇబ్బంది పెడుతున్నారు. ఆచారం, సంప్రదాయం అని చెప్పి బయట ప్రపంచం చూడనీయకుండా చేస్తున్నారు. అలాంటి ఓ ఊరికి చెందిన అమ్మాయి.. తన ప్రాణాల్ని పణంగా పెట్టి మరీ ఎలాంటి సాహసం చేసింది? మూఢనమ్మకాలపై ఎలా పోరాడింది అనే కల్పిత కథతో తీసిన చిత్రమే ఇది.సినిమా ప్రారంభంలో జెయింట్ వీల్ ఎక్కడానికే సుబ్బు చాలా భయపడుతుంది. కానీ పరిస్థితుల కారణంగా ఎత్తయిన ఎవరెస్ట్ వరకు వెళ్తుంది. తనలో భయాన్ని పోగొట్టుకుంటుంది. మూవీ అంతా సుబ్బు పాత్ర పరదా కప్పుకొని ఉంటుంది. ఆమె పూర్తిగా పరదా తీసేసే సీన్లో సీతాకోక చిలుక రిఫరెన్స్ మంచి ఇంపాక్ట్ ఇచ్చింది. సుబ్బుతో పాటు జర్నీ చేసే రత్న ఓ గృహిణి, ఆమిష్ట ఓ ఇంజినీర్. ఈ పాత్రల్ని ప్రారంభించిన తీరు, ముగించిన తీరు కూడా మెచ్చుకునేలా ఉంటుంది. సెకండాఫ్ మొదలవగానే రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ వస్తుంది. ఉన్నది కాసేపే అయినా.. ఆయన చెప్పే ఓ స్టోరీ, డైలాగ్స్ మంచి ఎమోషనల్గా అనిపిస్తాయి. క్లైమాక్స్లో సుబ్బు పాత్ర.. దేవుడికి కట్టిన వస్త్రాల్ని తగలబెట్టే సీన్, ఊరి ప్రజల కళ్లు తెరిపించింది అనేలా విజువల్గా చూపించడం బాగుంది.అన్ని ప్లస్సులేనా మైనస్సులు లేవా అంటే ఉన్నాయి. సినిమా అంతా కూడా మహిళలు, వారి చైతన్యం అనేలా సాగుతుంది. రెగ్యులర్ ప్రేక్షకులందరికీ ఇది నచ్చకపోవచ్చు. కానీ అమ్మాయిలు మాత్రం తప్పకుండా ఈ మూవీ చూడాలి. చూస్తున్నంతసేపు కచ్చితంగా ఎమోషనల్ అవుతారు.ఎవరెలా చేశారు?సుబ్బు పాత్రలో అనుపమ అద్భుతంగా నటించింది. ఈ పాత్ర ప్రారంభంలో బిడియం, భయం, ప్రేమ లాంటి అంశాలతో చలాకీగా కనిపిస్తుంది. తర్వాత సీరియస్ టోన్లోకి మారుతుంది. చివరకొచ్చేసరికి ఫియర్లెస్ ఉమన్గా మారడం లాంటి మార్పు కిక్ ఇస్తుంది. రత్నగా చేసిన సంగీత క్యారెక్టర్ కూడా చాలామంది గృహిణులకు కనెక్ట్ అవుతుంది. ఓ సీన్లో ఈమె తన భర్త క్యారెక్టర్తో చేసే కామెడీ భలే నవ్విస్తుంది. పెళ్లి, పిల్లలు వద్దు అంటూ ఇండిపెండెంట్గా ఉండే మహిళలకు దర్శన రాజేంద్రన్ చేసిన అమిష్టా క్యారెక్టర్ కనెక్ట్ అవుతుంది. లీడ్ రోల్స్ చేసిన ఈ ముగ్గురు కూడా బాగా చేశారు. రాగ్ మయూర్, 'బలగం' సుధాకర్ రెడ్డి.. ఇలా మిగిలిన వాళ్లు కూడా తమ వంతు న్యాయం చేశారు.టెక్నికల్ టీమ్ కూడా సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లింది. సినిమాటోగ్రఫీ బాగుంది. నేపథ్య సంగీతం అక్కడక్కడ కాస్త లౌడ్గా అనిపించింది కానీ మిగతా చోట్ల సెట్ అయింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్గా డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల గురించి చెప్పుకోవాలి. గతంలో సినిమా బండి, శుభం అని సినిమాలు తీశాడు. అవి మోస్తరుగా అనిపించాయి కానీ ఈ మూవీతో తనలో చాలానే విషయం ఉందని నిరూపించాడు. ఫిమేల్ సెంట్రిక్ తరహా సినిమాలంటే ఇష్టముంటే మాత్రం 'పరదా' మిస్ కావొద్దు.- చందు డొంకాన -
'మా సినిమాకు ఏ అవార్డులు వద్దు.. ఒక్క ట్వీట్ చేయండి ప్లీజ్'
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) లీడ్ రోల్లో నటింంచిన తాజా చిత్రం పరదా. ఈ మూవీకి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. లేడీ ఓరియంటెడ్ చిత్రంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్తో బిజీ అయిపోయారు అనుపమ. తాజాగా ఓ మాల్లో నిర్వహించిన మూవీ ప్రమోషన్స్ డైరెక్టర్ ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆడియన్స్ను ఉద్దేశించి ఎమోషనల్గా మాట్లాడారు.మా సినిమా అవార్డులు అక్కర్లేదని.. డబ్బులు వస్తే చాలని అన్నారు. మలయాళ సినిమాలు ఇక్కడ హిట్ అవ్వడం కాదు.. మన తెలుగు సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ కావాలన్నారు. మా సినిమా బాగుంటే పెద్ద పెద్ద స్టార్స్ ఒక్క ట్వీట్ చేయాలని డైరెక్టర్ ప్రవీణ్ విజ్ఞప్తి చేశారు. మీరు ట్వీట్ చేస్తే కనీసం కొంతమంది ప్రేక్షకులైనా మా మూవీ చూస్తారని దర్శకుడు అన్నారు.ప్రవీణ్ కండ్రేగుల మాట్లాడుతూ..'ప్రతి కథ హీరో చుట్టే తిరగాలని లేదు. అనుపమ కూడా పెద్ద స్టార్. నా సినిమాలో ముగ్గురు స్టార్స్ ఉన్నారు. మా సినిమాకు అవార్డులు వద్దు. డబ్బులు కావాలి. కచ్చితంగా ఈ చిత్రంపై నాకు నమ్మకముంది. ఇక్కడ లేడీ ఓరియంటెడ్ కాదు.. మెన్ ఓరియంటెండ్ కాదు.. ఇది కేవలం సినిమా అంతే. మన దగ్గర మలయాళ చిత్రాలు హిట్ అవ్వడం కాదు.. మన తెలుగు సినిమాలు అక్కడ బ్లాక్బస్టర్ కొట్టాలి. అందుకే మలయాళ నటులను పెట్టాను. సినిమా బాగుంటేనే చూడండి. మా సినిమా బాగుంటే పెద్ద పెద్ద స్టార్స్ ఒక్క ట్వీట్ చేయండి ప్లీజ్. మీవల్ల ఎంతోమంది మా చిత్రం చూస్తారు.' అని ఆడియన్స్ను కోరారు. కాగా.. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 22న థియేటర్లలో సందడి చేయనుంది. -
నా కెరీర్లోనే ది బెస్ట్ సినిమా ఇదే: అనుపమ ఎమోషనల్
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) లీడ్ రోల్లో నటింంచిన తాజా చిత్రం పరదా. ఈ మూవీకి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. లేడీ ఓరియంటెడ్ చిత్రంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్తో బిజీ అయిపోయారు అనుపమ. తాజాగా నిర్వహించిన పరదా ఈవెంట్లో ఆసక్తికర కామెంట్స్ చేశారు. నా కెరీర్లోనే ది బెస్ట్ సినిమా ఇదేనని అన్నారు.అనుమప పరమేశ్వరన్ మాట్లాడుతూ.. 'నేను ఈ సినిమా ఈవెంట్లో ఫస్ట్ ఇదే చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెబుతున్నా. నా కెరీర్లోనే ది బెస్ట్ సినిమా పరదానే. ఆగస్టు 22న మీరు కూడా ఇదే మాట చెబుతారని నాకు నమ్మకముంది. అందరూ చెప్పినట్లు మీరు సినిమా చూడండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కు కూడా చెప్పండి. రివ్యూస్ చూసే పరదా మూవీకి వెళ్లండి' అని మాట్లాడారు.కొద్ది రోజుల క్రితం విజయవాడలో జరిగిన పరదా ఈవెంట్లో అనుపమ కన్నీళ్లు పెట్టుకుంది. ఎన్నో కష్టాలను ఎదుర్కొని పూర్తి చేసిన సినిమా పరదా. దయచేసి ఈ సినిమాకు సపోర్ట్ చేయండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 22న థియేటర్లలో సందడి చేయనుంది. -
‘పరదా’ చర్చనీయాంశమవుతుంది: ప్రవీణ్ కాండ్రేగుల.
‘‘పరదా’ కోసం మేం సృష్టించిన ఊరు, సంస్కృతి, పాత్రలన్నీ కల్పితాలే. ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకుంటారు. మా సినిమాకు అవార్డులు రావాలని కోరుకుంటున్నాను. అయితే డబ్బులు వస్తే, ఈ తరహా చిత్రాలను నిర్మించేందుకు మరింతమంది నిర్మాతలు ముందుకొస్తారు. అందుకని వసూళ్లు బాగుండాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ప్రవీణ్ కాండ్రేగుల. అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా, దర్శనా రాజేంద్రన్, సంగీత ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘పరదా’. ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో శ్రీనివాసులు పీవీ శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో దర్శకుడు ప్రవీణ్ మాట్లాడుతూ–‘‘నా తొలి చిత్రం ‘సినిమా బండి’కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేసిన విజయ్గారికి ‘పరదా’ కథ చెప్పగా, ఎగ్జైట్ అయ్యారు. ఆ తర్వాత అనుపమ గారికి కథ వినిపించగా ఎమోషనల్ అయ్యారు. ఆ నెక్ట్స్ దర్శన, సంగీతగారు ఈ ప్రాజెక్ట్లోకి వచ్చారు. ఓ ఊర్లో మహిళలందరూ ఎందుకు పరదాలు ధరిస్తారనే విషయాన్ని సినిమా స్టార్టింగ్లోనే చెప్పాం. ఆడవాళ్లలోనే కాదు... మగవాళ్లల్లో కూడా ఒక పరదా ఉంటుందని ఈ ‘పరదా’తో చెప్పే ప్రయత్నం చేశాం. ‘హైవే’ సినిమాలో ఆలియా భట్గారి నటకు నేను పెద్ద అభిమానిని. ‘పరదా’లో ఆలియా స్థాయి నటను అనుపమ చేశారు. దర్శన, సంగీతగార్లు బాగా యాక్ట్ చేశారు. గోపీసుందర్గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. మృదుల్ సేన్ అనే అమ్మాయి అద్భుతమైన విజువల్స్ను అందించారు. ‘సినిమాబండి, శుభం, పరదా’లాంటి డిఫరెంట్ సినిమాలు చేస్తున్న నాకు కమర్షియల్ సినిమాలపై కూడా మంచి గ్రిప్ ఉంది. చాన్స్ వస్తే పెద్ద హీరోలతో కమర్షియల్ సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని అన్నారు. -
నా సినిమా చూడండి.. కన్నీళ్లు పెట్టుకున్న అనుపమ
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) లేటెస్ట్ మూవీ పరదా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఆగస్టు 22న విడుదల కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. మంగళవారం నాడు విజయవాడలో జరిగిన పరదా ఈవెంట్లో అనుపమ కన్నీళ్లు పెట్టుకుంది. ఎన్నో కష్టాలను ఎదుర్కొని పూర్తి చేసిన సినిమా పరదా. దయచేసి ఈ సినిమాకు సపోర్ట్ చేయండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అంత ఈజీ కాదుఎందుకిలా ఎమోషనల్ అవుతున్నారన్న ప్రశ్నకు.. ఒక సినిమా చేయడం అంత ఈజీ కాదు. అందులోనూ ఒకమ్మాయి సినిమా చేసి ముందుకు రావడం అంత సులువేమీ కాదు. మూవీ చేయడానికన్నా దాన్ని రిలీజ్ చేయడానికే ఎక్కువ కష్టపడాల్సి వస్తోంది. నా సినిమా కాబట్టి చూడమని చెప్పడం లేదు. నేను చేసిన సినిమాల్లోనే సగం నాకు నచ్చవు. విమర్శిస్తూ ఉంటాను. కానీ, ఈ మూవీలో నేను విమర్శించడానికేం లేదు అంటూ ఏడ్చేసింది. చదవండి: Bigg Boss: 15 మందికి అగ్నిపరీక్ష.. ఫైర్ మీదున్న జడ్జిలు! -
'అలా అడిగితే యాటిట్యూడ్ ఎక్కువంటారు': అనుపమ పరమేశ్వరన్
అనుపమ పరమేశ్వరన్ చాలా రోజుల తర్వాత తెలుగులో చేసిన తాజా చిత్రం 'పరదా'. ఈ లేడీ ఓరియంటెడ్ చిత్రానికి సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఇప్పటికే పరదా ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఈ మూవీపై అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచేసింది. డైరెక్టర్ ప్రవీణ్ సైతం రివ్యూలు బాగుంటేనే పరదా చూడాలని ఆడియన్స్కు సవాల్ విసిరారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్న అనుపమ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా మూవీ సెట్లో షాట్ ఆలస్యం కావడంపై స్పందించింది.అనుమప మాట్లాడుతూ..' ఇండస్ట్రీలో చాలా మంది అమ్మాయిలు నోరు విప్పడానికి భయపడతారు. ఏదైనా అడిగితే ఈమెకు ఆటిట్యూడ్ ఎక్కువ అంటారు. ఉదయం 7 గంటలకు షూట్కు వెళ్తే.. 9:30 వరకు వెయిట్ చేయాలి. ఎందుకు ఆలస్యమైందని అడిగితే మీకు యాటిట్యూడ్ ఎక్కువ అని ముద్ర వేస్తారు. కో యాక్టర్ ఆలస్యంగా వచ్చినప్పుడు మమ్మల్ని ముందు ఎందుకు పిలవాలి. ముందుగానే సెట్కు పిలిచి రెండున్నర గంటల పాటు ఎందుకు వెయిట్ చేయించాలి. ఈ గ్యాప్లో చాలా షాట్స్ తీయొచ్చు కదా అని అడిగితే.. నా డబ్బులు కదా మీకేంటి ఇబ్బంది అని అంటారు. అమ్మాయిలు ఏదైనా డైెరెక్ట్గా అడిగేస్తారు. అబ్బాయిలను మరో విధంగా ట్రీట్ చేస్తారు. అందరూ ఇలానే చేస్తారని నేను చెప్పట్లేదు' అని అన్నారు.కాగా.. అనుపమ పరమేశ్వరన్ నటించిన పరదా ఆగస్టు 22న థియేటర్లలోకి మూవీ రానుంది. ఇందులో అనుపమతో పాటు మలయాళ నటి దర్శన్, సంగీత కూడా కీలక పాత్రల్లో నటించారు. -
రివ్యూస్ చూశాకే మా సినిమా చూడండి: ఆడియన్స్కు డైరెక్టర్ ఛాలెంజ్
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో వస్తోన్న లేడీ ఓరియంటెడ్ చిత్రం 'పరదా'. ఈ సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ మూవీని విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ నిర్మించారు. తాజాగా హైదరాబాద్లో ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఈవెంట్కు హాజరైన దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమా రివ్యూలు నచ్చితేనే పరదా మూవీ చూడాలని అన్నారు. ఈ చిత్రంలో దర్శన రాజేంద్రన్, సంగీత ముఖ్య పాత్రలు పోషించారు. ప్రవీణ్ మాట్లాడుతూ.. 'నా రెండు సినిమాలు శుభం, సినిమా బండి ఒక జోనర్ చిత్రాలు. కానీ ఈ సినిమా నాకు పర్సనల్గా బిగ్ స్కేల్ ఫిల్మ్. వీడు చిన్న సినిమాలు చేస్తు బతికేస్తాడులే అందరు అనుకుంటారు. కానీ ముగ్గురు స్టార్స్తో పక్కా కమర్షియల్ సినిమా తీశా. ఈ చిత్రానికి మంచి పేరు తప్పకుండా వస్తుంది. కానీ పేరు ముఖ్యం కాదు.. డబ్బులు రావాలి. ఇలా జరిగితే ఇలాంటి కంటెంట్ సినిమాలు తీసేందుకు నిర్మాతలు రెడీగా ఉన్నారు. అనుపమకు ఇదొక పెద్ద సోలో ఫిల్మ్. అనుష్కకు అరుంధతిలాగే అనుపమకు కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఇది తనకు చాలా ఫేవరేట్ మూవీ. థియేటర్లకు వెళ్లి సినిమా చూడండి. రివ్యూలు బాగుంటేనే మా చిత్రాన్ని చూడండి. ఇది నా ఛాలెంజ్' అంటూ మాట్లాడారు. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 22న థియేటర్లలో సందడి చేయనుంది. -
అనుపమ పరమేశ్వరన్ ‘పరదా’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఇంట్రెస్టింగ్గా అనుపమ 'పరదా' ట్రైలర్
అనుపమ పరమేశ్వరన్ చాలారోజులు తర్వాత తెలుగులో చేసిన సినిమా 'పరదా'. ఆగస్టు 22న థియేటర్లలోకి మూవీ రానుంది. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్లో ట్రైలర్ లాంచ్ చేశారు. ఇది చిత్రంపై అంచనాలు పెంచేలా ఉందని చెప్పొచ్చు. ఇందులో అనుపమతో పాటు మలయాళ నటి దర్శన్, సంగీత కూడా కీలక పాత్రల్లో నటించారు.(ఇదీ చదవండి: మరో హిస్టరీ క్రియేట్ చేసిన 'మహావతార నరసింహ') ట్రైలర్లో కథ ఏంటనేది చూచాయిగా రివీల్ చేశారు. ఓ ఊరి దురాచారాలకు సంబంధించిన స్టోరీ ఇది. అక్కడ ఆడపిల్లలు మొహానికి పరదా కట్టుకుని బతుకుతుంటారు. అలాంటి చోట మరెలాంటి దురాచారాలా ఉన్నాయి? వాటిని తట్టుకుని సుబ్బు(అనుపమ) ఎలా నిలబడింది ఏం చేసిందనేదే కథలా అనిపిస్తుంది.ఈ చిత్రానికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకుడు. ట్రైలర్తోనే ఓ బలమైన సందేశం ఇవ్వబోతున్నామనే ఫీలింగ్ కలిగించారు. మరి కూలీ, వార్ 2 రిలీజైన వారంలో ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. మరి బిగ్ స్క్రీన్పై ఎలాంటి మేజిక్ చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: నేనెవరిని కలవలేదు.. క్లారిటీ ఇచ్చిన చిరంజీవి) -
అనుపమ పరదా మూవీ.. బ్యూటీఫుల్ సాంగ్ వచ్చేసింది!
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో వస్తోన్న తాజా చిత్రం పరదా. ఈ చిత్రానికి సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే పరదా మూవీ నుంచి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇప్పటికే యత్ర నార్యస్తు పూజ్యంతే అనే పాటను విడుదల చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మరో లిరికల్ సాంగ్ను రిలీజ్ చేశారు. ఎగరేయి నీ రెక్కలే అంటూ సాగే బ్యూటీఫుల్ సాంగ్ను విడుదల చేశారు.ఈపాటకు వనమాలి లిరిక్స్ అందించగా.. రితేశ్ జీ రావు ఆలపించారు. ఈ సాంగ్ను గోపి సుందర్ అద్భుతంగా కంపోజ్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో సంగీత, దర్శనా రాజేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. ఆగష్టు 22న ఈ చిత్రం విడుదల థియేటర్లో సందడి చేయనుంది.Let the music take you deep within🎶3rd single from #Paradha is here!#YegareyiNeeRekkale #AkaleEeNeermutthukal Lyrical Video OUT NOWTelugu: https://t.co/7EUihYEyKQMalayalam: https://t.co/wQ31mwufieIn cinemas AUG 22@anupamahere @darshanarajend @sangithakrish @GopiSundarOffl pic.twitter.com/OA2EveLA4D— Paradha Movie (@Paradhamovie) August 5, 2025 -
పరదాలో థియేటర్కు అభిమానులు.. అందరి కళ్లు వారిపైనే!
పవన్ కల్యాణ్ హీరోగా చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన ఫిక్షనల్ చిత్రం హరిహర వీరమల్లు. ఇవాళ థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు వీపరీతమైన నెగెటివ్ టాక్ వస్తోంది. వీఎఫ్ఎక్స్తో పాటు కథలో ఎలాంటి కొత్తదనం లేదంటూ ఆడియన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తొలి ఆట నుంచే వీరమల్లు చిత్రానికి ఊహించని షాకిస్తున్నారు అభిమానులు. భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతమేరకు రాణిస్తుందో వేచి చూడాల్సిందే.అయితే ఇవాళ ప్రసాద్ ఐమ్యాక్స్ వద్ద ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. హరిహర వీరమల్లు సినిమా చూసేందుకు వచ్చిన కొందరు మహిళలు విభిన్నమైన వేషధారణలో కనిపించారు. సినిమా చూసేందుకు వచ్చిన మహిళా అభిమానులు తమ తలకు శారీని పరదాలాగా కప్పుకుని సందడి చేశారు. రెడ్ శారీలో వచ్చిన వీరు.. మొహాలు ఎవరికీ కనిపించకుండా థియేటర్కు చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీంతో వీరంతా ఎందుకిలా వచ్చారని చర్చ మొదలైంది.అయితే ఇదంతా అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రలో నటించిన పరదా మూవీ కోసమేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మూవీ ప్రమోషన్లలో భాగంగానే ఇలా పరదా కప్పుకుని వచ్చారని సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇదంతా పరదా సినిమా ప్రమోషన్స్ కోసమేనని.. బ్రిలియంట్ ఐడియా అంటూ కొందరు నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏదేమైనా మహిళ అభిమానులు ఒక్కసారిగా పరదాల్లో కనిపించడంతో అందరి చూపులు వారిపైనే పడ్డాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా.. అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రలో నటించిన చిత్రం పరదా. ఈ చిత్రానికి సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 22న థియేటర్లలో సందడి చేయనుంది.#Paradha ladies watch #HariHaraVeeraMallu at Prasad’s! #Paradha movie directed by Praveen Kandregula (Cinema Bandi & Subham fame) is releasing on 22 August! pic.twitter.com/sO7AgByzMt— idlebrain jeevi (@idlebrainjeevi) July 24, 2025 -
ప్రసిద్ధ ఆలయంలో అనుపమ పరమేశ్వరన్ పూజలు
ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ 'పరదా' సినిమా సందర్భంగా హైదరాబాద్లో సందడి చేశారు. నగరంలోని ప్రసిద్ధ బల్కంపేట్ ఎల్లమ్మను అనుపమ దర్శించుకున్నారు. తను నటించిన కొత్త సినిమా ఆగష్టు 22న విడుదల కానుంది. దీంతో అమ్మవారి ఆశీస్సుల కోసం చిత్ర యూనిట్ వెళ్లింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వారికి స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఆపై ఆలయంలో పూజలు నిర్వహించారు. తన సినిమా పరదా నుంచి 'యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః' సాంగ్ పోస్టర్ను అక్కడ ప్రదర్శించారు. అందుకు సంబంధించిన పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.Team #Paradha visited Balakampet Yallamma Temple for the launch of #YatraNaryasthu Song and sought divine blessings 🙏✨ SECOND SINGLE OUT TODAY at 12 PM 🎼 pic.twitter.com/jYOENdHR8P— Ananda Media (@AnandaMediaOffl) July 17, 2025 -
అమ్మాయి పోస్టర్ చూడగానే అందరూ పారిపోతారు: అనుపమ
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో వస్తోన్న చిత్రం పరదా. లేడీ ఓరియంటెడ్ మూవీగా వస్తోన్న ఈ సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంగీత, దర్శనా రాజేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్కు ఇంకా నెల రోజుల సమయం ఉండగానే మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి ఓ సాంగ్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్కు హాజరైన అనుపమ పరమేశ్వరన్ తన సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.ఒక అమ్మాయి లీడ్ రోల్గా సినిమా పోస్టర్ చూస్తే అందరూ కూడా వెనక్కి వెళ్లిపోతారని అనుపమ తెలిపింది. అది ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఓటీటీతో పాటు ఆడియన్స్ కూడా కావొచ్చని పేర్కొంది. అయితే అది తప్పని నేను చెప్పట్లేదు..అదే రియాలిటీ అని అనుపమ వెల్లడించింది. ఆ రియాలిటీ నుంచే వచ్చిన సినిమా పరదా అని.. మా సినిమా దాదాపు ఏడాది క్రితమే పూర్తయిందని అనుపమ పరమేశ్వరన్ చెప్పుకొచ్చింది. మా సినిమా రిలీజ్ డేట్ కోసం చాలా కష్టపడ్డామని.. చివరికీ ఆగస్టు 22న మీ ముందుకు వస్తున్నామని తెలిపింది. -
'పరదా' సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
'పరదా' తొలగిస్తూ మెప్పించేలా సాంగ్
'యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః' ఋగ్వేదంలోని స్త్రీని విశ్వశక్తిగా గుర్తించారు. అయితే, తర్వాతి కాలంలో స్త్రీ ఎలాంటి ఇబ్బందలు ఎదుర్కుందో చెప్పేందుకే 'పరదా' సినిమా వస్తుంది. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వనమాలి రిచించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. గోపీ సుందర్ సంగీతం అందించారు. అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా, సంగీత, దర్శనా రాజేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రాన్ని ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. ఆగష్టు 22న ఈ చిత్రం విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
అందాల సిరి
‘మా అందాల సిరి మీద పడనీకు ఏ కళ్లు... ఆ చిరునవ్వే పచ్చంగా ఉండాలి నూరేళ్లు... వేయాలి పరదాలు... చేయాలి సరదాలు... అమ్మా... నీ దీవెనలు తోడుంటే అంతే చాలు... మా ఊరి పొలిమేర దాటవుగా సంతోషాలు’ అంటూ సాగుతుంది ‘పరదా’ సినిమాలోని ‘మా అందాల సిరి’ పాట. అనుపమా పరమేశ్వరన్, దర్శనా రాజేంద్రన్, సంగీత లీడ్ రోల్స్లో నటించిన ‘పరదా’ సినిమాలోని పాట ఇది.‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఆనంద మీడియా పతాకంపై విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ ఈ సినిమాను నిర్మించారు. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘మా అందాల సిరి...’ పాట లిరికల్ వీడియోను ఆదివారం రిలీజ్ చేశారు. సంగీత దర్శకుడు గోపీసుందర్ స్వరపరచిన ఈ పాటకు వనమాలి సాహిత్యం అందించగా, శ్రీ కృష్ణ, రమ్య బెహరా పాడారు. -
'పరదా' టీజర్ లాంచ్ ఈవెంట్..ఈవిడ ఎవరో తెలుసా .? (ఫొటోలు)
-
నా పదేళ్ల కెరీర్లో సుబ్బు నా ఫేవరెట్ : అనుపమా పరమేశ్వరన్
అనుపమా పరమేశ్వరన్, సంగీత, దర్శనా రాజేంద్రన్ లీడ్ రోల్స్లో నటించిన తాజా చిత్రం ‘పరదా’. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్ను డిజిటల్గా రిలీజ్ చేశారు దుల్కర్ సల్మాన్. హైదరాబాద్లో జరిగిన ‘పరదా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో అనుపమా పరమేశ్వరన్ మాట్లాడుతూ– ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతుంది. ఈ పదేళ్లలో నా మోస్ట్ ఫేవరెట్ మూవీ ‘పరదా’, ఫేవరెట్ క్యారెక్టర్ సుబ్బు. ఈ సినిమా అందరూ ఇష్టపడి చేసిన సినిమా, అందరూ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. టీం అందరికీ అడ్వాన్స్ కంగ్రాట్స్’అన్నారు. హీరోయిన్ దర్శన మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. అనుపమ, సంగీత గారితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. వారి నుంచి చాలా నేర్చుకున్నాను. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్ యూ. ఈ సినిమాలో మ్యాజిక్ కు మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను' అన్నారు . ‘‘ఇలాంటి గొప్ప కథ రాసిన డైరెక్టర్కు థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు సంగీత. ‘‘ఉమెన్ ఒరియంటెడ్ సినిమాలకు బిగ్ ఓపెనింగ్స్ వచ్చేలా ఈ మూవీ ఉంటుంది’’ అని పేర్కొన్నారు ప్రవీణ్. ‘‘ఈ సినిమా మలయాళం రైట్స్ను దుల్కర్ సల్మాన్ తీసుకున్నారు’’ అన్నారు విజయ్ డొంకాడ. ‘‘ఉత్తరాంధ్ర నుంచి ఓ నిర్మాత వచ్చి ఈ మూవీ చేయడం చాలా సంతోషంగా ఉంది. మహిళా సాధికారత ఉన్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ‘‘ఈ సినిమా తీయడం మాకు ‘బాహుబలి’లాంటి ప్రయత్నం’’ అని స్పష్టం చేశారు శ్రీధర్.