patient Raju
-
‘గాంధీ’లో ఇద్దరు ఉద్యోగుల తొలగింపు
⇔ ‘బొమ్మ సైకిల్’ ఘటనకుగానూ సస్పెన్షన్ వేటు హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో ఓ పేషెంట్ ను ఇబ్బందులకు గురిచేసినందుకుగానూ ఇద్దరు సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. పేషెంట్ రాజుకు వీల్ చైర్ ఇవ్వడానికి డబ్బు డిమాండ్ చేయడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటనలో ఇద్దరు సిబ్బందిని ఆ హాస్పిటల్ సూపరింటెండెంట్ విధుల నుంచి తొలగించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులైన పి.వెంకటరత్నం, ఎస్.మహేంద్రబాయిలను సూపరింటెండెంట్ తొలగించి... వెంటనే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని ఆయన ప్రకటించారు. గురువారం వీల్ చైర్ ఇవ్వక పోవడంతోపాటు రూ. 150 లంచం డిమాండ్ చేయడంతో పేషెంట్ రాజుని ‘బొమ్మ సైకిల్’ పై డాక్టర్ వార్డుకు తీసుకెళ్లారు. ఈ సంఘటనను ఈనెల 17న ‘హేరాం..ఎంతటి దైన్యం’శీర్షికన ‘సాక్షి’ ప్రచురించింది. దీన్ని చదివిన గవర్నర్ వివరణ ఇవ్వాలని వైద్యశాఖను ఆదేశించిన విషయం తెలిసిందే. మరోవైపు మంత్రి కేటీఆర్ ఆ పేషెంట్ వివరాలను తెలపితే తమకు తోచిన సాయం అందిస్తామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండ్ తో చర్చించిన అనంతరం ట్వీట్ చేశారు. మరోవైపు వీల్చైర్ ఘటనపై కమిటీ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించామని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమణి ఇదివరకే తెలిపారు. -
సాక్షి ఎఫెక్ట్ : గాంధీ ఆస్పత్రి ఘటనపై విచారణ
-
కాసుల రోగం పైసల పైత్యం
-
ఆ పేషెంట్ ఘటనపై స్పందించిన కేటీఆర్
హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చిన పేషేంట్లపై సిబ్బంది నిర్లక్ష్యంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. బొమ్మకారుతో పేషెంట్ పడిన బాధలను మీడియా ప్రతినిధులు వీడియో తీసి సిబ్బంది నిర్లక్ష్యాన్ని బయటపెట్టడంతో అది కాస్తా వైరల్ అయింది. గాంధీ ఆస్పత్రిలో సంచలనం రేపిన ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో స్పందించారు. ‘గాంధీ ఆస్పత్రి సూపరిటెండెంట్తో ఈ ఘటనపై చర్చించాను. బాధితుడి వివరాలు అడిగి తెలుసుకున్నాను. బాధితుడు రాజుకు తన వంతు సాయం చేయడానికి సిద్ధం’ అని ట్వీట్లో పేర్కొన్నారు. బేగంపేటకు చెందిన చెందిన రాజు (40) ప్రైవేటు ఎలక్ట్రీషియన్. కొద్దిరోజుల క్రితం విద్యుతాఘాతానికి గురై రెండు కాళ్లు చచ్చుబడి నడవలేని స్థితికి చేరుకున్నాడు. నగరంలోని గాంధీ ఆస్పత్రికి వచ్చిన అతడికి చక్రాల కుర్చీ కావాలని కోరగా.. సిబ్బంది రూ.150 లంచం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. తమ వద్ద డబ్బులు లేవని మనీ ఇచ్చుకోలేమని చెప్పడంతో సిబ్బంది నిరాకరించారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పేషెంట్ ను పిల్లులు ఆడుకునే బొమ్మకారుపై డాక్టర్ వార్డుకు తీసుకెళ్లారు. ఆస్పత్రికి వచ్చిన ప్రతిసారి చక్రాల కుర్చీ కోసం డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో.. గురువారం ఆస్పత్రికి వచ్చిన పేషెంట్ రాజు తనతో పాటుగా చిన్నారులు ఆడుకునే బొమ్మకారు తీసుకురావడంతో సమస్యను స్పెషల్ ఫోకస్ చేశారు. Spoke to the superintendent of Gandhi hospital. Can you please send me the contact details of patient? https://t.co/jdpuHDWbfw — KTR (@KTRTRS) 17 March 2017 My office contacted the family & will ensure they are helped https://t.co/9P2D6vuP1y — KTR (@KTRTRS) 17 March 2017