pdp-bjp government
-
చెక్కులో నగదు చూసి అవాక్కయిన రైతులు
జమ్ము: జమ్మూ రాష్ట్రంలో పలువురు రైతులు పంట మీదే ఆధారపడ్డారు. పంట పండితే ఈ ఏడాది కష్టాలుండవనుకున్నారు. పంట చేతికి వస్తుందని అనుకున్న తరుణంలో.. వరదల వచ్చి పడ్డాయి. రైతన్న ఆశలు ఆవిరయ్యాయి. గతేడాది సెప్టెంబర్లో జమ్మూ కాశ్మీర్లో రైతుల పరిస్థితి ఇది. నమ్ముకున్న పంట వరదల రూపంలో నట్టేటమునగడంతో రైతులు తీవ్ర నిరాశ చెందారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పీడీపీ - బీజేపీ ప్రభుత్వం అదుకుంటుందని అంతా భావించారు. ప్రభుత్వం సదరు రైతులకు చెక్కులు అందజేసింది. ఆ చెక్కుల్లోని నగదు చూసి రైతులు అవాక్కయ్యారు. ఒక్కో రైతుకు అక్షరాల రూ.32 చెక్కుల రూపంలో అందజేశారు. పంట నష్టం ఎక్కువ జరిగిన ఒకొక్క రైతుకు రూ.113 రూపాయిలు ఇచ్చారు. దీంతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పంట నష్టంతో ఏర్పడిన పాత గాయాలను రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ రేపుతుందని రైతులు ఆరోపించారు. రైతులు చెక్కులను తిరిగి వ్యవసాయశాఖకు అందజేశారు. తావీ నది వరదలతో వేలాది రూపాయిలు నష్టపోయిన తమను ఈ ప్రభుత్వం ఇంత తక్కువ నష్ట పరిహారం అందజేసి తమని అవమాన పరిచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కాశ్మీర్ సీఎంగా ముఫ్తీ మహ్మద్ సయీద్?
జమ్ము కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఇన్నాళ్లుగా నెలకొన్న సందిగ్ధం ఎట్టకేలకు తొలగిపోయింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పీడీపీ అధినేత ముఫ్తీ మహ్మద్ సయీద్ మార్చి 1న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం అన్నీ అనుకున్నట్లే జరిగితే.. కాశ్మీర్ ముఖ్యమంత్రి పదవిలో ఆయన ఆరేళ్ల పాటు కొనసాగే అవకాశం ఉంది. జమ్ము యూనివర్సిటీలోని జొరావర్ సింగ్ స్మారక ఆడిటోరియంలో ప్రమాణస్వీకారం జరుగుతుంది. పీడీపీ, బీజేపీల మధ్య కామన్ మినిమమ్ ప్రోగ్రాం (సీఎంపీ) ఖరారైంది. ఇందుకోసం పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఢిల్లీలో మంగళవారం సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఈ వారంలోనే ప్రధాని నరేంద్రమోదీని కూడా కలిసి సంకీర్ణ ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.