pedda nagaram people
-
ఆటోను ఢీ కొట్టిన లారీ.. మహిళా కూలీల పరిస్థితి విషమం
మహబూబాబాద్, సాక్షి: నర్సింహులపేట మండలం పెద్దనాగారం స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మహిళా కూలీలతో వెళ్తున్న ఓ ఆటోను లారీ ఢీ కొట్టడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఏరియా ఆస్పత్రికి తరలించగా.. వీళ్లలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తొర్రూర్ మండలం చెర్లపాలెం గ్రామానికి చెందిన 14 మంది, ఫతేపురం గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు మిర్చి తోట ఏరడానికి బంగ్లా వైపు ఆటోలో వెళ్తున్నారు. ఆ సమయంలో ఆటోను లారీ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. స్థానికుల సాయంతో మూడు ఆంబులెన్సులలో మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో 13 మందికి గాయాలు కాగా.. వాళ్లలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
నర్సింహులపేటలో కొనసాగించాలని బైక్ ర్యాలీ
నర్సింహులపేట : మండలంలోని పెద్దనాగారం గ్రామస్తులు నర్సింహులపేట మండలంలోనే కొనసాగుతామని మంగళవారం హైవేపై ఉప సర్పంచ్ వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. కొత్తగా ఏర్పడే ఎల్లంపేట మండలంలో చేర్చొద్దని డిమాండ్ చేశారు. అధికారులు, నాయకులు స్పందించి నర్సింహులపేట మండలంలోనే కొనసాగించాలని కోరారు. గ్రామస్తులు వెంకన్న, మల్లయ్య, నర్సయ్య, పుల్లయ్య, నరేందర్ పాల్గొన్నారు.