Permenent
-
పర్మినెంట్ రెసిడెంట్ : విద్యార్థుల కలలపై నిప్పులు పోసిన దేశం
అమెరికా ఆంక్షలతో బెంబేలెత్తుతున్న విద్యార్థులకు మరో షాక్ తగిలింది. కెనడాలో ఉన్నత చదువులు చదువుకుని అక్కడే శాశ్వత నివాసం (పీఆర్ కార్డ్) పొందాలనుకునే వేలాది మంది అంతర్జాతీయ విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు అక్కడి మానిటోబా ప్రావిన్స్ ప్రభుత్వం ఊహించని షాకిచ్చింది. కెనడాలోని మానిటోబా ప్రావిన్స్, అంతర్జాతీయ గ్రాడ్యుయేట్ల కోసం ఉన్న ఒక కీలకమైన వలస మార్గాన్ని మూసివేసింది. మానిటోబా ప్రావిన్షియల్ నామినీ ప్రోగ్రామ్ (ఎంపీఎన్పీ)ని, అంతర్జాతీయ విద్యా విభాగం (ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ స్ట్రీమ్) కింద ఉన్న కెరీర్ ఎంప్లాయ్మెంట్ పాత్వే (సీఈపీ)ని తక్షణమే రద్దు చేసింది. చదువు పూర్తైన విద్యార్థులు నేరుగా పర్మినెంట్ రెసిడెన్సీ పొందేందుకు ఇప్పటివరకు ఎంతో సులభంగా ఉపయోగపడుతున్న ఒక కీలకమైన ఇమ్మిగ్రేషన్ మార్గాన్ని ఆ ప్రావిన్స్ ప్రభుత్వం తక్షణమే రద్దు చేస్తున్నట్లు జూన్ 11న సంచలన ప్రకటన చేసింది. ఇలా చేసిన మొట్టమొదటి కెనడియన్ ప్రావిన్స్ మానిటోబానే. దీంతో ఉత్తర అమెరికా దేశంలో శాశ్వత నివాసం కోసం స్టూడెంట్ వీసా మార్గాన్ని ఎంచుకోవాలనుకుంటున్న భారతీయులపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.విస్తీర్ణం పరంగా కెనడాలో అతిపెద్ద ఆరో ప్రావిన్స్ మానిటోబా, భారతదేశంతో సహా అంతర్జాతీయ విద్యార్థులకు రోజురోజుకు మరింత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారుతోంది. దీని రాజధాని విన్నిపెగ్లో, టొరంటో, ఒట్టావా వంటి నగరాలతో పోలిస్తే జీవన వ్యయం తక్కువగా ఉంటుంది, అదే సమయంలో చక్కటి ప్రభుత్వ యూనివర్శిటీలు యూనివర్శిటీ ఆఫ్ మానిటోబా, ఆర్ఆర్సి పాలిటెక్ వంటి సంస్థలు అందుబాటులో ఉంటాయి. దీనికి తోడు పీఆర్ చాలా త్వరంగా, సులువుగా వస్తుందనే కారణంతో వేలాది మంది తెలుగువారితో పాటు 80కి పైగా దేశాల నుండి దాదాపు 20వేల మంది విద్యార్థులు ఇటే మొగ్గు చూపుతున్నారు. ఇక్కడి అంతర్జాతీయ విద్యార్థుల జనాభాలో భారతీయ విద్యార్థుల వాటా గణనీయంగా ఉంది. 2021లో, 5,240 మంది భారతీయులు స్టడీ పర్మిట్ హోల్డర్లు న్నారు.మానిటోబా ప్రావిన్షియల్ నామినీ ప్రోగ్రామ్ (MPNP) ప్రకారం మానిటోబా ప్రావిన్స్లోని గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో కనీసం ఏడాది పాటు చదివి, చదువు పూర్తి కాగానే తమ రంగానికి సంబంధించిన ఒక అర్హత కలిగిన ఉద్యోగ ఆఫర్ సంపాదిస్తే చాలు ఎటువంటి నిరీక్షణ లేకుండా నేరుగా పీఆర్కు దరఖాస్తు చేసుకునే లీగల్ అవకాశం ఉండేది. ముఖ్యంగా భారతదేశం నుండి కెనడా వెళ్లి అక్కడ వన్-ఇయర్ పీజీ డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు పీఆర్ సాధించి ప్రయోజనం పొందేవారు. ప్రస్తుతం ఈ విండోను పూర్తిగా మూసివేయడంతో భారతీయ విద్యార్థులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టైంది.ఇదీ చదవండి: స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో సుందర్ పిచాయ్కు చేదు అనుభవంభారతదేశం నుండి 5,485 మంది కొత్త శాశ్వత నివాసితులు న్నారు. ఇది మొత్తం ప్రవేశాలలో 33.1శాతం., CEP కార్యక్రమాన్ని రద్దు చేయడం వల్ల ఈ భారతీయ విద్యార్థులు ప్రభావితమవుతారు. వీరు శాశ్వత నివాసం కోసం విద్యా అర్హతల కంటే పని అనుభవానికి ప్రాధాన్యతనిచ్చే ప్రత్యామ్నాయ కార్యక్రమాలను ఎంచుకోవలసి ఉంటుంది. ఇదీ చదవండి: ట్విన్స్ పుట్టారని సంబరం : అంతలోనే ఊహించని షాక్!రద్దయిన సీఈపీ ప్రకారం, దరఖాస్తుదారులు మూడేళ్లలో కనీసం ఒక సంవత్సరం పాటు మానిటోబాలో పూర్తికాల స్టడీ ప్రోగ్రామ్ను పూర్తి చేసి ఉండాలి. కనీసం కెనడియన్ లాంగ్వేజ్ బెంచ్మార్క్ (CLB) 7 స్థాయి భాషా ప్రావీణ్యాన్ని కలిగి ఉండాలి. అలాగే ప్రావిన్సులో తమ దీర్ఘకాలిక వృత్తి అవకాశాలను వివరిస్తూ ఒక కెరీర్ ఎంప్లాయ్మెంట్ ప్లాన్ను కూడా సమర్పించాల్సి ఉండేది , కొన్ని సందర్భాల్లో, తమ వద్ద తగినంత స్థిరపడే నిధులు ఉన్నాయని నిరూపించుకోవాల్సి ఉండేది.ఇదీ చదవండి : విడాకులు మంజూరు : భర్తను వాటేసుకుని ఎమోషనల్, ఎందుకో తెలుసా?కానీ మారిన నియమాల ప్రకారం మానిటోబాలోని స్కిల్డ్ వర్కర్ ప్రోగ్రామ్, జాబ్ హిస్టరీకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అర్హత కలిగిన పూర్తికాల, దీర్ఘకాలిక ఉద్యోగ ఆఫర్ను స్వీకరించడానికి ముందు, ‘స్కిల్డ్ వర్కర్ ఇన్ మానిటోబా’ (Skilled Worker in Manitoba) ప్రోగ్రామ్ ప్రకారం దరఖాస్తుదారులు తప్పనిసరిగా అదే మానిటోబా యజమాని వద్ద కనీసం ఆరు నెలల నిరంతర పూర్తికాల పనిని పూర్తి చేయాలి. ఆ అనుభవ పత్రాలను సమర్పిస్తేనే పీఆర్ నామినేషన్కు అర్హత సాధిస్తారు. అయితే దీనికి ప్రత్యేక విద్యా అర్హత అవసరం లేదు. బదులుగా, భాషా అవసరాలు వృత్తి డిమాండ్లకు, మానిటోబాలో ఆర్థికంగా స్థిరపడగల దరఖాస్తు దారుడి సామర్థ్యానికి ముడిపడి ఉంటాయి. అలాగే ఒక సెటిల్మెంట్ ప్లాన్ను సమర్పించాల్సి ఉంటుంది. అంతకుముందు ఈ షరతులేదు. అంతేకాకుండా, స్వయం ఉపాధి ద్వారా లేదా పూర్తికాలం చదువుతున్నప్పుడు పొందిన వర్క్ ఎక్స్పీరియన్స్ను పరిగణనలోకి తీసుకోరు. ఇదీ చదవండి: పోలీసులే నివ్వెరపోయేలా భర్త టార్చర్, ఇనుప గొలుసులతోనే స్టేషన్కి! -
సకలజనుల సమ్మె వేతనాలు చెల్లించాలి
power project, finance, permenent గోదావరిఖని :సింగరేణి కార్మికులకు సకలజనుల సమ్మె వేతనాలు జూలై నెల వేతనంతో చెల్లించాలని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్అహ్మద్ డిమాండ్ చేశారు. స్థానిక ప్రధాన చౌరస్తాలోని యూనియన్ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మాట్లాడారు. 1200 మెగావాట్ల పవర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్న సందర్భంగా ప్రతీ కార్మికునికి ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ ఇవ్వాలని కోరారు. కోరుకున్న ప్రతీ కార్మికునికి ఎయిర్ కండీషన్ సౌకర్యం కల్పించాలని, వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించేందుకు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రతీ కార్మికునికి రెండు గుంటల భూమి, రూ.25 లక్షల రుణ సౌకర్యం కల్పించాలని, లాభాల వాటా 25 శాతం చెల్లించాలని, సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యాదగిరి సత్తయ్య, కాటిక శ్రీనివాస్, దాసరి మల్లయ్య, వై.కోటయ్య, వీరగోని మల్లయ్య, గాజుల వెంకటస్వామి, గడ్డం కొమురయ్య, సిరిపురం నర్సయ్య, కె.లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. -
క్రమబద్ధీకరణ ఎప్పుడో?
ఆందోళనలో కాంట్రాక్టు ఉద్యోగులు తెలంగాణలో సంబరాలు... ఇక్కడ నిట్టూర్పులు టీడీపీ హామీ విస్మరించిందంటూ సర్వత్రా విమర్శలు గుంటూరు వెస్ట్: అధికారం చేపడితే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామంటూ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ రూపుదాల్చలేదు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా కాంట్రాక్టు ఉద్యోగులకు ఉపశమనం లభించలేదు. క్రమబద్ధీకరణ కోసం నియమించిన కమిటీ సమావేశాల పేరుతో కాలయాపన చేయడం మినహా సాధించిందేమీ లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం సుమారు 20 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించింది. అంతటితో ఆగకుండా ఉద్యోగుల కుటుంబంలోని సభ్యులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి సంబరాలు నిర్వహిస్తోంది. కమిటీతో కాలక్షేపం రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 13,671 మంది, ప్రభుత్వరంగ సంస్థల్లో 43,043 మంది మొత్తంగా 56,714 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. వీరుకాక ఔట్సోర్సింగ్ ఉద్యోగులు 50 వేల మంది ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామకష్ణుడు నేతత్వంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కమిటీని నియమించింది. కమిటీ ఇప్పటికే రెండు మూడుసార్లు భేటీ అయినా ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపుతున్న కమిటీ ఉద్యోగులను క్రమబద్ధీకరించే విషయంలో సక్రమంగా స్పందించకపోవడంపట్ల ఉద్యోగుల నుంచి తీవ్రవిమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిత్తశుద్ధి ఏదీ... గుంటూరు జిల్లాలో సుమారు 803మంది, కష్ణాజిల్లాలో 442మంది వరకూ కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా రెవెన్యూ, మెడికల్, వ్యవసాయశాఖ, ఆర్అండ్బీ, డ్వామా, డీఆర్డీఏ, శిశు, మహిళా, ఎస్సీ, ఎస్టీ, సంక్షేమశాఖలు తదితర ప్రభుత్వశాఖల్లో జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, ఆఫీస్ సబార్డినేట్స్, కంప్యూటర్ ఆపరేటర్లు తదితర హోదాల్లో పనిచేస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్/టైపిస్టుకు నెలకు రూ.8400, ఆఫీసు సబార్డినేట్కు రూ.7 వేలు చెల్లిస్తున్నారు. ఉద్యోగులకు కనీస వేతనం రూ.15 వేలు ఇవ్వాలని నిబంధనలు చెబుతున్నా పాలకులు వాటిని విస్మరిస్తున్నారని కాంట్రాక్టు ఉద్యోగులు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వేతనాలు పెంచినప్పటికీ ఇందుకు సంబంధించిన జీఓ ఇంకా విడుదల కాకపోవడం, రెండు, మూడునెలలకొకసారి జీతాలు అందిస్తుండడం తమ సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలుపుతోందని కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నిండేది ఎప్పుడు? ఓ కాంట్రాక్టు ఉద్యోగి 20 ఏళ్ల నుంచి కాంట్రాక్టు ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నా. ప్రభుత్వం ఇస్తున్న వేతనంతో కుటుంబాన్ని నడపడం కష్టంగా ఉంది. ఇప్పుడు బైటకు వెళ్లి మరో ఉద్యోగం చేయలేని పరిస్థితి. ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు తమ జీతాలు పెంచుకుంటూ లక్షల రూపాయలు పొందుతున్నారు. అనునిత్యం ప్రజలకు అందుబాటు ఉంటూ విధులు నిర్వహించే మాకు అరకొర జీతాలే. ఎన్నికల సమయంలో టీడీపీ ఇచ్చిన హామీని నమ్మి ఓట్లు వేశాం. టీడీపీ అధికారం చేపట్టాక కాంట్రాక్టు ఉద్యోగులను విస్మరించడం బాధాకరం. మా జీవితాల్లో వెలుగులు నిండేది ఎప్పుడు? ప్రభుత్వం మా ఉద్యోగాలు వెంటనే క్రమబద్ధీకరించాలి. చట్టసవరణలు చేసైనా క్రమబద్ధీకరించాలి వై.నేతాజీ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని టీడీపీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు బేసిక్ వేతనాలను కూడా ఇవ్వడం లేదు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచుతున్నట్టు ప్రకటించారు కానీ ఆ విషయాన్ని ఇంతవరకూ తేల్చలేదు. అవసరమైతే అసెంబ్లీలో చట్టసవరణలు చేసి కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి.


