Perni Nani
-
పోలీసుల సమక్షంలోనే టీడీపీ కవ్వింపు చర్యలు: పేర్ని నాని
-
టీడీపీ, పోలీసులపై పేర్ని నాని ఫైర్
-
అక్రమ కేసులతో అణచివేయలేరు: వైఎస్సార్సీపీ
సాక్షి, కృష్ణాజిల్లా: మచిలీపట్నం సబ్ జైల్లో ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను మాజీ మంత్రి పేర్ని నాని పరామర్శించారు. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తిరునాళ్లలో జరిగిన ఘర్షణలో 16 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్టై రిమాండ్లో ఉన్న కార్యకర్తలను కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల ఆ పార్టీ అధ్యక్షులు పేర్ని నాని, దేవినేని అవినాష్, జగ్గయ్యపేట వైఎస్సార్సీపీ ఇంఛార్జి తన్నీరు నాగేశ్వరరావు పరామర్శించారు.పరామర్శ అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ, పెనుగంచిప్రోలు తిరునాళ్లలో పోలీసుల సమక్షంలోనే టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని.. విద్వేషపూరితంగా మాట్లాడుతూ రెచ్చగొట్టారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభల పై రాళ్లు, కర్రలు విసిరేశారు. వైఎస్సార్సీపీ శ్రేణులను నోటికొచ్చినట్లు తిట్టారు. టీడీపీ వాళ్లు రెచ్చగొడుతున్నా పోలీసులు కనీసం కట్టడిచేయలేదు. టీడీపీ కార్యకర్తలు రాళ్లు విసురుతుంటే ఆత్మరక్షణలో భాగంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు’’ అని పేర్ని నాని వివరించారు.‘‘టీడీపీ కార్యకర్తలు నానా గొడవ చేస్తుంటే పోలీసులు కనీసం స్పందించలేదు. తిరునాళ్లలో గొడవ జరిగినపుడు లేని వాళ్లను పోలీసులు ముద్ధాయిలుగా చేర్చారు. జాతరలో ప్రభలకు పూజలు చేస్తున్న పూజారి కుమారుడిని కూడా అరెస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నవారిపై పోలీసులు అన్యాయంగా అక్రమ కేసులు పెట్టారు. అసలు ఈ రాష్ట్రంలో చట్టం, ధర్మం, న్యాయం ఉందా?’’ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.‘‘పోలీసులు పసుపు పచ్చ కండువా వేసుకున్న వారిలా ఉద్యోగం చేస్తున్నారు. కిరాయి మూకలు, రౌడీ మూకలకు పోలీసులు వత్తాసు పలకడం దురదృష్టకరం. టీడీపీ వాళ్లు విసిరిన రాళ్లతో దెబ్బలు తగిలితే వైఎస్సార్సీపీ వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఖాకీ చొక్కాలేసుకున్న పోలీసులకు ఇది ధర్మమేనా?. చట్టాన్ని టీడీపీకి చుట్టంలా మార్చేసిన ఖాకీలను న్యాయం ముందు నిలబెడతాం. టీడీపీ పార్టీ ఖాజానా నుంచి మీకు జీతాలివ్వడం లేదని పోలీసులు గుర్తుంచుకోవాలి. అమాయకుల పై హత్యాయత్నం కేసుల్లో ఇరికించడం దుర్మార్గం’’ అని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.వారిని చట్టం ముందు నిలబెడతాం.. దేవినేని అవినాష్దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభ కంటే ముందు టీడీపీ ప్రభ వెళ్లాలని పెనుగంచిప్రోలులో పోలీసులు ఆపేశారు. టీడీపీ కార్యకర్తలు చేసిన దాడిలో పోలీసులు గాయపడ్డారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పోలీసులు తప్పుడు కేసు పెట్టారు. వైఎస్సార్సీపీలో యాక్టివ్గా ఉండే కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. తప్పుడు కేసు పెట్టి 16 మందిని జైల్లో పెట్టారు. జైల్లో ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను పరామర్శించాం. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలతో వారికి ధైర్యం చెప్పాం. తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్న పోలీసులు తస్మాత్ జాగ్రత్త. అలాంటి వారిని చట్టం ముందు నిలబెడతాం’’ అని ఆయన హెచ్చరించారు.టీడీపీ ఆఫీస్ నుంచి పేర్లు.. వారిపై కేసులు: తన్నీరు నాగేశ్వరరావుజగ్గయ్యపేట వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తిరుపతమ్మకు పసుపు కుంకుమ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. టీడీపీ పార్టీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టారు. వైఎస్సార్సీపీ శ్రేణులు సంయమనంగా ఉన్నప్పటికీ టీడీపీ పార్టీ కార్యర్తలు రాళ్లు, బాటిల్స్ విసిరారు. ఈ ఘటనలో పోలీసులు ఏకపక్షంగా 25 మందికి పైగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టారు. 16 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. చదువుకున్న యువకులను కావాలని కేసుల్లో ఇరికించారు. టీడీపీ ఆఫీస్ నుంచి పేర్లు పంపించిన వారిపై కేసులు పెట్టారు. గత యాభై ఏళ్లలో ఇలాంటి పరిస్థితులను ఎన్నడూ చూడలేదు. తప్పుడు కేసులు పెట్టిన పోలీసులపై న్యాయ పోరాటం చేస్తాం. తప్పుడు కేసులతో వైఎస్సార్సీపీ కార్యకర్తలను అణచివేయలేరు -
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమం.. పేర్నినాని కీలక వ్యాఖ్యలు
-
‘మీరు వైఎస్ జగన్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాల్సిందే’
కృష్ణాజిల్లా: ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే అది వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే సాధ్యమన్నారు మాజీ మంత్రి పేర్నినాని. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పాలనపై నిప్పులు చెరిగిన పేర్ని నాని.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వైఎస్ జగన్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు సూచించారు.‘ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ఒక్క జగన్కే సాధ్యం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి చంద్రబాబు...ఆయన తొత్తు పవన్ కళ్యాణ్ ... జగన్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాల్సిందే. ఎ న్నికల ముందు సూపర్ సిక్స్ ..షణ్ముఖ వ్యూహం అని హామీలిచ్చారు. కూటమి ఎమ్మెల్యేలు స్క్రిప్ట్ లు వేసుకుని బ్రతకాల్సిందే. ఐదేళ్ల క్రితం మన బ్రతుక్కి వచ్చింది 23 సీట్లు కాదా?, రాష్ట్ర ప్రజలు మీకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని ధ్వజమెత్తారు పేర్ని నానివైఎస్సార్సీపీ నాయకుల అరెస్టుల వల్ల జనాల్లో జగన్ పరపతి ఏమీ తగ్గలేదని. అరెస్టులతో కూటమి నాయకులు మానసిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. రెడ్ బుక్ రాజ్యాంగం వైఎస్సార్సీపీ నాయకులను ఏమీ చేయలేదన్నారు. పోసాని కృష్ణమురళిపై ఏ ఆధారాలు లేకుండానే 18 కేసులు పెట్టి కూటమి ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు పేర్ని నాని. -
దిక్కుమాలిన సంతకం... పేర్ని నాని సెటైర్లు
-
చంద్రబాబుకు పేర్నినాని వార్నింగ్
-
వైఎస్ జగన్ లక్ష్యంగా ఈనాడు విష ప్రచారం చేస్తోంది
-
ఈనాడు రోత రాతలు: పేర్ని నాని
-
Live: పేర్ని నాని PRESS MEET
-
చంద్రబాబు తప్పుడు మాటలు.. ఈనాడు రోత రాతలు: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: ఈనాడు రోత రాతలపై వైఎస్సార్సీపీ మండిపడింది. వైఎస్ జగన్ లక్ష్యంగా ఈనాడు విషపు రాతలు రాస్తోందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసులో నారాయణ సాక్షిగా ఉన్నారని ఈనాడు రోత రాతలు రాసింది. కేబినెట్లో చంద్రబాబు ఏదో మాట్లాడితే.. ఈనాడు తప్పుడు వార్తలు వండి వార్చింది. వివేకా వాచ్మెన్ రంగయ్య మృతిని కూడా వైఎస్ జగన్కు ఆపాదించే యత్నం చేసింది. హామీలు అమలు గురించి తప్పించుకునేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్’’ అంటూ పేర్ని నాని నిప్పులు చెరిగారు.‘‘డైవర్షన్ పాలిటిక్స్ చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు.. ఎన్నికలయ్యాక చేతులెత్తేశారు. రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు వార్తలు రాయించడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఎన్టీఆర్ పరపతిని కూడా ఈనాడును అడ్డంపెట్టకుని బాబు దెబ్బతీశాడు. గతంలో లక్ష్మీపార్వతిపై కూడా ఈనాడులో ఇలాగే తప్పుడు రాతలు రాయించారు. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ఈనాడును చంద్రబాబు వాడుతున్నారు. వైఎస్ వివేకా హత్యతో వైఎస్ జగన్కు ఏం సంబంధం?. వ్యవస్థలను ప్రభావితం చేసి వైఎస్సార్సీపీ నేతలను బాబు ఇబ్బంది పెట్టాలని చూశారు’’ అని పేర్ని నాని ధ్వజమెత్తారు.‘‘వైఎస్ జగన్, వైఎస్ అవినాష్రెడ్డిలపై విషం చిమ్మడమే చంద్రబాబు లక్ష్యం. న్యాయ వ్యవస్థలను కూడా ప్రభావితం చేసేలా ఈనాడులో వార్తలురాస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా రంగన్న మృతిని కేబినెట్లో చర్చించారు. నారాయణ యాదవ్ అనారోగ్యంతో మృతి చెందారు. గంగాధర్రెడ్డిది సహజ మరణమని పోస్టుమార్టం రిపోర్ట్ చెప్తుంది. గంగాధర్రెడ్డి మరణం అనుమానం అంటూ బాబు డైరెక్షన్లో ఈనాడు తప్పుడు రాతలు రాసింది. గన్మెన్లు ఉండగా రంగన్న మృతిపై చంద్రబాబుకు సందేహం ఏంటో అర్థం కావడం లేదు. చంద్రబాబు ఇచ్చిన గన్మెన్లు ఉండగా.. రంగన్న మృతి ఎలా అనుమానాస్పదం?’’ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.‘‘పరిటాల మృతి తర్వాత చంద్రబాబు సీఎం అయ్యారు. 2014- 2019 మధ్య పరిటాల సునీత కూడా మంత్రిగా ఉన్నారు. పరిటాల రవి హత్యపై ఎందుకు విచారణ చేయలేదు. వివేకా హత్య కేసులో నారాయణ సాక్షి కాదని రికార్డులు చెప్తూ ఉంటే.. నారాయణ సాక్షి అని ఈనాడు ఎలా రాస్తోంది?’’ పేర్ని నాని నిలదీశారు.‘‘వివేకా హత్య కేసులో ఈనాడు తప్పుడు వార్తలు రాసింది. సుగాలి ప్రీతి హత్య కేసు గురించి తీవ్రంగా పరిగణించరుగానీ రంగయ్య మృతిపై మాత్రం తీవ్రంగా స్పందిస్తారంట. జగన్ డ్రైవర్ నారాయణ యాదవ్ ఆ కేసులో సాక్షి అంటూ తప్పుడు కథనాలు రాశారు. జగన్ లక్ష్యంగా విషపు రాతలు రాసింది. చంద్రబాబువి.. తప్పుడు మాటలు, ఈనాడువి తప్పుడు రాతలు. కేబినెట్లో ప్రజలకు చేయాల్సిన మేలు గురించి చర్చించలేదు. ఎన్నికలలో ఓట్ల కోసం ప్రజలను మోసం చేస్తారు. అధికారంలోకి వచ్చాక తన తప్పుడు హామీల నుండి బయట పడటానికి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. హామీలకు పంగనామాలు పెట్టారు...రాజకీయ ప్రత్యర్థులపై ఈనాడులో విషం కక్కించటం చంద్రబాబుకు అలవాటే. ఎన్టీఆర్ కు వెన్నుపోటు నుండి అనేక అంశాలలో ఇదే జరిగింది. లక్ష్మీ పార్వతి విషయంలో కూడా అప్పట్లో ఇలాగే రాయించారు. అవినాష్ కు సంబంధం లేకపోయినా కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. న్యాయవ్యవస్థను కూడా ప్రభావితం చేసేలాగ పెద్దపెద్ద అక్షరాలతో వార్తలు రాయిస్తున్నారు. నారాయణకు వివేకా కేసుకు ఎలాంటి సంబంధం లేదు. బ్రెయిన్ ట్యూమర్ తో నారాయణ చనిపోయారు. కల్లూరి గంగాధరరెడ్డిని 243వ సాక్షిగా ఉన్నాడు. దీర్ఘకాలంగా షుగర్ వ్యాధితో మృతి చెందారు. ఆయనది సహజ మరణం అని పోస్టుమార్టం రిపోర్టు కూడా ఉంది. శ్రీనివాసరెడ్డి 2018 సెప్టెంబరు లో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వేధింపుల కారణంగానే సూసైడ్ చేసుకున్నట్టు సూసైడ్ నోట్ రాశారు..వైఎస్ అభిషేక్రెడ్డి తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. జగన్, సునీతమ్మ ఇద్దరికీ అభిషేక్ బంధువే. మల్టీ ఆర్గన్స్ డేమేజ్ వలన అభిషేక్ మృతి చెందిన సంగతి అందరికీ తెలిసినా ఈనాడు విషపు రాతలు రాసింది. వాచ్మెన్ రంగన్నకు పోస్టుమార్టం అయ్యాక ఖననం చేశారు. రంగన్న గురించి కేబినెట్లో చర్చించారు. డీజీపీతో పాటు కడప నుండి పోలీసు అధికారులు వచ్చి ప్రభుత్వ పెద్దల సందేశం తీసుకుని వెళ్లారు. రంగన్నకు 2+2 గన్ మెన్లతో జగన్ ప్రభుత్వం భద్రత కల్పించారు. చంద్రబాబు వచ్చాక 1+1 భద్రతకు తగ్గించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన గన్మెన్ ఉండగా ఎలా అనుమానాస్పదంగా రంగన్న మృతి చెందారు?. ఖననం చేసిన రంగన్న మృతదేహాన్ని మళ్ళీ బయటకు తీసి రీపోస్టుమార్టం చేస్తున్నారు. ఆ నివేదికలు రాకముందే ఈనాడులో తప్పుడు కథనాలు ఎలా రాశారు?..పరిటాల రవి హత్యలో సాక్షుల మృతిపై చంద్రబాబు ఎందుకు విచారణ జరపలేదు?. ఎప్పుడో చనిపోయిన నారాయణ యాదవ్ మృతితో సహా అందరిపై విచారణ చేస్తారట, ఎవరిని ఇరికించటానికి విచారణల పేరుతో వ్యవస్థలను నాశనం చేస్తారు?. ఎన్నికల హామీలను డైవర్షన్ చేయటానికి ఇలాంటి తప్పుడు వార్తలు, తప్పుడు విచారణలు చేయిస్తున్నారు. రంగన్న ఇచ్చిన 164 స్టేట్మెంటులో అవినాష్ రెడ్డి పేరు లేదు. అసలు ఏ సాక్షి కూడా అవినాష్ పేరు చెప్పలేదు. ఇలాంటి తప్పుడు కథనాలు రాసే విష సంస్కృతి మానుకోవాలి’’ అని పేర్ని నాని హితవు పలికారు. -
పేర్ని నానికి హైకోర్టులో ఊరట
-
ఏపీ హైకోర్టులో పేర్ని నానికి ఊరట
అమరావతి, సాక్షి: ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య(నాని)కి ఊరట లభించింది. రేషన్ బియ్యం వ్యవహారానికి సంబంధించిన కేసులో కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఆయన ఏ6గా ఉన్న సంగతి తెలిసిందే. పేర్ని నాని(Perni Nani) సతీమణి పేర్ని జయసుధ పేరిట ఉన్న గోడౌన్లో రేషన్ బియ్యం మాయమైందన్న అభియోగాలతో కూటమి ప్రభుత్వం కిందటి ఏడాది డిసెంబర్లో కేసు పెట్టింది. ఈ కేసులో జయసుధ పేరును ఏ1గా, ఏ2గా గోదాం మేనేజర్ మానస్ తేజ్, మిల్లు యాజమాని బాల ఆంజనేయులు, లారీ డ్రైవర్ మంగారావులను మిగతా నిందితులుగా చేర్చారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మచిలీపట్నం పీఎస్ లో పేర్ని జయసుధ విచారణకు హాజరు కాగా.. కోర్టు నుంచి ముందస్తు బెయిల్ కూడా పొందారు. అయితే ఈ అభియోగాలను ఖండించిన పేర్ని నాని.. రాజకీయ ఉద్దేశంతో పెట్టిన కేసేనని, తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడంతో పాటు తనను అరెస్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్(Anticipatory Bail) కోసం ఆయన హైకోర్టు(High Court)ను ఆశ్రయించగా.. చివరకు ఊరట దక్కింది.వైవీ విక్రాంత్ రెడ్డికి ఊరటమరోవైపు కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో వైవీ విక్రాంత్ రెడ్డి(YV Vikrant Reddy)కి కూడా ఇవాళ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కాకినాడ పోర్టు, సెజ్ కు సంబంధించి 41 శాతం వాటాలు బలవంతంగా లాగేసుకున్నారని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో విక్రాంత్ రెడ్డి ఏ1గా ఉన్నారు. అయితే కాకినాడ పోర్టు, సెజ్ విషయంలో తనకు సంబంధం లేదని విక్రాంత్ రెడ్డి చెబుతున్నారు. ఈ క్రమంలో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా.. ఇవాళ మంజూరు అయ్యింది. -
మౌలానా అబుల్ కలాం ఆజాద్ కు YSRCP నేతలు నివాళులు
-
వల్లభనేని వంశీతో ములాఖత్ అయిన సతీమణి పంకజ శ్రీ, పేర్ని నాని
-
చంద్రబాబు బంధువే ఫోన్ ట్యాపింగ్ సూత్రదారి: పేర్నినాని
సాక్షి,విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతోందని మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖలు చేశారు. శుక్రవారం విజయవాడ జిల్లా జైల్లో వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభేనేని వంశీతో ఆయన సతీమణి పంకజశ్రీ, పేర్ని నాని, ఇతర వైఎస్సార్సీపీ నేతలు ములాఖత్ అయ్యారు.ములాఖత్ అనంతరం పేర్నినాని మీడియాతో మాట్లాడారు. అనధికారికంగా కొందరు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల ఫోన్ నెంబర్లను సేకరిస్తున్నారు. నా ఫోన్ ట్యాప్ చేయడంతో పాటు మా పార్టీ కార్యకర్తల ఫోన్ నెంబర్స్ను సేకరించారు. నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని నేను భయపడటం లేదు. గ్రామ స్థాయి లీడర్ల భార్యల ఫోన్ నెంబర్లతో ఏం పని? అని ప్రశ్నించారు. చంద్రబాబు బంధువే ఫోన్ ట్యాపింగ్ సూత్రదారి చంద్రబాబు బంధువు ప్రకాష్ అనే ఒక వ్యక్తి అనదికారికంగా విజయవాడలో రమేష్ ఆసుపత్రి దగ్గర ఆఫీసు పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. ఫోన్ ట్యాప్ చేసి నేతలను బెదిరించాలని చూస్తున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోంది. ఎన్ని తప్పుడు పనులు చేసిన వాళ్ళందరినీ చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు.వల్లభనేనీ వంశీ కేసులో దుర్మార్గంగా పోలీసులువల్లభనేనీ వంశీ కేసులో పోలీసు అధికారులు ఉన్నతాధికారుల పర్యవేక్షణతో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ నాయకులను సంతృప్తి పరచడం కోసం పటమట పోలీసులు పని చేస్తున్నారు. 10వ తేదిన సత్యవర్ధన్ కోర్టుకు వచ్చి తప్పుడు కేసు అని అఫిడవిట్ ఇచ్చారు. టీడీపీ కార్యకర్త ఫణి కుమార్ అనే వ్యక్తి ద్వారా సత్యవర్ధన్, వంశీపై తప్పుడు కేసులు పెట్టించారు. కిరణ్ అనే వ్యక్తి ద్వారా ఇంకో కంప్లైంట్ తీసుకొని కేసులు నమోదు చేశారు. ఊహాజనిత ఫిర్యాదుతో నాన్ బెయిలబుల్ సెక్షన్లు వంశీపై పెట్టారు. నాపైనా కేసులు సత్య వర్ధన్ చెప్పాడో లేదో కూడా తెలియకుండా కేసు పెడతారా? వంశీకి రిమాండ్ విధించే సమయంలో ఎస్సీ,ఎస్టీ కేసుల న్యాయస్థానంలో హాజరు పరచకుండా వేరే కోర్టులో ప్రవేశపెట్టారు. చట్టాలు, కేసులు, సెక్షన్లు అనేవి లేకుండా పోలీసులు వ్యవహరించారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో పర్యటించే సమయంలో నేను లేను. అయినా నాపై కేసులు పెట్టి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కొల్లు రవీంద్రపై పేర్ని ఫైర్ కొల్లు రవీంద్ర మంత్రిగా ప్రజా సేవకు మా ఊరు,రాష్ట్రాన్ని బాగు చేయడానికి పనికిరారు. లోకేష్ ఇస్తే కాసులకు కక్కుర్తి పడే వ్యక్తి. కొడాలి నాని అరెస్టు చేయిస్తా, పేర్ని నానినీ అరెస్టు చేయిస్తా అంటున్నారు. నేనూ ఆరు నెలలుగా మచిలీపట్నం రోడ్లపై తిరుగుతున్నాను. మీరు ఏం చేయలేరు’అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు. -
ఫోన్ ట్యాపింగ్లకు నేను భయపడను: పేర్నినాని
-
తప్పుడు కేసుపై డీజీపీకి పేర్ని నాని ఫిర్యాదు
గుంటూరు, సాక్షి: తనపై తప్పుడు కేసు నమోదు అయిన విషయాన్ని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) డీజీపీకి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు శుక్రవారం ఫిర్యాదు చేస్తూ డీజీపీ(AP DGP) హరీష్ కుమార్ గుప్తాకు ఓ లేఖ రాశారు. గిట్టుబాటు ధర లేక ఆందోళనలో ఉన్న గుంటూరు మిర్చి రైతులను బుధవారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన సంగతి తెలిసిందే. ఆయన జగన్, మరికొందరు వైఎస్సార్సీపీ(YSRCP) నేతలు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారంటూ నల్లపాడు పీఎస్లో టీడీపీ నేతలు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో జగన్ సహా వైఎస్సార్సీపీ నేతలపై కేసు నమోదు అయ్యింది.అయితే ఆ పర్యటనలో పాల్గొనని పేర్ని నాని(Perni Nani)పై కూడా కేసు నమోదు కావడంతో ఆయన స్పందించారు. ఈ పర్యటనలో పాల్గొనకున్నా తన ప్రతిష్టను దెబ్బ తీసేందుకు తనపై ఫిర్యాదు చేశారని డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారాయన. ప్రజాక్షేత్రంలో ఉన్న తనపై ఇలాంటి తప్పుడు కేసు బనాయించడం.. అందరినీ తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని అన్నారాయన. ఈ అంశంపై విచారణ జరిపి తప్పుడు ఫిర్యాదు చేసిన వాళ్లపై, అలాగే బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారాయన. ఇదీ చదవండి: సభ పెట్టలేదు.. మైక్ ముట్టలేదు.. ఇదేమీ దుర్మార్గం -
వీడియో: పోలీసుల అత్యుత్సాహం.. పేర్ని నాని హౌస్ అరెస్ట్
సాక్షి, కృష్ణా: ఏపీలో కూటమి సర్కార్ వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ పాలన చేస్తోంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అనంతరం రాష్ట్రంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.వంశీ అరెస్ట్ నేపథ్యంలో మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం పేర్ని నాని ఇంటి వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. ఏఆర్ ఏఎస్పీ, డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది మోహరించారు. ఈ క్రమంలో నానిని ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో, పోలీసుల తీరుపై పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పేర్ని నాని హౌస్ అరెస్ట్...
-
మాజీ మంత్రి పేర్ని నాని ముందస్తు బెయిల్పై నేడు విచారణ
సాక్షి, అమరావతి : రేషన్ బియ్యం కేసులో మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య అలియాస్ నానిపై ఎలాంటి కఠిన చర్యలేవీ తీసుకోవద్దంటూ ఇటీవల తామిచ్చిన ఉత్తర్వులను హైకోర్టు బుధవారం వరకూ పొడిగించింది. నాని ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి సోమవారం ఉత్తర్వులిచ్చారు. రేషన్ బియ్యం కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ నాని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు రావాల్సి ఉన్నా.. రాకపోవడంతో అత్యవసర విచారణ కోసం నాని తరఫు న్యాయవాది వీసీహెచ్ నాయుడు కోర్టును అభ్యర్థించారు. దీంతో న్యాయమూర్తి లంచ్మోషన్ రూపంలో విచారణకు అంగీకరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యర్థన మేరకు న్యాయమూర్తి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.పెనాల్టీ నోటీసులపై పూర్తి వివరాలివ్వండి.. ఇదే వ్యవహారంలో రూ.1.67 కోట్లు పెనాల్టీ చెల్లించాలంటూ పౌర సరఫరాల శాఖ ఇచి్చన నోటీసులను సవాలు చేస్తూ పేర్ని నాని సతీమణి, గోడౌన్ యజమాని జయసుధ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు పూర్తి వివరాలను తమ ముందుంచాలని పౌర సరఫరాల శాఖను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు సోమవారం ఉత్తర్వులిచ్చారు. ముందస్తు బెయిల్ పిటిషన్ల కొట్టివేత సాక్షి, అమరావతి : గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన కేసులో పలువురు నిందితులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. పిటిషనర్లపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదై ఉన్నందున చట్ట నిబంధనల ప్రకారం కింది కోర్టులోనే పిటి షన్లు దాఖలు చేసుకోవాలంది. అందువల్ల ఈ వ్యాజ్యాలకు విచారణార్హత లేదని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ సోమవారం తీర్పు వెలువరించారు. 2023లో గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. ఈ ఘ టనలో పోలీసులు పలువురిపై కేసులు నమో దు చేశారు. దీంతో కృష్ణారావు మరో 32 మంది హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దా ఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి సోమవారం నిర్ణయాన్ని వెలువరించారు. వారికి నెల రోజుల్లో ట్రాన్సిట్ పర్మిట్లు జారీ చేయండిసాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘించని మైనర్ మినరల్ లీజుదారులకు నెల రోజుల్లో ట్రాన్సిట్ పర్మిట్లు జారీ చేయాలని గనుల శాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. గత ఏడాది అక్టోబర్లో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు లోబడి ఈ ట్రాన్సిట్ పర్మిట్లు ఉండాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ కుంఢజడల మన్మథరావు మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. చట్ట ప్రకారం అన్ని అనుమతులు ఉన్నప్పటికీ తమకు ట్రాన్సిట్ పర్మిట్లు జారీ చేయకపోవడాన్ని సవాలు చేస్తూ ఫెడరేషన్ ఆఫ్ మైనర్ మినరల్స్ ఇండస్ట్రీ (ఫెమ్మీ) సెక్రటరీ జనరల్ చట్టి హనుమంతరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సోమవారం విచారణ జరిపిన జస్టిస్ మన్మథరావు నిబంధనల ప్రకారం ట్రాన్సిట్ పర్మిట్లు జారీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేశారు. అంబటి పిటిషన్లో పూర్తి వివరాలివ్వండి పోలీసులకు హైకోర్టు ఆదేశం సాక్షి, అమరావతి: తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు తనను, తన కుటుంబ సభ్యులను కించపరుస్తూ, అసభ్యకరంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలంటూ తాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ మాజీ మంత్రి అంబటి రాంబాబు దాఖలు చేసిన వ్యాజ్యంలో పూర్తి వివరాలు సమరి్పంచాలని హైకోర్టు సోమవారం పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి ఉత్తర్వులు జారీచేశారు. తాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాధ్యులపై కేసు నమోదు చేసేలా గుంటూరు పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని రాంబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు వచి్చంది. అంబటి రాంబాబు స్వయంగా వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణ ఈ నెలాఖరుకి వాయిదా వేశారు. -
YSRCP సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్నినాని కుటుంబంపై చంద్రబాబు కక్ష
-
బాబ్బాబూ పుణ్యముంటుంది.. ఆయన్ను అరెస్టు చేయండి..
ఇళ్లకొచ్చి అడుక్కునే ముష్టివాళ్ల సంఖ్య ఇప్పుడు తగ్గిపోయింది. ట్రాఫిక్ సిగ్నళ్లలో, గుడులూ, హాస్పిటళ్లూ, హోటళ్ల దగ్గరే ‘బాబ్బాబూ ధర్మం చేయండి బాబూ.. పుణ్యముంటుంది బాబూ..’ అంటూ అడుక్కునే ముష్టివాళ్లు మనకు దండిగా కనిపిస్తుంటారు. ఈ ముష్టివాళ్ల సంగతి సరే.. నిజానికి ఇంకోరకం ముష్టివాళ్లు కూడా ఉంటారు. వారికి అనేకానేక వంకర ప్రయోజనాలు ఉంటాయి. ఆ వంకర ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి అడ్డు పడేవారి మీద కక్ష పెంచుకుంటారు. ఆ కక్ష సాధించుకోవడానికి ఇంకో రకం ముసుగులు తగిలించుకుని, చవకబారు ముష్టెత్తుతూ ఉంటారు.పేర్ని నాని కుటుంబానికి చెందిన గోడౌన్ల నుంచి బియ్యం నిల్వల తేడా వచ్చిన కేసులో అటు పోలీసులకు, ఇటు పౌరసరఫరాల శాఖకు, ప్రభుత్వానికి లేని శ్రద్ధ పచ్చ మీడియాకు మాత్రం విపరీతంగా ఉన్నట్టు కనిపిస్తోంది. చట్టప్రకారం అవకాశం ఉన్నా లేకపోయినా కూడా.. పేర్ని నానిని అరెస్టు చేసేవరకు తాము కారుకూతలు కూస్తూనే ఉంటాం.. బురదచల్లుడు చవకబారు రాతలు రాస్తూనే ఉంటాం.. అనే ధోరణిని పచ్చ మీడియా ప్రదర్శిస్తున్నది.పేర్ని నాని స్వయంగా ప్రభుత్వానికి లేఖ రాసిన తర్వాతనే.. బియ్యం నిల్వల్లో తేడా వచ్చిన సంగతి బయటపడింది. అప్పటికీ నిబంధనల ప్రకారం అధికారులు ఎంత జరిమానా విధించారో.. అదంతా కూడా డీడీల రూపంలో చెల్లించేశారు. అయినాసరే.. పేర్నినానిని అరెస్టు చేసేదాకా పచ్చమీడియా కళ్లు చల్లబడేలా కనిపించడం లేదు.‘మేం కేసు పెడతాం అంతే.. అరెస్టులు మాత్రం చేయం.. మీరు కోర్టుకు వెళ్లి ఉపశమనం పొందేవరకు వేచిచూస్తూ ఉంటాం.. అన్నట్టుగా పోలీసులు వేచిచూస్తున్నారంటూ..’ పచ్చమీడియా వారి వెంటపడుతోంది. పేర్నినాని వ్యవహారం బయటకు వచ్చిన నాటినుంచి.. చట్టం తనశైలిలో తాను పనిచేసుకుంటూ పోతోంది. అయితే పచ్చమీడియా మాత్రం అత్యుత్సాహం ఆపుకోలేక.. ఆయనను అరెస్టు చేయడం లేదు, కొల్లు రవీంద్ర గానీ, పార్టీపెద్దలు గానీ.. ఆయన గురించి విమర్శలు చేయడం లేదు. అరెస్టు చేయాలని పోలీసుల వెంటపడడం లేదు.. పేర్ని నానితో కుమ్మక్కు అయినట్టుగా పనిచేస్తున్నారు.. అంటూ రకరకాల కారుకూతలు, చవకబారు రాతలు రాశారు.తీరా పచ్చమీడియా పోరు పడలేకపోతున్నట్టుగా.. కొల్లు రవీంద్ర కూడా ప్రెస్ మీట్ పెట్టి.. ఏదో పేర్నినాని మీద కొన్ని నిందలు వేసి దులుపుకున్నారు. ఆ తర్వాత.. రకరకాల మలుపులు తిరిగిన వ్యవహారంలో గోడౌన్ యజమానిగా రికార్డుల్లో ఉన్న జయసుధకు ముందస్తు బెయిలు వచ్చింది. పచ్చమీడియా పెద్దలు హతాశులయ్యారు. ఈలోగా పోలీసులు.. ‘విచారణలో తెలిసిన సమాచారం మేరకు..’ అనే ముసుగులో పేర్ని నాని పేరును కూడా ఏ6గా కేసులో చేర్చారు.కక్షపూరితంగా వేధించదలచుకుంటున్నారనే భయంతో పేర్ని కుటుంబం అజ్ఞాతంలోకి వెళితే.. నానా చెత్తరాతలు రాసిన పచ్చమీడియా.. ఇప్పుడు ముందస్తు బెయిల్ తర్వాత జయసుధ విచారణకు హాజరైనా కూడా ఓర్వలేకపోతోంది. కుట్రపూరితంగా తన పేరును కూడా ఇరికించిన నేపథ్యంలో పేర్ని నాని ముందస్తు బెయిలుకోసం దరఖాస్తు చేసుకోవడం కూడా పచ్చమీడియాకు కంటగింపే. ఆయనకు ముందస్తు బెయిల్ రావడం కూడా ఖరారే అని సంకేతాలు అందుతున్న వేళ.. తక్షణం ఆయనను అరెస్టు చేయకుండా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారంటూ పచ్చ మీడియా పాపం.. ఆవేదన చెందుతోంది.టీడీపీ, జనసేనల్లో పేర్ని నాని సన్నిహితులున్నారని, వారే ఆయనను కాపాడుతున్నారని పచ్చ మీడియా పాపం కుమిలపోతున్నది. అయినా.. చట్టప్రకారం ఆయన దోషి అయితే గనుక.. కాపాడటం ఎవరి తరం అవుతుంది? జరిగింది నేరం కానప్పుడు.. బియ్యం నిల్వల తేడాకు సంబంధించి.. ఒప్పందంలో ఉన్న నిబంధనల ప్రకారం జరిమానా మొత్తం చెల్లించేసినప్పుడు.. ఇక ఆయనను ఏ రకంగా శిక్షించగలరని పచ్చ మీడియా ఆరాటపడుతున్నదో అర్థం కావడం లేదు. వ్యవహారం మొత్తం గమనిస్తే.. నాని అరెస్టుకోసం పచ్చ మీడియా ముష్టెత్తుకుంటున్నట్టుగా.. బాబ్బాబూ.. మీకు పుణ్యముంటుంది.. అరెస్టు చేయండి బాబూ.. అని దేబిరిస్తున్నట్టుగా కనిపిస్తోంది.-ఎం.రాజేశ్వరి -
మహిళలను అవమానించేలా కూటమి చర్యలు
-
పేర్ని నాని భార్యను పోలీస్ స్టేషన్ కు రప్పించే కుట్ర
-
కూటమి సర్కార్ ‘రాజకీయ’ కక్ష.. మహిళను అవమానించేలా..
సాక్షి, కృష్ణా జిల్లా: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు కొనసాగిస్తూనే ఉంది. మరోసారి పేర్ని నాని సతీమణి జయసుధకు పోలీసులు నోటీసులిచ్చారు. రాజకీయ కక్ష సాధింపు కోసం మహిళలను అవమానించేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పదే పదే విచారణకు పిలిచి పేర్ని నాని కుటుంబాన్ని అవమానించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ నాడు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు.మధ్యాహ్నం రెండు గంటల్లోగా విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో బందరు తాలుకా పీఎస్కు పేర్ని నాని సతీమణి జయసుధ విచారణకు హాజరయ్యారు. తన న్యాయవాదులతో కలిసి పేర్ని జయసుధ పీఎస్కు వెళ్లారు. ఆమెను సుమారు రెండు గంటల పాటు విచారించారు.ఆరోగ్యం బాగోలేకపోయినా విచారణకు రావాల్సిందే..స్పైనల్ కార్డ్ సమస్యతో బాధపడుతూ జయసుధ విచారణకు హాజరయ్యారు. ఆరోగ్యం బాగోలేకపోయినా విచారణకు రావాల్సిందేనని పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణ సమయంలో జయసుధతో పాటు లాయర్లను పోలీసులు అనుమతించలేదు. జయసుధతో పాటు వచ్చిన వైఎస్సార్సీపీ మహిళా నేతలను సైతం పోలీసులు బయటికి పంపించేశారు. పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.అనారోగ్యంతో ఉన్నప్పటికీ జయసుధ విచారణకు హాజరయ్యారు. పేర్ని జయసుధ తరఫు న్యాయవాది వరద రాజులు మీడియాతో మాట్లాడుతూ, న్యాయస్థానం విధించిన షరతులకు లోబడి పోలీసుల విచారణకు జయసుధ హాజరయ్యారయ్యారని.. జయసుధ స్పైనల్ కార్డ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆరోగ్యం సరిగా లేకపోయినప్పటికీ విచారణకు హాజరయ్యారన్నారు. గంట నుంచి పోలీసులు విచారిస్తున్నారని.. ఆనారోగ్యంతో ఉన్నప్పటికీ పోలీసుల విచారణకు జయసుధ సహకరిస్తున్నారని తెలిపారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఇద్దరి ష్యూరిటీ సర్టిఫికెట్లను పోలీసులకు అందజేశామని వరద రాజులు తెలిపారు.అక్రమ కేసులతో చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో అంతకంతకూ పెట్రేగిపోతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులతో అణచివేసే కుట్రలకు మరింతగా పదనుపెడుతోంది. పేర్ని నాని కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసుల మీద అక్రమ కేసులు నమోదు చేస్తుండటం రాష్ట్రంలో హక్కుల హననానికి తాజా నిదర్శనం. ప్రభుత్వ పెద్దలు చెప్పిందే తడవుగా అధికార యంత్రాంగం ఈ కుట్రలకు వత్తాసు పలుకుతోంది. ఇదీ చదవండి: ఇదీ పన్నాగం.. చంద్రబాబు సర్కార్ బరితెగింపు.. -
పేర్ని నాని భార్యపై వేధింపులు..
-
హైకోర్టులో పేర్ని నానికి ఊరట
-
ఏపీ హైకోర్టులో పేర్ని నాని లంచ్ మోషన్ పిటిషన్
-
ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి పేర్నినానికి ఊరట
సాక్షి, విజయవాడ: ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి పేర్నినానికి ఊరట దక్కింది. పేర్నినాని దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా సోమవారం వరకు పేర్నినానిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి పేర్నినాని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. పౌరసరఫరాల సంస్థకు సంబంధించిన కేసులో పేర్ని నానిని ఏ6గా మచిలీపట్నం పోలీసులు చేర్చారు.పేర్ని నాని పై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. పేర్ని నాని కుటుంబమే లక్ష్యంగా అక్రమ కేసులు పెడుతోంది. రికవరీ మొత్తం చెల్లించినా వదలకుండా వేధింపుల పర్వానికి తెరతీసింది. పేర్ని నాని సతీమణి జయసుధకు ముందస్తు బెయిల్ రాగానే మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే కోటి 68 లక్షలు పేర్ని నాని కుటుంబం చెల్లించింది. మరో కోటి 67 లక్షలు రికవరీ చెల్లించాలంటూ జయసుధకు కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ నోటీసులు పంపించారు. జయసుధకు ముందస్తు బెయిల్ రాగానే పేర్ని నానిని ఏ6గా కేసులో పోలీసులు చేర్చారు.ఇదీ చదవండి: ఇదీ పన్నాగం.. చంద్రబాబు సర్కార్ బరితెగింపు..కాగా, ఈ కేసులో మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) సతీమణి జయసుధకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ మచిలీపట్నంలోని 9వ అదనపు జిల్లా కోర్టు జడ్జి ఎస్.సుజాత సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా పేర్ని జయసుధ కేసులో మచిలీపట్నం రూరల్ పోలీసులు సోమవారం రాత్రి నలుగురి ని అరెస్టు చేశారు. గోడౌన్ మేనేజర్ మానస తేజ, సివిల్ సప్లయీస్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, లారీ డ్రైవర్ మంగారావు, లారీ డ్రైవర్ స్నేహి తుడు ఆంజనేయులును అరెస్టు చేశారు. వీరికి జడ్జీ 12 రోజులు రిమాండ్ విధించారు. -
బాబు సర్కార్ బరితెగింపు
-
ఇదీ పన్నాగం.. చంద్రబాబు సర్కార్ బరితెగింపు..
సాక్షి, అమరావతి: అక్రమ కేసులతో చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో అంతకంతకూ పెట్రేగిపోతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులతో అణచివేసే కుట్రలకు మరింతగా పదనుపెడుతోంది. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసుల మీద అక్రమ కేసులు నమోదు చేస్తుండటం రాష్ట్రంలో హక్కుల హననానికి తాజా నిదర్శనం. ప్రభుత్వ పెద్దలు చెప్పిందే తడవుగా అధికార యంత్రాంగం ఈ కుట్రలకు వత్తాసు పలుకుతోంది.పేర్ని నానిపై కక్ష సాధింపు కుట్రతో ఆయన కుటుంబానికి చెందిన గోదాముల్లో ప్రభుత్వం తనిఖీలు నిర్వహించింది. ఏకంగా 4,500 బియ్యం బస్తాలు తగ్గాయని అధికారులు ఏకపక్షంగా నివేదిక ఇచ్చేశారు. గోదాములకు బియ్యం బస్తాలు తీసుకువచి్చనప్పుడు తేమ శాతం అధికంగా ఉంటుంది. దాంతో బియ్యం నిల్వలు బరువు ఎక్కువ ఉంటాయి. కానీ గోదాముల నుంచి బియ్యాన్ని తరలించేటప్పుడు తేమ శాతం తగ్గుతుంది. దాంతో బియ్యం నిల్వల బరువు తగ్గుతుంది. ఇది సహజం. కానీ దీన్ని ఏమాత్రం పట్టించుకోకుండా 4,500 బస్తాలు తగ్గాయని ఏకపక్షంగా నిర్ధారించేశారు.రూ.1.68 కోట్లు రికవరీ కింద చెల్లించాలని నోటీసులిచ్చారు. తమ తప్పు ఏమాత్రం లేకపోయినప్పటికీ.. అంతా సక్రమంగా ఉన్నప్పటికీ పేర్ని నాని కుటుంబం అందుకు సమ్మతించింది. ఈ వ్యవహారంపై ఓ వైపు న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తూనే మరోవైపు ప్రభుత్వం చెప్పినట్టుగా రూ.1.68 కోట్లు చెల్లించింది. నోటీసులకు వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కాగా రికవరీగా చెల్లించమన్న మొత్తం చెల్లించేయడంతో నిబంధనల ప్రకారం దాంతో ఈ వ్యవహారాన్ని ముగించాలి. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం మాత్రం కేవలం వేధించాలన్న ఏకైక కుట్రతో ఆ గోదాం యజమానిగా ఉన్న పేర్ని నాని సతీమణి జ యసుధపై అక్రమ కేసు నమోదు చేసింది.రికవరీ మొత్తం చెల్లించినప్పటికీ మరోసారి చెల్లించాలంటూ జేసీ ఈనెల 29న ఇచ్చిన నోటీసు బెయిల్ను సహించలేని ప్రభుత్వం ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసును సవాల్ చేస్తూ పేర్ని నాని కుటుంబం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తమ గోదాము వద్ద ఉన్న సీసీ టీవీ కెమెరాల ఫుటేజీలను ఆధారాలుగా న్యాయస్థానానికి సమరి్పంచింది. తాము గోదాము నుంచి బియ్యాన్ని అక్రమంగా తరలించనే లేదని వీడియో ఆధారాలతో సహా తమ వాదనను బలంగా వినిపించింది. పేర్ని నాని కుటుంబ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. పేర్ని జయసుధకు సోమవారం ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది.రికవరీ మొత్తం చెల్లించాలని పేర్ని నాని కుటుంబానికి కృష్ణా జిల్లా జేసీ జారీచేసిన నోటీసుదాంతో చంద్రబాబు ప్రభుత్వం తమ పన్నాగానికి మరింత పదును పెట్టింది. అధికారులను సోమవారం మరోసారి ఆ గోదా ము కు పంపించింది. మరో రూ.1.67 కోట్లు రికవరీ మొత్తంగా చెల్లించాలని నోటీసులు ఇ చ్చింది. తద్వారా తమకు నిబంధనలు పట్టవని.. అక్రమ కేసులతో వేధించడమే తమ ఏకైక లక్ష్యమని చంద్రబాబు ప్రభుత్వం బాహాటంగా వెల్లడించింది. ముందు చెప్పిన రికవరీ మొత్తాన్ని చెల్లించినా సరే మరోసారి రికవరీ మొత్తం చెల్లించాలని నోటీసులివ్వడాన్ని పరిశీలకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని తన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాదిరిగా ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారని విమర్శిస్తున్నారు.ఇదీ చదవండి: ఇంగ్లీష్ మీడియం మన పిల్లలకే..'పేద బిడ్డలకు తెలుగే' -
కూటమి ప్రభుత్వం అక్రమ కేసు.. పేర్ని నాని సతీమణికి ఊరట
సాక్షి,కృష్ణా : కూటమి ప్రభుత్వం నమోదు చేసిన రేషన్ బియ్యం అక్రమ కేసులో మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి ఊరట దక్కింది. పేర్ని నానీ సతీమణి పేర్ని జయసుధకు మచిలీపట్నం కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రేషన్ బియ్యం కేసులో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) ఇప్పటికే ఖండించారు. ఈ విషయంలో అధికారుల దర్యాప్తు కంటే సోషల్ మీడియాలో రచ్చ ఎక్కువైందని, పోలీసుల విచారణ పూర్తి కాకముందే ఉద్దేశపూర్వకంగా తనను దొంగగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారాయన. శనివారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘అద్దె కోసమే గోడౌన్ కట్టుకున్నాం. తప్పుడు పనులు చేయడానికి కాదు. సివిల్ సప్లై అధికారులు నా భార్య జయసుధకు చెందిన గోడౌన్లో స్టాక్ ఉంచారు. మా గోడౌన్లో బియ్యం తగ్గిందని అధికారులు చెప్పారు. టెక్నికల్గా మా తప్పు లేకపోయినా.. నైతికంగా బాధ్యత తీసుకుంటామని చెప్పాం. అధికారులు 3,800 బస్తాలు తగ్గాయని చెబితే.. నగదు చెల్లించాం. అయినా సరే మాపై కక్షగట్టి కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణ పూర్తి కాలేదని పోలీసులే చెబుతున్నారు. ఏదీ తేలకముందే నేనే దొంగనంటూ కూటమి(Kutami) నేతలు కొద్దిరోజులుగా నాపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు’’ అని అన్నారాయన.అయినా కూడా ఈ వ్యవహారంలో డిపార్ట్మెంట్ విచారణ కంటే సోషల్ మీడియా(Social Media) రచ్చ ఎక్కువైంది. మాపై ఎల్లో మీడియా, ఐటీడీపీ తప్పుడు రాతలు రాస్తోంది. కూటమి అనుకూల నేతలు, విశ్లేషకులు ఈ తప్పుడు ప్రచారంలో భాగం అయ్యారు. నేను పారిపోయానంటూ ప్రచారాలు చేశారు. నేనెక్కడికి పారిపోలేదు. 15వ తేదీ నుంచి మూడు రోజులపాటు బందరులోనే ఉన్నా. కేవలం లాయర్ల సూచన మేరకే ఇంతకాలం మీడియా ముందుకు రాలేదు.నాపై ప్రతీకారం తీర్చుకోవాలని నా ఇంట్లో ఆడవాళ్లను ఇబ్బంది పెడుతున్నారు. గోడౌన్ మేనేజర్ను అరెస్ట్ చేసి.. ఆయన ద్వారా నా పేరు చేర్చడానికి ప్లాన్ చేశారు. గోడౌన్ను పగలగొట్టి సరుకును తీసుకెళ్లారు. ఓ సీఐ ఈ స్వామికార్యాన్ని దగ్గరుండి జరిపించారు. ఇలా ఏదో ఒక రకంగా నన్ను, నా భార్యను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. కొన్ని యూట్యూబ్ చానెల్స్లో నా భార్య గురించి దారుణమైన కామెంట్స్ పెట్టారు. ఇప్పటికే చాలామంది స్టేషన్కు తీసుకెళ్లి కొడుతున్నారు. రాజకీయ కక్ష ఉంటే నాపై తీర్చుకోండి. నా ఇంట్లో ఆడవాళ్లతో ఏం పని?’’.... సామాన్య ప్రజలు ఆలోచించాలి. నేను మూడుసార్లు ఎమ్మెల్యేగా చేశా. ప్రభుత్వం రూల్స్ ఏంటో నాకు తెలుసు. నేను మంత్రిగా చేసినప్పుడు.. ఇదే డీజీపీ నా శాఖలో పని చేశారు. ఆయనకు నేనేంటో తెలుసు. నా తల్లి మీద ఒట్టేసి చెబుతున్నా.. ఎలాంటి తప్పు చేయలేదు. నేను, నా భార్య ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. తప్పుడు మార్గంలో సంపాదించాలనే ఆలోచన ఏనాడూ నాకు లేదు. కేవలం నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. తప్పు చేసి ఉంటే ఈ ఐదు నెలలు ఏం చేశారు?. నా మీద అధికార పార్టీ, ఎల్లో మీడియా కక్ష కట్టాయి. వైఎస్ జగన్ కంటే నేనే వాళ్ల మొదటి టార్గెట్. అందుకే నన్ను తప్పుడు కేసులో ఇరికించాలని చూస్తున్నారు. నా వ్యక్తిత్వాన్ని హననం చేయాలనుకుంటున్నారు. త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయి.ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్తే రకరకాల కుట్రలు చేశారు. పీపీలను మారుస్తూ అడ్డంకులు సృష్టించారు. జనవరి 2వ తేదీలోగా నన్ను, నా కుమారుడిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారని తెలిసింది. ఇంకోవైపు.. నా దగ్గర రూ.5 వేల కోట్లు ఉన్నాయని టీడీపీ పత్రికల్లో అసత్య ప్రచారం చేస్తున్నారు. నా దగ్గరే అంత డబ్బు ఉంటే సీజ్ చేస్కోండి. 3 శాతం లంచాలు తీసుకునేవాళ్లు కూడా నాపై ఆరోపణలు చేస్తున్నారు. మంత్రిగా ఉంటూ తన శాఖలోని ఉద్యోగుల బదిలీలకు లంచాలు తీసుకున్నవాళ్లు కూడా నాపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ నెల 30న బెయిల్ తీర్పు ఉన్నందున అన్ని విషయాల గురించి మాట్లాడలేకపోతున్నా’’ అని పేర్ని నాని అన్నారు. -
చంద్రబాబు ప్రభుత్వంపై పేర్నినాని కామెంట్స్
-
నా తల్లి మీద ప్రమాణం చేసి చెబుతున్న
-
కావాలనే ఆ టైం కి నోటీసులు అంటించారు
-
నా పైన ప్రతీకారం తీర్చుకోవడానికి ఇంట్లో మహిళలను ఇబ్బందిపెడుతున్నారు
-
కూటమి నేతలు కొద్దిరోజులుగా నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు
-
నా తల్లి మీద ఒట్టేసి చెబుతున్నా.. ఏ తప్పు చేయలేదు: పేర్ని నాని
గుంటూరు, సాక్షి: రేషన్ బియ్యం మాయం కేసులో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) ఖండించారు. ఈ విషయంలో అధికారుల దర్యాప్తు కంటే సోషల్ మీడియాలో రచ్చ ఎక్కువైందని, పోలీసుల విచారణ పూర్తి కాకముందే ఉద్దేశపూర్వకంగా తనను దొంగగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారాయన. శనివారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘అద్దె కోసమే గోడౌన్ కట్టుకున్నాం. తప్పుడు పనులు చేయడానికి కాదు. సివిల్ సప్లై అధికారులు నా భార్య జయసుధకు చెందిన గోడౌన్లో స్టాక్ ఉంచారు. మా గోడౌన్లో బియ్యం తగ్గిందని అధికారులు చెప్పారు. టెక్నికల్గా మా తప్పు లేకపోయినా.. నైతికంగా బాధ్యత తీసుకుంటామని చెప్పాం. అధికారులు 3,800 బస్తాలు తగ్గాయని చెబితే.. నగదు చెల్లించాం. అయినా సరే మాపై కక్షగట్టి కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణ పూర్తి కాలేదని పోలీసులే చెబుతున్నారు. ఏదీ తేలకముందే నేనే దొంగనంటూ కూటమి(Kutami) నేతలు కొద్దిరోజులుగా నాపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు’’ అని అన్నారాయన. అయినా కూడా ఈ వ్యవహారంలో డిపార్ట్మెంట్ విచారణ కంటే సోషల్ మీడియా(Social Media) రచ్చ ఎక్కువైంది. మాపై ఎల్లో మీడియా, ఐటీడీపీ తప్పుడు రాతలు రాస్తోంది. కూటమి అనుకూల నేతలు, విశ్లేషకులు ఈ తప్పుడు ప్రచారంలో భాగం అయ్యారు. నేను పారిపోయానంటూ ప్రచారాలు చేశారు. నేనెక్కడికి పారిపోలేదు. 15వ తేదీ నుంచి మూడు రోజులపాటు బందరులోనే ఉన్నా. కేవలం లాయర్ల సూచన మేరకే ఇంతకాలం మీడియా ముందుకు రాలేదు. నాపై ప్రతీకారం తీర్చుకోవాలని నా ఇంట్లో ఆడవాళ్లను ఇబ్బంది పెడుతున్నారు. గోడౌన్ మేనేజర్ను అరెస్ట్ చేసి.. ఆయన ద్వారా నా పేరు చేర్చడానికి ప్లాన్ చేశారు. గోడౌన్ను పగలగొట్టి సరుకును తీసుకెళ్లారు. ఓ సీఐ ఈ స్వామికార్యాన్ని దగ్గరుండి జరిపించారు. ఇలా ఏదో ఒక రకంగా నన్ను, నా భార్యను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. కొన్ని యూట్యూబ్ చానెల్స్లో నా భార్య గురించి దారుణమైన కామెంట్స్ పెట్టారు. ఇప్పటికే చాలామంది స్టేషన్కు తీసుకెళ్లి కొడుతున్నారు. రాజకీయ కక్ష ఉంటే నాపై తీర్చుకోండి. నా ఇంట్లో ఆడవాళ్లతో ఏం పని?’’.. .. సామాన్య ప్రజలు ఆలోచించాలి. నేను మూడుసార్లు ఎమ్మెల్యేగా చేశా. ప్రభుత్వం రూల్స్ ఏంటో నాకు తెలుసు. నేను మంత్రిగా చేసినప్పుడు.. ఇదే డీజీపీ నా శాఖలో పని చేశారు. ఆయనకు నేనేంటో తెలుసు. నా తల్లి మీద ఒట్టేసి చెబుతున్నా.. ఎలాంటి తప్పు చేయలేదు. నేను, నా భార్య ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. తప్పుడు మార్గంలో సంపాదించాలనే ఆలోచన ఏనాడూ నాకు లేదు. కేవలం నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. తప్పు చేసి ఉంటే ఈ ఐదు నెలలు ఏం చేశారు?. నా మీద అధికార పార్టీ, ఎల్లో మీడియా కక్ష కట్టాయి. వైఎస్ జగన్ కంటే నేనే వాళ్ల మొదటి టార్గెట్. అందుకే నన్ను తప్పుడు కేసులో ఇరికించాలని చూస్తున్నారు. నా వ్యక్తిత్వాన్ని హననం చేయాలనుకుంటున్నారు. త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయి. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్తే రకరకాల కుట్రలు చేశారు. పీపీలను మారుస్తూ అడ్డంకులు సృష్టించారు. జనవరి 2వ తేదీలోగా నన్ను, నా కుమారుడిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారని తెలిసింది. ఇంకోవైపు.. నా దగ్గర రూ.5 వేల కోట్లు ఉన్నాయని టీడీపీ పత్రికల్లో అసత్య ప్రచారం చేస్తున్నారు. నా దగ్గరే అంత డబ్బు ఉంటే సీజ్ చేస్కోండి. 3 శాతం లంచాలు తీసుకునేవాళ్లు కూడా నాపై ఆరోపణలు చేస్తున్నారు. మంత్రిగా ఉంటూ తన శాఖలోని ఉద్యోగుల బదిలీలకు లంచాలు తీసుకున్నవాళ్లు కూడా నాపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ నెల 30న బెయిల్ తీర్పు ఉన్నందున అన్ని విషయాల గురించి మాట్లాడలేకపోతున్నా’’ అని పేర్ని నాని అన్నారు. -
పోలీసుల నోటీసులను రద్దుచేయండి..
సాక్షి, అమరావతి :రేషన్ బియ్యం కేసులో సాక్షులుగా విచారణకు రావాలంటూ బందరు తాలుకా పోలీసులు తమకు జారీచేసిన నోటీసులను సవాలుచేస్తూ మాజీమంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని సాయి కృష్ణమూర్తి హైకోర్టును ఆశ్రయించారు. నోటీసులను రద్దుచేయాలని కోరుతూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అసలు తమను ఏ విధంగా సాక్షులుగా పరిగణిస్తున్నారో అర్థంకావడంలేదన్నారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం విచారణ జరగనుంది. మమ్మల్ని ఇరికించి అరెస్టుకు పోలీసుల యత్నం..బందరులో పేర్ని నాని భార్య జయసుధ ఓ గౌడన్ నిర్మించి దానిని పౌర సరఫరాల శాఖకు అద్దెకిచ్చారు. ఇందులో నిల్వచేసిన రేషన్ బియ్యంలో కొంత మాయమైనట్లు ఆరోపణలు రావడంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ నిమిత్తం తమ ముందు హాజరుకావాలంటూ నోటీసులివ్వడంతో వాటిపై నాని, ఆయన కుమారుడు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. బియ్యం మాయం కేసులో తమను అక్రమంగా ఇరికించి, అరెస్టుచేసేందుకు పోలీసులు యత్నిçÜ్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. బియ్యం మాయంతో తమకెలాంటి సంబంధంలేదన్నారు. గోడౌన్ను పౌర సరఫరాల శాఖకు అద్దెకిచ్చామని, అందులో ఉన్న బియ్యం మాయమైతే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలిగానీ, అద్దెకిచ్చిన యజమానిపై కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాజకీయ కారణాలతోనే పోలీసులు ఈ కేసు నమోదు చేశారన్నారు. తమ నుంచి ఎలాంటి సమాచారం కావాలో పోలీసులు నోటీసుల్లో పేర్కొనలేదన్నారు. బియ్యం మాయంపై కోటిరెడ్డి అనే అధికారి ఫిర్యాదు ఇచ్చారని, దాని ఆధారంగా నమోదుచేసిన కేసులో విచారణకు రావాలని మాత్రమే నోటీసుల్లో పేర్కొన్నారని వారు తెలిపారు. -
మాజీ మంత్రి పేర్ని నానికి పోలీసుల నోటీసులు
-
కూటమి కక్ష సాధింపు.. కేసుతో సంబంధం లేకున్నా నోటీసులు!
సాక్షి, కృష్ణా: ఏపీలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ కేసుతో సంబంధం లేకపోయినా పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. అంతేకాకుండా మధ్యాహ్నం రెండు గంటలలోపే స్టేషన్కు రావాలని హుకుం జారీ చేస్తున్నారు.మాజీ మంత్రి పేర్ని నానిపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్య కొనసాగుతోంది. కేసుతో సంబంధం లేకపోయినప్పటికీ పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం రెండు గంటలలోపే స్టేషన్కు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. స్టేషన్కు వచ్చి వాస్తవ విషయాలు చెప్పాలని.. అలాగే, అందుబాటులో ఉన్న రికార్డులు ఇవ్వాలని నోటీసులో తెలిపారు. అయితే, కేసుతో సంబంధం లేకపోయినా నోటీసులు ఇవ్వడమేంటని పలువురు వైఎస్సార్సీపీ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. -
మాజీ మంత్రి పేర్ని నానికి YSRCP నేతల పరామర్శ
-
మాజీ మంత్రి పేర్ని నాని సంచలన ఆరోపణలు
-
‘కెన్స్టార్’ షిప్పును పవన్ ఎందుకు వదిలేశారు: పేర్నినాని
సాక్షి,మచిలీపట్నం:డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ఇటీవలి కాకినాడ పోర్టు పర్యటనపై మాజీ మంత్రి,వైఎస్సార్సీపీ సీనియర్ నేత పేర్నినాని సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయమై మచిలీపట్నంలో పేర్నినాని సోమవారం(డిసెంబర్2) మీడియాతో మాట్లాడారు.స్టెల్లాషిప్ను తనిఖీ చేసిన పవన్ కల్యాణ్ కెన్స్టార్షిప్ను ఎందుకు వదిలేశారని మాజీ మంత్రి పేర్నినాని ప్రశ్నించారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి వియ్యంకుడు అందులో బియ్యం తరలిస్తున్నారని తమకు సమాచారం ఉందన్నారు. తన ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కెన్స్టార్షిప్లోకి వెళ్లేందుకు అనుమతి లేదంటున్నారని, అక్కడే ఉన్న అధికారులు కాకుండా ఇంకెవరు అనుమతి ఇవ్వాలో స్పష్టం చేయాలన్నారు. కెన్స్టార్షిప్లోకి వెళ్లకూడదని పవన్కల్యాణ్కు చంద్రబాబు చెప్పారా అని పేర్నినాని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం పోర్టు ఓనర్ అయితే అరబిందో కంపెనీ ప్రస్తావన ఎందుకు వచ్చిందో చెప్పాలన్నారు. -
గన్నవరంలో అక్రమంగా 8 మంది అరెస్ట్.. ఏపీ పోలీసులపై పేర్ని నాని ఫైర్
-
‘గుర్తుంచుకో చంద్రబాబూ.. అధికారం ఎల్లకాలం ఉండదు’
సాక్షి, కృష్ణా జిల్లా: రాష్ట్రంలో శాంతిభద్రతలను చంద్రబాబు సర్కార్ గాలికొదిలేసిందని.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకుందంటూ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తప్పుడు కేసులతో వైఎస్సార్సీపీ శ్రేణులను వేధించడానికే పోలీసులను వాడుతున్నారంటూ ధ్వజమెత్తారు.‘‘పాత కేసులను తిరగదోడి.. తప్పుడు కేసులు పెడుతున్నారు. గన్నవరంలో 8 మంది వైఎస్సార్సీపీ నేతలను అక్రమంగా కేసుల్లో ఇరికించారు. న్యాయమూర్తి 307 కేసును తొలగించారు. కానీ బెయిల్ విషయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పచ్చ చొక్కాల ఒత్తిడికి లొంగిపోయారు. కుంటిసాకులతో రెండురోజుల పాటు కాలయాపన చేసి పోలీస్ కస్టడీ కోరారు. రెండు సార్లు విచారణ అయ్యాక ఏముందని పోలీస్ కస్టడీకి కోరుతున్నారు’’ అని పేర్ని నాని ప్రశ్నించారు...అమాయకులను తెచ్చి ముద్దాయిలను చేశారు. వైఎస్సార్సీపీ జెండా, జగన్ బొమ్మ పెట్టుకుని తిరగకుండా చేయాలని చూస్తున్నారు. అడ్డగోలుగా పోలీసులను వాడుతున్నారు. పాతకేసులను తిరగదోడుతున్నందుకు డీజీపీకి మా సూటిప్రశ్న. పాతకేసులకు సంబంధించి ఎస్సై, సీఐలను సస్పెండ్ చేశారా?. తప్పుడు ఉద్యోగం చేశావని ఒక్కరిపైనైనా చర్యలు తీసుకున్నారా?. చేసేవి దొంగ పనులు కాబట్టి చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఒక్కొక్కరి పై 10, 20 కేసులు పెడుతున్నారు.తమతో పాపాలు చేయిస్తున్నారని కొందరు పోలీసు అధికారులు బాధపడుతున్నారు. ఖాకీ యూనిఫాం వేసుకుని తప్పుడు కేసులు పెట్టి పాపాలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు ఎల్లకాలం సీఎంగా ఉండడు. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ఈ రోజు పసుపు చొక్కేలేసుకుని అక్రమంగా వ్యవహరిస్తున్న అధికారులు తప్పకుండా చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని పేర్ని నాని హెచ్చరించారు. -
పేర్ని నాని నాతో ఎప్పుడూ అనే మాట...
-
దేవుడి దయతో గొప్ప విజయాన్ని చవిచూశాం: YS Jagan
-
సంపద సృష్టిచడం అంటే బొచ్చ పట్టుకొని అడుక్కోవడమా..? బాబుపై పేర్నినాని ఫైర్
-
జగన్ ని పతనం చేయాలనే కుట్రలో భాగంగా..
-
జగన్ ఉన్నప్పుడు అదానీ పెట్టుబడులు పెడితే మీకు చేదు
-
ధర్మం చంద్రబాబు పాదం మీదే నడుస్తుందా..?
-
మార్గదర్శి పాపాల గురించి మీ పేపర్లో ఒక్కరోజైనా రాశారా ..?
-
చంద్రబాబుకు ఆ ఒప్పందాలను రద్దు చేసే దమ్ముందా?: పేర్ని నాని
సాక్షి, గుంటూరు: వైఎస్ జగన్ను పతనం చేయాలనే కుట్రలో భాగంగానే చీకట్లో కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు చేతులు కలిపారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వైఎస్ జగన్పై 15 ఏళ్లుగా ఎల్లో మీడియా విషం చిమ్మనిరోజు లేదన్నారు. జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఎన్ని కుట్రలు చేస్తున్నా వాటిని జగన్ పటాపంచలు చేస్తున్నారని పేర్ని నాని అన్నారు.‘‘రెండు పేపర్లు, పది టీవీ ఛానళ్లతో నిత్యం వైఎస్ జగన్పై విషం చిమ్ముతూనే ఉన్నారు. గతంలో కూడా ఇలాగే అమెరికాలో కేసులు అంటూ విషం చిమ్మారు. అయినా సరే జనం జగన్ను సీఎం చేశారు. ఇప్పుడు మళ్లీ విషం చిమ్మటం మొదలయింది. జగన్కు రూ.1750 కోట్ల లంచాలు అంటూ ఈనాడు రాసింది. సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటే అవినీతా?. పైగా ఇంటర్నేషనల్గా జగన్ పేరు అంటూ టీడీపీ ప్రచారం చేస్తోంది. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ జైలుకు వెళ్లినప్పుడే చంద్రబాబు పేరు అంతర్జాతీయంగా మార్మోగింది. మార్గదర్శి పాపాలను ఈనాడులో ఏనాడైనా రాశారా?’’ అంటూ పేర్ని నాని నిలదీశారు.‘‘అదానీ చంద్రబాబును కలిస్తే ఆహాఓహో అంటూ ఈనాడు రాసింది. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయంటూ పేజీల నిండా రాసింది. అదే అదానీ జగన్ను కలిస్తే పోర్టులు, మైనింగ్ అంతా అదానీకే దోచిపెడుతున్నారంటూ తప్పుడు వార్తలు రాసింది. ఇలా రాస్తే జనం నవ్వుతారని కూడా లేకుండా నిస్సిగ్గుగా వార్తలు రాసింది. కేంద్ర రంగ సంస్థ సెకీతో ఏపీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది. రూ.2.49లకే 25 సంవత్సరాలపాటు విద్యుత్ ఇచ్చేందుకు సెకీ అంగీకరించింది. ఇందులో తప్పేముంది?’’ అని పేర్ని నాని చెప్పారు.‘‘రూ.4.50ల చొప్పున చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే తప్పు కాదా?. అదే రూ.2.49లకే జగన్ కొనుగోలు చేస్తే అవినీతా?. అడ్డగోలు ఒప్పందాలతో చంద్రబాబు జనం మీద భారం వేస్తే అది ఈనాడుకు కనపడదా?. రామోజీరావు సంతాప సభ కోసం ప్రజల సొమ్ము రూ.25 కోట్లు ఖర్చు చేశారు. అందుకని చంద్రబాబు రుణం తీర్చుకోవటానికి ఈనాడు పచ్చి అబద్దాలను అచ్చోసింది. చంద్రబాబు దిగేనాటికి కరెంటు కంపెనీలకు రూ.22 వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయి. జగన్ ప్రభుత్వం కుదుర్చుకున్నది కేంద్ర రంగ సంస్థ కంపెనీ సెకీతోనే.. అదానీతో ఎలాంటి ఒప్పందాలూ కుదుర్చుకోలేదు’’ పేర్ని నాని స్పష్టం చేశారు.‘‘కేంద్ర ప్రభుత్వం ఎవరి దగ్గర కొనుగోలు చేస్తుందో మాకు అనవసరం. జగన్ కంటే సంవత్సరంన్నర ముందు అదే సెకీతో చంద్రబాబు రకరకాల అధిక ధరలతో కొనుగోలు చేశారు. మిగతా రాష్ట్రాల్లో అంతకంటే తక్కువ ధరకు కొనుగోలు జరిగితే చంద్రబాబు ఎందుకు అధిక ధరకు కొనుగోలు చేశారు?. జగన్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు తప్పు అయితే దాన్ని రద్దు చేయాలి. గతంలో జగన్ పై పెట్టిన కేసుల్లో నిజం లేదని సుప్రీంకోర్టు తేల్చేసింది. సంతకాలు పెట్టిన అధికారుల తప్పు లేదని తేల్చింది. అలాంటప్పుడు ఇక జగన్ పేరు ఎందుకు ప్రస్తావన ఉంటుంది?’’ అని పేర్ని నాని ప్రశ్నించారు.ఇదీ చదవండి: సెకీతోనే ఒప్పందం.. ప్రభుత్వానికి అదానీతో ఏం సంబంధం? -
Perni Nani: పుష్ప ఈ మధ్యన ఇంటర్నేషనల్... చంద్రబాబు ఎప్పుడో ఇంటర్నేషనల్
-
పవన్ కళ్యాణ్, చంద్రబాబు పై పేర్ని నాని ఫైర్
-
టపాసుల గొడవ... చిన్నారిపై మర్డర్ కేసు
-
ఫేక్ పోస్టులు పెట్టే సంస్కృతి టీడీపీదే: పేర్నినాని
సాక్షి,కృష్ణాజిల్లా:ఫేక్పోస్టులు పెట్టే సంస్కృతి టీడీపీదేనని మాజీ మంత్రి,వైఎస్సార్సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షులు పేర్నినాని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యుల ఫోటోలతో పెట్టిన పోస్టులు డీజీపీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ మేరకు పేర్నినాని సోమవారం(నవంబర్ 11) మీడియాతో మాట్లాడారు.‘డబ్బులిచ్చి పోస్టులు పెట్టే సంస్కృతికి తెరలేపింది టీడీపీ కాదా. వైఎస్ జగన్ కుటుంబ సభ్యుల ఫోటోలతో పోస్టులు పెట్టిన వారిని చంద్రబాబు,పవన్కు దమ్ముంటే అరెస్ట్ చేయండి. మీ ఇంట్లో ఆడవాళ్లే ఆడవాళ్లా. ఇలాంటి పోస్టులు ఎవరు పెట్టినా తప్పే. వాళ్లు చేసిన తప్పే మనం చేయొద్దు. టీడీపీ,జనసేన,బీజేపీకి చెందిన వాళ్లు తప్పుడు పోస్టులు పెడితే కేసులు పెట్టండి.వాళ్లు బూతులతో ఫోటోలు పెట్టారని మనం పోస్టులు పెట్టొద్దు. మనం సంస్కారవంతంగా వ్యవహరిద్దాం. పెద్దపెద్ద మాటలు చెప్పే చంద్రబాబు,పవన్ను సూటిగా ప్రశ్నిస్తున్నా. నాభార్య గురించి ఎన్నో సార్లు యూట్యూబ్ లో తప్పుడు పోస్టులు పెట్టించారు.మాకు మీలాగా దొంగ ఏడుపులు ఏడవడం రాదు.భయపెట్టాలనే వందల మందిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇక్కడితో అయిపోతుందని అనుకోవద్దు. నక్కిన శ్యామ్ అనే యువకుడిని చిత్రహింసలకు గురిచేశారు. తప్పుడు కేసులు పెట్టే పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది. మీరు రిటైర్ అయ్యేవరకు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉంటాడనుకుంటున్నారా..? సోషల్ మీడియా పేరుతో పెడుతున్న తప్పుడు కేసులపై పోరాడతాం. రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం’అని పేర్నినాని పేర్కొన్నారు.ఇదీ చదవండి: బాబుపై సుమోటో కేసులేవీ పవన్: అంబటి -
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు బహిష్కరిస్తున్నాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక పాలన కారణంగా ఎన్నికలు ధర్మబద్ధంగా నిర్వహించే పరిస్థితి లేనందున గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. గుంటూరు, కృష్ణా, ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనబోవటం లేదని వైఎస్సార్సీపీ నాయకులు వెల్లడించారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తదితరులు ఈ వివరాలు వెల్లడించారు.రాష్ట్రంలో రోజురోజుకీ శాంతి భద్రతలు దిగజారిపోయాయని పేర్ని నాని దుయ్యబట్టారు. 5 నెలల్లో 100 మందికి పైగా బాలికలు, మహిళలపై అత్యాచారాలు జరిగినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల మంచి, చెడు పట్టించుకోవడంలేదని, ఎన్నికల హామీలు కూడా అమలు చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేలా డైవర్షన్ పాలిటిక్స్ అనుసరిస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన తమ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి అర్థరాత్రి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారని ఆరోపించారు.ఎక్కడికి తీసుకెళ్తున్నారో కుటుంబ సభ్యులకు కూడా చెప్పడంలేదని, రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలిందని దుయ్యబట్టారు. 41 – ఎ నోటీసులు అందుకున్న కేసులను కూడా 307 సెక్షన్కు మార్చి, అక్రమంగా జైళ్లకు పంపి దారుణంగా వేధిస్తున్నారని తెలిపారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థ కూటమి ప్రభుత్వానికి, టీడీపీకి ప్రైవేట్ సైన్యంలా మారిందన్నారు. కిరాతకాలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న కూటమి నాయకుల వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా పోలీసులకు లేకుండా పోయిందని చెప్పారు. పోస్టింగ్ల కోసం చట్టాలను అతిక్రమించి, వైఎస్సార్సీపీ జెండా పట్టినా, ప్రభుత్వ చేతకానితనాన్ని ప్రశ్నించినా అడ్డగోలుగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆక్షేపించారు.ఈ పరిస్థితులన్నీ చూశాక కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయన్న నమ్మకం తమకు లేదన్నారు. పోటీ చేసే అభ్యర్థులకు ఓట్లడిగే స్వేచ్ఛను కాలరాసేలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, చివరకు గెలుపును కూడా ఓటమిగా మార్చే దౌర్జన్య విధానాలు అవలంబిస్తున్నారని, అందువల్లే కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు బహిష్కరించాలని వైఎస్సార్సీపీ నిర్ణయించిందని పేర్ని నాని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు వెలంపల్లి శ్రీనివాసరావు, పార్టీ ఎనీ్టఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్ బాబు, కోన రఘుపతి తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ YSRCP గెలవడం ఖాయం
-
‘పవన్ మా సంగతి తర్వాత.. ముందు నిన్ను నమ్మినోళ్ళ సంగతి చూస్కో’ : పేర్ని నాని
సాక్షి,విజయవాడ: ‘అధికారం లేకపోయినా వైఎస్సార్సీపీ జెండా మోసిన కార్యకర్తలు దర్జాగా బతుకుతుంటే.. జనసేన జెండా మోసిన కార్యకర్తలు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. కొడుతున్నారు. కాళ్లు పట్టిస్తున్నారు. నువ్వేం చేస్తున్నావ్ పవన్’ అంటూ మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నలు సంధించారు. ఇవాళ (ఆదివారం) వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా దేవినేని అవినాష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పేర్ని నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ..చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రజలకు అబద్దాలు చెప్పి అధికారం లోకి వచ్చారు.కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైఎస్సార్సీపీ నేతలను, కార్యకర్తలను వేధిస్తున్నారుఈరోజు వేధించే వాళ్ళకి 10 రేట్లు మేము తిరిగి ఇస్తాంనాలుగేళ్లకంటే ముందే...వాళ్ళకి చూపిస్తాంఅధికార మదంతో కూటమి నాయకులు రెచ్చిపోతున్నారువైఎస్సార్సీపీకి కార్యకర్తలే బలంఎంత కొట్టినా, తిట్టినా వైఎస్సార్సీపీ జెండా మోయకుండా ఎవ్వరు ఆపలేరుఅది మా పార్టీ కార్యకర్తల చిత్తశుద్ధిసోషల్ మీడియాలో పోస్టులు పెడితే..అరెస్టులు చేస్తున్నారువైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు భయపడదిలేదుటీడీపీ సోషల్ మీడియాలా డబ్బులకు పని చేసేవాళ్ళు కాదువైఎస్ జగన్ తల్లి, చెల్లెలి గురించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారుచంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీరు తల్లికి, చెల్లికి ఆస్తులు రాసిచ్చారాచంద్రబాబుకి ఎంత మంది చెల్లెలు ఉన్నారో ఎవరికైనా తెలుసాతన చెల్లెళ్లకు చంద్రబాబు ఎంత ఆస్తి రాసిచ్చారువైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చూసి ఎవరు ప్రేమించరువైఎస్ జగన్ని ఓ హీరోగా, ఆదర్శ రాజకీయ నాయకుడిగా ప్రేమిస్తారుసీట్లు చూసుకుని నోరు లేచేది పవన్ కళ్యాణ్ బ్యాచ్మాకు ఎన్ని సీట్లు, ఉన్నా లేకపోయినా మేం పోరాడుతాంమాకు అధికారం ఉన్నా, లేకపోయినా నోరు లేస్తుందివైఎస్సార్సీపీ కార్యకర్తలు నోరు లేపితే తాట తీస్తాడంటనిన్ను నమ్ముకుని నీ జెండాలు మోసిన జనసేన కార్యకర్తల్ని కొడుతుంటే నువ్వేం చేశావ్ పవన్జనసేన కార్యకర్తల్ని టీడీపీ వాళ్ళు కొడుతుంటే..ఏం చేశావ్?అధికారం లేకపోయినా వైఎస్సార్సీపీ జెండా మోసిన కార్యకర్తలు దమ్ముగా బతుకుతున్నారుపవన్ జెండా మోసిన..వాళ్ళు మాత్రం మానసికంగా క్షోభ అనుభవిస్తున్నారుకొడుతున్నారు..కాళ్ళు పట్టిస్తున్నారు..ఎం చేస్తున్నావ్పవన్ కళ్యాణ్ మా సంగతి తర్వాత. నిన్ను నమ్మినోళ్ళ సంగతి ముందు చూస్కోమమ్మల్ని ఎంత వేధించినా ..మేము తగ్గేదే లేదు..నీకు చేతనైంది చేస్కోలోకేష్కి అమెరికా వెళ్లినా వైఎస్సార్సీపీనే గుర్తొస్తుందిఎన్ని కేసులు పెట్టినా.. వైఎస్సార్సీపీ జెండాని వదిలి పెట్టరు ప్రతి కార్యకర్తకు అండగా వైఎస్ జగన్ : దేవినేని అవినాష్కుటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎవరూ భయపడొద్దు.. ప్రతి కార్యకర్తకి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా ఉంటారని దేవినేని అవినాష్ అన్నారు. ఆయన ఇవాళ (ఆదివారం) పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో టీడీపీ, ఎల్లో మీడియా దుష్ప్రచారం వలన ఒడిపోయాం. నాలుగు నెలలకే ప్రజలు ఎందుకు కూటమిని గెలిపించామా అని బాధ పడుతున్నారు. చంద్రబాబు ప్రజలకు అబద్దాలు చెప్పి గెలిచారు. వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రజలకోసం పోరాడుదాం. ఎన్ని కేసులు పెట్టిన ఎవ్వరు భయపడొద్దు. ప్రతి కార్యకర్తకరు వైఎస్ అండగా ఉంటారని హామీ ఇచ్చారు.వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిని చేద్దాం : ఆళ్ల అయోధ్య రామిరెడ్డిఅధికారం లేకపోయినా వైఎస్ జగన్ ఆదర్శంగా పార్టీని నడుపుతున్నారు పార్టీని మరింత బలోపేతం చేసేలా జగన్ పనిచేస్తున్నారుప్రజల్లో నిరంతరం ఉండేలా పార్టీ ఇకమీదట కూడా పనిచేస్తుందిపార్టీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేస్తాంరాష్ట్రంలో జమిలి ఎన్నికలు రాబోతున్నాయిరెండేళ్లకే ఎన్నికల వాతావరణం వస్తుందికచ్చితంగా అధికారంలోకి వచ్చేలా అందరం కలిసి పనిచేస్తాంవచ్చే ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిని చేద్దాం -
చంద్రబాబు వ్యాఖ్యలు.. పేర్నినాని కౌంటర్
-
బాబూ.. ఆస్తులు అమ్మడం సంపద సృష్టా?: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: ప్రజల ఆస్తులను అమ్మడంలో చంద్రబాబు దిట్ట మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. సంపద సృష్టించడం దేవుడెరుగు. సృష్టించిన సంపదను కూడా తెగనమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులను దొడ్డిదారిన చంద్రబాబు తన వారికి కట్టబెడుతున్నారని ఆరోపించారు.మాజీ మంత్రి పేర్ని నాని సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు. సంపద సృష్టిస్తామంటూ మోసపూరిత మాటలు చెప్పారు. సంపద సృష్టించడం దేవుడెరుగు. ఈ ఆర్థిక సంవత్సరంలో 45వేల కోట్లు అప్పులు తెచ్చారు. సృష్టించిన సంపదను కూడా తెగనమ్ముతున్నారు. తమ వారికి సంపదనంతా దోచిపేట్టే కార్యక్రమం చేస్తున్నారు. రాష్ట్రంలో మూడు పోర్టుల నిర్మాణానికి వైఎస్సార్సీపీ హయాంలో వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. నిర్మాణాలు పూర్తి అయినప్పటికీ ఈరోజుకు కూడా పోర్టులో కార్యకలాపాలు ప్రారంభించలేదు.మచిలీపట్నం పోర్టు కృష్ణా జిల్లా ప్రజల ఆకాంక్ష. బందరు పోర్టు కోసం నాడు వైఎస్సార్ అన్ని రకాల అనుమతులు తీసుకువచ్చి పనులు ప్రారంభించారు. చంద్రబాబు హయాంలో పోర్టు పనులు ఆగిపోయాయి. వైఎస్ జగన్ హయంలో బందరు పోర్టు 50 శాతం పూర్తి అయ్యింది. చంద్రబాబు ఆరు నెలల్లోనే బందరు పోర్టు కడతామన్నారు.. ఏమైంది?. బందరు పోర్టు కట్టకపోగా 22 గ్రామాలను ఖాళీ చేయించారు. మూలపేట పోర్టు పనులను కూడా ఈ ప్రభుత్వం నిలిపివేసింది. వైఎస్ జగన్ సృష్టించిన సంపదను కూటమి నేతలు దోచుకుంటున్నారు. ఈ మూడు పోర్టుల పనులను నిలిపేసి అమ్మకానికి పెట్టారు.కరెంట్ ఛార్జీల మోత..2014-19 మధ్య కాలంలో ఇదే కూటమి ప్రభుత్వం ఉంది. ఆ ఐదేళ్లలో రామాయపట్నం పోర్టు ఊసు కూడా ఎత్తలేదు. వాళ్ల సంపద పెంచుకోవడానికి దుర్మార్గపు పనులు చేస్తున్నారు. తెగనమ్ముకోవడాన్ని సంపద సృష్టించడం అంటారా?. 14 మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెట్టారు. ప్రజల ఆస్తులను అమ్మడంలో చంద్రబాబు దిట్ట. ప్రభుత్వ ఆస్తులను దొడ్డిదారిన చంద్రబాబు తన వారికి కట్టబెడుతున్నాడు. చంద్రబాబు పాపపు పనులను ప్రజల్లో ఎండగడతాం. ఎన్నికల సమయంలో బాబు ఒక్క పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పారు. కానీ, ఇప్పుడు రూ.6072 కోట్లు ప్రజలపై భారం మోపుతున్నారు. సుప్రీంకోర్టు చెప్పిందని బాబు అబద్ధాలు చెబుతున్నారు. ఛార్జీలు పెంపు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. ఉచిత ఇసుక పెద్ద మోసం..ఇసుక గురించి నాడు ఇష్టానుసారం మాట్లాడారు. ఇప్పుడు భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి దారుణంగా ఉంది. ఉచిత ఇసుక అంటూ అబద్ధాలు మాట్లాడుతున్నారు. బంగారం ఇచ్చినా ఇసుక దొరకని పరిస్థితికి తీసుకొచ్చారు. టెండర్లను మంత్రులు, ఎమ్మెల్యేలే వేసుకోవాలట. పేరుకు మాత్రం ఉచితం.. అంతా దోపిడీనే. కూటమి సర్కార్ పాలనలో నిత్యవసరాల ధరలు మండిపోతున్నాయి. చంద్రబాబు, లోకేష్, పవన్, పురంధేశ్వరి.. నలుగురు కలిసి జనాన్ని బాదేస్తున్నారు. ధరల నియంత్రణకు బాబు ఏం చర్యలు తీసుకున్నారు. ఇది ఎంత మోసపూరిత ప్రభుత్వమో అర్థం అవుతోంది. ఇంతకంటే దగుల్బాజీ ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా? అని కామెంట్స్ చేశారు. బాలినేనికి కౌంటర్..ఇదే సమయంలో ఆస్తుల విషయంలో విజయమ్మ జడ్జీగా ఉండాలంటూ బాలినేని వ్యాఖ్యలపై పేర్ని నాని స్పందించారు. జడ్జిగా ఉండేవారు మధ్యస్థంగా ఉండాలి కదా?.ఒకరివైపు ఉండేవాళ్లు జడ్జి ఎలా అవుతారు?. ఈ పార్టీ వద్దు అని వెళ్లిపోయిన బాలినేని ఇప్పుడు పెద్ద మనిషి అవతారం ఎందుకు ఎత్తారు?. అవసరాల కోసం చేసే రాజకీయాలే ఇప్పుడు కనిపిస్తున్నాయి. బాలినేని రాజకీయాల కోసం ఏదైనా మాట్లాడతారు. ఇప్పుడు జనసేనలో ఉన్నందున ఆ పార్టీలైన్ మాట్లాడుతున్నారు అంటూ కౌంటరిచ్చారు. -
వైఎస్ఆర్ శత్రువులతో షర్మిల చేతులు కలిపారు: పేర్నినాని
-
అవి జగన్ సొంత సంస్థలు
సాక్షి, అమరావతి: భారతి సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్ సంస్థలు వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత సంస్థలని.. వాటిల్లో షర్మిల వాటాదారు కాదని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తేల్చిచెప్పారు. సోదరి షర్మిలపై ప్రేమ, ఆప్యాయతతో తన స్వార్జితమైన నాలుగు సంస్థల్లో 40 శాతం వాటాను ఇస్తూ జగన్ ఒప్పందం రాసిచ్చారని.. ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్), కోర్టు అనుమతి ఇచ్చాక వాటిని పూర్తి స్థాయిలో బదలాయిస్తానని స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. అయితే ఈడీ జప్తు చేసిన సరస్వతీ పవర్ షేర్లను బదిలీ చేయించి జగన్ బెయిల్ను రద్దు చేయించాలన్న కుట్రలో షర్మిల పావుగా మారారని.. ఆ కుట్రను చిత్తు చేయడానికే ఎన్సీఎల్టీలో జగన్ పిటిషన్ వేశారేగానీ ఆస్తులు వెనక్కి తీసుకోవాలని కాదని స్పష్టం చేశారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. అవన్నీ జగన్ స్వార్జితం: వైవీ సుబ్బారెడ్డి షర్మిల బహిరంగ లేఖ చూశాక కుటుంబపరమైన కొన్ని విషయాలను ప్రజలకు తెలియజేస్తున్నా. సరస్వతీ పవర్ షేర్ల అంశం హైకోర్టులో ఉంది. ఈడీ జప్తు చేసిన ఆ సంస్థ ఆస్తులపై హైకోర్టు స్టేటస్ కో విధించింది. జగన్పై కాంగ్రెస్ పార్టీ అక్రమంగా కేసులు బనాయించి జైలుకు పంపించడంతో ఆయన సంస్థల ఆస్తుల అటాచ్మెంట్ జరిగింది. ఈడీ అటాచ్మెంట్లో ఉన్న షేర్లను బదిలీ చేయించుకున్నారు కాబట్టే దాన్ని ఆపాలని జగన్ ఎన్సీఎల్టీలో పిటిషన్ ఇచ్చారు. అంతేగానీ ఆస్తులు వెనక్కు తీసుకోవాలని కాదు. » జగన్ తన స్వార్జిత ఆస్తిలో షర్మిలకు వాటా ఇస్తూ 2019 ఆగస్టులో ఒప్పందం రాసిచ్చారు. ఆ ఒప్పందంలో జగన్ స్వార్జిత ఆస్తులు అని చాలా స్పష్టంగా ఉంది. అది చూశాకే షర్మిలమ్మ, విజయమ్మ ఇద్దరూ సంతకం పెట్టారు. తన చెల్లిపై ప్రేమ, అభిమానంతో ఆస్తులు ఇస్తున్నట్లు జగన్ ఆ ఒప్పందంలో రాశారు. ఇవన్నీ వాస్తవాలు. వాటిని కప్పి పుచ్చి దుష్ప్రచారం చేస్తున్నారు. » దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నప్పుడే ఆయన ఆస్తులను పంచారు. షర్మిల ఈ ఆస్తులు కావాలని అని నిజంగా అనుకుంటే.. అవి ఇస్తానని జగన్ చెప్పినా.. ఆమె ఇప్పుడేం మాట్లాడుతున్నారో చూస్తుంటే.. ఆమె ఆస్తుల కోసం పోరాడుతున్నారా? లేక జగన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారా? అని అనిపిస్తోంది. » నాకు తెలిసినంతవరకు జగన్ స్వార్జిత ఆస్తిలో ఎక్కడా షర్మిలమ్మ ప్రమేయం లేదు. నిజంగా ఆ ఆస్తుల్లో షర్మిలమ్మకు వాటా ఉండి ఉంటే.. ఆమెపై ఆనాడు కేసులు ఎందుకు నమోదు కాలేదు? కేవలం జగన్ మాత్రమే ఎందుకు జైలుకు వెళ్లారు? జగన్ కంపెనీలో షేర్ హోల్డర్ కాబట్టే ఆయనకు డివిడెండ్ వచ్చింది. దాన్నుంచే ఆయన తన చెల్లికి ఈ పదేళ్లలో రూ.200 కోట్లు ఇచ్చారు. షర్మిల అందులో షేర్ హోల్డర్ కాదు. అవి జగన్ సొంత కంపెనీలు. అందుకే వాటికి భారతి సిమెంట్స్.. తన పేరు, భార్య పేరు కలిసొచ్చేలా జగతి పబ్లికేషన్స్ (సాక్షి గ్రూప్) అని పేరు పెట్టారు. » నలుగురు పిల్లలూ తనకు సమానం అని వైఎస్సార్ అన్నారని షర్మిల లేఖలో రాశారు. అది నిజమే. ప్రేమను పంచడంలో వైఎస్సార్ నలుగురు పిల్లలనూ సమానంగా చూశారు. అయితే వైఎస్సార్ బతికున్నప్పుడే జగన్ స్థాపించిన కంపెనీల్లో ఎక్కడా షర్మిల గానీ, అనిల్ గానీ షేర్హోల్డర్గా లేరు. అది వైఎస్సార్ కోరుకోలేదు. ఒకవేళ ఆయన కోరుకుంటే వారిని ఆ కంపెనీల్లో షేర్ హోల్డర్లుగా పెట్టి ఉండేవారు కదా? తండ్రి మరణం తర్వాత, ప్రజలకు ఇచ్చిన మాట కోసం జగన్ కాంగ్రెస్ పార్టీని వీడి ఓదార్పు యాత్ర చేశారు. ఎన్నో పోరాటాలు చేశారు. 2014లోగానీ మొన్న 2024లోగానీ అబద్ధాలు చెప్పి ఉంటే అధికారంలోకి వచ్చేవారు. అలాంటి మనిషే అయితే చెల్లి విషయంలో మాట తప్పరు కదా? బాబుతో కలసి రాజకీయం చేయడం వైఎస్ అభిమతమా?: పేర్ని నాని » గత మూడు నాలుగు రోజుల నుంచి టీడీపీ నానా హంగామా చేసి చెప్పిన బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే.. షర్మిలమ్మ తన ఆస్తుల పంపకం గురించి అన్నకు రాసిన ఉత్తరం. అది రాష్ట్రానికి, ప్రజలకు అంత ముఖ్యమా? షర్మిలమ్మ పీసీసీ అధ్యక్షురాలు. ఆమె అన్నకు రాసిన ఉత్తరం ఎన్డీఏ అఫీషియల్ వెబ్సైట్లో రావడం అంటే చంద్రబాబు ఎంత అనైతికంగా వ్యవహరిస్తున్నారు? ఎక్కడికక్కడ ఎవరెవరితో కలిసి పని చేస్తున్నారు? అనేది ఆలోచించండి. ఢిల్లీలో కాంగ్రెస్తో కుస్తీ.. ఇక్కడ మాత్రం దోస్తీ! ఏ స్థాయిలో దిగజారి రాజకీయాలు చేస్తున్నాడో చూడండి. లేఖ రాసింది రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలైతే టీడీపీ వెబ్సైట్లో ప్రచారం చేయడం ఏమిటి? » వైఎస్సార్ జీవించి ఉన్నప్పుడు మొదలుపెట్టిన కంపెనీల్లో కుటుంబ సభ్యులంతా వాటాదారులైతే.. భారతి సిమెంట్స్లో షర్మిల పేరు ఎందుకు పెట్టలేదు? షేర్ హోల్డర్లుగా ఎందుకు ప్రకటించలేదు? జగన్ ఆ కంపెనీలకు కేవలం కాపలాదారే అయితే వైఎస్సార్ మిమ్మల్ని కంపెనీల్లో డైరెక్టర్లుగా పెట్టేవారు కదా? అప్పట్లో మీరు విదేశాల్లో కూడా లేరు కదా? » వైఎస్సార్ అభిమతం, ఆశయాలను కొనసాగించాలన్న అంకితభావం ఉంటే.. చంద్రబాబుతో కలిసి ప్రయాణించడం, రాజకీయం చేయడాన్ని ఎవరైనా ఊహిస్తారా? వైఎస్సార్ అదే ఆశించారా? ఆయన్ను అణగదొక్కడానికి చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేశారో తెలుసు కదా? రాజకీయాల్లో ఇద్దరూ బద్ధ శతృవులు. అలాంటి చంద్రబాబుతో కలిసి పని చేస్తారా? ఏబీఎన్ రాధాకృష్ణతో కూడా కలసి పోతారా? వైఎస్సార్ అభిమానుల్లో ఎవరైనా చంద్రబాబుతో కలిసి పని చేస్తున్నారా? కానీ ఆ పని మీరు ఎందుకు చేస్తున్నారు? మీరు కాంగ్రెస్లో ఉంటూ ఎన్డీఏ కూటమితో కలసి ఎలా పని చేస్తున్నారు? అదేనా వైఎస్సార్ అభిమతం? ఆశయం? » వైఎస్సార్ మరణించాక.. జగన్ 10 ఏళ్లు కష్టాలు పడితే.. తాను పార్టీ కోసం పాటుపడ్డాడని, కష్టపడి పని చేశానని షర్మిలమ్మ అంటున్నారు. జగన్ ఎప్పుడు సమస్యలు ఎదుర్కొన్నారో తెలియదా? ఆయన సోనియాను ఎదిరించి బయటకు వచ్చిన తర్వాత అక్రమ కేసులు పెట్టారు. జైల్లో పెట్టారు. అప్పుడు 230 రోజులు షర్మిలమ్మ పాదయాత్ర చేశారు. అది కూడా 2014 ఎన్నికల ముందు మాత్రమే. 2014 తర్వాత ఆమె ఏనాడూ రాలేదు. పార్టీ జెండా మోయలేదు. » వైఎస్సార్సీపీకి 2012 నుంచి ఈరోజు వరకు కర్త, కర్మ, క్రియ, కష్టం నష్టం.. గెలుపు.. అన్నింటిలో పూర్తి భాగస్వామ్య హక్కు జగన్ది మాత్రమే. కేవలం ఆయన వల్లనే పార్టీ ఎదిగింది... నిల్చింది... గెల్చింది. ఆ ఘనత పార్టీది, కార్యకర్తలది. అంటే జగన్, పార్టీ కార్యకర్తలకే ఆ ఘనత దక్కుతుంది. ఇంకా చెప్పాలంటే మాలాంటి వారు చాలా మంది పని చేశారు. పదవులు వదులుకుని వచ్చాం. టీడీపీ నుంచి కూడా పదవులు వీడి వచ్చిన వారు ఉన్నారు. అధికారాన్ని వదులుకుని ప్రతిపక్షంలో ఉన్న పార్టీలోకి వచ్చారు. కానీ ప్రధానంగా పని చేసింది లక్షలాది మంది కార్యకర్తలు, జగన్ మాత్రమే. వారి వల్లనే పార్టీ ఎదిగింది. నిలబడింది. ఇది వాస్తవం. దీన్ని షర్మిలమ్మ గుర్తించాలి. » ఇది చెప్పాలో వద్దో తెలియదు. షర్మిలమ్మ పాదయాత్ర సమయంలో జగన్ జైల్లో ఉంటే నేను స్వయంగా కలిశా. చెల్లితో పాదయాత్ర చేయించడం ఎంత వరకు కరెక్ట్? భవిష్యత్తులో సమస్యలు వస్తాయని చెబితే అలాంటి అవకాశం అసలు ఉండదని నాడు జగన్ అన్నారు. చెల్లిపై ఆయనకు అంత నమ్మకం. కానీ ఈ రోజు నేను అన్నదే జరుగుతోంది. » షర్మిలను పార్టీ కోసం వాడుకుని వదిలేశారని చంద్రబాబు అంటున్నారు. మరి నువ్వు జూనియర్ ఎన్టీఆర్ను పార్టీ కోసం ఎంతగా వాడుకున్నావ్ చంద్రబాబూ..? మీరు కనీసం సభ్యత్వం కూడా ఇవ్వలేదు. అందుకే ఆయన పార్టీని వీడారు కదా? మీరు మీ లాభం కోసం మనుషులను ఎలా వాడుకుంటారో.. స్వయంగా మీ తోడల్లుడు ఏకంగా పుస్తకమే రాశారు కదా! వాడుకోవడం, వదిలేయడం.. అదీ మీ నైజం! అలాంటి మీరు నీతులు చెబుతున్నారు. ఆస్తులు ఇవ్వడం లేదని విమర్శిస్తున్నారు. మరి మీ హెరిటేజ్లో మీ తోబుట్టువులకు ఎంత వాటా ఇచ్చారు? ఏమైనా రాసిచ్చారా? మీకు నిజాయితీ ఉంటే వెంటనే ఆ పని చేసి చూపండి. ఈ వయసులో ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి చంద్రబాబూ!! 40% వాటా కోసం మాట తప్పుతారా? » అన్ని కుటుంబ వ్యాపారాలకు జగన్ కేవలం గార్డియన్ మాత్రమేనని, ఆస్తులను నలుగురికి (మనవళ్లు, మనవరాళ్లు) సమానంగా పంచడం, అది జగన్ బాధ్యత అని.. అది వైఎస్సార్ ఉద్దేశమని.. అది ఆయన సన్నిహితులైన కేవీపీ, సాయిరెడ్డి, సుబ్బారెడ్డికి కూడా తెలుసని షర్మిలమ్మ ఆ లేఖలో రాశారు. ఒకవేళ నిజంగా వైఎస్సార్ ఉద్దేశం అదే అయితే.. ఇంత మందికి ఆయన చెప్పి ఉంటే, జగన్కు కూడా చెప్పి ఉండాలి కదా? ఇద్దరు తల్లిదండ్రులను కూడా కంపెనీ డైరెక్టర్లుగా పెట్టి ఉండాలి కదా? ఇలాంటి మనస్తత్వమా షర్మిలది? »తండ్రి మరణం తర్వాత జగన్ ఓదార్పుయాత్ర చేస్తానంటే.. కాంగ్రెస్ వద్దనడంతో పార్టీని వీడారు. పదవులు ఇస్తామన్నా ఆశ పడలేదు. కేవలం మాట కోసం బయటకు వచ్చారు. రాజీ పడకుండా పోరాడారు. తండ్రి ఆశయం, జనం కోసం, నమ్మిన సిద్దాంతం కోసం ఎంతో పోరాడారు. 16 నెలలు అన్యాయంగా జైలు శిక్ష అనుభవించారు. ఎంతో జీవితాన్ని పోగొట్టుకున్నారు. కానీ ఆశయాన్ని మాత్రం వీడలేదు. జగన్పై ఎన్ని కేసులు పెట్టారు? ఇప్పటికీ వాటిని మోస్తూనే ఉన్నారు. పదవులు ఇస్తామన్నా కేవలం ఇచ్చిన మాట కోసం వదులుకున్నారు. » అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి ఏదో నాలుగు ఆస్తుల్లో 40 పైసల వాటా కోసం మాట తప్పుతారా? ఇచ్చిన మాట నిలబెట్టుకోరా? తనే స్వయంగా రాశారని మీరే చెబుతున్నారు కదా! నమ్మిన సిద్ధాంతం, ఆశయాల కోసం రాజీ పడకుండా అన్ని కష్టాలు అనుభవించిన వ్యక్తి 40 పైసల వాటా కోసం మాట తప్పుతారా? మరి ప్రజలు దీన్ని నమ్ముతారా? »గత పదేళ్లలో మీకు రూ.200 కోట్లు నగదు బదిలీ చేస్తే అది కంపెనీ డివిడెండ్ అని అంటారా? మీరు కంపెనీలో షేర్హోల్డర్ కానప్పుడు మీకు లాభం ఎలా పంచుతారు? అది వచ్చింది మీ అన్న, వదిన నుంచి కాదా? ఇంత దారుణంగా మాట్లాడడం, వ్యవహరించడం ఎంత వరకు సబబు? తండ్రి, అన్న శతృవుతో కలిసి పని చేయడం, ఆస్తుల కోసం జగన్ కోర్టుకు ఎక్కాడని టీడీపీ మీడియాతో కలసి దు్రష్పచారం చేయడాన్ని మీ విజ్ఞత, విచక్షణకే వదిలేస్తున్నాం.రెట్టింపు డబ్బులిస్తాం.. ఫిలిం సిటీ భూములు వదిలేస్తారా?వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు ఒంగోలు సిటీ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సరస్వతి పవర్ ప్రాజెక్టు కోసం రైతుల నుంచి చట్ట ప్రకారం భూములు కొన్నారని, రామోజీరావు అండ్కో లా హైదరాబాద్లో ఫిలిం సిటీ కోసం పేదలను భయపెట్టి భూములు చవగ్గా కొల్లగొట్టలేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు చెప్పారు. రామోజీ అండ్ కో ఫిలింసిటీ కోసం ఎంతో మంది పేదలను భయపెట్టి భూములు లాక్కొన్నారని, ఆరోజు కొన్న రేటుకు రెట్టింపు డబ్బులిస్తాం ఫిలిం సిటీ భూములను వదిలేస్తారా అని ప్రశ్నించారు. జూపూడి శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ చట్టప్రకారం కొన్న భూములపైనా ఎల్లోమీడియా వక్రీకరించడం సమంజసం కాదని అన్నారు. చంద్రబాబుకు సిగ్గు ఉందో లేదో తెలియదు కానీ, రాష్ట్రం మొత్తం చంద్రబాబును చూసి సిగ్గుపడే అంశాలు చాలా ఉన్నాయని విమర్శించారు. జగన్ ఇంట్లో ఆస్తుల తగదాలతో ఆయనకేమిటి సంబంధం అని ప్రశ్నించారు. సంబంధం లేకపోతే షర్మిల లేఖ చంద్రబాబు దగ్గరకు ఎలా వచ్చిందని నిలదీశారు. ఆనాడు సోనియాగాంధీతో కుమ్మక్కైన చంద్రబాబు వైఎస్ జగన్పై తప్పుడు కేసులు బనాయించారని, ఫలితంగా జగన్ ఆస్తులు సీబీఐ, ఈడీ అటాచ్లో ఉన్నాయన్నారు. న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా ఉండటం కోసమే జగన్ ఎన్సీఎల్టీకి అర్జీ పెట్టుకున్నారని వివరించారు. అసలు చంద్రబాబు ఏనాడైనా తన ఆస్తులను తమ్ముళ్లు, చెల్లెమ్మలకు రాసిచ్చారా అని నిలదీశారు. చంద్రబాబు తన ఉనికి కోసం సొంత తమ్ముడు రామ్మూర్తినాయుడిని ఎదగకుండా చేశాడని విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డైవర్షన్ పాలిటిక్స్, ప్రత్యర్థి పార్టీ నాయకులను వేధించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని, శాంతిభద్రతలను పూర్తిగా వదిలేశారని ధ్వజమెత్తారు.అనుబంధాల గురించి షర్మిల మాట్లాడటమా?వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డిప్రొద్దుటూరు: శత్రువులతో చేతులు కలిపిన షర్మిలమ్మ కుటుంబ అనుబంధాలు, ప్రేమల గురించి మాట్లాడటం విడ్డూరమని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. ఆమె ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో కుమ్మక్కై ఆస్తి కోసం సొంత అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బజారుకీడుస్తున్నారని ధ్వజమెత్తారు. శివప్రసాదరెడ్డి శుక్రవారం వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత షర్మిలమ్మపై ప్రేమతో జగన్ స్వార్జితంలో సుమారు రూ.200 కోట్లు నగదు చెల్లించారని చెప్పారు.ఇందుకు భారతమ్మ కూడా పూర్తి సహకారం అందించి గొప్పతనాన్ని చాటుకున్నారని తెలిపారు. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్, మిగతా ఆస్తులలో షర్మిలమ్మకు భాగం ఇవ్వాలనే ఎంఓయూ కుదుర్చుకున్నారన్నారు. అయితే ఆస్తులు ఈడీ అటాచ్మెంట్లో ఉండటతో బదలాయించలేదన్నారు. కేసులు పరిష్కారమయ్యే వరకు, న్యాయ సంబంధమైన సమస్యలు రాకుండా ఉండేందుకు ఎంవోయూ ఇచ్చారన్నారు. షర్మిలకు చెందని ఆస్తి కోసం చంద్రబాబు అండ్ కో తో చేతులు కలిపి వైఎస్ జగన్ను మరో మారు జైలుకు పంపేందుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వైఎస్ జగన్కు రాష్ట్రంలో కోటి కుటుంబాలు అండగా ఉన్నాయన్న విషయం తెలుసుకోవాలన్నారు. షర్మిలమ్మ అత్యాశతో అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అసలు సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలియదని అన్నారు. చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడుకు ఆస్తిలో వాటా ఇవ్వకపోవడంవల్లే మతి స్థిమితం కోల్పోయారని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్, నందమూరి వారసులకు ఆస్తి తగాదాలు లేవా అని ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆయన సతీమణులకు భాగ పరిష్కారాల సమస్య లేదా అని ప్రశ్నించారు. వైఎస్సార్ వ్యతిరేకుల చేతుల్లో షర్మిల కీలుబొమ్మవైఎస్సార్సీపీ మేధావుల ఫోరం అధ్యక్షుడు వై.ఈశ్వరప్రసాద్రెడ్డి సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై షర్మిల చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం లాజిక్లేదని, ఆమె వైఎస్సార్ కుటుంబ వ్యతిరేకుల చేతుల్లో కీలుబొమ్మగా మారిపోయారని వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం అధ్యక్షుడు వై. ఈశ్వర ప్రసాద్రెడ్డి ఆరోపించారు. అటాచ్మెంట్లపై హైకోర్టు ఆంక్షలు భూమికి మాత్రమే వర్తిస్తాయని, వాటాల బదిలీకి కాదని ఆమె చెప్పారని.. నిజానికి, మెజారిటీ షేర్ల బదిలీ అంటే భూమితో సహా అన్ని ఆస్తులను బదిలీ చేయడంతో సమానమని.. ఇది హైకోర్టు అటాచ్మెంట్ ఉత్తర్వులకు విరుద్ధమని శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ విషయంలో షర్మిల, కంపెనీల చట్టం ప్రకారం నిర్దేశించిన విధానాలను అనుసరించకుండా మెజారిటీ షేర్లను బదిలీ చేశారన్నారు. వాటా బదిలీ ఫారంలలో బదిలీదారుల సంతకాలు తీసుకోలేదని.. బదిలీ కోసం షేర్ సర్టిఫికెట్లు అందించలేదని ఆయన పేర్కొన్నారు. జగన్ బెయిల్ రద్దు చేయించాలనే..ఇక జగన్ బెయిల్ రద్దు కావాలంటే ఎలా అని ఆలోచించి.. చివరకు పల్నాడులోని సరస్వతి పవర్ ప్రాజెక్టు ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన అంశాన్ని పట్టుకున్నారన్నారు. తద్వారా.. దాని షేర్లు బదిలీ చేశారని చూపుతూ జగన్ బెయిల్ రద్దు చేయించాలని కుట్ర పన్నినట్లు ఈశ్వర్ప్రసాద్ తెలిపారు. తన బెయిల్ రద్దుచేసి, తిరిగి జైలుకు పంపించే కుట్ర చేస్తుండడంతో జగన్ న్యాయబద్ధంగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)కు అప్పీల్ చేశారని వివరించారు. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని.. షర్మిల ఇప్పటికైనా ఈ దుష్టశక్తుల కుట్రల నుంచి బయటపడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
టీడీపీ కుట్రలో షర్మిల పావు: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి,తాడేపల్లి: టీడీపీ చేసే కుట్రలో షర్మిల పావుగా మారిందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి పేర్నినానితో కలిసి వైవీ సుబ్బారెడ్డి తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం(అక్టోబర్ 25) మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేసే కుట్రలు జరుగుతున్నాయన్నారు.‘జగన్ బెయిల్ రద్దు చేసే కుట్రలు జరుగుతున్నాయి. గతంలో కాంగ్రెస్,టీడీపీ కలిసి వైఎస్జగన్పై కేసు పెట్టాయి. హైకోర్టు స్టేటస్కో ఆదేశాలున్నా షర్మిల సరస్వతి పవర్ కంపెనీ షేర్లు బదలాయించారు. షేర్లను బదలాయించినందువల్లే జగన్ ఎన్సీఎల్టీని ఆశ్రయించారుఆస్తుల్లో వాటా ఉంటే షర్మిలపై ఈడీ కేసులు ఎందుకు పెట్టలేదు. చెల్లిపై ప్రేమ ఉన్నందునే వైఎస్జగన్ షర్మిలకు ఎంవోయూ చేసుకున్నారు. షర్మిల ఆస్తుల కోసం పోరాడుతున్నారా’అని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. వైవీసుబ్బారెడ్డి ఇంకా ఏమన్నారంటే.. సరస్వతి సిమెంట్స్ ప్రాపర్టీ ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి.అయినాసరే షేర్లు బదలాయించుకోవటం వెనుక కుట్ర ఉంది.2019 ఆగస్టులో వైఎస్జగన్, షర్మిల ఎంవోయూ రాసుకున్నారుప్రాపర్టీ చూసుకున్నాకనే షర్మిల సంతకాలు పెట్టారుజగన్ ప్రేమ అభిమానంతోనే షర్మిలకు ఆస్తులు రాసిచ్చారు.కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఇదంతా జరిగింది.ఇప్పుడు షర్మిల చేస్తున్న రాద్దాంతమంతా ఆస్తుల కోసమే అని అర్థం అవుతోంది.షర్మిలకు లీగల్ గా ఆస్తుల మీద హక్కు ఉంటే ఆమె కూడా కేసులు ఎదుర్కొనేవారు.జగన్ ఒక్కరే జైలుకు ఎందుకు వెళ్తారు?జగన్ కు వచ్చిన డివిడెండ్ నుంచి షర్మిలకు రూ.200 కోట్లు ఇచ్చారు.జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్ జగన్ పెట్టుకున్న పరిశ్రమలు.వైఎస్సార్ బతికి ఉన్నప్పుడే ఈ కంపెనీలు పెట్టుకున్నారు.అందులో షర్మిలకు వాటాలు ఉంటే అప్పుడే రాసిచ్చేవారు.షర్మిల అబద్దాలాడుతున్నారువైఎస్ జగన్ ఇంట్లో చిచ్చుపెట్టి చంద్రబాబు చలిమంట కాచుకుంటున్నారు: పేర్నినానివైఎస్సార్ శత్రువులతో షర్మిల చేతులు కలిపారుతండ్రి ఆశయం కోసమైతే చంద్రబాబు కోసం పనిచేస్తారావైఎస్సార్ను అభిమానించేవారు ఇప్పటికీ చంద్రబాబును వ్యతిరేకిస్తున్నారు.గత మూడు నాలుగు రోజులుగా వైఎస్జగన్పై దుష్ప్రచారం చేస్తున్నారు.షర్మిల తాపత్రయం అంతా ఆస్తుల కోసమే..తండ్రి ఆశయాల కోసం కానేకాదువ్యక్తిగతంగా రాసుకున్న ఉత్తరం టీడీపీ అధికారిక వెబ్సైట్లో ఎలా వచ్చింది? చంద్రబాబు అక్రమ రాజకీయాలకు ఇది నిదర్శనంకేంద్రంలో బీజేపీతో ఉంటూ రాష్ట్రంలో కాంగ్రెస్తో అక్రమ బంధాన్ని కొనసాగిస్తున్నారుకాంగ్రెస్కు తాము వ్యతిరేకమని చెప్పి చంద్రబాబు ఇలా ఎందుకు చేస్తున్నారు?రాజకీయ వింత బంధాలను ఏపీలోనే చూస్తున్నాంవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టడంవెనుక జగన్ కష్టం,కార్యకర్తలే కారణంషర్మిలతో మాలాంటోళ్లు చాలామంది పని చేశాంమాలాంటి 30,40 మంది పదవులు వదులుకుని వచ్చారుటీడీపీ నుండి చాలామంది వైఎస్సార్సీపీలోకి వచ్చారుకానీ ప్రధానమైన కష్టం,నష్టం అంతా జగన్,కార్యకర్తలదేషర్మిలతో పాదయాత్ర వద్దని నేనే స్వయంగా జగన్తో చెప్పానుభవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని కూడా జగన్కి చెప్పానుకానీ నా కుటుంబంలో అలాంటివేమీ రావని జగన్ చెప్పారుకంపెనీల్లో షర్మిలకు వాటాలు ఉంటే ఆమెని కూడా డైరెక్టర్గా వైఎస్సార్ పెట్టేవారుఅలా జరగ లేదంటే షర్మిలకు సంబంధం లేదనే అర్థం కదాచంద్రబాబు అనవసరంగా జగన్ కుటుంబ సభ్యుల గొడవల్లో జోక్యం చేసుకుంటున్నారుజూనియర్ ఎన్టీఆర్ను ఎన్నికలకు వాడుకుని ఎందుకు వదిలేశారు?చంద్రబాబు నైజంపై ఆయన తోడళ్లుడే పుస్తకం వేశారుఅసలు చంద్రబాబు తన తోడబుట్టినవారికి ఏం ఆస్తులు రాసిచ్చారు?చంద్రబాబు చేతిలో షర్మిల పావుగా మారింది ఇదీ చదవండి: ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యావు షర్మిలా..? -
పక్కింట్లో గొడవైతే చంద్రబాబుకు ఎందుకంత సంబరం ?
-
‘పక్కింట్లో గొడవైతే చంద్రబాబుకు ఎందుకంత సంబరం?’
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ వ్యవహారంపై వాస్తవాలను పట్టించుకోకుండా అత్యంత దుర్మార్గంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న ఎల్లో మీడియా, కూటమి నేతలపై మాజీ మంత్రి పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్నినాని మీడియాతో మాట్లాడారు.హత్యలు,అత్యాచారాలు జరుగుతుంటే సీఎం చంద్రబాబు, ఎల్లో మీడియా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని పేర్ని నాని ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ విషయాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందేలా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పేర్ని నాని ఏమన్నారంటే..మూడ్రోజులుగా హైడ్రామా:గత మూడు రోజుల నుంచి పచ్చ మీడియా నానా హంగామా చేస్తోంది. రాష్ట్రం తలకిందులైపోతుంది అని ప్రచారం చేస్తోంది. ఇది టీడీపీ అంటే పడిచచ్చే ఛానల్స్ కాకుండా, టీడీపీకి ఊడిగం చేస్తున్న పేపర్లు కాకుండా, టీడీపీ అఫీషియల్ ట్విట్టర్లో బాగా ప్రచారం చేశారు. ఇది ఏ పేపర్, ఛానల్ చేస్తే వేరు. కానీ పార్టీ ట్విట్టర్ వేదికగా చేయడం ఆశ్చర్యకరం.రాష్ట్రంలో రోజూ ఆడపిల్లలపై హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా, టీడీపీకి పట్టదు. ట్విట్టర్లో అసలు ప్రస్తావించరు.కానీ రాష్ట్రంలో ఏదో జరుగుతుంది అంటూ నానా హంగామా చేసి, ప్రచారం చేశాక, వారు బయట పెట్టిందేమిటంటే.. జగన్గారు, తన తల్లి, చెల్లిపై కేసు పెట్టారని. ఆ తర్వాత ఎల్లో మీడియాలో పుంఖానుపుంఖాలుగా కధలు వండి వార్చారు. ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తూ, కధనాలు రాశారు. దుర్మార్గమైన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. జగన్గారిపై ప్రజల్లో ఉన్న యశస్సుని మసక బారేలా చేయాలి. రాజకీయంగా ఆయన్ను ఎదుర్కోలేక పోతున్నాం కాబట్టి, ఇలా వ్యక్తిత్వ హననం చేయాలన్న ప్రయత్నం.అవన్నీ జగన్గారి స్వార్జితం:వైఎస్సార్ మరణించక ముందే పిల్లలకు ఆస్తులు పంచారు. జగన్కి ఇచ్చేవి ఆయనకు ఇచ్చారు. షర్మిలకి ఇచ్చేవి కూడా ఇచ్చారు. ఆ తర్వాత జగన్ వ్యాపారాలు మొదలుపెట్టిన తర్వాత, ఆ ఆదాయాల ద్వారా వ్యాపారాలు పెంచుకుంటూ పోయారు. భారతి సిమెంట్స్, సాక్షి మీడియా గ్రూప్, పల్నాడు జిల్లా గురజాలలో సరస్వతి పవర్ కంపెనీ.. ఇవన్నీ జగన్ స్వార్జితం.ఎవరికైనా అనుమానాలు ఉంటే, రికార్డులు చూసుకోవచ్చు. 2009 నుంచి ఆయన అఫిడవిట్స్ కానీ, ఐటీ రిటర్న్ల్లో కూడా చూడొచ్చు. అన్నీ ఆన్ రికార్డ్. సరస్వతి పవర్ ప్రాజెక్టు ల్యాండ్ గవర్నమెంట్ లీజ్ భూమి కాదు. కానీ దీనిపై ఒక టీడీపీ నాయకుడు అసత్యాలు చెబుతున్నారు. అది రైతుల నుంచి కొనుక్కున్న భూమి.అక్రమ కేసులతో అటాచ్మెంట్ఘెస్సార్ మరణం తర్వాత, జగన్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత, చంద్రబాబు.. కాంగ్రెస్ నాయకులు కూడబలుక్కుని జగన్గారిపై తప్పుడు కేసులు నమోదు చేయించారు. ఆయనపై సీబీఐ దాడులు కూడా చేయించారు. ఆయన ఆస్తులను కూడా సీబీఐ, ఈడీ ద్వారా అటాచ్ చేయించారు. 2011 నుంచి 2016 వరకు ఆయనకు నరకం చూపించారు. ఆ పనుల్లో చంద్రబాబు ఎన్ని కుట్రలు చేశారో అందరికీ తెలుసు.35 ఏళ్ల యువకుడిని ఎదుర్కోవడానికి సోనియా, చంద్రబాబు ఎన్ని పిల్లిమొగ్గలు వేశారో అందరికీ తెలుసు. 2019లో ఆయన గెల్చారు.జగన్కు ఆస్తిపై మక్కువ ఉండి ఉంటే..ఇందాక షర్మిల అంటున్నారు. అది మా అన్న స్వార్జితం కాదు అని.. మరొకరు అంటారు.. జగన్కి ఆస్తి అంటే పిచ్చి అని.అదే నిజమైతే, ఆయన తన ఆస్తులను తల్లి, చెల్లికి ఎందుకు రాసిచ్చారు? ఆయన ప్రభుత్వం కూడా ఏర్పాటైంది. అధికారంలో ఉన్నా, తన చెల్లి మీద ఉన్న ప్రేమతో ఆస్తులు రాసిచ్చారు. నిజంగా ఆయనకు ప్రేమ లేకపోతే, బాధ్యత లేకపోతే ఆస్తులు ఎందుకు ఇస్తారు? తండ్రి చనిపోయిన ఇన్నేళ్లకు, ఆమె పెళ్లి తర్వాత ఇన్నేళ్లకు ఇలా ఎవరైనా ఆస్తులు పంచుతారా?అసలు చంద్రబాబు తన ఆస్తులు ఎవరికైనా పంచారా? ఆయనకున్న ఆస్తులు విలువ ఎంత? ప్రభుత్వ ధరల ప్రకారమే, ఆయన అఫిడవిట్ ప్రకారమే రూ.1400 కోట్ల ఆస్తి. మరి ఆ ఆస్తిలో చంద్రబాబు తన అక్కచెల్లెమ్మలు, తమ్ముడికి ఏమైనా రాసిచ్చాడా?స్వార్జితం అయినా వాటా ఇస్తామన్నారుజగన్ ఆస్తులన్నీ కూడా.. చంద్రబాబు, సోనియా కుట్రల వల్ల తప్పుడు కేసులతో సీబీఐ, ఈడీ అటాచ్లో ఉన్నాయి కాబట్టి.. నేరుగా బదిలీ కాకుండా ఎంఓయూ రాశారు. భారతి సిమెంట్స్లో 40 శాతం వాటా గిఫ్ట్ ఇస్తున్నట్లు రాశారు. ఆయనకు నిజంగా డబ్బుపై మమకారం ఉంటే, ఇలా ఆస్తి తన చెల్లికి రాసిస్తారా? చంద్రబాబు తన తమ్ముడికి, అక్కకి ఒక్కటంటే ఒక్క ఆస్తి అయినా రాశారా? సరస్వతి పవర్ ప్రాజెక్ట్, క్యారమిల్.. వీటన్నింటిలో వాటా ఇస్తూ, ఈడీ అటాచ్ అయిపోగానే, తన చెల్లికి ఇవన్నీ ఇస్తానంటూ.. రాసిచ్చారు. అలాగే సరస్వతి పవర్లో తన అమ్మగారికి కూడా వాటా రాశారు. ఈడీ కేసు అయిపోయిన తర్వాత, ఆ ఆస్తులు దఖలు చేసేలా రాసిచ్చారు.హైకోర్ట్ స్టేటస్కో ఆర్డర్వాస్తవాలు ఇలా ఉంటే.. ఇందాక షర్మిలగారు మాట్లాడుతున్నారు. ఈడీ ఆస్తుల అటాచ్మెంట్ ఏమీ లేదని. కానీ వాస్తవం ఏమిటంటే..2019లో ఈడీ అప్పిలేట్ అథారిటీలో జగన్గారికి అనుకూలంగా తీర్పు ఇస్తే, వారు హైకోర్టులో మూవ్ చేస్తే.. అదే ఏడాది చివర్లో స్టేటస్కో ఇచ్చింది. ఎక్కడ ఉన్నది అలాగే కొనసాగాలని. కానీ, దీనిపై షర్మిలగారు హైకోర్టు ఆదేశం లేదని అబద్ధం చెబుతున్నారు.ఆ తగాదాతో చంద్రబాబుకు ఏ సంబంధం?ఇంకా ఆమె ఏమంటున్నారు? అమ్మను బజారుకీడ్చారని, కోర్టుకు లాగారు. ఈ ఆస్తుల పంపకం బజార్లో పెట్టుకోవడం అవసరమా? అంటారు. ఇక చంద్రబాబు ఏమన్నారు. దేశంలోనే తొలిసారిగా సొంత తల్లిపై కేసు పెట్టిన శాడిస్టు కొడుకు. ఇలాంటి వారితోనా తాను రాజకీయం చేయాలి.. అంటున్నారు.నిజానికి ఇలాంటి దిక్కుమాలిన, దగుల్బాజీ పార్టీతో జగన్ రాజకీయాలు చేయడం శాపం కాదా? జగన్ ఇంట్లో ఆస్తుల తగాదా అయితే, మీకేమిటి సంబరం? ఇది రాష్ట్రానికి, దేశానికి, ప్రజలకు ఏం సమస్య? చంద్రబాబుకు ఈ పులకరింత ఎందుకు? పతిత కధలు చెబుతున్నావు. ఎదుటి వారి ఇంట్లో ఆస్తుల తగాదా వస్తే. నీకేమిటి?ఈ తగాదా వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయా? ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయా? ప్రజలకు ఏమైనా ఇబ్బంది వచ్చిందా?హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ..ఆ ఎంఓయూ ప్రకారం.. విజయమ్మ గారికి ఏం రాసిచ్చారంటే.. కోర్టులో అటాచ్మెంట్ వ్యవహారం తేలాక, ఆస్తుల బదలాయింపు ఉంటుందని. అంతవరకు సరస్వతి పవర్లో 2 శాతం వాటా విజయమ్మగారి పేరుమీదే ఉండగా, మరో 48 శాతం విజయమ్మగారి పేరు మీద బదలాయింపునకు అంగీకారం తెలుపుతూ, అన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్.. తెల్లకాగితం మీద రాసి, విజయమ్మగారి దగ్గర పెట్టడం జరిగింది. అయితే షేర్ సర్టిఫికెట్లు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేసి, కొత్త షేర్ల కాపీలు తీసుకుని, వాటిని విజయమ్మగారి పేరుమీద బదిలీ చేసి, కంపెనీలో బోర్డు డైరెక్టర్లను మార్చేశారు. అలా హైకోర్టు ఆదేశాలను పూర్తిగా బేఖాతరు చేశారు.చంద్రబాబు కుట్ర. డెరెక్షన్ఇదంతా చంద్రబాబునాయుడు నుంచి డైరెక్షన్ వచ్చాకే జరిగింది. ఆయన నుంచి డైరెక్షన్ వచ్చింది. మీరు మూవ్ అయ్యారు. జగన్గారి బెయిల్ రద్దు కావాలంటే.. ఏ కేసులో అయితే, ఆయన బెయిల్ మీద బయట ఉన్నారో.. ఆ కేసులో సాక్షులను బెదిరించినా.. బెయిల్ రద్దు అవుతుంది. అయితే ఆయన ఆ పని చేయడం లేదు. మరి ఆయన ఎలా దొరుకుతాడు.. అని ఆలోచించి, పల్నాడులోని సరస్వతి పవర్ ప్రాజెక్టులో ఈడీ ఆస్తులు అటాచ్ చేసినా, జగన్గారు బెయిల్ కండిషన్ను బేఖాతరు చేసి, షేర్లు బదిలీ చేశారని చూపుతూ.. జగన్గారి బెయిల్ రద్దు చేయించాలన్న కుట్రతో ఎవరితోనో ఒకరితో ఫిర్యాదు చేయించి, ఆ పని చేయాలని చూశారు.ఆయనకున్న ప్రత్యామ్నాయం ఏమిటి?మరి జగన్ ఈ పరిస్థితిలో ఏం చేయాలి?. ఆయనకు అమ్మ అన్నా, చెల్లి అన్నా ప్రేమ. కానీ వారు శత్రువులచేతుల్లోకి పోయి, తన బెయిల్ రద్దు చేసే ప్రయత్నం చేస్తే.. ఆయన ఏం చేస్తారు? చెప్పండి.ఎమ్మెల్యే అయి, మంత్రి అయినా చంద్రబాబుకు ఎవరూ పిల్లను ఇవ్వలేదు. కానీ రామారావుగారు ఇచ్చారు. కానీ ఆయనకే వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు.అలాంటి చంద్రబాబుతో మీరు కలిసి కుట్ర చేసి, తన బెయిల్ రద్దు చేసి, తిరిగి జైలుకు పంపించే కుట్ర చేస్తుండడంతో, ఆయన మాత్రం ఏం చేస్తారు? అందుకే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)కు అప్పీల్ చేశారు. చంద్రబాబు కుట్రలో భాగస్వాములై, ఆయన్ను తిరిగి జైలుకు పంపే యత్నం చేస్తుంటే, తాను ఏం చేస్తాడు?ఏనాడైనా నోరు మెదిపారా?రాష్ట్రంలో రోజూ అమ్మాయిలపై హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే, ఒక్కనాడు మీరు నోరు మెదపలేదు. జగన్గారు ఓడిపోయారు. ఎలా అనేది వేరే విషయం. అయినా ఆయనపై ఎందుకంత కక్ష.ఎక్కడైనా అధికారపార్టీపై విమర్శలు చేస్తారు. కానీ ఇక్కడ ప్రతిపక్షంపై అదే పనిగా విమర్శలు చేస్తున్నారు. ఒక అధికార పార్టీ నాయకుడు, ప్రతిపక్షం నాయకురాలని పొగుడుతున్నారు. ఇలా ఎక్కడైనా జరుగుతుందా?చంద్రబాబు చేస్తున్న దగుల్బాజీ రాజకీయం, కుటుంబంలో తగాదాను అడ్డు పెట్టుకుని చేస్తున్న కుట్రకు బలి కాకుండా.. చంద్రబాబు చేతిలో పావుగా మారిన చెల్లెమ్మ కోసం.. అంత కంటే ఏం చేస్తారు?అందుకే ఎన్సీఎల్టీకి అర్జీ పెట్టారు.ప్రేమ లేకపోతే ఆస్తులు రాసిస్తారా?:అటాచ్మెంట్ రిలీజ్ కాగానే, ఆయన కచ్చితంగా షేర్లు బదలాయిస్తారు. మీకూ తెలుసు. జగన్గారిపై పెట్టిన కేసులేవీ నిల్చేవి కావని. అందుకే కదా, మీరు ఆ ఒప్పందానికి ఒప్పుకున్నారు. ప్రతి పేపర్మీద సంతకాలు పెట్టారు.భారతి సిమెంట్స్లో, సాక్షి గ్రూప్లో 40 శాతం చొప్పున, పల్నాడులోని సరస్వతి పవర్ ప్రాజెక్టులో 100 శాతం వాటాకు ఒప్పుకుని, ఎంఓయూ రాసుకుని ఒప్పుకున్నారు కదా. అన్నకు నీ మీద ప్రేమ లేకపోతే, అలా ఆస్తులు ఇస్తానని రాసిస్తాడా? ఎందుకంటే అవన్నీ ఆయన స్వార్జితం. ఆయనకు నిజంగా డబ్బు పిచ్చి ఉంటే, అలా ఆస్తులు ఇస్తానని రాసిస్తాడా? ప్రతి పేజీలో ఇద్దరూ సంతకాలు పెట్టారు కదా? ఇవన్నీ పబ్లిక్ డాక్యుమెంట్ కదా?భూముల కబ్జాపై చంద్రబాబు కుట్ర ఇన్ని కుట్రలు చేసిన చంద్రబాబు పతిత కబుర్లు చెబుతున్నారు. చంద్రబాబుకు వయసొచ్చింది. కానీ నైతికత లేదు. సరస్వతి పవర్ ప్రాజెక్టు కోసం రైతుల నుంచి భూములు కొనుగోలు చేస్తే.. 2014–19 మధ్య, చంద్రబాబు స్వయంగా గురజాల ఎమ్మెల్యే ద్వారా రౌడీలను పంపించి, ఆ భూములు కబ్జా చేసే ప్రయత్నం చేశారా? లేదా?.ఇవాళ షర్మిలగారు చాలా మంచి అమ్మాయి అంటున్నావు కదా? మరి ఆరోజు ఆమె ఆస్తిని కబ్జా చేసేందుకు మీరు ప్రయత్నించారు. దాన్ని మాచర్ల ఎమ్మెల్యే ద్వారా జగన్గారు అడ్డుకున్నారు. ఇవాళ అందరూ ఉన్నారు. అన్నీ అందరికీ తెలుసు.అన్ని కుట్రలు, కుతంత్రాలు చేసి, ఇప్పుడు కూడా అదే చేస్తున్న చంద్రబాబు మొసలికన్నీరు కారుస్తున్నారు. కానీ, అవి షర్మిలమ్మకు అర్ధం కావడం లేదు. ఆయన్నే నమ్ముతున్నారు.శవ రాజకీయాలు చేసింది ఎవరు?ఇవాళ పేపర్ చూస్తే.. రోజూ అమ్మాయిలపై హత్యలు. అత్యాచారాలు. పరిస్థితి దారుణం. వాటి నుంచి డైవర్షన్ కోసమే కదా? ఇవన్నీ చేస్తోంది?మీరు అధికారంలోకి వచ్చాక, కనీసం ఒక్క కుటుంబాన్ని ఓదార్చారా? అమ్మాయిని కోల్పోయిన వారిని పరామర్శించారా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే పనిగా వెళ్లారు కదా? ప్రభుత్వంతో వేధింపులకు గురవుతున్నారు చాలా మంది. మరి వారిని ఓదార్చేది ఎవరు? అందుకే జగన్గారు వెళ్తున్నారు. వారికి కలుస్తున్నారు. జగన్గారు శవాల దగ్గరకు వెళ్తున్నారని విమర్శిస్తున్నారు. అసలు మీకు సిగ్గుందా?మీరు అధికారంలో లేకపోతే, ప్రభుత్వం డబ్బు ఇస్తే, డబ్బుతో ప్రాణాలు వస్తాయా? అంటారు. అదే ఇప్పుడు జగన్గారు ఇస్తుంటే కూడా తప్పు బడుతున్నారు. అసలు మీ వంటి వారితో రాజకీయాలు చేయాలంటే నిజంగా సిగ్గు వేస్తోంది.ఆనాడు చంద్రబాబు ఏం చేశారు?అన్నను తిట్టొద్దంటూ రామ్మూర్తినాయుడికి అమ్మ అమ్మణమ్మ ద్వారా చెప్పించే ప్రయత్నం’.. అంటూ వార్త కథనాన్ని చూపిన పేర్నినాని, ఆ అంశాన్ని వివరించారు.తన ఉనికి కోసం కాంగ్రెస్లో చేరిన నారా రామ్మూర్తినాయుడు, తన అన్న చంద్రబాబుపై అదేపనిగా విమర్శలు చేయడం, చాలా నష్టం కలిగిస్తోంది కాబట్టి, అమ్మ ద్వారా చెప్పించే ప్రయత్నం చేశారని.. ఆ వార్త.ఇది దాదాపు 30 ఏళ్ల క్రితం జరిగింది. ఆయన కాంగ్రెస్లో చేరారు. అప్పుడు చంద్రబాబు సీఎంగా ఉన్నారు. అయినా కాంగ్రెస్లో చేరి, చంద్రబాబును తిట్టారు. ఎందుకు తిట్టారు?మరి ఆయనకేమైనా చంద్రబాబు ఆస్తులు పంచారా? కనీసం అక్క చెల్లెమ్మలకు అయినా ఆస్తులు పంచారా? అదే జగన్గారు, తన తండ్రి చెల్లికి ఆస్తులు పంచినా, తన స్వార్జితంలో కూడా, తండ్రి చనిపోయిన 10 ఏళ్ల తర్వాత కూడా, ఆస్తులు పంచి ఇస్తున్నట్లు రాసిచ్చారు. చంద్రబాబు నీ జీవితంలో ఎప్పుడైనా, ఎవరికైనా అలా రాసిచ్చావా?.హైదరాబాద్లో 5 ఎకరాల ఫామ్హౌజ్ను చంద్రబాబు అమ్మ అమ్మణమ్మ, తన మనవడు నారా లోకేష్కు ఎలా గిఫ్ట్ డీడ్ ఇచ్చారు. ఆమెకు అంత మంది మనవళ్లు, మనవరాళ్లు ఉంటే, కేవలం చంద్రబాబు కొడుక్కే ఎందుకు ఆ ఆస్తి గిఫ్ట్డీడ్గా ఇచ్చింది?.ఆ ఆస్తి వద్దని తల్లికి ఎందుకు చెప్పలేదు? కనీసం ఇప్పుడైనా ఆ ఆస్తి తమకు వద్దని చంద్రబాబు కొడుక్కి చెప్పొచ్చు కదా?ఇది కుట్ర కాక మరేమిటి?ఇది జగన్ బెయిల్ రద్దు కోసం చేసిన కుట్ర కాక, మరేమిటి? షేర్లు బదలాయించడం, కంపెనీ డైరెక్టర్లను మార్చడం. వీటిలో దోషి ఎవరు? అటాచ్మెంట్లో ఉన్న ఆస్తులు. వాటిపై స్టేటస్కో కొనసాగించాలని హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినా, అలా బదలాయింపు చేయడం ఎంత వరకు కరెక్ట్?.కావాలంటే తెలంగాణ హైకోర్టు ఆదేశాలు చూడొచ్చు. కాగితం మీద రాసిచ్చిన వాడు, నిజంగా ఆస్తి ఇవ్వడా? అయినా ఎందుకు బదలాయించుకున్నారు? ఇది కుట్ర కాక మరేమిటి?.చెప్పేవన్నీ శ్రీరంగ నీతులునెల్లూరులో ఒక గజనీ మహ్మద్ ఉన్నారు. ఆయన ఓడి ఓడి మొన్న గెల్చాడు. ఏదో సినిమా బిట్ చూపి, జగన్గారిపై విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు గురించి మాట్లాడాలంటే, మన తెలుగు సినిమాల్లో ఏ విలన్ను చూసినా కనిపించేది చంద్రబాబే. ఆయన చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు. మరి చేతలు మాత్రం శూన్యం.జగన్.. ఎన్టీఆర్లా కాదు.జగన్మోహన్రెడ్డి వ్యక్తిత్వాన్నికించపర్చాలని, నాశనం చేయాలని, ఆయన్ను రాజకీయంగా ఎదుర్కోలేక, మీరిచ్చిన హామీలు అమలు చేయలేక, జగన్కి ఇంకా పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక, ఆయన్ను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలన్న కుట్రతో, ఆయన బెయిల్ రద్దు చేయించాలన్న మీ ప్రయత్నం నెరవేరదు. ఎందుకంటే, మీ కుట్రలు, కుతంత్రాలకు బలవ్వడానికి ఆయన ఎన్టీఆర్ కాదు.హోం మంత్రి అనిత ఒక గురువింద గింజ మాదిరిగా మాట్లాడుతున్నారు. అనిత మాదిరిగా జగన్పై చెక్ బౌన్స్ కేసు లేదు కదా? చెల్లెలు ఇలా వ్యవహరిస్తే ఎవరికైనా బాధలేచెల్లెలు ఇలా వ్యవహరిస్తే జగన్కే కాదు, చంద్రబాబుకీ బాధ తప్పదు. తన పేరుమీద ఉన్న ఆస్తులు మొత్తం.. అవన్నీ ఆయన స్వార్జితం. ఇది ఆన్ రికార్డ్. జగన్ స్వయంగా సంతకం పెట్టారు. ఆస్తి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఇది కుటుంబ వ్యవహారం. నాలుగు గోడల మధ్య జరిగిన విషయం. మరి ఇవాళ అది బజార్లోకి తెచ్చింది ఎవరు? అలా పెట్టింది ఎవరు? అలా బజార్లో పెట్టిన వాళ్లే.. విమర్శలు చేస్తే ఎలా?. నింద వేస్తే ఎవరికి చెప్పుకోవాలి? అందుకే ప్రజలకు చెబుతున్నామని పేర్నినాని వివరించారు. -
కాలర్ ఎగరేసి చెప్పండి మా దమ్ము.. ధైర్యం జగన్ అని
-
దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం.. కూటమి నేతలకు పేర్ని నాని వార్నింగ్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్కు అధికారం లేకపోయినా ప్రజాబలం ఉందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. కూటమి సర్కార్ వైఎస్సార్సీపీ కార్యకర్తలను వెంటాడి వేధిస్తోంది.. మేము తిరగబడితే కూటమి నేతలు కొట్టుకుపోతారని హెచ్చరించారు.మాజీ మాంత్రి పేర్ని నాని తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్కు ప్రజాబలం ఎక్కువ. జన బలం ఎవరికి ఉందో ఈవీఎం బ్యాచ్కి బాగా తెలుసు. ప్రజలను మోసం చేయడానికి వైఎస్ జగన్ ఎర్ర పంచ కట్టలేదు. వైఎస్ జగన్ సింగిల్గా వచ్చి గెలిస్తే.. చంద్రబాబు పొత్తుతో వచ్చాడు. కూటమి సర్కార్ వైఎస్సార్సీపీ కార్యకర్తలను వెంటాడి వేధిస్తోంది. మేము తిరగబడితే మీరు ఎక్కడ ఉంటారో ఒక్కసారి ఆలోచించుకోండి అని హెచ్చరించారు.అలాగే, వైఎస్ జగన్ దగ్గర అధికారం లేకపోవచ్చు.. కానీ మోసపు మాటలు మాత్రం లేవు. పవన్ తనకు కులం లేదు అని మొన్న చెప్పి.. ఇవాళ కులం ఉంది, మతం ఉందని డ్రామాలాడుతున్నారు. చంద్రబాబుకు అధికారం ఏమైనా శాశ్వతంగా ఉందా?. 2019లో వైఎస్ జగన్ను 151 సీట్లతో అధికారంలోకి తెచ్చింది కార్యకర్తలే. ఇప్పుడు 2029లో కూడా 175 సీట్లతో కార్యకర్తలే వైఎస్సార్సీపీని తిరిగి అధికారంలోకి తెస్తారు అంటూ వ్యాఖ్యలు చేశారు. -
చంద్రబాబుకు పేర్ని నాని సూటి ప్రశ్న
-
నీ చెంచా గాళ్ళు కు ఎవడూ భయపడడు పవన్ కు పేర్ని నాని స్ట్రాంగ్ వార్నింగ్
-
నీ ఉడత ఊపులకు భయపడం.. పవన్కు పేర్ని నాని స్ట్రాంగ్ వార్నింగ్
సాక్షి, కృష్ణా జిల్లా: డిప్యూటీ సీఎం పదవిలో ఉండి ఇలాంటి రాజకీయాలేంటి? అంటూ పవన్ కల్యాణ్పై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. పవన్ చేసిన వ్యాఖ్యలను ఎండగడితే తప్పేంటి? అంటూ ప్రశ్నించారు. గురువారం ఆయన మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ, ఇళ్ల మీదకు కిరాయి మనుషుల్ని పంపిస్తే భయపడతామా?. మీ ఉడత ఊపులకు మేం భయపడబోం’’ అని ధ్వజమెత్తారు. మచిలీపట్నం పోలీసులపైనా పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘సినిమాల్లో నాలుగు డ్యాన్స్లు వేసి రాజకీయాల్లోకి వచ్చావ్. నోటికి ఏదొస్తే అది నువ్వు మాట్లాడుతున్నావ్. కులం లేదు, మతం లేదంటూ మతాలను రెచ్చగొడతావ్. క్రిస్టియన్లకు, ముస్లింలకు ఉన్న ఐక్యత మీకు లేదా అంటూ హిందువులను రెచ్చగొడతావ్. ఎన్నికల ముందు కులాలను రెచ్చగొట్టావ్. ఈ రోజు మతాలను రెచ్చగొడుతున్నావ్. డిప్యూటీ సీఎంగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి. .బాధ్యత లేకుండా ప్రవర్తించడం సిగ్గుమాలినతనం’’ అంటూ పేర్ని నాని నిప్పలు చెరిగారు.‘‘గుడివాడ వెళితే నా కారుపై రాళ్లు వేయించావ్. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో.. మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం అని గుర్తుంచుకో పవన్. మచిలీపట్నం పోలీసులను కూడా హెచ్చరిస్తున్నా. తప్పుడు ఉద్యోగం చేయడం మీరు మొదలుపెడితే హింసా రాజకీయాలు మొదలవుతాయి. మేం చాలా ప్రశాంతంగా ఉన్నాం. మందు పోయించి మా ఇళ్ల పైకి మందిని పంపిస్తే. పరిస్థితులు మరోలా ఉంటాయి’’ అంటూ పేర్ని నాని హెచ్చరించారు. ‘‘పవన్ తప్పుడు రాజకీయాలు మానుకోవాలి. నిన్నటి దాకా కులం అయిపోయింది. ఇప్పుడు కాషాయ దుస్తులు ధరించావ్. కాషాయ దుస్తులు తీసేసి.. సినిమాల్లో అమ్మాయిలతో డాన్స్లు చేసి రావడమేంటి?. లడ్డూలో నిజంగానే తప్పులుంటే ఈ డ్రామాలెందుకు?. తప్పుడు రాజకీయాలు చేస్తూ విద్వేషాలు రెచ్చగొట్టి పాపం మూటగట్టుకుంటున్నారు. దిష్టిబొమ్మ తగలేసి. శునకానందం పొందడం మానుకో. హుందాగా రాజకీయం చేయండి. పోతు పేరంటాళ్లలాగా మెట్లకు పసుపులు రాయడం కాదు’’ అని పేర్ని నాని దుయ్యబట్టారు.ఇదీ చదవండి: గెలిచే ముందు ఒక అవతారం.. గెలిచాక ఇంకో అవతారం.. ఏది నిజం?వైజాగ్ స్టీల్ కార్మికులతో ఏం చెప్పావో మర్చిపోయావా?. ఒక్క ఎంపీ ఇవ్వండి పార్లమెంట్ను బద్ధలు కొట్టేస్తా అన్నావ్. చంద్రబాబు, నువ్వు స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు. స్టీల్ ప్లాంట్ కాపాడతానని సొల్లు కబుర్లు చెప్పారు కదా. మీరు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోండి. నేను గెలిచిన 24 గంటల్లో సుగాలి ప్రీతికి న్యాయం చేస్తానన్నావ్. వంద రోజులైంది. ఏమైంది సుగాలి ప్రీతి కేసు. ఎన్నికల ముందు 30 వేల మంది ఆడపిల్లలు మాయమైపోయారన్నావ్ కదా. డిప్యూటీ సీఎం అయ్యావు.. అప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు ఏమైపోయాయి. నా కారు పై రాళ్లేయించినా.. డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయించినా తగ్గేదే లేదు.. ఆగేదే లేదు. నీకు చేతనైతే.. నికార్సైన రాజకీయ నాయకుడివైతే.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చు’’ అని పేర్ని నాని హితవు పలికారు. ‘‘బందరు పోర్టు, మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెట్టారు. ఇలాంటి పాపాలు చేయడం మానుకోండి. లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందని నువ్వూ... నీ ముఖ్యమంత్రి చెబుతారు. లోకేష్.. నీ ఆర్థిక మంత్రి నెయ్యి కలపలేదంటారు. దేవుడితో దుర్మార్గమైన నీచ రాజకీయాలు మాని.. ప్రజలకు మంచి చేయండి’’ అని పేర్ని నాని అన్నారు. -
'పేర్ని నాని ఇంటి వద్ద' జన సైకోలు ఓవరాక్షన్
-
చంద్రబాబుకు వైఎస్ఆర్ సీపీ నేతల హెచ్చరిక..
-
తిరుపతి లడ్డు వివాదంపై పేర్ని నాని ఫస్ట్ రియాక్షన్
-
చంద్రబాబు పాపాలు కడిగేందుకే పూజలు: పేర్నినాని
సాక్షి,తాడేపల్లి:రాజకీయాల కోసం చంద్రబాబు దైవాన్ని కూడా వదల్లేదని మాజీ మంత్రి పేర్నినాని అన్నారు. పార్టీ నేతలు కొడాలినాని, వల్లభనేనివంశీతో కలిసి తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో బుధవారం(సెప్టెంబర్25) పేర్నినాని మీడియాతో మాట్లాడారు.‘తిరుమలలో నెయ్యిని వెనక్కి పంపామని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. చంద్రబాబు, లోకేశ్ మాత్రం అబద్ధాలు చెబుతున్నారు.లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. తన కుట్ర రాజకీయాల కోసం కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీశారు.లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు మాట్లాడారు.అలాంటిదేమీ లేదని ఈవో శ్యామలరావు చెప్తుంటే చంద్రబాబు అడ్డమైన ఆరోపణలు చేశారు.లోకేష్ అయితే ఏకంగా పందికొవ్వు కలిసిందన్నారు.పవన్ కళ్యాణ్ కూడా అదే దారిలో ఆరోపణలు చేశారు.ఈ కూటమి పాపాన్ని ప్రక్షాళన చేయాలని వైఎస్ఆర్సీపీ భావించింది. వారి పాపాలను క్షమించి వదిలేయమని శనివారం(సెప్టెంబర్28) రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పూజలు చేయాలని పిలుపునిస్తున్నాం.శరీరం, ఆత్మ వేరైనా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఒకటే.అందుకే చంద్రబాబు మాట్లాడిన మలినపు మాటలకు పవన్ కూడా వత్తాసు పలికారు.ఎన్నికలకు ముందు చంద్రబాబు అనేక హామీలు ఇస్తే వాటికి పవన్ కూడా హామీ ఇచ్చారు.బస్సులో ఉచిత ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, అమ్మకు రూ.18 వేలు.. ఇలా అనేక హామీలు ఇచ్చారుఅవేమీ అమలు చేయలేదు కాబట్టి వారంతా లోలోపల మదనపడుతున్నారు.అందుకే పాపపరిహార్ధం ప్రాయశ్చిత్త శిక్ష వేసుకున్నారు.తాను బాప్టిజం తీసుకున్నట్టు పవన్ చెప్పారు.జనం ఏదీ మర్చిపోరు.నెయ్యి వెయ్యి రూపాయలు ఉందని చంద్రబాబు అంటున్నారు.మరి ఆయన హయాంలో ఏనాడైనా వెయ్యి రూపాయలకు కొన్నారా?జగన్ ప్రభుత్వం కంటే తక్కువ ధరకే చంద్రబాబు హయాంలో కొనుగోలు చేశారు.హెరిటేజ్ లో ఆవునెయ్యి నాలుగు వందలకు ఎలా ఇస్తున్నారు’అని పేర్ని నాని ప్రశ్నించారు.చంద్రబాబు నిజంగా శ్రీవారి భక్తుడేనా: కొడాలి నానిస్వామివారి ప్రతిష్టను మంటకలిపేలా చంద్రబాబు ఆరోపణలు చేశారువైఎస్సార్సీపీ హయాంలో 18 సార్లు కల్తీ ట్యాంకర్లను వెనక్కు పంపాంప్రతి ట్యాంకర్ను నిబంధనలకు అనుగుణంగా టెస్టులు చేశాంవందల ఏళ్లుగా ఇలాంటి ఆనవాయితీ కొనసాగుతోందిజులై 17 న ఒక ట్యాంకర్లో నెయ్యి సరిగా లేదని వెనక్కి పంపారుఆ నెయ్యిని లడ్డూలో వాడలేదుకానీ చంద్రబాబు మాత్రం అడ్డమైన ఆరోపణలు చేశారుఅపవిత్రమైన లడ్డూలను భక్తులు తిన్నారని చంద్రబాబు అన్నారుజగన్ని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని ఇలాంటి దుర్మార్గపు ఆరోపణలు చేశారుచంద్రబాబుకు బుద్ది రావాలని వెంకటేశ్వర స్వామి ని కోరుకుంటున్నాంవెంకటేశ్వరస్వామిని కూడా రాజకీయాలకు వాడుకున్న దుర్మార్గుడు చంద్రబాబుఏ ల్యాబ్ కూడా కల్తీలు జరిగినట్టు రిపోర్టు ఇవ్వలేదుకల్తీ జరిగే అవకాశం ఉందని మాత్రమే చెప్పాయిదాన్ని పట్టుకుని చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయం చేశారుచంద్రబాబు అసలు వెంకటేశ్వర స్వామి భక్తుడేనా?నిజమైన భక్తుడే ఐతే ఎన్నిసార్లు తలీలాలు అర్పించారో చెప్పాలిసుప్రీంకోర్టు న్యాయమూర్తికి కూడా జగన్ లేఖ రాశారువిచారణ జరపాలని కోరాంసిట్ అంటే కూర్చునే, స్టాండ్ అంటే నిలపడే అధికారులతో సిట్ వేస్తే ఏం లాభం?టీడీపీ ఆఫీసులో లోకేష్ చెప్పినట్టు రిపోర్ట్ రాసే వారు ఇంకేం విచారణ చేస్తారు?చంద్రబాబు చేసిన పాపానికి ఆయనకే శిక్ష వేయాలిరాష్ట్రం సౌభాగ్యంగా ఉండాలని కోరుతూ శనివారం ప్రత్యేక పూజల కార్యక్రమానికి పిలుపునిస్తున్నాఇదీ చదవండి: తాము తీసుకున్న గోతిలోనే బాబు అండ్ కో -
వైఎస్సార్సీపీ కేడరే కూటమి టార్గెట్
నగరంపాలెం(గుంటూరు): టీడీపీ కార్యాలయంపై దాడి కేసు అంటూ గుంటూరు, కృష్ణా జిల్లాలోని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో అక్రమంగా అరెస్టయి, గుంటూరుజిల్లా కారాగారంలో ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్, విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజ భర్త శ్రీనివాసరెడ్డిని పేర్ని నాని, ఎమ్మెల్సీ బొమ్మి ఇశ్రాయేల్, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్, గుంటూరు ప్రత్తిపాడు ఇన్చార్జి బలసాని కిరణ్కుమార్, నందిగం సురేష్ కుటుంబ సభ్యులు శుక్రవారం ములాఖత్లో విడివిడిగా కలిశారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా ఉన్న నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి జైళ్లకి పంపిస్తున్నారని, టీడీపీ కార్యకర్తలతో దొంగ సాక్ష్యాలు ఇప్పిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ కార్యాలయం బాత్రూంలు, పరిసరాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయని, సీసీటీవీల ఫుటేజీ పోలీసుల వద్ద ఉందని టీడీపీ నాయకులు చెబుతున్నారని, ఆ పుటేజీల్లో ఎక్కడా లేని మాజీ ఎంపీ నందిగం సురే‹Ù, శ్రీనివాసరెడ్డిని ఎలా అరెస్ట్ చేస్తారని నిలదీశారు. ఈ కేసులో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో క్రియాశీలకంగా ఉన్న 171 మందిని తీసుకువచ్చారని, వారెవరూ సీసీ టీవీ ఫుటేజీల్లో లేరని తెలిపారు. తప్పుడు కేసులతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను కుంగదీయాలనే కూటమి పెద్దలు ఇలా చేస్తున్నారని, వారి ఆశలు నెరవేరవని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరినీ జైళ్లలో వేసినా తమ పార్టీకి ఏమీ కాదని, వారంతా తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కోసం రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారని తెలిపారు. ఓవైపు వరదలతో ప్రజలు అనేక కష్టాలు పడుతున్నా, అనేక మంది మృత్యువాత పడుతున్నా కూటమి ప్రభుత్వానికి పట్టడంలేదని అన్నారు. కేవలం వైఎస్సార్సీపీ వారిపై కక్ష సాధించాలన్న తపనే ప్రభుత్వంలో కనపడుతోందన్నారు. ప్రభుత్వ పెద్దల తప్పుడు చర్యలే వరదలకు, భారీ నష్టానికి కారణమన్నారు. వరద బాధితులను కాపాడేందుకు, వారికి ఆహారాన్ని అందించేందుకు పోలీసులను పంపడంలేదని, వైఎస్సార్సీపీ మాజీ మంత్రి జోగి రమే‹Ùను పట్టుకునేందుకు ఓ వంద మంది, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ఆచూకీ కోసం మరో 200 మంది పోలీసులను పంపించడం కూటమి ప్రభుత్వ నీచత్వానికి పరాకాష్ట అని అన్నారు. -
అక్కడ వందలమంది చావుబతుకుల్లో ఉంటే.. ఇక్కడేమో చంద్రబాబు శవ రాజకీయం..
-
నందిగం సురేష్ అరెస్ట్ పై పేర్నినాని రియాక్షన్
-
పోలీసుల సమక్షంలోనే పేర్ని నానిపై దాడి
-
పేర్ని నాని లక్ష్యంగా టీడీపీ, జనసేన శ్రేణుల వీరంగం
సాక్షి, అమరావతి/గుడివాడటౌన్/తాడేపల్లి/నెహ్రూనగర్: కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో ఆదివారం జనసేన, టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) లక్ష్యంగా బీభత్సం సృష్టించారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ప్రతినిధి ఇంటూరి రవికిరణ్ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. రవి కిరణ్కు బెయిల్ ఇచ్చి విడుదల చేయించేందుకు పేర్ని నాని, పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ పోలీస్ స్టేషన్కు వచ్చారు. స్టేషన్లో రవికిరణ్కు బెయిల్ ఇప్పించిన అనంతరం పేర్ని నాని ఆయన అనుచరులతో కలిసి రాజేంద్రనగర్లోని వైఎస్సార్సీపీకి చెందిన తోట శివాజీ ఇంటికి వెళ్లారు. పేర్ని నాని పట్టణానికి వచ్చిన సమాచారం అందుకున్న జనసేన, టీడీపీ నేతలు ఒక్కసారిగా రెచ్చిపోయారు.తోట శివాజీ ఇంటి వద్దకు చేరుకుని పేర్ని నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆదివారం కావడం, ఇతర కార్యక్రమాలు లేకపోవడంతో కార్యకర్తలు భారీగా గుమికూడారు. ఇంటిబైట ఉన్న నాని కారును ధ్వంసం చేశారు. రాళ్లతో కారు అద్దాలు పగలగొట్టారు. కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పేర్ని నాని.. జనసేన నాయకులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారించినప్పటికీ ఫలితం లేకపోయింది. సుమారు రెండు గంటలు పైబడి పేర్ని నానికి, వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.పోలీసుల సమక్షంలోనే ఈ దౌర్జన్యం, దాడులు కొనసాగాయి. దాడుల విషయం తెలుసుకుని టిడ్కో గృహాల వద్ద మరో కారుతో పేర్ని నాని డ్రైవర్ సిద్ధంగా ఉండగా.. అక్కడకూ వెళ్లి ఆ కారుపైనా దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే ఈ దాడులు జరుగుతున్నా వారు చేష్టలుడిగి చూస్తుండిపోయారు. అనంతరం పోలీసులు జనసేన శ్రేణులను అక్కడ నుంచి పంపించి.. పేర్ని నానిని పట్టణం దాటించారు. కాగా, పేర్ని నానిపై టీడీపీ, జనసేన నేతల దాడిపై మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆటవిక పాలనకు ఇలాంటి ఘటనలే తార్కాణమన్నారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్ అరెస్టును ఆ పార్టీ లోక్సభ పక్ష నాయకుడు పెద్దిరెడ్డి మిథున్రెడ్డి ఖండించారు. -
కక్షసాధింపు ఆపకపోతే తిరగబడతారు: అంబటి రాంబాబు
సాక్షి,గుంటూరు: మాజీ మంత్రి పేర్నినాని, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ గుడివాడలో నాని బంధువును పలకరించడానికి వెళితే రాళ్లు రువ్వారని వైఎస్సార్సీపీ నేత అంబటిరాంబాబు అన్నారు. ఈ ఘటనపై తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం(సెప్టెంబర్1) అంబటి మీడియాతో మాట్లాడారు.పేర్నినానిపై జరిగిన దాడిపై ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. జిల్లా ఎస్పీకి తమ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స ఫోన్ చేసినా ఎస్పీ ఫోన్ తీయలేదన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని మండిపడ్డారు. అంబటి ప్రెస్మీట్ ముఖ్యాంశాలు..మాజీ మంత్రిని తిరగటానికి వీళ్ళేదని అనటం సమంజసమాచట్టబద్దంగా వ్యవరిస్తామని చంద్రబాబు పదేపదే చెబుతున్నారుఇంటూరు రవి కిరణ్ ఎన్నికల ముందు సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారని పోలీసులు అదుపులోకి తీసుకున్నారుఅతన్ని న్యాయవాదుల సాయంతో పేర్ని నాని పీఎస్ నుంచి బయటకు తీసుకొచ్చారుఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాక మరేంటిపోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయి రాష్ట్రంలో అరాచకత్వం ప్రబలుతోందిపోలీసులు రక్షణ కల్పించకపోవడం ధర్మమేనావరద బాధితులకు సాయం చేయాల్సిన సమయంలో ఇటువంటి దాడులు చేస్తారాహోంమంత్రి సమాధానం చెప్పాలిఇది సరైన విధానం కాదుతప్పుడు కేసులు పెడుతూనే దౌర్జన్యాలకు పాల్పడుతున్నారుకక్ష సాధింపు చర్యలు మానుకో కుంటే మావాళ్ళు తిరగబడతారుపోలీసులపై కూడా కేసులు పెడతామంటున్నారుముంబై నటి కేసులో ముగ్గురు ఐపిఎస్ లపై కేసు పెడతామంటున్నారుప్రభుత్వాలు మారతాయి. కొత్త సాంప్రదాయాలకు అధికారులు తెర తీయవద్దుపోలీసుల్లో ఒక వర్గాన్ని గుర్తించి వారిని అణిచి వేయాలని సూచిస్తున్నారురెడ్ బుక్ లో రాసిన వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పపడుతున్నారుగడ్లవల్లేరు కాలేజ్ చిన్న సంఘటన అంటూ లోకేష్ మాట్లాడుతున్నారుమీ ప్రభుత్వంలో జరిగితే చిన్న విషయమాచర్యలు తీసుకోవాల్సిన బాధ్యత లేదాప్రకాశం బ్యారేజి నుండి ఎనిమిది లక్షల క్యూసెక్కుల నీరు విడుదల అవుతుందిదీంతో చంద్రబాబు ఇల్లు మునుగుతుందిసీఎం మచిలీపట్నం అతిధి గృహంలో ఉంటారంటున్నారుఅక్రమ కట్టడంలో చంద్రబాబు ఉంటున్నారని మీము మొదట నుండి చెబుతున్నాంనది గర్భంలో ఉన్న ఇంటిలో ఉంటే వరద వచ్చినప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాల్సి ఉంటుందిసాక్షాత్తు సీఎం సురక్షిత ప్రాంతానికి తరలి పోతున్నారులోకేష్ పరిధిలోని విద్యాశాఖలోని ట్రిబుల్ ఐటీ కాలేజ్, గుడ్లవల్లేరు కాలేజీ ఘటనలపై లోకేష్ విఫలమయ్యారు. -
రాష్ట్రంలో ఆటవిక పాలనకు ఇదే నిదర్శనం : బొత్స
సాక్షి,అమరావతి : గుడివాడలో పేర్నినాని కారుపై దాడి ఘటనను వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఖండించారు. ఈ మేరకు బొత్స పోలీసు అధికారులు ఫోన్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు సన్నగిల్లుతున్నాయని అన్నారు. పార్టీ నాయకులకు ఏమైనా జరిగితే పోలీసులు బాధ్యత వహించాల్సి ఉంటుందని బొత్స సత్యనారాయణ ఎస్పీకి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆటవిక పాలనకు ఇలాంటి ఘటనలే నిదర్శనమన్నారు బొత్స.కొనసాగుతున్న రెడ్ బుక్ రాజ్యంగంరాష్ట్రంలో ఆటవిక పాలన, రెడ్బుక్ రాజ్యాంగం కొనసాగుతుంది. గుడివాడలో పేర్ని నాని లక్ష్యంగా రెండు సార్లు దాడులు జరిగాయి. సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్కు అండగా న్యాయ సహాయం కోసం గుడివాడ వెళ్లారు పేర్నినాని,కైలే అనిల్. ఇంటూరిని విడిపించిన తర్వాత స్నేహితుడి ఆహ్వానం మేరకు టీ తాగేందుకు వారి ఇంటికి వెళ్లారు పేర్ని నాని. దీంతో రెచ్చి పోయిన జనసేన, టీడీపీ కార్యకర్తలు పేర్నినాని కారుపై రాళ్ల దాడి చేశారు. అద్దాలు పగుల గొట్టారు.పోలీసుల సమక్షంలోఇక ఈ ఏపిసోడ్ మొత్తం పోలీసుల సమక్షంలో జరగడం గమనార్హం. పోలీసుల సమక్షంలో దాడులకు తెగబడ్డారు టీడీపీ, జనసేన కార్యకర్తలు. అటు దాడులు గురించి సమాచారం తెలుసుకుని టిడ్కో గృహాల వద్ద మరో కారును ఉంచారు పేర్ని నాని కారు డ్రైవర్. అయితే, అక్కడకు వెళ్లిమరీ కారుపై దాడి చేశారు. -
గుడివాడలో పేర్నినాని కారుపై రాళ్ల దాడి
సాక్షి,అమరావతి : గుడివాడలో మాజీ మంత్రి పేర్ని నాని కారుపై రాళ్ల దాడి కలకలం రేపుతుంది. వైఎస్సార్సీపీ నేత వైసీపీ నేత తోట శివాజీ మాజీ మంత్రి పేర్ని నాని,మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ వెళ్లారు. ఆ ఇద్దరు నేతలు శివాజీ ఇంట్లో ఉన్న సమయంలో.. ఇంటి బయటే టీడీపీ, జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. పరుష పదజాలంతో దూషిస్తూ.. తాము దాడి చేసేందుకు వచ్చామంటూ హెచ్చరికలు జారీ చేశారు.టీడీపీ, జనసేన నేతల దాడిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అయినప్పటికీ వారిని నిలురించే ప్రయత్నం చేయలేదు. సుమారు రెండు గంటలకు పైగా పేర్నినాని శివాజీ ఇంట్లోనే ఉన్నారు.ఏపీలో ఆటవిక పాలన, రెడ్బుక్ రాజ్యాంగంఏపీలో ఆటవిక పాలన, రెడ్బుక్జ్యాంగం కొనసాగుతోంది. గుడివాడలో మాజీ మంత్రి పేర్ని నాని లక్ష్యంగా రెండు సార్లు దాడులకు పాల్పడ్డారు టీడీపీ, జనసేన నేతలు. కారుపై దాడిచేసి అద్ధాలు పగలగొట్టారు టీడీపీ, జనసేన నాయకులు. పోలీసుల సమక్షంలో దాడులకు పాల్పడ్డారు.సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్కు అండగా ఉండేందుకు న్యాయ సహాయం కోసం పేర్ని నాని, కైలే అనిల్లు గుడివాడ వెళ్లారు. ఈ క్రమంలోనే పేర్ని నాని కారుపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు కూటమి నేతలు. టిడ్కో గృహాల వద్ద మరో కారును పేర్ని నాని డ్రైవర్ ఉంచగా. అక్కడకు వెళ్లిమరీ కారుపై దాడికి పాల్పడ్డారు. -
బాబూ ఎందుకీ ‘కొనుగోలు’ డ్రామాలు..
-
బాబుకు పేర్నినాని కౌంటర్
-
మా జగన్ ఎన్టీఆర్ లా అమాయకుడు కాదు నీ ఆటలు సాగవ్
-
చంద్రబాబూ ఎందుకీ ‘కొనుగోలు’ డ్రామాలు: పేర్ని నాని
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో చంద్రబాబు అతిపెద్ద రాజకీయ ఆషాడభూతి.. నమ్మిన వారిని మోసం చేయడం ఆయనకు అలవాటు.. అది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అంటూ మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఏనాడూ తన సొంత బలంతో గెలవలేదని గుర్తు చేశారు. ఇంకా ప్రలోభాలు, కొనుగోళ్లు చంద్రబాబుకు అలవాటు అని, ఇప్పుడు కూడా యథేచ్ఛగా తమ పార్టీ ఎంపీలను కొనుగోలు చేశారని, అది చూస్తుంటే ఆయనపై జాలి కలుగుతోందన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా తమ పార్టీ చెక్కుచెదరదని, తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ని ఏమీ చేయలేరని పేర్ని నాని స్పష్టం చేశారు.ఆ భయం చంద్రబాబును వెంటాడుతోంది..వైఎస్ జగన్ తనకు రాజకీయంగా అడ్డు పడతారన్న భయం చంద్రబాబును వెంటాడుతోందని, అందుకే 2011 నుంచి ఆయనను రాజకీయాల నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని పేర్ని నాని తెలిపారు. ఆ ప్రక్రియలోనే జగన్గారిని అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టారని, అయినా ఆయన ధైర్యం కోల్పోకుండా ప్రజల్లో నిల్చి, తొలుత 67 సీట్లు గెల్చి సత్తా చూపారని గుర్తు చేశారు. అప్పుడు కూడా తమ పార్టీని, జగన్ని నిర్వీర్యం చేసేందుకు సంతలో పశువుల్లా 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను కొనుగోలు చేశారని చెప్పారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా..టీడీపీలోకి ఎవరైనా రావాలంటే రాజీనామా చేశాకే ఆ పని చేయాలని చెబుతున్న చంద్రబాబు, అప్పుడు ఆ 23 మందితో ఎందుకు రాజీనామా చేయించలేదని పేర్ని నాని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా విజయవాడ, విశాఖ కార్పొరేషన్ల నుంచి టీడీపీ కండువాలు కప్పుకున్న మేయర్లు, కార్పొరేటర్లతో ఎందుకు రాజీనామా చేయించలేదని నిలదీశారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా రాజకీయంగా జగన్ని ఒక్క అంగుళం కూడా తగ్గించలేరని తేల్చి చెప్పారు.జగన్ గెలవాలంటే జనం సాయం చాలు‘చంద్రబాబు గెలవాలంటే ఇతర పార్టీల సాయం అవసరం. అదే జగన్ గెలవాలంటే జనం సాయం చాలు’.. అని మాజీ మంత్రి స్పష్టం చేశారు. స్వార్థంతో రాజకీయాలు చేసే జంప్ జిలానీ బ్యాచ్లు జగన్ని అవసరం లేదని తేల్చి చెప్పారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, 2029 ఎన్నికల్లో ప్రజలు వారికి కచ్చితంగా తగిన బుద్ధి చెబుతారని అన్నారు. వెనకబడిన వర్గాలకు రాజకీయాల్లో ప్రాధాన్యం ఇచ్చిన జగన్, వారికి పదవులు కట్టబెట్టారని పేర్ని నాని గుర్తు చేశారు. ఇప్పుడు రాజ్యసభలో ఖాళీ అయిన రెండు పదవుల్లో చంద్రబాబు అదే సామాజిక వర్గాల వారిని నియమించాలని సవాల్ చేశారు.ప్రజల దృష్టి మళ్లించేందుకే డైవర్షన్ పాలిటిక్స్కేవలం జగన్ వల్లనే ఒక మత్స్యకారుడు పెద్లలసభలో అడుగుపెట్టగలిగాడని పేర్ని నాని గుర్తు చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలమైన చంద్రబాబు, వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు (డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ) ఇలా ప్రలోభాలతో ఎంపీలను కొనుగోలు చేస్తున్నారని అన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా, శాంతి భద్రతల గురించి అస్సలు ఆలోచించకుండా, బాధ్యతను పూర్తిగా మర్చిన హోం మంత్రి, ఇష్టానుసారం మాట్లాడుతున్నారని పేర్ని నాని ఆక్షేపించారు.మీడియా ప్రశ్నలకు సమాధానంగా..ఆనాడు తమ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి ఉంటే, టీడీపీలో ఒక్కరు కూడా మిగిలే వారు కారన్న పేర్ని నాని.. ఇప్పుడు లావాదేవీలే తప్ప రాజకీయాలు లేవని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చినా, నిత్యం మాపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ కూటమి, ఎల్లో మీడియా.. తాజాగా ఒక సినీ నటి కేసు టేకప్ చేశారని చెప్పారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో అభియోగాలు ఎదుర్కొంటూ, కేసులు నమోదైన ఆమెను తెరపైకి తీసుకొచ్చి, ఇక్కడ అనేక మంది ఐపీఎస్ అధికారులను వేధించడమే లక్ష్యంగా ఎల్లో మీడియా డ్రామా చేస్తోందని వెల్లడించారు. 2014లో మా పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత, ఏనాడూ మా పార్టీ గుమ్మం తొక్కని కుక్కల విద్యాసాగర్ను, ఇప్పుడు మా పార్టీకి అంటగడుతున్నారని, ఇదంతా టార్గెటెడ్ ఐపీఎస్ అధికారులను వేధించడమే లక్ష్యంగా జరుగుతున్న కుట్ర అని పేర్ని నాని తెలిపారు. ఆ నటి వ్యవహారాలన్నీ త్వరలోనే బయటకు వస్తాయని చెప్పారు. -
చంద్రబాబుకు పాలించే సత్తా లేకే జగన్ పై ఏడుపు
-
జగన్ మీద పడి ఏడవటం కాదు..
-
బాబూ.. దమ్ముంటే ఆ లెక్కలు బయటపెట్టు: పేర్ని నాని
సాక్షి, గుంటూరు: వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా చేసిన మంచిని కూటమి ప్రభుత్వం చూడలేక పోతోందని.. ప్రజల బాగోగులు వదిలేసి ఆయనపై అభాండాలు వేస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘రూ.3.63 కోట్లతో ఎగ్పఫ్లు తిన్నారని తప్పుడు పోస్టులు పెట్టారు. బాబుకు చిత్తశుద్ధి ఉంటే ఆ లెక్కలన్నీ బయటపెట్టాలి’’ అని పేర్ని నాని సవాల్ విసిరారు.‘‘బొద్ధింకలు, ఎలుకలను పట్టుకునేందుకు బాబే కోట్లు చెల్లించారు. పాలించే సత్తాలేక జగన్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దుష్ప్రచారంపై కాదు.. హామీల అమలుపై దృష్టిపెట్టండి’’ అని పేర్ని నాని హితవు పలికారు.‘‘జీఏడీ చంద్రబాబు చేతిలో ఉంది. జగన్ ప్రభుత్వంలో అలాంటి తప్పుడు పనులు చేయలేరు. చంద్రబాబు హయాంలో బల్లులు, బొద్దింకలు, ఎలుకలను పట్టుకునేందుకు కోట్లు చెల్లించారు. ఆ ఘనత చంద్రబాబు ప్రభుత్వానిది. టమోటా రైతులను దత్తత తీసుకుంటానని లోకేష్ పాదయాత్రలో చెప్పారు. ఇప్పుడు ఆ రైతులు అలోలక్ష్మణా అని బాధ పడుతుంటే.. మరి లోకేష్ ఏం చేస్తున్నారు?’’ అంటూ పేర్ని నాని నిలదీశారు.‘‘మెడికల్ కాలేజీల్లో సీట్లు అమ్ముకుంటున్నారంటూ అప్పట్లో గొడవ చేశారు. మరి దళితులు, పేదలు చదవకూడదా?. అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగ, అధికారంలోకి వచ్చాక ఇంకోలా మాట్లాడటం ఎందుకు?. ప్రభుత్వం వచ్చి వంద రోజులు అవుతున్నా టమోటా రైతులను ఎందుకి దత్తత తీసుకోలేదు?. వైఎస్సార్సీపీ వారిపై దాడి చేయటం కాదు.. జనానికి ఉపయోగపడే పనులు చేయాలి. చంద్రబాబుకు దమ్ముంటే పఫ్ల లెక్కలు బయటపెట్టాలి.. పరిపాలన చేయటం చేతకాక జగన్పై పడి ఏడవటం మానుకోవాలి. జీఏడీ శాఖ మంత్రిగా కూడా ఉన్న చంద్రబాబు పఫ్ల ఖర్చు ఫైల్ బయట పెట్టగలరా?’’ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు.ఎంగిలి బిస్కెట్లకి ఆశపడి @ysjagan గారిపై ఉద్దేశపూర్వకంగా బురద చల్లుతున్న పచ్చమందసిగ్గులేకుండా తప్పుడు వార్తలు రాస్తున్నారే.. ఇది జర్నలిజమా.. బ్రోకరిజమా? దమ్ము, ధైర్యముంటే సాక్ష్యాలతో నిరూపించండి. లేదా తప్పుడు సమాచారం ఇచ్చినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. pic.twitter.com/RYSchbcDBn— YSR Congress Party (@YSRCParty) August 21, 2024 -
నువ్వు ఏమన్నా చేసుకో మేం భయపడం
-
మా 175 మందిని అరెస్ట్ చేసుకో..
-
వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్గా టీడీపీ కక్ష సాధింపు: పేర్ని నాని
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ నేతలపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు పథకాల అమలు చేయకుండా.. వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ధ్వజమ్తెతారు. అగ్రిగోల్డ్ భూములు జోగి రమేష్ కుమారుడు కొన్న భూములకు దగ్గరలో కూడా లేవన్నారు.2022లో పేపర్ ప్రకటన జోగి రమేష్ ఇచ్చారు. ఆయన దగ్గర స్థలం కొన్నప్పుడు కూడా వాళ్లు కూడా పేపర్ ప్రకటన ఇచ్చారు. సీబీఐ కూడా ఎక్కడా అభ్యంతరాలు చెప్పలేదు. ఆగస్ట్ 2న ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. చంద్రబాబుపై జోగి రమేష్ గట్టిగా మాట్లాడారు కాబట్టే కక్ష కడుపులో పెట్టుకొని ఆయన కొడుకుపై అక్రమ కేసులు పెట్టారు.’’ అని పేర్ని నాని మండిపడ్డారు.‘‘175 నియోజకవర్గాల్లో అందరిని జైల్లో వేసిన పోరాటం ఆపం. టీడీపీ చేసే తప్పులపై పోరాటం చేస్తాం.. 2029లో టీడీపీని కులగొట్టేందుకు కావాల్సిన పోరాటం చేస్తాం. పొలం అమ్మిన వారు ముద్దాయిలుగా లేరు.. అమ్మిన వాళ్లు చంద్రబాబు చుట్టాలయి వుంటారు. అరెస్టులు చేసి తప్ఫడు కేసులు పెట్టి మానసిక ఆనందం పొందుతున్నారు. రెడ్ బుక్లో ఎవరెవరు పేర్లు ఉన్నాయో వాళ్లను వేధిస్తున్నారు. ఒకే సంఘటనకు రెండు కేసులు పెట్టారు. మానసిన ఆనందం తాత్కాలికం..’’ అని పేర్ని నాని దుయ్యబట్టారు. -
రెడ్బుక్ రాజ్యాంగానికి లోబడే పాలన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రెండు నెలలుగా అంబేడ్కర్ రాజ్యాంగం బదులు.. నారా లోకేశ్ ప్రకటించిన రెడ్బుక్ రాజ్యాంగానికి లోబడి పరిపాలన సాగుతోందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడే పోలీసులను కొత్త పోకడలతో నడిపించే పరిస్థితి కనిపిస్తోందని ఆయనన్నారు. గతంలో ఎప్పుడూలేని పోకడలు రెండు నెలలుగా రాష్ట్రంలో చూస్తున్నామని చెప్పారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో యూపీ, బిహార్లో ఇలా ప్రభుత్వ ప్రేరేపిత హింసను చూశామని.. ఇప్పుడా పరిస్థితి మన రాష్ట్రంలో నెలకొందన్నారు. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరుగుతోందని.. చివరకు వారిపైనా దాడులు జరుగుతున్నాయన్నారు. ఇంత జరుగుతున్నా, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ నోరు మెదపడంలేదని ఆక్షేపించారు. నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామాపురంలో జరిగిన దారుణ హత్య అత్యంత హేయమని చెప్పారు. ‘రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని ఓ రిటైర్డ్ డీజీపీ, రిటైర్డ్ ఐజీ ఇద్దరూ కలిసి అమలుచేస్తున్నారు. జగ్గయ్యపేటలో గంజిపల్లి శ్రీనివాస్పై పచ్చమూకలు అత్యంత దారుణంగా దాడికి తెగబడ్డాయి. సీతారామాపురం హత్య ఘటనపై కూటమి ప్రభుత్వ పెద్దలు సిగ్గుపడాలి. ఇక వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో నాటి సీఎం జగన్ పార్టీలకతీతంగా, అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలుచేయాలని చెప్పారు. కానీ, సోమవారం నాటి కలెక్టర్ల కాన్ఫరెన్స్లో రాజకీయ పార్టీ తరహాలోనే ప్రభుత్వాన్ని నడుపుతామని చంద్రబాబు చెప్పారు. ఎన్నికల హామీల గురించి ప్రస్తావించలేదు’ అని అన్నారు. -
ఏపీలో ప్రభుత్వ ప్రేరేపిత హింస జరుగుతోంది: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వంలో హింస రోజురోజుకు పెరుగుతోందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. రెడ్ బుక్ రాజ్యాంగం కారణంగా పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందన్నారు. అలాగే, పోలీసుల ముందే దారుణాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులు ఎవరో తెలిసిప్పటికీ వారి పేర్లను బయటకు చెప్పడం లేదన్నారు. కాగా, మాజీ మంత్రి పేర్ని నాని సోమవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడూ ఇటువంటి ఘటనలు జరగలేదు. ఏపీలో రాజకీయ ప్రేరేపిత దాడులు జరుగుతున్నాయి. ఏపీలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. ప్రభుత్వ ప్రేరేపిత హింసలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. పోలీసుల కళ్ల ముందే దారుణాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో కుట్రలతో వైఎస్సార్సీపీ కార్యకర్తలను చంపుతున్నా పట్టించుకోవడం లేదు. కనీసం ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయడం లేదు.ప్రాణహాని ఉందని చెప్పినా ఏ మాత్రం స్పందించడం లేదు. నంద్యాలలో టీడీపీ నేతలు మారణాయుధాలతో రోడ్లపై తిరుగుతున్నారు. ఏపీలో విచిత్రమైన పోలీస్ వ్యవస్థ ఉంది. రాజకీయ హత్యలను దుండగులు చంపేశారని ప్రచారం చేస్తున్నారు. సీతారామపురంలో అమాయకుడిని దారుణంగా హత్య చేశారు. సుబ్బారాయుడు అనే వ్యక్తిని చంపేసినా పట్టించుకోలేదు. తనకు ప్రాణహాని ఉందని నారప్ప రెడ్డి చెప్పినా పోలీసులు స్పందించలేదు. మా కార్యకర్తలను చంపుతుంటే ఈనాడు కూడా వార్తలు రాయడం లేదు. నిందితులు ఎవరో తెలిసిప్పటికీ వారి పేర్లను బయటకు చెప్పడం లేదు. ఇలాంటి ప్రభుత్వ ప్రేరేపిత హింస ఏ రాష్ట్రంలోనైనా ఉందా?. నడిరోడ్లపై హత్యలు, దాడులు చేస్తుంటే పోలీసులు కనీసం గాల్లోకి కూడా కాల్పులు జరపలేదు. కళ్ల ముందే మనిషిని చంపుతుంటే పోలీసులు ఆపలేరా? అని ప్రశ్నించారు. ఏపీ చరిత్రలో పోలీసుల కొత్త పోకడలు ఇప్పుడు చూస్తున్నాం. బీహార్లో ప్రభుత్వ ప్రేరేపిత ఘటనలు జరిగేవి. రాజకీయ నేర సంఘటనలు చూస్తుంటే ఉత్తరాది రాష్ట్రాల తరహా హింస జరుగుతోంది. బీహారులో ప్రస్తుతం శాంతిభద్రతలు అమల్లోకి వచ్చాయి. కానీ ఏపీలో మాత్రం రోజురోజుకూ పెరిగిపోతోంది. పోలీసులు కూడా కూటమి నేతల చేతిలో అగౌరవపడుతున్నారు. కూటమి ప్రభుత్వ ప్రేరేపిత హింసకి పోలీసులే సాక్ష్యంగా మిగిలారు. పోలీసు వ్యవస్థ అంతా పాత డీజీపీ, పాత ఐజీ చేతిలో ఉంది. ఎవర్ని సస్పెండ్ చేయాలన్నా ట్రాన్స్ఫర్ చేయాలన్నా వారిదే పెత్తనం. దేశంలో ఇంత కిరాతకంగా ప్రభుత్వ హింస ఇంకెక్కడైనా జరుగుతుందా?. శాంతిభద్రతల విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిలక పలుకులు పలికారు. ఇప్పుడు దారుణాలు జరుగుతున్నా వారు పట్టించుకోవడం లేదు. అధికారంలోకి వచ్చి యాభై రోజులు దాటినా వారికి రక్తదాహం తీరలేదు. వాలంటీర్లకు పదివేలు ఇస్తానని ఎగ్గొట్టారు. ఎమ్మెల్యేలు, కలెక్టర్లు కలిసి ఒక వాట్సాప్ గ్రూపు పెట్టుకోవాలని చంద్రబాబు సూచించడం దేనికి సంకేతం?. వైఎస్సార్సీపీ హయంలో అందరికీ న్యాయం చేయాలని కలెక్టర్లతో వైఎస్ జగన్ చెప్పారు. చంద్రబాబు మాత్రం మాది పొలిటికల్ గవర్నెన్స్ అని బాహాటంగానే చెప్పారు. ఇలాంటి దిక్కుమాలిన దిగజారిన ప్రభుత్వాన్ని ఏపీలో చూస్తున్నాం. మేనిఫెస్టో పథకాల గురించి చంద్రబాబు కలెక్టర్లతో ఎందుకు మాట్లాడరు?. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చే నాటికి ఖజానా ఖాళీగా ఉన్నా పథకాలు ఆపకుండా ఇచ్చారు. సోషల్ మీడియాని సర్వనాశనం చేసిందే చంద్రబాబు. అలాంటి వ్యక్తి ఇప్పుడు తప్పుడు సమాచారం వస్తే కేసులు పెట్టమంటున్నారు. భట్టిప్రోలులో టీడీపీ నేతలు ఎస్ఐ చొక్కా పట్డుకున్నారు. వైఎస్ జగన్ మీద విషం కక్కిన ఎల్లో మీడియా మంచిదంటా?. నిజాలు రాసే సాక్షి మీద కేసులు పెడతారంట. ఖాకీ పౌరుషం తెలుసు అని మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదు?. అక్రమ నిర్మాణాలు చేపట్టిన భవనాలను కొచ్చిన్, ఢిల్లీలో కోర్టులు కూల్చేశాయి. మరి ఆ కోర్టులను కూడా ఎందుకు తప్పు పట్టలేదు?. అసలు చంద్రబాబు నివాసం ఉంటున్న ఇల్లు అక్రమ కట్టడం కాదా?. రూల్స్కి విరుద్దంగా ఉందని దాన్ని కూల్చడానికి గతంలో మీ ప్రభుత్వమే నోటీసులు ఇచ్చిందా? లేదా?. చివరికి ఆర్మీ జవాను ఇంటిని కూల్చటానికి కూడా చంద్రబాబు ప్రభుత్వం ముందుకు వచ్చింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
ఏపీలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయింది: పేర్నినాని
-
వల్లభనేని వంశీ అరెస్ట్ పై పేర్నినాని కామెంట్స్
-
వైఎస్సార్సీపీ నేతల అక్రమ అరెస్టులు, బెయిల్ రాకుండా సెక్షన్లు మారుస్తున్నారు : పేర్ని నాని
ఏలూరు, సాక్షి: ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక వైఎస్సార్సీపీ జెండా మోసిన కార్యకర్తలను టార్గెట్ చేశారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ప్రజలకు మంచి చేయడం మాని వైఎస్సార్సీపీ కార్యకర్తలతో జైళ్లను నింపే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు. నూజివీడు సబ్ జైల్లో ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను పేర్నినానితోపాటు, మాజీ ఎమ్మెల్యేలు కైలే అనిల్ కుమార్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం పరామర్శించారు. ఆనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.‘చంద్రబాబు సమావేశాల్లో అమరావతి, అభివృద్ధి, సంపద సృష్టి అని కబుర్లు చెబుతున్నారు. కానీ తెరవెనుక జరిగేదంతా మట్టి, ఇసుక దోపిడీ, లే అవుట్ల పేరుతో దోపిడీ చేస్తున్నారు. అక్రమ కేసులతో వైఎస్సార్సీపీ కార్యకర్తలను జైలులో వేస్తున్నారు. 2023 ఫిబ్రవరిలో వైఎస్సార్సీపీ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడికి వచ్చారు. టీడీపీ కార్యకర్తలపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు తిరగబడితే.. ఇప్పుడు తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇప్పటి వరకూ 71 మంది పేర్లను చేర్చారు. ఇంకా ఉన్నారని చెబుతున్నారు. గన్నవరం వైఎస్సార్సీపీలో యాక్టివ్గా ఉన్నవారిని పోలీసులను ఉపయోగించి అరెస్టులు చేయిస్తున్నారు. .. పోలీసులను అడ్డగోలుగా దిగజార్చి వాడుకుంటున్నారు. బెయిల్ రాకుండా చేయడానికి సెక్షన్లు మార్చి జైళ్లలో ఉంచుతున్నారు. అరెస్టైన వారిలో వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడి తల్లి చనిపోతే దినం చేయడానికి కూడా అనుమతి ఇవ్వలేదు. ఏడాది క్రితం జరిగిన కేసులో ఒక్కొక్కరినీ చేరుస్తూ అరెస్ట్ చేస్తున్నారు.పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జైల్లో ఉన్నవారిని పరామర్శించి వారికి ధైర్యం చెప్పాం. అక్రమంగా అరెస్టైన వారి బెయిల్ కోసం పార్టీ ప్రయత్నిస్తోంది. ఎన్ని కేసులు పెట్టినా జెండా వదిలిపెట్టేదిలేదని కార్యకర్తలు ధైర్యంగా ఉన్నారు. వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు ప్రచారం చేసి టీడీపీ నేతలు సునకానందం పొందుతున్నారు. గతంలో కొడాలి నానికి కేన్సర్ అంటూ ప్రచారం చేశారు. వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారంటూ వార్తలు వేసి శునకానందం పొందారు. వైఎస్సార్సీపీ కార్యాలయంపైకి బెజవాడ నుంచి గూండాలు దాడికి వస్తే.. వంశీపై అన్యాయంగా కేసు పెట్టారు. వంశీ న్యాయం కోసం పోరాడుతున్నారు. కచ్చితంగా బెయిల్ తీసుకుని వంశీ వస్తారు. టీడీపీ చేస్తున్న మోసాలను ప్రజలకు చేరవేసేందుకు ప్రజాపోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’అని అన్నారు. -
చెత్త పన్ను డబల్ చేసిన చెత్తగాళ్ళు
-
‘తప్పుడు’ లెక్కలే బాబు భయం
సాక్షి, అమరావతి: పూర్తిస్థాయి బడ్జెట్ కూడా ప్రవే శపెట్టలేని దుస్థితిలో చంద్రబాబు అనుభవం ఉందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఎద్దేవా చేశారు. రాష్ట్ర అప్పులపై వారు చేసిన విష ప్రచారం మొత్తం అవాస్తవమన్న విషయం బయటపడుతుందనే భయంతోనే పూర్తి స్థాయి బడ్జెట్ గురించి చంద్రబాబు ప్రభుత్వం ఆలోచన కూడా చేయడం లేదని అన్నారు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడే నాటికి రాష్ట్ర ఖజానాలో ఉన్నది రూ.100 కోట్లు మాత్రమేనని, అయినప్పటికీ తాము ఆ ఏడాది జూలై 12న పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టామని తెలిపారు.నాని మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జూన్ 12న చంద్రబాబు ప్రమాణ స్వీ కారానికి 2 రోజుల ముందే కేంద్రం నుంచి డబుల్ డెవల్యూషన్ ద్వారా రూ.5,655.72 కోట్లు వచ్చా యని, అయినా అట్టహాసంగా ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలకు నిధులివ్వలేకే పూర్తి స్థాయి బడ్జెట్కు వెనకాడుతున్నారన్నారు. ఇప్పటికే ఉచిత ఇసుక కొండెక్కగా, తల్లికి వందనంలో కోత పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. చిత్తశుద్ధి ఉంటే సూపర్ సిక్స్, పవన్ కళ్యాణ్ షణ్ముఖ వ్యూహానికి ఎంత బడ్జెట్ కేటాయిస్తారో ఎంత ఖర్చు చేస్తారో చెప్పాలన్నారు.రహస్యంగా బిల్స్ పాస్ చేసేందుకు, కేటాయింపు లు, శాఖల డిమాండ్లు కూడా చూపించాల్సిన అవసరం ఉండదనే ఆర్డినెన్స్ లేదా ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు వెళ్తున్నారని దుయ్యబట్టారు. నాడు అప్పు లపై అసత్యాలు ప్రచారం చేసిన టీడీపీ, కూటమి నేతలు ఇప్పుడు అప్పటికంటే ఎక్కువ తెస్తున్నారని, ఈ నెల రోజుల్లోనే పరిమితికి మించి అప్పు చేశారని చెప్పారు. హామీలు అమలు చేయలేక, వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు పర్యటనలు, శ్వేతపత్రాలతోనే బాబు కాలం వెళ్లదీస్తున్నారు. అప్పటికీ, ఇప్పటికీ రాష్ట్రంలో ఏం మారిందని నిలదీశారు.వైఎస్ జగన్పై దుర్భాషలాడటం, వ్యక్తిత్వ హననం చేయడం తప్ప చేసినదేముందని ప్రశ్నించారు. ద మ్ముంటే వైఎస్సార్సీపీ నేతలపై చేసిన ఆరోపణల్లో ఒక్క దానినైనా నిరూపించాలని సవాల్ చేశారు. త మ ప్రభుత్వం రైతులు, నిరుపేదలకు మేలు చేస్తూ అనేక భూములను నిషేధిత జాబితాల నుంచి తొ లగించి, హక్కులు కల్పించిందని తెలిపారు. త మ ప్రభు త్వం నెలకు రూ.30 నుంచి రూ.60 మా త్రమే చెత్త పన్ను వసూలు చేసిందన్నారు. ఇప్పుడు చెత్తకు రోజుకు రూ.3 పన్ను వసూలు చేయాలని పవన్ అంటున్నారని, ఇప్పుడు ఎవరు చెత్త సీఎం అని నిలదీశారు. అసెంబ్లీ సమావేశాలకు జగన్తో సహా పార్టీ ఎమ్మెల్యేలందరూ హాజరవుతారని తెలిపారు.మీడియా ముసుగులో వ్యక్తిత్వ హననం నీచంమీడియా ముసుగులో కొందరు దిగజారి ప్రవర్తిస్తున్నారని పేర్ని నాని మండిపడ్డారు. విజయసాయిరెడ్డి గానీ, చంద్రబాబు గానీ, పేర్ని నాని గానీ.. ఎవరైనా సరే.. ప్రజా జీవితంలో ఉన్న వారి మీద ఎవరైనా విమర్శలు చేసినప్పుడు మీడియా హుందాగా ప్రవర్తించాలన్నారు. ముందుగా వాటికి ఆధారాలున్నాయేమో చూడాలని, ఆధారాల్లేకపోతే ప్రచురించకూడదని, ప్రసారం చేయకూదని, అయితే ఇప్పుడు మీడియాలో ఇది జరగడంలేదని ఆక్షేపించారు. మీడియా అంతా రాజకీయ రంగులు పులుముకుందన్నారు. అందుకే ఆరోపణల విషయంలో ఫలానా వ్యక్తి ఆరోపించారని చెప్పకుండా పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.ఎంపీ వి.విజయసాయిపై ఒక వ్యక్తి ఆరోపణలు చేస్తే, ఆయన వివరణ తీసుకోకుండా, కనీసం మాట్లాడే ప్రయత్నం కూడా చేయకుండా, ఏకంగా ఒక ఛానల్ సీఈవోనే డిబేట్ పెట్టడం, అందులో నీచంగా మాట్లాడటం పూర్తిగా దిగజారి పోవడమే అని మండిపడ్డారు. ఛానల్ను హుందాగా నడపాల్సింది పోయి వ్యక్తిత్వ హననం చేస్తూ మనిషిని మానసికంగా చంపే ప్రయత్నం చేయడం హేయమన్నారు. ఓ మనిషిని రాజకీయంగా చంపటానికి, మానసికంగా పతనం చేయడానికి పైశాచికం ప్రదర్శించడం సరికాదన్నారు. పార్టీ మహిళా కార్యకర్తలతో టీవీలో తిట్టించడం దుర్మార్గమన్నారు. మీడియా ముసుగులో ఇంత అసహ్యంగా ప్రవర్తిస్తున్న వారిని, వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. -
చంద్రబాబూ.. మీ అనుభవం దేనికసలు?: పేర్ని నాని
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో కూటమి పాలన 30 రోజులు పూర్తయ్యిందని, తన అంత అనుభవజ్ఞుడు లేడని సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారాయన. ‘రాష్ట్రంలో కూటమి పాలన 30 రోజులు పూర్తయ్యింది. ఈ 35 రోజుల్లో చంద్రబాబు ఏం అడుగులు వేశారో చెప్పాలి. ఈ 35 రోజుల్లో పెన్షన్ డబ్బులు ఇవ్వడం తప్ప మరో పని చేయలేదు. జగన్ను దూషించటం తప్ప ఒక్క పని కూడా చేయలేదు. కాలక్షేపం కోసం శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారు. శ్వేతపత్రం విడుదల చేయడం తప్ ఒక్కటైనా నిరూపించారా? ఎన్నికల్లో చంద్రబాబు మాటలు కోటలు దాటాయి. ప్రజల కోసం చంద్రబాబు చేసిందేమి లేదు. పోలవరం ప్రాజెక్టు 70 శాతం మీరే కట్టారని చెప్తున్నారు. మిగతా 30 శాతం ఎప్పుడు పూర్తి చేస్తారని ప్రశ్నిస్తే సమాధానం లేదు. అమరావతి అంతా తిరిగారు. ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పరు. విద్యుత్ శాఖపై కూడా శ్వేతపత్రం ఇచ్చారు. వైఎస్ జగన్ మీద అబద్ధాలతో శ్వేత పత్రం విడుదల చేశారు.విద్యుత్ ఛార్జీలు తగ్గిద్దామని పవన్ కల్యాణ్ కూడా చెప్పారు. కరెంట్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల ముందు చెప్పారు. మళ్లీ విద్యుత్ ఛార్జీలపై చంద్రబాబు మాట మర్చేశారు. జగన్పై బాదుడే బాదుడే అంటూ అసత్య ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చి 35 రోజులైంది.. చెత్త పన్ను ఆపారా?. జగన్ అధికారంలో ఉన్నప్పుడు చెత్తపన్ను విధిస్తే విమర్శించారు. చెత్త పన్ను కొనసాగిస్తున్న మిమ్మల్ని ఏమనాలి?.. మైనింగ్పై అబద్ధాలతో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. మైన్స్లో మీకంటే రెండు రెట్లు ఎక్కువ ఆదాయం వైఎస్ జగన్ సమకూర్చారు. నాలుగు అసత్యాలు.. పది అబద్ధాలతో చంద్రబాబు శ్వేత పత్రం ఉంది. బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నారు. ఇదేనా మీ అనుభవం.. ఇంతకుమించి అని చేయలేరా? ఎన్నికల్లో మాత్రం జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తామన్నారు. సంపద సృష్టించి అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పుడు ఖజానా డబ్బులు లేవని మాటట్లాడుతున్నారు. బాబు సీఎం అయ్యే 48 గంటల ముందు కేంద్రం రూ. 5,600 కోట్లు ఇచ్చింది’ అని అన్నారు.చదవండి: పరిపాలన మరీ ఇంత అధ్వానమా? -
రోజుకో శ్వేత పత్రం
-
అప్పులు సృష్టించడమే బాబు పని
-
"ఆరడుగుల అబద్దం..' పేర్ని నాని నాన్ స్టాప్ కోటింగ్
-
అక్రమ కేసులు పెట్టడానికేనా ఎర్ర బుక్?: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వం అసత్యాలతో శ్వేతపత్రం విడుదల చేస్తోందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. అలాగే, ప్రతీరోజు ఏదో ఒకదానిపై శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. అసత్యాలు, తప్పుడు అంకెలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, పేర్ని నాని శుక్రవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులైంది. రాష్ట్రంలో కూటమి నేతలు శ్వేతపత్రాల విడుదల పేరుతో అబద్దాలు చెబుతున్నారు. హామీలు అమలు చేయకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ ఇస్తామన్నారు. ఇప్పుడు బిల్లులు ఎక్కువగా బిల్లులు వేస్తున్నారు. ట్రూఅప్ ఛార్జీలు గురించి విలేకరులు అడిగితే నేనెప్పుడు ఆమాట అన్నాను అన్నారు. అమరావతి నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందని ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పలేదుసంపద సృష్టించి అమరావతిని అభివృద్ధి చేస్తామన్నారు.. ఏమైంది?. అభివృద్ధిపై ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు. సంపద సృష్టిస్తామని చంద్రబాబు అనేక సార్లు మాట్లాడారు. 2019లో సంపద ఎక్కడుందో ఎవరికీ కనిపించలేదు. అప్పులు సృష్టించడంలో ఏపీని మొదటి స్థానంలో నిలబెట్టారు చంద్రబాబు. ఎర్రబుక్ అక్రమ కేసులు పెట్టడానికేనా?. పోలవరాన్ని నాశనం చేసిందే చంద్రబాబు. ఆయన నిర్వాకం వల్లే డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది. చంద్రబాబు, బీజేపీ కలిసే పోలవరాన్ని నాశనం చేశారు. నచ్చినోళ్లకు కాంట్రాక్ట్లు ఇచ్చి ప్రాజెక్ట్ను నాశనం చేశారు.ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ప్రతీ పిల్లాడికి రూ.15వేలు ఇస్తామన్నారు.. ఏమైంది?. రాష్ట్రంలో పిల్లలు హ్యాపీగా లేరు.. మంత్రి మాత్రం హ్యాపీగా ఉన్నారు. తల్లికి వందనం.. పిల్లలకు పంగనామాలు పెట్టి జనాన్ని మోసం చేశారు. ఆరడగుల అబద్ధం చంద్రబాబు. కూటమి అంతా హ్యాపీగా ఉంటే కాదు.. ప్రజలు కూడా హ్యాపీగా ఉండాలి. ఉచిత ఇసుక అంటారు.. వెంటనే డబ్బులు కట్టమంటారు. ఎప్పుడో జరిగిన ఘటనలపై ఇప్పుడు కేసులు పెడుతున్నారు.ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తామన్న బాబు.. ఇప్పుడేం చేయలేమని చెప్పడం విడ్డూరం. ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ మాటలు కోటలు దాటించారు. ఉచితం పేరుతో మళ్లీ దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేలు దోచుకోవడం కోసమే ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చారు. అధికారం లేనప్పుడు చంద్రబాబుకు ప్రజలపై వినయం, ప్రేమ ఉంటుంది. అధికారం రాగానే బాబు బలుపు మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే అమ్మఒడి తల్లుల ఖాతాల్లో వేసేవారు. విద్యాదీవెన, వసతి దీవెన లబ్దిదారుల ఖాతాల్లో పడేవి. ముగ్గురూ కలిసి సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారు. కూటమి బాస్ అయిన బీజేపీ వారే ఏపీ రూ.4 లక్షల కోట్లు అప్పులు చేసినట్లు చెప్పింది. కానీ, చంద్రబాబు మాత్రం పది లక్షల కోట్లు అంటూ అబద్దాలు చెప్తున్నారు. సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు చేతులెత్తేశారు. వైఎస్ జగన్ సీఎం అయ్యేనాటికే ఖజానా ఖాళీ అయింది. ఇక అప్పు కూడా పుట్టదని యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రజలను మోసం చేసి కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమి నేతలంతా ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే. పంచాయతీరాజ్ శాఖ తప్ప మరో శాఖ వైపు పవన్ చూడటం లేదు. షర్మిల ఎవరి కోసం రాజకీయాలు చేస్తున్నారో అందరికీ తెలుసు. బీజేపీ, చంద్రబాబు కోసమే షర్మిల రాజకీయం చేస్తున్నారు. అధికారంలో ఉన్నవాళ్లను వదిలేసి, మమ్మల్ని ప్రశ్నించడమేంటి? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
కాలయాపనకే తప్ప.. కార్యాచరణ లేదు
సాక్షి, అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగిన తీరు, తీసుకున్న నిర్ణయాలను గమనిస్తే అదంతా కాలయాపనకే తప్ప.. కార్యాచరణ లేదనే విషయం స్పష్టమవుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. అధికారులతో కమిటీ ఏర్పాటుచేస్తూ తీసుకున్న నిర్ణయం విభజన సమస్యల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వెనక్కిలాగే నిర్ణయంగా చూడాల్సి వస్తోందని పేర్కొంది. ఇందుకు సంబంధించి వైఎస్సార్సీపీ స్పందనను మాజీమంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి శనివారం రాత్రి మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో వారు ఏం పేర్కొన్నారంటే..» రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలేంటి? అపరిష్కృత అంశాలేంటి? పంచాల్సిన ఆస్తులేంటి? ఎందుకు ముందుకెళ్లడంలేదు? వీటిపై కోర్టుల్లో ఉన్న కేసులేంటి? అనే వాటిపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలకూ స్పష్టత కూడా ఉంది. కొత్తగా రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృత అంశాల గుర్తింపునకు మళ్లీ కమిటీ అన్నట్లుగా చెప్పడం విభజిత సమస్యల పరిష్కారంలో మరింత జాప్యానికే దారితీస్తుందన్న సంకేతాన్ని ఇద్దరు సీఎంల సమావేశం ఇచ్చిందని అభిప్రాయపడుతున్నాం.» పార్లమెంటు చేసిన విభజన చట్టంలోని అంశాల అమలుపై కేంద్ర ప్రభుత్వం గతంలో సీనియర్ అధికారి షీలా బేడీ కమిటీని ఏర్పాటుచేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆస్తుల వివాదంపై కూడా ఈ కమిటీ పలు సిఫార్సులు చేసింది. వీటిపై అనేక దఫాలుగా పదేళ్లపాటు చర్చలు జరిగాయి. కొన్ని సిఫార్సులను తెలంగాణ ప్రభుత్వం అంగీకరించినప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. చర్చలను ఆ దశ నుంచి ముందుకు తీసుకెళ్లాల్సిందిపోయి మళ్లీ కమిటీ ఏర్పాటుచేయడమంటే వ్యవహారాన్ని మళ్లీ మొదటికి తీసుకెళ్లడమేనని భావిస్తున్నాం.» ఇక తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో అపరిష్కృత అంశాలపై దృష్టిపెట్టాలని, దశాబ్దకాలంగా అంగుళం కూడా ముందుకు పడకపోవడంతో ఏపీకి తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆ రోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వైఎస్ జగన్ కేంద్ర హోంమంత్రి ఎదుట గొంతెత్తారు. దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టి నిర్ణీత కాలపరిమితిలోగా సమస్యలు తీరుస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో కూడా రెండు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, అధికారులు కూడా విభజిత సమస్యలపై చర్చల ప్రక్రియ వేగం అందుకుంది. వీటిని కూడా ముందుకు తీసుకెళ్లే అంశాలపై దృష్టిపెట్టకుండా మళ్లీ కమిటీని ఏర్పాటుచేయడమంటే.. మళ్లీ వెనక్కి లాగడమే అవుతుందని భావిస్తున్నాం.» పైగా ఇప్పుడు కమిటీ ఏర్పాటు అన్నది కేంద్ర ప్రభుత్వంతో సంబంధంలేకుండా, వారి ప్రమేయంలేకుండా ఏర్పాటవుతోంది. విభజన చట్టం చేసింది పార్లమెంటు, దాన్ని అమలుచేయాల్సింది కేంద్ర ప్రభుత్వం అయినప్పుడు, కేంద్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా కమిటీ ఏర్పాటు అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. » ఇక రాష్ట్రానికి రావాల్సిన దాదాపు రూ.7వేల కోట్ల విద్యుత్ బకాయిల విషయంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది. తద్వారా ఆ బకాయిలు చెల్లింపునకు ఆదేశాలు కూడా ఇచ్చింది. తర్వాత ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. దీనిపై దృష్టిపెట్టి పరిష్కారం సాధించే ప్రయత్నం ఇప్పుడు జరిగిన సమావేశంలో పెద్దగా జరిగినట్లు లేదు. » ముఖ్యంగా నీటి ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ తీవ్ర అన్యాయాన్ని ఎదుర్కొంటోంది. రాయలసీమ ప్రాంతం గొంతెండుతున్న పరిస్థితుల్లో కూడా విద్యుత్ రూపేణా తెలంగాణ రాష్ట్రం శ్రీశైలం ఎడమ కాల్వ నుంచి నీటిని ఇష్టానుసారం విడిచిపెడుతోంది. దీనిపై తక్షణం పరిష్కారానికి ప్రయత్నించి ఒక నిర్ణయాన్ని తీసుకోకుండా సమావేశం అసంపూర్తిగా ముగియడం రాష్ట్రానికి అన్యాయం చేసినట్లే. » ఏపీ భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ కుడికాల్వ, స్పిల్వే భాగాన్ని వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది. ఈ సమస్యను పరిష్కరిస్తామని కేంద్ర హోంశాఖ ఇచ్చిన హామీ మేరకు సంయమనం పాటించాం. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో చంద్రబాబు దీనిపై కూడా దృష్టిపెట్టిన దాఖలాలు కనిపించకపోవడంతో విభజిత సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.» ఇప్పుడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఏపీ పోర్టులు, తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల్లోనూ తెలంగాణ వాటా కోరినట్లుగా మీడియా సంస్థలు వార్తలను ప్రసారం చేశాయి. అలాగే, ఏడు మండలాల్లోని కొన్ని గ్రామాలను కూడా విలీనానికి ఏపీ సుముఖంగా ఉన్నట్లుగా కూడా ప్రచారం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు దీనిపై తీవ్ర ఆందోళనలో ఉన్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వం నుంచి ఒక మంత్రి కాని, ఒక అధికారి కాని ఎలాంటి ప్రకటనా చేయకపోవడం ప్రజల అనుమానాలను బలపరిచినట్లే అవుతుందని వైఎస్సార్సీపీ భావిస్తోంది. -
తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. పేర్ని నాని ఆసక్తికర ట్వీట్
సాక్షి, తాడేపల్లి: తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై మాజీ మంత్రి పేర్ని నాని ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘తెలుగు న్యూస్ ఛానళ్ల బ్రేకింగ్ వార్తలు చూస్తుంటే.. నేటి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఇద్దరి డిమాండ్లు తీరాలంటే రెండు రాష్ట్రాల పునరేకీకరణే ఏకైక మార్గంగా కనిపిస్తోంది!’’ అంటూ ట్వీట్ చేశారు.తెలుగు న్యూస్ ఛానళ్ళ బ్రేకింగ్ వార్తలు చూస్తుంటే.. నేటి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఇద్దరి డిమాండ్లు తీరాలంటే రెండు రాష్ట్రాల పునారేకీకరణయే ఏకైక మార్గంగా కనపడుతుంది !— Perni Nani (@perni_nani) July 6, 2024 కాగా, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అంశాలపై ఈ రోజు.. ప్రజాభవన్ వేదికగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థాయిలో కీలక సమావేశం జరగనుంది. ఇరు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు ఏర్పాటైన నేపథ్యంలో మరోసారి విభజన అంశాలపై చర్చలకు ఇరు రాష్ట్రాల సీఎంలు రేవంత్రెడ్డి, చంద్రబాబునాయుడు సిద్ధమయ్యారు.విభజన సమస్యలపై గతంలో అధికారుల స్థాయిలో దాదాపు 30 సమావేశాలు జరిగినా పెద్దగా ముందడుగు పడలేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమ రాష్ట్ర ప్రయోజనాలకు పెద్ద పీఠ వేయడంతో సమస్యలు, అంశాలు పరిష్కారానికి నోచుకోలేదు. తాజా సమావేశంలో ప్రధానంగా షెడ్యూల్ 9, 10లోని సంస్థలు, వాటి ఆస్తులు, నగదు నిల్వల పంపకాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలుస్తోంది.ఏ రాష్ట్రంలో ఉన్న ఆస్తులు ఆ రాష్ట్రానికి చెందుతాయని కేంద్ర ప్రభుత్వం విస్పష్టంగా ప్రకటించినప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ మాత్రం అలా కుదరదని, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వేలకోట్లతో హైదరాబాద్లో ఆస్తులు ఏర్పడ్డాయని, వాటిలో వాటా కావాలని డిమాండ్ చేస్తోంది. తెలంగాణ మాత్రం తమ భూభాగంలోని స్ధిరాస్తుల్లో వాటా ఇచ్చే ప్రసక్తే లేదని వాదిస్తోంది. ఇక ఆర్టీసీ బస్భవన్, రాష్ట్ర ఆర్థికసంస్థ, ఉన్నత విద్యా మండలి, స్పోర్ట్స్ అథారిటీ ఆస్తులు, దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్, ఉద్యోగుల పరస్పరం బదిలీ అంశాలు కూడా ప్రస్తుత భేటీలో ప్రధానంగా చర్చకు రానున్నాయి. -
‘వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహిస్తాం’
తాడేపల్లి : రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ‘వైఎస్సార్ 75వ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించబోతున్నాం, రక్తదానం, పుస్తకాల పంపిణీ, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని క్యాడర్ కి పిలుపునిస్తున్నాం.పార్టీ క్యాడర్ అంతా జులై 8న వీటిని నిర్వహించాలని కోరుతున్నాం. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలి. వైఎస్సార్ మీద భక్తి ఉన్న వారంతా జయంతి కార్యక్రమాలు చేయొచ్చు. ఆ మహనీయుడిని స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేపట్టాలని జగన్ ఆదేశించారు. ఆ మేరకు క్యాడర్ అంతా సేవా కార్యక్రమాలను నిర్వహించాలి. వైఎస్సార్ ఆశయాలు, విధానాలతోనే వైఎస్సార్సీపీ ఏర్పడింది. వైఎస్ఆర్ ఆలోచనా విధానంతోనే ముందుకు సాగుతున్నాం’ అని పేర్ని నాని పేర్కొన్నారు. -
పచ్చ బిల్డింగ్లపై పేర్ని నాని పంచులు
-
చంద్రబాబు రాజమహల్లో ఉంటూ జగన్పై ఆరోపణలా?:పేర్ని నాని ఆగ్రహం
సాక్షి,తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎల్లో మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాల్ని ఆ పార్టీ నేత పేర్ని నాని ఖండించారు. ఈ మేరకు మీడియా సమావేశంలో పేర్ని నాని మాట్లాడుతూ.. ఏపీలో ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు తప్పుడు వార్తలు రాస్తున్నాయి. వారి మానసిక నైజం ఈ వార్తల ద్వారా బయట పెడుతున్నారు.. వైఎస్ జగన్ భద్రత కోసం 986 మంది సెక్యూరిటీ అంటూ తప్పుడు వార్తలు రాశారు. అవన్నీ అవాస్తవాలే’ అని మండిపడ్డారు.పేర్ని నాని ఏమన్నారంటే..ఏపీలో ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు తప్పుడు వార్తలు రాస్తున్నాయివారి మానసిక నైజం ఈ వార్తల ద్వారా బయట పెడుతున్నారుజగన్ సీఎంగా ఉన్నప్పుడు భద్రత కోసం 986 మంది సెక్యూరిటీ అంటూ తప్పుడు వార్తలు రాశారు ఆర్మ్వడ్ ఫోర్స్ 33AP స్పెషల్ ఫోర్స్ 89ఆక్టోపస్ 13ఇతర పోలీసులు 23కాన్వాయ్ కి 21 మంది196 మంది మొత్తం పని చేస్తారు బెంగళూరులో జగన్కి సెక్యూరిటీ లేదుహైదరాబాదు నివాసం బయట పోలీసులు రెస్టు తీసుకోవటానికి రేకుల షెడ్ వేసుకున్నారుచంద్రబాబు, రోశయ్య, ఎన్టీఆర్, జనార్ధనరెడ్డి ఇలా అందరి సీఎంల దగ్గర బ్యారెక్లు పెడతారుఅది పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులే చేస్తారుదానికి జగన్కి సంబంధం ఏమిటి?రామోజీ కొడుకు ఈ వాస్తవాలను పక్కనపెట్టి తప్పుడు వార్తలు రాశారుచంద్రబాబు వెళ్తుంటే ట్రాఫిక్ ఆపవద్దని చెప్పాడని తప్పుడు వార్తలు రాశారునాతో వస్తే ట్రాఫిక్ ఆపుతున్నారో లేదో చూపిస్తాఏ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరైనా చంద్రబాబు కాన్వాయ్ ఆగిందా?కానీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు తప్పుడు వార్తలు వేస్తూనే ఉన్నాయిచంద్రబాబు సెక్యూరిటీకి ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతోందీ చెప్పాలి2014 నుండి 2019 వరకు చంద్రబాబుకు ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారో ప్రకటించాలిరాజమండ్రి జైలులో ఉన్నప్పుడు కూడా బ్లాక్ క్యాట్ కమేండోలను పంపాలని కోరిన వ్యక్తి చంద్రబాబుచంద్రబాబు మనమడుకి కూడా 4+4 గన్ మెన్లను ఇచ్చారా? లేదా?అంటే చంద్రబాబు ఫ్యామిలీవే ప్రాణాలా? జగన్ వి ప్రాణాలు కాదా?జగన్ ఇంటిముందు రోడ్డును ఆపేశారంటూ వార్తలు రాశారుమరి కరకట్ట మీద 2014 నుండి 2019 వరకు టీడీపీ ఎమ్మెల్యేలను కూడా ఎందుకు రానివ్వలేదు?సెక్యూరిటీ రివ్యూ మీటింగ్ జరగకుండా బెదిరించి జగన్ ఇంటిముందు రోడ్డును తెరిచారుహైదరాబాద్లోని చంద్రబాబు ఇళ్లు విలువ ఎంత? జగన్ ఇంటి విలువ ఎంతో తేల్చాలి?చంద్రబాబు, జగన్ ఇళ్లలోని ఫర్నీచర్ విలువ ఎంతో ఆడిట్ చేయించాలిచంద్రబాబు ఇంటి ఫోటోలను బయటి ప్రపంచానికి ఎందుకు చూపటం లేదు?చంద్రబాబు రాజమహల్లో ఉంటూ జగన్ పై ఆరోపణలు చేస్తారా?ఎన్టీఆర్ వయాగ్రా వాడుతున్నారని కూడా వార్తలు రాయించిన ఘనత చంద్రబాబుదిఎంతటివారినైనా వ్యక్తిత్వ హననం చేయటం చంద్రబాబు, ఫేక్ ఫ్యాక్టరీలకు అలవాటేకృష్ణానదిలో దిగి చంద్రబాబు కాళ్లు కడుక్కోవటానికి కూడా జనం సొమ్ముతో నిర్మాణాలు చేశారురైతుల పొలాల్లో అడ్డగోలుగా హెలిఫ్యాడ్ నిర్మాణాలు ఎందుకు చేశారు?జగన్ ఇంటి చుట్టూ ఇళ్లు ఉన్నందునే సెక్యూరిటీ కోసం ఐరెన్ గ్రిల్స్ ఏర్పాటు చేయటం తప్పేంటి?జగన్ క్యాంప్ ఆఫీసులో ఉన్న ఫర్నీచర్ తీసుకెళ్లమని లెటర్ రాస్తే ఇంతవరకు సమాధానం ఎందుకు ఇవ్వలేదు?చంద్రబాబు ఇచ్చిన జీవో ప్రకారమే వైసీపి ఆఫీసులకు స్థలాలు కేటాయించారుచంద్రబాబు తన కార్యాలయాలన్నిటినీ ఎకరం వెయ్యి రూపాయలకే కేటాయించుకున్నారుఆ సంగతిని ఎల్లోమీడియా ఎందుకు రాయలేదు?మంగళగిరి ఆఫీసుని కూడా వెయ్యి రూపాయలకే తీసుకున్నారుహైదరాబాదులో పార్టీ ఆఫీసు కోసం స్థలం తీసుకుని దాన్ని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ గా ఎందుకు మార్చారు?మంగళగిరి ఆఫీసు నిర్మాణానికి ఏం అనుమతులు ఉన్నాయో చూపించాలికాకినాడ, గుంటూరు, నెల్లూరు, ఏలూరు, వైజాగ్.. ఇలా అనేక ప్రాంతాల్లో నిర్మించిన మీ పార్టీ ఆఫీసులు రేకుల షెడ్డులా?ఒక్క హైదరాబాద్ లోని పార్టీ ఆఫీసే వందల కోట్ల విలువైనదినిబంధనలకు విరుద్దంగా చంద్రబాబు వ్యవహరించినా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలకు కనపడటం లేదా?జగన్ బెంగుళూరు వెళ్తే కూడా తప్పుడు వార్తలు రాస్తున్నారుడీకే శివకుమార్ తో చర్చించినట్టు కూడా తప్పుడు వార్తలు రాశారుసోనియా, చంద్రబాబు కలిసి జగన్ని 16 నెలలు జైల్లో పెడితేనే లొంగలేదుఅలాంటిది ఇప్పుడు పార్టీని విలీనం చేస్తారా?జగన్ పై ఎన్ని తప్పుడు వార్తలు రాసినా, కార్యకర్తలపై దాడులు చేసినా ఆయన బెదరడుతాడేపల్లి నుండే అయన తన పోరాటం చేస్తారే తప్ప భయపడి వెనుకడుగు వేయడుచంద్రబాబు రోజూ ప్రవచనాలు చెప్తున్నట్టు ఎల్లోమీడియా వార్తలు రాస్తోంది65% మంది ప్రజలు చూసే సాక్షిటీవీ సహా మరో రెండు ఛానల్స్ ని రాకుండా అడ్డుకున్నారువాస్తవాలను చూపించే ఛానల్స్ ని ఆపేసి చంద్రబాబు ప్రవచనాలు చెప్తున్నారుహైకోర్టు ఆదేశాలతో ఆ ఛానల్స్ అన్నీ తిరిగి టెలికాస్ట్ చేయల్సిందేలేకపోతే కోర్టు ధిక్కరణ కేసులు వేస్తాంచంద్రబాబు ఇంటి పక్కన, వెనుక, భవానీద్వీపంలో ఎంతమంది పోలీసులు కాపలా కాస్తున్నారో లెక్కలు తీయాలిఎన్.ఎస్.జీ. కమాండోలు, రాష్ట్ర పోలీసులు ఎంతమంది ఉన్నారో, ఎంత ఖర్చు చేస్తున్నారో ప్రజలకు చెప్పాలివైఎస్సార్సీపీ ఆఫీసుల నిర్మాణాలన్నీ మా పార్టీ ఖర్చులేఅమరావతి నిర్మాణ కాంట్రాక్టర్ తో మంగళగిరి ఆఫీసు కట్టించినట్టు మేం చేయటం లేదుహైదరాబాదులో హైటెక్ సిటీ నిర్మించిన వారితో అక్కడ పార్టీ ఆఫీసు కట్టలేదుటీడీపీ ఆఫీసుల ఫైళ్లు తీసుకుని వస్తే, వైసీపి ఆఫీసు ఫైల్స్ కూడా తీసుకుని వస్తాంసెక్రటేరియట్ లో కూర్చుని చర్చిద్దాంఆ దమ్ము టీడీపీకి ఉందా?2019లో తమ్మినేని సీతారాంని స్పీకర్ గా ఎన్నుకున్నప్పుడు టీడీపీ వారు అసెంబ్లీలో ఉన్నారా?ఆయన్ను స్పీకర్ ఛెయిర్ లో కూర్చోపెట్టేందుకు ఎందుకు రాలేదు?జగన్ని చచ్చేదాకా కొట్టాలనే వ్యక్తిని స్పీకర్ చేయటం మాకు నచ్చలేదుఅందుకే బాయ్ కాట్ చేశాంబందరులో కాకుండా ఇక ఆంధ్ర, తెలంగాణలో ఎక్కడైనా నా కుటుంబ సభ్యుల పేరుతో ఇళ్లు ఉంటే ఆధారాలు చూపండివెంటనే ఆ ఆస్తినంతా వారికే రాసిస్తా. -
ఆగని టీడీపీ దాడులు.. పెరిగిన విధ్వంసం
సాక్షి నెట్వర్క్: టీడీపీ పార్టీ కార్యకర్తలు పేట్రేగిపోతున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ, శంకుస్థాపనల శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం మండపాకలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ భవనాల వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రాలున్న శిలాఫలకాలను టీడీపీ శ్రేణులు శుక్రవారం రాత్రి ధ్వంసం చేశాయి. శనివారం ఉదయం విధులకు హాజరైన సచివాలయ సిబ్బంది దీనిని గుర్తించారు. ఈ ఘటనపై తణుకు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు బోడపాటి వీర్రాజు తెలిపారు. నూజివీడులో శిలాఫలకం కూల్చివేత ఏలూరు జిల్లా నూజివీడు నెహ్రూ పేటలో శనివారం తెల్లవారుజామున ఒక శిలాఫలకాన్ని కూల్చివేశారు. వారం రోజుల క్రితం చాట్రాయి మండలం పోలవరంలో నాలుగు శిలాఫలకాలను ధ్వంసం చేయగా.. ఈ నెల 11న రాత్రి నూజివీడు మండలం బోర్వంచలో గ్రామ సచివాలయ భవనం కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. ఎంఎన్పాలెంలో రెండు శిలాఫలకాలను, సీతారామపురంలో ఒక శిలాఫలకాన్ని, తూర్పుదిగవల్లిలో గ్రామ సచివాలయం బోర్డును ధ్వంసం చేశారు. సచివాలయంపై టీడీపీ జెండా ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం చినమనగుండం సచివాలయం ప్రారం¿ోత్సవ శిలాఫలకాలను టీడీపీ కార్యకర్తలు నెలకుర్తి దినే‹Ù, గుత్తా మహేందర్ ధ్వంసం చేశారు. సచివాలయం, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవనం వద్ద ఉన్న శిలాఫలకం కూడా ధ్వంసం చేశారు. అనంతరం గ్రామ సచివాలయంపై టీడీపీ జెండా పెట్టారు. శిలాఫలకాన్ని ధ్వంసం చేస్తున్న దృశ్యాలను టీడీపీ కార్యకర్తలు వీడియో తీసి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరని కామెంట్లు పెట్టారు. ధ్వంసం చేసిన శిలాఫలకాల బోర్డులను, సచివాలయ భవనాలను శనివారం వైఎస్సార్సీపీ నాయకులు, సర్పంచ్ వడ్లమూడి మురళీమోహన్, ఎంపీటీసీ కోండ్రు వెంకటేశ్వర్లు, మాజీ వైస్ ఎంపీపీ ఉన్నం శ్రీనివాసులు పరిశీలించారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పంచాయతీ కార్యదర్శి నాగార్జున ఇచ్చిన ఫిర్యాదు మేరకు పొదిలి సీఐ మల్లికార్జునరావు, ఎస్ఐ మాధవరావు ఘటన స్థలాన్ని పరిశీలించారు. సచివాలయ ఉద్యోగులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఐ, ఎస్ఐ చెప్పారు. వైఎస్సార్ పేరు తొలగింపు ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని నూతన మునిసిపల్ కార్యాలయంపై గల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు, కార్యాలయం ప్రవేశ ఆర్చిపై ఉన్న మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి, వెంకాయమ్మ చారిటబుల్ ట్రస్ట్ పేర్లను టీడీపీ నాయకులు శనివారం తొలగించారు. మునిసిపల్ కార్యాలయం 6 నెలల క్రితం ప్రారంభం కాగా.. ఆర్చిని బూచేపల్లి శివప్రసాదరెడ్డి సొంత నిధులతో నిర్మించారు. వీటితో పాటు చీమకుర్తిలోని ప్రభుత్వాస్పత్రి ప్రవేశ ద్వారం ఆర్చిపై ఉన్న మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి, వెంకాయమ్మ పేర్లను కూడా తొలగించారు. ఈ ఘటనలపై వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ క్రిష్టిపాటి శేఖరరెడ్డి, కౌన్సిలర్ సోమా శేషాద్రి, గోపురపు చంద్ర, ఆముదాలపల్లి రామబ్రహ్మం తదితరులు సీఐని కలిసి వినతిపత్రం అందించారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఇంత దారుణమా..
-
దాడులపై పోలీసులు ప్రేక్షక పాత్ర
మచిలీపట్నం టౌన్: కృష్ణా జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ, జనసేన కార్యకర్తలు చేస్తున్న దాడులను నియంత్రించకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తున్న పోలీసులపై హైకోర్టులో ప్రైవేటు కేసులు వేస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), మాజీ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు (నాని) వెల్లడించారు. శనివారం వారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. పేర్ని నాని మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు రోజు నుంచి జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ, జనసేన రౌడీ మూకలు ఉద్దేశ పూర్వకంగా, అధికార మదంతో మారణహోమం సాగిస్తున్నా, విధ్వంసం సృష్టిస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారన్నారు. చంద్రబాబునాయుడు, జిల్లాలో గెలుపొందిన ఎమ్మెల్యేలు.. వారి కార్యకర్తలు చేస్తున్న దాడులపై ప్రేక్షకపాత్ర వహించేలా పోలీసులకు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. ఆ ఆదేశాలను పోలీసులు తూచా తప్పకుండా పాటిస్తుండటం విచారకరం అన్నారు. గతంలో బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితిని చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్లు ఆంధ్రప్రదేశ్లోనూ తీసుకొచ్చారని విమర్శించారు. రౌడీషీటర్లు స్థానికంగా ఉన్న డీఎస్పీ, సీఐ, ఎస్సైలను ఏరా.. ఉద్యోగం చేయాలని లేదా.. నువ్వు ఇక్కడే ఉంటావా.. లేక వీఆర్కు వెళతావా.. అని మాట్లాడుతున్నా పోలీసులు మిన్నకుండి పోవడం విచారకరం అన్నారు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలతో కోర్టుకు వెళతామని స్పష్టం చేశారు. కళ్లెదుటే దాడులు.. అచేతనంగా పోలీసులు‘బందరు గొడుగుపేటలోని ఎంకులు బంకులు ఎదురుగా ఉన్న సందులో ఒక యాదవ కుటుంబం ఇంట్లో సామగ్రి, టీవీని ధ్వంసం చేస్తే, కేసు పెట్టినా ఇనుగుదురుపేట పోలీసులు పట్టించుకోలేదు. బాధితులను వైఎస్సార్సీపీ నాయకులు పరామర్శించి సామగ్రి కొనుగోలుకు ఆర్థిక సాయం చేస్తే మళ్లీ సామగ్రి కొంటే ఇలాగే ధ్వంసం చేస్తామని టీడీపీ నాయకులు, కార్యకర్తలు హెచ్చరిస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణం. స్థానిక చిలకలపూడి గోడౌన్స్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ కాలనీలో కూలీ పనులు చేసుకునే భార్యాభర్తలు వైఎస్సార్సీపీకి పని చేశారనే కారణంతో వారి ఇంటిపై దాడి చేసి సామగ్రి ధ్వంసం చేశారు. అడ్డుపడిన వీరిద్దరినీ తీవ్రంగా గాయపరిచారు. ఆ దంపతులను ఆసుపత్రిలో చేర్చుకోకుండా అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు వారిని ఆసుపత్రిలో చేర్చారు. ఆ సమయంలో 25కు పైగా కేసులు ఉన్న రౌడీషీటర్ నవీన్.. ఆసుపత్రికి వెళ్లి నెలల పిల్లాడిని ఎత్తుకున్న ఆ మహిళను అసభ్య పదజాలంతో దూషించాడు. ఇదంతా పోలీసుల కళ్లెదుటే జరిగింది. అయినా రౌడీ షీటర్పై కేసు పెట్టకపోగా, బాధితులపైనే ఎదురు కేసు పెట్టారు. మర్డర్ కేసు ముద్దాయిలు, రౌడీలే డీఎస్పీలు, సీఐలుగా భావించేలా చంద్రబాబు తయారు చేశారు. మహేష్ అనే వ్యక్తి విచ్చలవిడిగా బరితెగించి కుర్చీలతో ఎస్ఐ పైనే దాడి చేశాడు. కార్లు ధ్వంసం చేశాడు. అయినా ఇంత వరకు కేసు నమోదు చేయలేదు. ఇంత జరుగుతున్నా జిల్లా ఎస్పీ స్పందించకపోవటం విచారకరం. మాజీ ఎమ్మెల్యేలు అందరం ఎస్పీని కలిసి విన్నవించాలని నిర్ణయం తీసుకున్నాం. విజయవాడ నుంచి బయలుదేరిన వల్లభనేని వంశీ, కైలే అనిల్కుమార్లను పోలీసులు రానివ్వకుండా నిర్బంధించారు. రేపో, ఎల్లుండో డీజీపీ, ఎస్పీలను కలిసి దాడుల ఘటనలపై ఆధారాలతో ఫిర్యాదు చేస్తాం. ఈ దాడుల ఘటనలపై వీడియో ఆధారాలతో హైకోర్టులో ప్రైవేటు కేసు వేస్తున్నాం’ అని పేర్ని నాని తెలిపారు.మేం వస్తున్నాం.. ధైర్యంగా ఉండండి...మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్సార్సీపీ శ్రేణులను నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు భౌతిక దాడులకు దిగుతూ చేతులు, కాళ్లు విరగ్గొట్టడంతో పాటు గ్రామాల్లో ఉండొద్దని హెచ్చరిస్తున్నారన్నారు. ఈ ఘటనలకు పోలీసులే ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారని తెలిపారు. ‘దాడులు జరుగుతుంటే పోలీసులు నిలబడి చూస్తూ ఎంజాయ్ చేస్తుండటం దారుణం.స్థానికంగా దాడులు జరుగుతున్న సమయంలో ఆయా ప్రాంతాల పోలీసులకు సమాచారం అందించినా, స్పందించడం లేదు. వచ్చినా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఈ ఘటనలపై కేసులు కట్టడం లేదు. దాడులు చేస్తున్న వారే కాకుండా దాడులను చూస్తూ మిన్నకుండిపోయిన పోలీసులపై కూడా కేసులు వేస్తాం. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. రెండు రోజుల్లో జిల్లాలోని ముఖ్య నాయకులందరం ప్రతి నియోజకవర్గానికి వెళ్లి దాడులకు గురైన వారి ఇళ్లకు వెళ్లి ధైర్యం చెబుతాం. ఇకనైనా దాడులు ఆగకుంటే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డు పైకి వస్తారు. లా అండ్ ఆర్డర్ సమస్య ఎదురైతే దానికి పోలీస్ వ్యవస్థే బాధ్యత వహించాలి’ అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు, మచిలీపట్నం, పెడన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పేర్ని కృష్ణమూర్తి (కిట్టు), ఉప్పాల రమేష్ (రాము) పాల్గొన్నారు.పేర్ని కిట్టు, నాయకులను అడ్డుకున్న పోలీసులుటీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన బాబి దంపతులను పరామర్శించేందుకు బయలుదేరిన వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బందరు పట్టణంలోని చిలకలపూడి ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉండే బాబి దంపతులు వైఎస్సార్సీపీ పక్షాన నిలిచారనే నెపంతో కూటమి శ్రేణులు వారి నివాసంపై దాడికి పాల్పడ్డారు. సామగ్రి ధ్వంసం చేశారు.ఈ సందర్భంగా శనివారం బాధితులను పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) తన నివాసం నుంచి నగర మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, మునిసిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్దాదా, కార్పొరేటర్లతో కలిసి బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారి పరామర్శకు వెళ్లేందుకు అనుమతి లేదని అడ్డుకున్నారు.అదనపు బలగాలను రప్పించి దారికి అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పరామర్శకు అనుమతి ఏమిటని పేర్ని కిట్టు, తదితరులు పోలీసులను దాటుకుని వెళ్లి బాబి దంపతుల ఇంటికి వెళ్లి పరామర్శించారు. పరామర్శించిన వారిలో కార్పొరేటర్లు మేకల సుబ్బన్న, జోగి చిరంజీవి, ఐనం తాతారావు, మాచవరపు రాంప్రసాద్, పల్లి శేఖర్, పర్ణం సతీష్, శ్రీరాం చిన్నా ఉన్నారు. -
నో పోలీస్.. నో కేసు.. టీడీపీ, జనసేన దాడులపై పేర్ని నాని ఫైర్..
-
ఏపీలో దాడుల వెనుక ఆ ఇద్దరు: పేర్ని నాని
సాక్షి, కృష్ణా: ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తూ.. మారణ హోమం చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆవేదవ వ్యక్తం చేశారు. రాష్ట్రం నలుమూలలా టీడీపీ శ్రేణులు కొనసాగిస్తున్న అరాచకాలపై శనివారం ఆయన మీడియాతో మాట్లాడుడారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై సంచలన ఆరోపణలు చేశారాయన. కౌంటింగ్ రోజు నుంచే వైఎస్సార్సీపీ నాయకుల పై దాడులు చేస్తున్నారు. టీడీపీ , జనసేన పార్టీ రౌడీ మూకలు అధికారమదంతో రెచ్చిపోతున్నాయి. టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలే ఈ దాడుల్ని ప్రోత్సహిస్తున్నారు. డీజీపీ, పోలీసులు ఉద్యోగం చేయకుండా చంద్రబాబు వాళ్ల చేతులు కట్టేశారు. బీహార్, యూపీ మాదిరి ఏపీలో హింసా రాజ్యం రచిస్తున్నారు. చంద్రబాబు , ఆయన కుమారుడే ఇదంతా చేయిస్తున్నారు.... పోలీసులను టీడీపీ రౌడీలు , రౌడీషీటర్లు బెదిరిస్తున్నారు. దాడులు చేస్తున్న టీడీపీ రౌడీలను ఆపే ప్రయత్నం కూడా పోలీసులు చేయడం లేదు. మా ఇళ్ల పై పడి దాడులు చేస్తుంటే పోలీసులు కనీసం కేసు కూడా పెట్టడం లేదు. పోలీసు వ్యవస్థను చంద్రబాబు పతనావస్థకు తీసుకొచ్చాడు. టీడీపీ రౌడీ షీటర్లు మహిళల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇంత జరుగుతున్న జిల్లా ఎస్పీ ఏమైపోయారు. .. చంద్రబాబు సీఎం అయ్యాక రౌడీలు సీఐలు,డీఎస్పీలు , ఎస్పీలు అయిపోయారు.మేం మీటింగ్ పెట్టుకుంటే మా నాయకులను రాకుండా అడ్డుకున్నారు. దాడులు చేస్తున్నా పోలీసులు చూస్తూ ఉంటే.. మేం కూడా తిరగబడక తప్పదుచంద్రబాబు చేయిస్తున్న దౌర్జన్యాల పై చర్యలు తీసుకోనందుకు కోర్టుకు వెళ్తాం. రెండు రోజుల్లో జిల్లా ఎస్పీని మా నాయకులమంతా కలుస్తాం’’ అని పేర్ని నాని అన్నారు. -
టీడీపీ హింస రాజకీయాలపై పేర్నినాని స్ట్రాంగ్ రియాక్షన్
-
వైఎస్సార్ సీపీ నేతల ఇళ్లపై కిరాతకంగా దాడులు చేశారు: పేర్నినాని
-
యథేచ్ఛగా టీడీపీ, జనసేన నాయకుల హింసాకాండ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: అధికారం చేపట్టక ముందే టీడీపీ, జనసేన నాయకులు యథేచ్ఛగా సాగిస్తున్న హింసాకాండపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని వైఎస్సార్ సీపీ నేతలు గవర్నర్ అబ్దుల్ నజీర్కు విన్నవించారు. ఈమేరకు రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, అరకు ఎంపీ తనూజ, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ శివప్రసాద్రెడ్డి, మాజీ ఎంపీ కేశినేని నాని, అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం, పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డితో కలిసి గవర్నర్కు గురువారం వినతిపత్రం అందచేసిన అనంతరం మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఓట్ల లెక్కింపు అనంతరం బిహార్ తరహాలో రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసకాండ, హింసాత్మక ఘటనలను గవర్నర్ దృష్టికి తెచి్చనట్లు చెప్పారు. టీడీపీ మూకలు ఎన్నికల రోజు మధ్యాహ్నం నుంచే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరుల ఇళ్లపై దాడులకు తెగబడి పలు చోట్ల గృహ దహనాలు, ఆస్తులను ధ్వంసం చేశాయన్నారు. మహిళలు, పిల్లలను సైతం హింసించి భయ భ్రాంతులకు గురి చేశాయని తెలిపారు. టీడీపీ, జనసేన విధ్వంస కాండకు సంబంధించి వీడియో, ఫొటో ఆధారాలను పరిశీలించి విస్తుపోయిన గవర్నర్.. పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశి్నంచారన్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని, కళ్ల ముందే దాడి జరిగినా కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం లేదని గవర్నర్ దృష్టికి తెచి్చనట్లు వెల్లడించారు. నూజివీడులో కౌన్సిలర్పై పోలీసుల సమక్షంలోనే కత్తులతో దాడి జరగటాన్ని గవర్నర్ దృష్టికి తెచ్చామన్నారు. ఈ ఘటనలపై డీజీపీతో చర్చించి చర్యలు తీసుకుంటానని గవర్నర్ హామీ ఇచ్చారన్నారు. పర్యవసానాలు తప్పవు వైఎస్సార్సీపీ జెండా పట్టుకున్న వారిపై దాడులు చేసేందుకే అధికారంలోకి వచ్చారా? అని టీడీపీ నేతలను పేర్ని నాని ప్రశ్నించారు. ఎర్ర పుస్తకం పేరుతో హింసకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని కూటమి నాయకులకు సూచించారు. చంద్రబాబు ఒత్తిడితో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. దాడులను ఆపకుంటే పర్యవసానాలు తప్పవని హెచ్చరించారు. కార్యకర్తలను కాపాడుకునేందుకు కమిటీలు, లీగల్ టీమ్స్ రాష్ట్రంలోని వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులను కాపాడుకునేందుకు 26 జిల్లాల్లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ప్రత్యేక కమిటీలను వైఎస్సార్సీపీ ఏర్పాటు చేసినట్లు పేర్ని నాని వెల్లడించారు. బాధితులను పరామర్శించడంతో పాటు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. టీడీపీ హింసాకాండను మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేస్తామన్నారు. 26 జిల్లాలో ఏర్పాటైన లీగల్ టీమ్లు బాధితులకు అండగా నిలుస్తాయని, శుక్రవారం నుంచి చురుగ్గా పని చేస్తాయని తెలిపారు. కింది స్థాయి పోలీసులు కేసులు నమోదు చేయకుంటే ఎస్పీలను కలిసి న్యాయం కోసం పోరాటం చేస్తామన్నారు. -
దాడులతో ఏపీనీ మరో బీహార్ లా మారుస్తున్న టీడీపీ
-
వైఎస్సార్సీపీ జెండా మోసిన వాళ్లపై టీడీపీ దాడులు: పేర్ని నాని
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులనే లక్ష్యంగా టీడీపీ దాడులు జరుపుతోందని అన్నారు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ అరాచక చేష్టలకు దిగింది. దీంతో వైఎస్సార్సీపీ నేతలు గురువారం సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసి.. ఆయన దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. గవర్నర్ నజీర్ను కలిసిన అనంతరం వైఎస్సార్సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులే టార్గెట్గా టీడీపీ దాడులు జరిపిందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. బిహార్ తరహాలో ఏపీలో టీడీపీ దాడులకు తెగబడిందని మండిపడ్డారు. బిహార్ సంస్కృతిని టీడీపీ ఆచరిస్తోందన్నారు. టీడీపీ గూండాలు వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై కిరాతకంగా దాడులు చేశారని అన్నారు. టీడీపీ నేతలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ జెండా మోసిన వారిపై దాడులకు తెగబడుతున్నారు.నూజివీడులో పట్టపగలే కత్తులతో దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు పేర్ని నాని. ఇళ్లలోకి చొరబడి ఆస్తులను ధ్వసం చేస్తున్నారని మండ్డారు. టీడీపీ దాడులు చూసి గవర్నర్ కూడా ఆశ్చర్యపోయారని తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా? లేనట్టా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కార్యకర్తలను కాపాడుకోవడానికి కమిటీలు వేశామని, 26 జిల్లాల్లోనూ మా లీగల్ టీమ్లు యాక్టివేట్ అయ్యాయని తెలిపారు. బాధితులను పరామర్శించి, వారికి అండగా ఉంటామని పేర్కొన్నారు. టీడీపీ గుండాల దాడులతోపాటు.. పోలీసుల తీరుపై కూడా గవర్నర్కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.వైఎస్సార్సీపీ నేతల బృందానికి రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వం వహించారు. గవర్నర్ను కలిసిన వాళ్లలో తాజా ఎంపీలు గురుమూర్తి, తనుజా, ఎమ్మెల్యేలు శివప్రసాద్, మత్యలింగం, విశ్వేశ్వర రాజు, పర్చూర్ నేత బాలాజీ ఉన్నారు. -
గెలుపు, ఓటములు సహజం కార్యకర్తలు అధైర్యపడొద్దు .. మీకు అండగా నేనుంటా
-
ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజం : పేర్ని కిట్టు
సాక్షి, కృష్ణాజిల్లా : ఓటు వేసిన ప్రతీ ఒక్కరికీ కృష్ణాజిల్లా వైస్సాఆర్సీపీ నేత పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వెన్నంటే నిలిచిన ప్రతీ ఒక్కరికీ రుణపడి ఉంటామన్న పేర్ని కృష్ణమూర్తి.. గెలుపు , ఓటములు సహజం కార్యకర్తలు అధైర్యపడొద్దు ..అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎవరు రెచ్చగొట్టినా...సంయమనంగా..ధైర్యంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.ఎన్నికల ఫలితాల మాట్లాడిన పేర్నికృష్ణ మూర్తి మచిలీపట్నం నుంచి గెలిచిన కొల్లురవీంద్రకు శుభాకాంక్షలు తెలిపారు. ‘మంచి పరిపాలన కొనసాగించాలని కోరుతున్నా. పోర్టు పనులు వేగవంతం చేయాలి. మెడికల్ కాలేజీకి కావాల్సిన వసతులు కల్పించాలి. మీరు ఇచ్చిన ప్రతీ హామీని ప్రజలతో పాటు మేం కూడా బాగా గుర్తుంచుకుంటాం. ఏడాది తర్వాత మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను మళ్లీ గుర్తుచేస్తాం. ఎల్లప్పుడూ ప్రజలకు మేం అండగా ఉంటాం. మంచి చేస్తే మిమ్మల్ని అభినందిస్తాం’అని పేర్ని కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. -
ఫలితాల రోజు ఈసీ పెట్టిన రూల్స్ పై పేర్నినాని రియాక్షన్
-
ఈసీపై పేర్నినాని ఫైర్
-
చట్టం మీ చుట్టమా ?
-
సీఈవో గుప్పెట్లో చట్టం
చిలకలపూడి (మచిలీపట్నం): రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనా చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. గురువారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో అధికారి సీలు లేకున్నా చెల్లుతుందని సీఈఓ జారీ చేసిన సర్క్యులర్ చట్ట విరుద్ధమన్నారు. సీలు, హోదా(డిజిగ్నేషన్) లేకపోయినా ఫర్వాలేదని, స్పెసిమెన్ సిగ్నేచర్ అనుమానం వస్తే జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో ధ్రువీకరిస్తే సరిపోతుందని చెప్పారని, ఈ లెక్కన ప్రతి జిల్లా నుంచి వెయ్యికి పైగా స్పెసిమెన్ సిగ్నేచర్లను ధృవీకరించుకోవడం సాధ్యమేనా అని ప్రశి్నంచారు.13 ఏ, 13 బి పోస్టల్ బ్యాలెట్లు ఇస్తారని, దానికి గెజిటెడ్ ఆఫీసర్ సరి్టఫికెట్ ఇస్తారని, ఫారం 12 ఏ అనేది ఎక్కడ నుండి వచి్చందని ప్రశి్నంచారు. ఎంతో బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న సీఈవో ఎవరికి మేలు చేకూర్చాలని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో చెప్పాలన్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తే కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఓకే చెప్పిందని, దేశంలో ఒకలా.. రాష్ట్రంలో మరోలా నిబంధన ఎలా అమలు చేస్తారని ప్రశి్నంచారు. చివరికి కోర్టులో లంచ్మోషన్ పిటిషన్ వేస్తే ఆ మెమోను సీఈఓ వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారన్నారు.ఆయన తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు దీనిద్వారా స్పష్టమైందని, ఎవరి కోసం ఆ తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని నిలదీశారు. చంద్రబాబు బీజేపీతో కలిసి ఎన్ని కుట్రలు చేసినా ఫలించవని చెప్పారు. టీడీపీ ఎన్డీఏతో కలిసి చట్టాలను చుట్టాలుగా మార్చుకుందని, ప్రజలు దీనిని గమనించాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అంగీకారంపైనా పోరాటం చేస్తామని, చివరకు న్యాయమే గెలుస్తుందనే నమ్మకం తమకుందని వెల్లడించారు. న్యాయ వ్యవస్థతో సమానంగా బాధ్యతగా మెలగాల్సిన హోదాలో, ఎన్నికల సంఘంలో ప్రమాణం చేసి, ఇలాంటి సొంత నిర్ణయాలు తీసుకోవడం అంటే ఒక పార్టీ వైపు మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోందన్నారు.రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, వేధింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. టీడీపీ తప్పులను ఎత్తి చూపిస్తున్నప్పటికీ పట్టించుకోని సీఈవో.. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వార్తలు వస్తే వెంటనే స్పందించి తమ పార్టీ నాయకులపై కేసులు పెట్టడం అన్యాయమని అన్నారు. టీడీపీ, బీజేపీ నేతలపై కేసులు పెట్టొద్దని కలెక్టర్లు, ఆర్వోలను బెదిరిస్తున్నారని, వైఎస్సార్సీపీ నాయకులపై సాధ్యమైనంత వరకు కేసులు ఎక్కువ పెట్టాలని ఆదేశాలు ఇస్తున్నారని చెప్పారు. -
‘మెమో వెనక్కి అంటే.. తప్పుచేసినట్లేకదా!’
కృష్ణా, సాక్షి: కేంద్ర ఎన్నికల సంఘం, ఏపీ ఎన్నికల సంఘాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒత్తిడికి లొంగిపోయి పని చేస్తున్నాయన్నారు ఏపీ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు విషయంలో ఎన్నికల సంఘం డబుల్ గేమ్పై, న్యాయస్థానాల్లో తాజా పరిణామాలపైనా ఆయన స్పందించారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా నిబంధనలను మీరారు. స్టాంప్ వేయకపోయినా.. డిజిగ్నేషన్ లేకపయినా ఫర్వాలేదని మెమో జారీ చేశారు. చట్టాన్ని మీరి మరి రూల్స్ తయారు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. .. అందుకే మేం కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశాం. దేశంలో ఎక్కడా లేని రూల్స్ ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నారు. తాను ఇచ్చిన మెమోను వెనక్కి తీసుకుంటున్నట్లు సీఈవో ఎంకే మీనా కోర్టుకు తెలిపారు. మెమో వెనక్కి అంటే.. ఆయన తప్పు చేసినట్లే కదా. ఆ మెమోను ఈసీ సమర్థించడం అన్యాయం. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన వెసులుబాటుపై కోర్టులో పోరాడుతున్నాం. కచ్ఛితంగా న్యాయం గెలిచి తీరుతుంది. చంద్రబాబు, బీజేపీ ఎన్ని కుయుక్తులు పన్నినా న్యాయస్థానంలో గెలుపు ధర్మానిదే.. .. బీజేపీ ఒత్తిడికి లొంగిపోయే అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఎన్నికల సంఘాలు పని చేస్తున్నాయి. ఈ సంగతి ఎప్పటి నుంచో చెబుతున్నాం. టీడీపీ తప్పులపై ఆధారాలతో సహా మేం ఫిర్యాదు చేసినా ఈసీ పట్టించుకోలేదు. అదే ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లలో వార్తలు వస్తే చాలూ.. వైఎస్సార్సీపీ నేతలపై కేసులు పెడుతున్నారు. టీడీపీపై పొరపాటున కేసులు పెడితే ఆ జిల్లా కలెక్టర్లను, ఆర్వోలను బెదిరిస్తున్నారు. .. వైఎస్సార్సీపీపై సాధ్యమైనంత వరకు ఎక్కువ కేసులు పెట్టాలని ఆదేశాలు ఇస్తున్నారు. టీడీపీ, బీజేపీలపై కేసులు పెట్టొద్దనే సంకేతాలిస్తున్నారు అని ఆరోపించారాయన. -
ఎలక్షన్ కమిషన్ నిబంధనలపై పేర్ని నాని రియాక్షన్
-
ఆ నిబంధనలను ఈసీ ఉపసంహరించుకోవాలి: వైఎస్సార్సీపీ
సాక్షి, గుంటూరు: అడిషనల్ సీఈవోను వైఎస్సార్సీపీ నేతలు పేర్ని నాని, మేరుగు నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి కలిశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సడలింపు నిబంధనలపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది.అనంతరం మీడియాతో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ‘‘అన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై గతంలో నిబంధనలు పంపారు. పోస్టల్ బ్యాలెట్ కవర్లు, 13ఏ, 13 బీ నిబంధనలు చెప్పారు. గెజిటెడ్ అధికారం సంతకం పెట్టి స్టాంప్ వేయాలని గతంలో చెప్పారు. స్టాంప్ లేకపోయినా చేతితో రాసినా ఆమోదించాలని గతంలో చెప్పారు. ఇప్పుడు కొత్తగా స్టాంప్ వేయకపోయినా సరే ఆమోదించాలని అంటున్నారు’’ అని పేర్ని నాని నాని అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేనిది ఇక్కడే ఎందుకు తీసుకొచ్చారని ఆయన ప్రశ్నించారు.‘‘ఈసీ ఇచ్చిన ఆదేశాలు గొడవలకు దారి తీసే అవకాశం ఉంది. ఈసీ నిబంధనలు వలన ఓటు రహస్యత ఉండదు. ఏజెంట్లు అభ్యంతరం తెలిపితే ఘర్షణలకు దారి తీస్తుంది. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పని నిబంధనలను ఎలా అమాలు చేస్తారు అని అడిగాం. ఈ నిబంధనల పై పునరాలోచించాలి అని కోరాం’’ అని పేర్ని నాని వివరించారు.మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ, ‘‘చంద్రబాబు ఎన్నికల్లో అలజడులు సృష్టించారు. పేదల పైన టీడీపీ నేతలు దాడులు చేస్తే ఎన్నికల కమిషన్, టీడీపీ నేతలు చర్యలు తీసుకోలేదు. ఆఖరికి ఈసీఐ నిబంధనలని కూడా ఏపీలో మార్చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో ఈసీఐకి విరుద్ధంగా సీఈఓ ఆదేశాలు ఇవ్వడం ఏంటి..? వెంటనే ఆ నిబంధనలను ఉపసంహరించుకోవాలి. స్పెసిమెన్ సంతకం ద్వారా ఆమోదించడం సమంజసం కాదు. పోలింగ్ రోజున అక్రమాలకు టీడీపీ పాల్పడింది. ఇప్పుడు లెక్కింపు సక్రమంగా జరగకూడదు అన్నది టీడీపీ కుట్ర’’ అంటూ మండిపడ్డారు. -
టీడీపీ అరాచకాలు కళ్లకు కట్టినట్టు చూపించిన పేర్నినాని
-
పిన్నెల్లి హత్యకు పథకం: పేర్ని నాని ఆందోళన
సాక్షి, అమరావతి: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెంటాడి హత్య చేసేందుకు పోలీసుల ద్వారా టీడీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆందోళన వ్యక్తం చేశారు. పిన్నెల్లి ప్రాణాలకు ఎలాంటి హాని జరిగినా సీఐ నారాయణస్వామి, గుంటూరు రేంజ్ ఐజీ, డీజీపీదే బాధ్యతని స్పష్టం చేశారు. సీఐ నారాయణస్వామిని అడ్డు పెట్టుకుని తనను అంతమొందించేందుకు టీడీపీ నేతలు కుట్ర చేస్తున్నట్లు ఈసీ, పోలీసు ఉన్నతాధికారులకు పిన్నెల్లి ఫిర్యాదు చేసిన తర్వాత ఆయన ఇంటి వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పారామిలిటరీ బలగాలను ఈనెల 14న ఎందుకు వెనక్కి రప్పించారని నిలదీశారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి ఈ కుట్రలపై గవర్నర్, రాష్ట్రపతి, ప్రధానికి మొర పెట్టుకుంటేగానీ పారా మిలిటరీ బలగాలను పంపలేదన్నారు. పోలీసు వ్యవస్థకు మాయని మచ్చలా తయారై సంఘ విద్రోహక శక్తుల్లా వ్యవహరిస్తున్న అధికారులకు ముందుంది ముసళ్ల పండుగని హెచ్చరించారు. పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో టీడీపీ గూండాలకు వత్తాసు పలుకుతున్న వారు జూన్ 4 తరువాత తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు. పేర్ని నాని ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా మాచర్ల, నరసరావుపేట నియోజకవర్గాల్లో టీడీపీ మూకల విధ్వంసకాండను రుజువు చేసే పలు వీడియోలను ప్రదర్శించారు.పిన్నెల్లి 2009 నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మాచర్లలో వైఎస్సార్సీపీకి బలమైన పునాది వేశారు. మాచర్లలో టీడీపీ అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తోందని, గట్టి భద్రత కల్పించి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరపాలని కోరుతూ ఈనెల 11న ఆర్వో, జిల్లా ఎన్నికల అధికారి, ఎన్నికల కమిషన్, పోలీసు ఉన్నతాధికారులకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వినతిపత్రం అందచేశారు.⇒ మాచర్ల నియోజకవర్గంలో ఇప్పటివరకూ అల్లర్లు జరగని ప్రాంతాల్లో పారా మిలటరీ బలగాలను నియమించిన అధికారులు ఘర్షణలు చోటుచేసుకునే చోట్ల మాత్రం హోంగార్డులతో సరిపుచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై టీడీపీ మూకలు దాడి చేస్తుంటే ప్రేక్షకపాత్ర వహించడం ద్వారా పోలింగ్ శాతాన్ని తగ్గించేందుకు కుట్ర చేశారు. వైఎస్సార్ సీపీ మద్దతుదారులను భయభ్రాంతులకు గురి చేసి టీడీపీ మూకలు రిగ్గింగ్కు పాల్పడ్డాయి.⇒ ఈనెల 13న పోలింగ్ రోజు పాల్వాయి గేట్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసమైనట్లు పీవో లాగ్ బుక్లో ఎందుకు నమోదు చేయలేదు? అర క్షణమైనా పోలింగ్కు విఘాతం కలిగిందా? ఈనెల 17న విచారణకు వెళ్లిన సిట్ బృందానికైనా ఈవీఎం ధ్వంసం గురించి చెప్పారా? ఈనెల 18న డీజీపీకి సిట్ ఇచ్చిన ప్రాథమిక నివేదికలోనూ ఎమ్మెల్యే పిన్నెల్లి పేరు లేదు. ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేసినట్లు ఆ నివేదికలో ఎక్కడా లేదు. మీడియాకు సిట్ విడుదల చేసిన నివేదికే అందుకు తార్కాణం.⇒ ఈనెల 20న లోకేష్ ట్వీట్ ఆధారంగా పిన్నెల్లిని అరెస్టు చేయాలని ఎన్నికల కమిషన్ మర్నాడు ఆదేశించింది. లోకేష్కు ఆ వీడియో ఎలా వచ్చిందని మీడియా ప్రశ్నిస్తే తన కార్యాలయం నుంచి లీక్ కాలేదని, ఎలా వచ్చిందో విచారణలో తేలుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పేర్కొనడం హాస్యాస్పదం.⇒ ఈసీ ఉత్తర్వులపై పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించి ఈనెల 22న బెయిల్ తెచ్చుకుంటే అదే రోజు ఆయనపై తప్పుడు కేసు బనాయించారు. ఈనెల 14న కారంపూడిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలను చెదరగొట్టేటప్పుడు తనకు గాయమైందని, తనపై దాడి చేసిన వారిలో పిన్నెల్లి ఉన్నారని ఈనెల 22న సీఐ నారాయణస్వామి తాపీగా స్టేట్మెంట్ ఇచ్చారు. పిన్నెల్లి పేరు ఎఫ్ఐఆర్లో చేర్చి తప్పుడు కేసు బనాయించారు. సీఐకి 14న గాయమైతే 22 వరకూ స్టేట్మెంట్ ఇవ్వకుండా ఏం చేశారు?⇒ పోలింగ్ మర్నాడు పారా మిలటరీ బలగాలు మాచర్లలో ఉన్నా పక్కనే ఉన్న కారంపూడిలో సీఐ నారాయణస్వామి, ఎస్సై రామాంజనేయులు అండతో చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన టీడీపీ రౌడీమూకలు విధ్వంసానికి తెగబడ్డాయి. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఇళ్లు, దుకాణాలను ధ్వంసం చేసినా పోలీసులు పట్టించుకోలేదు.⇒ టీడీపీకి లొంగిపోయిన ఎన్నికల వ్యవస్థ, పోలీసు వ్యవస్థలు పిన్నెల్లిపై కక్ష కట్టి తప్పుడు కేసులు బనాయిస్తున్నాయి. మాచర్లలో ఎన్నికల హింసకు సంబంధించి ఎస్సీ, డీఎస్పీ, ఎస్సై సస్పెండైనా ఐజీ త్రిపాఠీకి సన్నిహితుడైన సీఐ నారాయణస్వామిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గతంలో కారంపూడి ఎస్సైగా ఉన్నప్పుడు అత్యంత వివాదాస్పంగా వ్యవహరించి సస్పెన్షన్కు గురైన నారాయణస్వామిని సీఐగా ఎలా నియమిస్తారు? ఆయన వ్యవహార శైలిపై గత నెల 8నే ఎమ్మెల్యే పిన్నెల్లి ఫిర్యాదు చేసినా ఈసీ పట్టించుకోలేదు. ⇒ పోలింగ్ రోజు టీడీపీ కార్యకర్తను హత్య చేసేందుకు పురిగొల్పారని, మహిళలను చంపుతానని బెదిరించారని పిన్నెల్లిపై ఈనెల 23న మరో రెండు కేసులు నమోదు చేశారు. ఇలా ఇంకెన్ని తప్పుడు కేసులు బనాయిస్తారో డీజీపీ వెల్లడించాలి. పిన్నెల్లిని కౌంటింగ్కు రానివ్వకుండా చేసి దౌర్జన్యాలకు తెగబడాలని టీడీపీ కుట్రలు చేస్తోంది. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన ఈసీ అందుకు వంత పాడటం దారుణం. -
టీడీపీ వీడియో ట్వీట్ చేస్తే ఈసీ విచారణకు ఆదేశిస్తుందా?: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఈసీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. పోలీసు అధికారులు కూడా బరితెగించి ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ సందర్భంగా హింస జరుగుతోందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదని కామెంట్స్ చేశారు.కాగా, పేర్ని నాని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘పోలీసు అధికారులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. టీడీపీ నేతలు హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టరు. పోలీసులు ఏకపక్షంగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపైనే కేసులు పెడుతున్నారు. అసలు ముద్దాయిని వదిలేసి తప్పుచేయని వారిపై కేసులు పెడుతున్నారు. హింస జరిగిన తర్వాత కూడా పోలీసులు సరిగా స్పందించలేదు. హింస జరుగుతోందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదు.13వ తేదీన కేసు ఎందుకు పెట్టలేదు?..వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఓటు వేయకుండా అడ్డుకున్నారు. కూటమి నేతలు ఎవరిని నియమించాలని కోరితే వారినే నియమించారు. పాల్వాయి గేటు దగ్గర దౌర్జన్యం జరిగితే అడ్డుకోలేదు. పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేస్తే 13వ తేదీనే ఎందుకు కేసు నమోదు చేయలేదు. ఈ ఘటనపై టీడీపీ అప్పుడే ఎందుకు ఫిర్యాదుచేయలేదు. డీజీపీకి సిట్ ఇచ్చిన నివేదికలో పిన్నెల్లి ప్రస్తావన కూడా లేదు. ఈసీ కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది.టీడీపీ నేతలు హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టలేదు. ఎస్పీ సహా అధికారులకు పిన్నెల్లి ఫిర్యాదు చేశారు. పోలింగ్ ఆగినట్టు ప్రిసైడింగ్ ఆఫీసర్ లాగ్ బుక్లో ఎందుకు లేదు?. ఛానళ్లలో చూసిన తర్వాతే ఈసీ అధికారులు స్పందిస్తారా?. టీడీపీ పిన్నెళ్లి వీడియోను ట్వీట్ చేస్తే ఈసీ విచారణకు ఆదేశిస్తుందా?. అసలు ఏం జరిగిందో విచారణ చేయరా?. కారంపూడిలో విధ్వంసకాడ జరిగితే చూస్తూ ఊరుకుంటారా?’ అని ప్రశ్నలు సంధించారు.పోలింగ్ ఆగిందా?..టీడీపీ వారు కర్రలు, రాళ్లతో స్వైరవిహారం చేస్తున్నా పట్టించుకోలేదు. గొడవలను ఆపటానికి ప్రయత్నించలేదు. కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. పోలింగ్ స్టేషన్ 202లో ఒక గంటసేపయినా పోలింగ్ ఆగిందా?. నిజంగానే ఎమ్మెల్యేనే ధ్వంసం చేస్తే అధికారులు వెంటనే ఎందుకు చర్యలు తీసుకోలేదు?. కనీసం టీడీపీ ఏజెంట్లు అయినా ఎందుకు ఫిర్యాదు చేయలేదు?. సిట్ అధికారులకైనా ఎమ్మెల్యేపై ఎవరూ ఎందుకు ఫిర్యాదు చేయలేదు?. కానీ లోకేష్ మాత్రం ఎమ్మెల్యే ఒక వీడియోను రిలీజ్ చేయగానే ఈసీ వెంటనే ఎమ్మెల్యేను అరెస్ట్ చేయమని ఆదేశించింది. కోర్టులకు కూడా లేని అధికారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఉపయోగించాలని చూసింది.ఈసీపై సెటైర్లు..కేంద్ర ఎన్నికల సంఘం తొందరపాటు చర్యలకు దిగటం దారుణం. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే పిన్నెల్లి తరపు లాయర్ కోర్టులో గట్టిగా వాదించి బెయిల్ తెచ్చుకున్నారు. దున్నపోతు ఈనిందని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పగానే దూడని కట్టేయమని రాష్ట్ర ఎన్నికల అధికారి అంటున్నారు. వాస్తవాలు ఏంటనేది మాత్రం ఇద్దరూ పట్టించుకోవటం లేదు. సీఐ నారాయణ స్వామి చౌదరికి గాయమైతే మొత్తం టీడీపీ కార్యకర్తలకు గాయాలైనట్లు ఫీలయ్యారు. ఘటన జరిగితే పది రోజులపాటు కేసు కూడా నమోదు చేయకపోవటం ఏంటి?. పిన్నెల్లిపై ఇంకా ఎన్ని కేసులు నమోదు చేస్తున్నారో పోలీసులు చెప్పాలి. రెంటచింతల మండలంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు బయటకు రాకుండా చేయాలని, కారంపూడి మండలంలో టీడీపీకి సహకరించేలా సీఐ నారాయణ చౌదరిని నియమించారు. ఆ సీఐ అత్యంత వివాదాస్పదుడు. గతంలో సస్పెండ్ అయ్యాడు. అలాంటి వ్యక్తిని సీఐగా ఎలా పంపించారు?. పదకొండు రోజుల తర్వాత పిన్నెల్లిపై రెండు కేసులు నమోదు చేశారు. సిట్ బృందానికి కూడా ఈ కేసుల గురించి చెప్పలేదు. పిన్నెల్లి హత్యకు టీడీపీ తీవ్రంగా పని చేస్తోంది. ఈ కుట్రకు సహకరిస్తున్న ప్రతీ పోలీసు అధికారి కచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. పల్నాడులో పోలీసు ఐజీ నాయకత్వంలోనే ఈ కుట్రలన్నీ జరుగుతున్నాయి. ఎల్లో మీడియాలో వార్తలు రాయగానే పోలీసులు, ఎన్నికల సంఘం చర్యలకు దిగుతోంది అంటూ తీవ్ర విమర్శలు చేశారు. -
టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని
-
టీడీపీ అరాచకం.. డీజీపీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, గుంటూరు: టీడీపీ దాడులు, హింసాత్మక చర్యలపై డీజీపీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. ఆ పార్టీ నేతలు మేరుగు నాగార్జున, అంబటి రాంబాబు, పేర్ని నాని డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు.అనంతరం మంత్రి అంబటి రాంబాబు మంగళగిరి డీజీపీ కార్యాలయం దగ్గర మీడియాతో మాట్లాడుతూ, పోలింగ్ బూత్లలో హింస జరుగుతుంటే పోలీసులు అడ్డుకోలేదన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. కొంతమంది పోలీసులు టీడీపీకి కొమ్ము కాశారని మండిపడ్డారు.‘‘వైఎస్సార్సీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్లు చేశారు.టీడీపీ నేతలు మాత్రం విచ్చలవిడిగా తిరిగారు. కూటమి ఫిర్యాదుతో ఈసీ పోలీస్ అధికారులను మార్చింది. అధికారులను మార్చిన తర్వాత కూడా హింస ఎందుకు జరిగింది?’’ అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు.‘‘పోలీసు వ్యవస్థలో కొంతమంది టీడీపీ వారితో కలిసిపోయారు. మాకు బాగా ఓట్లు పడేచోట భారీగా పోలీసులను పెట్టారు. టీడీపీకి బలమైన గ్రామాలలో పోలీసులను పెట్టలేదు. దీంతో వారు పోలింగ్ బూత్లను క్యాప్చర్ చేశారు. నన్ను హౌస్ అరెస్టు చేసి, నా ప్రత్యర్థిని యథచ్చగా తిరగనిచ్చారు. చాలా దుర్మార్గపు చర్యలకు దిగారు. పోలీసు అధికారులను ఉన్నట్టుండి మార్చారు. అలా మార్చితే మేలైన పరిస్థితులు ఉండాలి కదా? మరి ఎందుకు హింస జరిగింది?. అధికారులను మార్చిన తర్వాత ఎందుకు హింస జరిగింది?. అవగాహన లేని డీజీపి, ఎస్పీలను పెట్టడం వలన హింస జరిగింది’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.‘‘ఎన్నికల కమిషన్ తీసుకున్న తప్పుడు నిర్ణయం వలనే ఈ పరిస్థితి ఏర్పడింది. పోలీసు పరిశీలకుడు ఢిల్లీ ఆదేశాలు, పురంధేశ్వరి ఆదేశాలతోనే చేశారు. సీఎస్, డీజీపీలను ఢిల్లీకి పిలిచారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తన నియోజకవర్గంలో రీపోలింగ్ అవసరం లేదని ఈసీ ఎలా చెబుతుంది?. వెబ్ కెమెరాలను విశ్లేషించకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారు?’’ అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు.పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దారుణాలు: మాజీ మంత్రి పేర్నిటీడీపీ నేతలు, కార్యకర్తలు యథేచ్చగా కర్రలు, రాడ్లతో దాడులు చేశారు. మా వాళ్లు ఎదురు తిరిగితే మాపై కేసులు పెడుతున్నారు. పోలింగ్ తర్వాత జరుగుతున్న హింసలకు పోలీసుల వైఫల్యమే కారణం. పల్నాడు ఎస్పీకి ఫోన్లు చేసినా పట్టించుకోలేదు?. రిటైర్డ్ అధికారిని పోలీసు అబ్జర్వర్ని పెడితే ఏం జవాబుదారీతనం ఉంటుంది. బీజేపి, కూటమికి సహకరించమని పోలీసు అధికారులనే ఆయన బెదిరించారు. మా కార్యకర్తలపై హత్యానేరం కేసులు పెడుతున్నారు. పురంధేశ్వరి చెప్పినట్టు పోలీసు అధికారును మార్చినచోటే హింస జరిగింది. అంటే పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దారుణాలకు పాల్పడ్డారు -
మీ ఆస్తిపత్రాలు ఎవరి వద్ద ఉన్నాయి చంద్రబాబూ?
సాక్షి, అమరావతి: చంద్రబాబు ఆస్తిపత్రాలు ఎవరివద్ద ఉన్నాయని ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. పవన్ తన ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకుంటే జిరాక్స్ పేపర్లు ఇచ్చారా? అని నిలదీశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై చంద్రబాబు విషం గక్కుతున్నారని చెప్పారు. పక్క రాష్ట్రాల్లో మోదీపై విమర్శలు చేస్తే ఈసీ ఆంక్షలు విధిస్తోందని, కానీ ఇక్కడ జగన్ని చంపేయండంటున్నా మిన్నకుంటుందని పేర్కొన్నారు. మే 14 తర్వాత పథకాలు అమలు చేయండని తెలంగాణలో ఈసీ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. రామోజీ, రాధాకృష్ణలు.. చంద్రబాబు కోసం ఎంతకైనా బరితెగిస్తున్నారని, తప్పుడు రాతలు రాస్తున్నారని చెప్పారు. పవన్కళ్యాణ్ను వాడుకుని జగన్కి కాపులను దూరం చేయాలని చంద్రబాబు అనుకుంటున్నాడని, దళితులను చీల్చడానికి మంద కృష్ణమాదిగను తెచ్చాడని, కానీ బీసీలను చీల్చుదామంటే వారు ప్రశ్నించడం మొదలు పెట్టారని వివరించారు. ఎన్నిచేసినా పెద్ద గీత జగన్ పక్కన చంద్రబాబు చిన్న గీతగానే మిగిలాడని, ఇక ఏమీ చేయలేక భూములపై విషప్రచారం మొదలుపెట్టారని చెప్పారు. ఇవన్నీ ఆగాలంటే, ప్రజలకు మేలు జరగాలంటే ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలని కోరారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..దుష్టచతుష్టయం కుటిల పన్నాగాలు ఫెయిల్ ఎన్నికలు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పనితీరుపై జరగకూడదని రామోజీరావు, రాధాకృష్ణ, చంద్రబాబు, పవన్కళ్యాణ్ దుష్ట పన్నాగాలు పన్నారనేది స్పష్టం అవుతోంది. జగన్ ప్రభుత్వం వలంటీర్ వ్యవస్థను చేపట్టిందని, అది దుర్మార్గమైన వ్యవస్థ అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వలంటీర్ వ్యవస్థ పెద్ద మాఫియా అని, వలంటీర్లు అమ్మాయిలను రెడ్లైట్ ఏరియాకు అమ్మేస్తున్నారని పవన్కళ్యాణ్ మాట్లాడారు. ఏపీలో అమ్మాయిలు మిస్సయ్యారని, కేంద్ర నిఘావర్గాలు తనకు చెప్పాయని దుష్ప్రచారం చేశారు. ఈ సంచులు మోసే వలంటీర్లు మగవాళ్లు ఇంట్లోలేని సమయంలో తలుపులు కొట్టి ఆడవాళ్లను లోబరుచుకుంటారని చంద్రబాబు మాట్లాడాడు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వలంటీర్ వ్యవస్థపై నీచంగా వార్తలు రాశాయి. కానీ ప్రజల్లో ఈ వ్యవస్థపై ఇసుమంతైనా నమ్మకం సడలలేదు. కోవిడ్ సమయంలో దేశంలోనే అత్యద్భుతంగా సేవలందించిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది. చంద్రబాబు, పవన్కళ్యాణ్, రామోజీ, రాధాకృష్ణ హైదరాబాద్లో ఇళ్లల్లోంచి బయటకు రాలేదు. జగన్ ఇక్కడే ఉండి రూ.30 వేల కోట్లు కోవిడ్ కోసం ఖర్చుచేసి మందులు, వైద్యం అందించారు.కులాలను వాడుకుని దెబ్బతీయాలని బోర్లా పడ్డారు చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో ఈ రాష్ట్రానికి ఫలానా మేలు చేశానని చెప్పుకొనే పరిస్థితి ఉందా? చేసిందేమీ లేక కులాలను వాడుకుని జగన్ను దెబ్బతీయాలనే ప్రయత్నం చేశాడు. మహిళలనూ చీల్చుదామని చూశాడు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు రూ.14 వేల కోట్ల రుణాలు బేషరతుగా మాఫీచేస్తానని, ప్రతి మహిళకు సెల్ఫోన్ కొనిస్తానని, పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.25 వేలు ఇస్తానని చెప్పి మోసం చేశాడు. రాష్ట్రంలో ఉన్న సుమారు మూడు కోట్లమంది మహిళలు సీఎం జగన్కు అండగా ఉన్నారు.2019 నుంచీ ఎవరి ఆస్తిపత్రాలు వారి వద్దే..ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై వదంతులు సృష్టించారు. ఈ యాక్ట్ 2019లోనే వచ్చింది. ఇప్పుడు 2024లో దానిగురించి మాట్లాడుతున్నారు. 2019లో చట్టం వస్తే.. ఇప్పటివరకు చంద్రబాబు కొనుక్కున్న ఆస్తుల కాగితాలు అతని వద్దే ఎందుకు ఉన్నాయి? పవన్కళ్యాణ్ ఈ ఐదేళ్లలో మూడో, నాలుగో ఆస్తులు కొన్నారని చెబుతున్నారు. మరి ఆయన కాగితాలు ఆయన వద్దే ఎలా ఉన్నాయి? ఈ రాష్ట్రంలోని టీడీపీ, జనసేన నాయకులు కొనుక్కున్న ఆస్తుల ఒరిజనల్స్ ఎవరివి వారివద్ద ఎందుకున్నాయి?బరితెగించిన చంద్రబాబు తప్పుడు ప్రచారంపై ఎన్నికల కమిషన్ కేసులు పెడితే.. చంద్రబాబు బరితెగించి ఫుల్పేజీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఆయనకు వ్యవస్థలంటే లెక్కలేదు. రాష్ట్రంలోని 26 వేల రెవెన్యూ గ్రామాల్లో ఇప్పటివరకు ఆరువేల గ్రామాల్లోనే సర్వే జరిగింది. అక్కడ టీడీపీ వారు లేరా? సర్వే సందర్భంగా ఒక్కరన్నా ఆరోపణలు చేశారా? అసెంబ్లీలో చట్టం చేసేటప్పుడు టీడీపీ సమర్థించింది. ఇప్పుడు ఎన్నికల కోసం విషం చిమ్ముతోంది. చంద్రబాబు బీసీ సర్టిఫికెట్ ఇస్తే.. దానిపై ఆయన బొమ్మ ఉంటే ఆ బీసీ.. కమ్మ ఆయిపోతారా? పాసు పుస్తకం లోపల తహసీల్దారు సంతకం ఉంటుంది. పైన ఫొటో ముఖ్యమా? లోపల సంతకం ముఖ్యమా? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. -
పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని
-
చంద్రబాబు కోసం ఇంతలా దిగజారాలా పీవీ రమేష్..?
సాక్షి, కృష్ణా: చంద్రబాబు కోసం ఇంతలా దిగజారాలా అంటూ రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్పై మాజీ మంత్రి పేర్నినాని ధ్వజమెత్తారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి పచ్చ మీడియా సరిపోవన్నట్లు మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా చంద్రబాబు జత కట్టుకుంటున్నారని మంపడిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విపరీతమైన విషం చిమ్మి కుట్రతో అధికారంలోకి రావాలని చంద్రబాబు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాడని నిప్పులు చెరిగారు.మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల తన పొలం మ్యుటేషన్ జరగట్లేదని చేసిన ట్వీట్ను ప్రస్తావించారు. పెద్ద పెద్ద చదువులు చదువున్న మీరు ఇంత అసహ్యంగా, దిగజారి మీరు ప్రవర్తించాలా? అని ప్రశ్నించారు. పీవీ రమేష్ది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం విన్నకోట గ్రామమమని తెలిపారు. ఈ గ్రామంలో తన తండ్రి పేరుపై ఉన్న పొలం తన పేరుపైకి మార్చడం లేదంటూ అన్యాయంగా, కిరాతకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రమేష్ తండ్రి సుబ్బారావు మాస్టారుతో పాటు అదే గ్రామంలో ఉన్న ఇతర ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కుటుంబాలు, స్థానికులు మొత్తం కలిసి 25 ఎకరాల భూమిని కొని చెరువును తవ్వారని చెప్పారు.25 మంది కలిసి 70 ఎకరాలు కొని దానిలో ఒక చెరువు తవ్వి లీజుకు ఇస్తూ వస్తున్నారన్నారు పేర్ని నాని. ఏడాది క్రితం రమేష్ తండ్రి సుబ్బారావు మరణించారని, ఆయన మరణించిన తర్వాత రమేష్ మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేశారని, అప్పటి నుంచీ విచారణలు జరుగుతున్నాయని చెప్పారు. గాలంకి నాగేంద్ర అనే వ్యక్తి కూడా ఈ చెరువులో భాగస్వామి. ఆయనకు, రమేష్కు కోర్టులో కేసులు నడుస్తున్నాయని తెలిపారు.వివాదాల వల్లే..ఆ చెరువులో వీళ్లకి సంబంధించిన పొలం ఎంతో కొంత ఉంది.దీనికోసమే జనవరి నెలలో జాయింట్ కలెక్టర్, ఆర్డీవోలు అక్కడ విచారణ నిర్వహించారు. ఆ విచారణకు అందరు రైతుల్ని ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకుని రమ్మని చెప్పారు. అయితే పీవీ రమేష్ మాత్రం తన గుమస్తాకు ఫోటోస్టాట్ కాపీలిచ్చి పంపారట. ఫోటోస్టాట్ కాదు..ఒరిజినల్స్ పంపండి అని చెప్పారు. ఆయన రాడు..సరే గుమస్తాను పంపినా ఒరిజినల్స్ కావాలి కదా?క్కడ ఉన్న వివాదాన్ని తీర్చడం కోసమే మూడు నెలలుగా ఆ చెరువును అధికారులు ఎండబెడుతున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత సరిహద్దులు ఫిక్స్ చేసి ఎవరి భూమి వారికి ఇచ్చేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.ఇంత కథ నడుస్తుంటే ఇంత విషం చిమ్మడం ధర్మమా పీవీ రమేష్?మీ వివాదానికి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధం ఏమిటి?అక్కడున్న రైతులందరికీ, మీకు తగాదా ఉండటం ఏంటి? అక్కడున్న ల్యాండ్ కన్నా మీరు అదనంగా లీజు పొందుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.ఎవరి పొలం ఎక్కడో కూడా తెలియని పరిస్థితి. చెరువు పూర్తిగా ఎండిపోయిన తర్వాత కదా కొలతలు వేసి ఎవరి హద్దు ఏంటో చెప్పేది?.ఎటువంటి వివాదం లేకపోతే, అది వ్యవసాయ భూమి అయి హద్దులు క్లియర్గా ఉంటే..ప్రభుత్వాన్ని విమర్శించినా ఒక అర్ధం ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు మీ పొలానికి సంబంధం ఏంటి?చంద్రబాబు పంచన చేరి ఐఏఎస్ చదువుకుని పచ్చిగా రాజకీయాల కోసం దిగజారడం అవసరమా? చంద్రబాబు కోసం మీరు ఏ డాన్స్ కట్టమంటే ఆ డాన్స్ కడుతున్నారు. ఏ ట్వీట్ చేయమంటే ఆ ట్వీట్ చేస్తున్నారు. చంద్రబాబుకు అధికారం సంపాదించడం కోసం మీరు ఇలా తప్పుడు ప్రకటనలు చేసి జగన్గారి ప్రభుత్వంపై విషం చిమ్మడం దుర్మార్గమైన చర్య. మీరు విన్నకోట గ్రామం రండి.. అక్కడేం జరుగుతుందో చూడండి.మీ కోసమే.. ఆ వివాదం తేల్చడం కోసమే మూడు నెలలుగా వీఆర్వోలను కాపలా పెట్టి మరీ చెరువును కాళీ చేయిస్తున్నారు.పోలింగ్ అయిన తర్వాత వచ్చి సర్వే చేస్తామని రైతులకు, మీ గుమస్తాకి కూడా సమాచారం అందించారు. ఆ చెరువు మధ్యలోనే ఆవుల దొడ్డి కింద ఓ 3.5 ఎకరాల వివాదాస్పద భూమి కూడా ఉంది. మీతో ఉన్న ఆ 25 మంది రైతులు కూడా ఆ ఆవుల దొడ్డి భూమి మాదంటే మాది అని క్లెయిమ్ చేస్తున్నారు.ఇలాంటి చరిత్ర కలిగిన భూమిని మీ నాన్నగారు మీకు అప్పజెప్పారు.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల నాకు మ్యుటేషన్ అవ్వడం లేదని ఇంతగా దిగజారడం అవసరమా? ’ అని మండిపడ్డారు పేర్ని నాని. -
నా కొడుకు కోసం బందరులో ఎక్కడైనా అడుగు.. ఒక్కటే సమాధానం
-
కొల్లు రవీంద్రకు పేర్నినాని సవాల్
-
మేనిఫెస్టోలో మోదీ.. యాడ్స్లో పవన్ ఫొటోలు ఎందుకు లేవు
చిలకలపూడి (మచిలీపట్నం): ఇటీవల చంద్రబాబు, పవన్కళ్యాణ్ విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రధాని మోదీ ఫొటో లేకపోవటం.. ఇప్పుడు టీడీపీ తరఫున పత్రికల్లో ఇచ్చిన అడ్వరై్టజ్మెంట్స్లో పవన్కళ్యాణ్ ఫొటో లేకపోవటం చంద్రబాబు దగాకోరు విధానానికి అద్దం పడుతోందని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఎద్దేవా చేశారు. మచిలీపట్నంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో గురు వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ అడ్వరై్టజ్మెంట్లో రూ.4 వేలు పింఛన్ ఇస్తామన్న హామీ కూడా లేకపోవటం చంద్రబాబు మాయమాటలకు అద్దం పడుతోందన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కూటమి అధినేతల ఫొటోలు మాయమవడంతో పాటు హామీలను కూడా మాయం చేసే చంద్రబాబును ప్రజలు దగాకోరుగా అభివర్ణిస్తున్నారన్నారు. ఎన్నికలు రాకముందే మోసం మొదలైందని చెప్పుకుంటున్నారన్నారు. ఎన్టీఆర్ హామీలనూ తుంగలోకి తొక్కిన ఘనుడు బాబు ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఉన్నప్పుడు కిలో రెండు రూపాయల బియ్యం, మద్యపాన నిషేదం హామీలను అమలు చేస్తే.. కుట్రలు పన్ని, ఆయనకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కిలో రెండు రూపాయల బియ్యాన్ని రూ.5.50 చేయటంతో పాటు మద్యపాన నిషేధాన్ని ఎత్తివేశారని పేర్ని నాని గుర్తు చేశారు. 1999లో ఇచ్చిన మేనిఫెస్టోలో యువతకు 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, 35 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతామని, ప్రతి పాఠశాలకు పక్కా భవనం నిరి్మస్తామని, మహిళలకు ప్రత్యేక బ్యాంకులు ఏర్పాటు చేస్తామని చెప్పిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. 2014లో 600 హామీలతో మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు.. ఆ హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రజలు ప్రశ్నించినప్పుడు ఆశకు హద్దుండాలని వ్యాఖ్యానించటం ఆయనకే చెల్లిందన్నారు. జాబు కావాలంటే బాబు రావాలని ప్రచారం చేసుకున్న చంద్రబాబు తన కుమారుడు లోకేశ్కు మాత్రమే జాబు ఇచ్చారన్నారు. ప్రధాని మోదీ, పవన్కళ్యాణ్తో కూటమి కట్టిన చంద్రబాబు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ వారిని ఆటలో అరటిపండులా వదిలేశాడన్నారు. ఎంతటి వారినైనా మోసం చేసే గుణం చంద్రబాబుకే ఉందన్నారు. ఇటువంటి చంద్రబాబు మాయమాటలను రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా గ్రహించి నక్కజిత్తుల మాటలు నమ్మకుండా ఆలోచించాలన్నారు. వైఎస్ జగన్ అంటే నడిచే నమ్మకంగా చంద్రబాబు మాటలు అపనమ్మకంగా భావించి చంద్రబాబును శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం చేయాలని కోరారు. మే 13న చంద్రబాబుకు కర్రు కాల్చి వాత పెట్టే విధంగా తీర్పును ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దయనీయ పరిస్థితిలో పింఛన్ లబ్దిదారులు చంద్రబాబు, ఆయన బంధువు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కుట్రల కారణంగా పింఛన్ లబ్దిదారులు దయనీయ స్థితిలో ఉన్నారని పేర్ని నాని అన్నారు. హైకోర్టులో పిటిషన్లు వేసి ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చి పింఛన్ లబ్దిదారులు గడప దాటేలా చేశారన్నారు. బ్యాంకులకు వెళ్లిన లబి్ధదారులకు మినిమమ్ బ్యాలెన్స్ మొత్తాలను కట్చేసి పింఛన్లు ఇస్తుంటే వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు. ఇటువంటి పరిస్థితి తీసుకువచ్చిన చంద్రబాబుకు 66 లక్షల మంది పింఛన్దారుల ఉసురు తప్పకుండా తగులుతుందన్నారు. -
దగాకోరు చంద్రబాబుతో తస్మాత్ జాగ్రత్త: పేర్ని నాని
సాక్షి, కృష్ణా జిల్లా: చంద్రబాబు చెప్పేవన్నీ మాయ మాటలేనని.. కూటమి మేనిఫెస్టోలో మోదీ ఫొటో మాయమైందని మాజీమంత్రి పేర్ని నాని మండిపడ్డారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీఎం జగన్ జనం గుండెల్లో గూడు కట్టుకున్నారన్నారు.‘‘జగన్ను కూలదోయడానికి కూటమి జట్టు కట్టుకట్టారు. మాయ మాటలతో ప్రజలను మోసం చేసేందుకు పక్కా ప్రణాళికతో వస్తున్నారు. చంద్రబాబు ముగ్గురు ఫోటోలతో కూటమి అని బయల్దేరాడు. మేనిఫెస్టో నాటికి మూడు ఫోటోలు కాస్తా రెండు ఫోటోలయ్యాయి. సూపర్ 6 అంటూ ఇంటింటికీ పాంప్లెట్లు పంచారు. ఇప్పుడేమో మేనిఫెస్టోకు బీజేపీ ఆర్ధిక అనుమతులు లేవంటున్నాడు. చంద్రబాబు ఇచ్చిన ప్రకటనల్లో ఇప్పుడు పవన్ ఫోటో మాయం చేశాడు. చంద్రబాబు మేనిఫెస్టోలో ఫోటోలతో పాటు హామీలు కూడా ఒక్కొక్కటి మాయమవుతున్నాయి. నాలుగు వేల పెన్షన్ అంటూ ఇంటింటికీ తిరిగి ఊదరగొట్టారు. ఇప్పుడు సూపర్ సిక్స్ నుంచి చివరి పేజీలోకి పోయింది. ఈ రోజు ఇచ్చిన ప్రకటనలో అసలు పెన్షనే లేకుండా ఎత్తేశారు’’ అని పేర్ని నాని ఎద్దేవా చేశారు.పేర్ని నాని మీడియాతో ఇంకా ఏం మాట్లాడారంటే:నిన్న మోదీ..నేడు పవన్ కల్యాణ్ ఫోటోలు మాయం:⇒చంద్రబాబు, మోదీ, పవన్ కల్యాణ్లు ఈ రాష్ట్రాన్ని ఉద్దరిస్తామని కూటమిగా ఏర్పడ్డారు. ⇒సీఎం జగన్ లాంటి జనం గుండెల్లో గూడు కట్టుకున్న ప్రజా నాయకుడిని కూలదోయాలనే కుట్రతో ముగ్గురూ కలిశారు ⇒వారు జట్టు కట్టి మాయ మాటలతో ప్రజల్ని వంచించాలని పక్కా ప్రణాళికతో వస్తున్నారు⇒బీజేపీతో నేను కలిశానంటే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే అని చంద్రబాబు అంటారు⇒జగన్ను కూలదోయడం కోసం పవన్ కల్యాణ్తో కలిశానని చెప్తున్నాడు⇒ముగ్గురు ఫోటోలతో బయలుదేరిన ఆయన మేనిఫెస్టో విడుదలలో మూడు ఫోటోలు రెండు ఫోటోలు అయ్యాయి⇒మోదీ మాయమయ్యాడు. చంద్రబాబు, పవన్ కల్యాణే మిగిలారు⇒ముందు సూపర్ సిక్స్ అని చంద్రబాబు, వవన్, మోదీ ఫోటోలతో ఇంటింటికీ పాంప్లెట్ ఇచ్చారు⇒మేనిఫెస్టోలో మోదీ ఫోటో మాయమైంది. ఎందుకయ్యా అంటే మా మేనిఫెస్టోకి బీజేపీ ఆర్థిక పరమైన ఒత్తాసు లేదని చెప్తున్నారు⇒ఈ మేనిఫెస్టో అమలు చేయాలంటే రెండు లక్షల కోట్ల వరకూ కావాలి. .అంత మోసం మేం చేయలేం అని బీజేపీ తప్పుకుంది⇒ఈ రోజు చంద్రబాబు రాష్ట్రంలోని పత్రికలన్నిటికీ కోట్లు ఖర్చు పెట్టి ప్రకటనలు ఇచ్చుకున్నాడు⇒సరే పాపపు సొమ్ము ఉంది కాబట్టి ప్రకటనలు ఇచ్చుకుంటాడు. ఈ ప్రకటనలో పవన్ కల్యాణ్ మాయం⇒ముందు ముగ్గురం అన్నాడు.. మేనిఫెస్టోలో మోదీ మాయమయ్యాడు. ఎన్నికల దగ్గరయ్యే కొద్దీ పవన్ కల్యాణ్ కూడా మాయంఫోటోలే కాదు.. ఆయనిచ్చిన హామీలు మాయం:⇒ఫోటోలే కాదు..చంద్రబాబు ఇచ్చిన హామీలు కూడా మాయమై పోతున్నాయి. ⇒ఇంటింటికీ సూపర్ సిక్స్ పేరుతో ఊదరగొట్టారు. డబ్బా కబుర్లు చెప్పారు. ⇒ఈ రోజు ఇచ్చిన ప్రకటనలో వారి సూపర్ సిక్స్లో నాలుగు వేల పింఛన్ ఎత్తేశారు.⇒రూ.4వేలు పింఛన్ అని ముందు ఊదరగొట్టారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరయ్యే కొద్దీ దాన్ని కనిపించకుండా చేస్తున్నాడు.⇒మేనిఫెస్టోలో నాలుగు వేల పింఛన్ చివరి పేజీకి వెళ్లిపోయింది. ఈ రోజు అసలు కనిపంచనే లేదు.⇒ఇవాళ అప్పుడే చంద్రబాబు దగాకోరుతనం, మోసం మొదలైపోయింది.⇒ఇంతకు ముందు చంద్రబాబు ఓట్లు వేయించుకున్న తర్వాత మోసం మొదలు పెట్టేవాడు. ⇒ కానీ ఇప్పుడు ఇంకా పోలింగ్ కాకముందే మోసం మొదలుపెట్టాడు.⇒1994లో ఎన్టీఆర్ రెండు రూపాయలకే కిలో బియ్యం, 50 రూపాయలకే హార్స్పవర్ విద్యుత్, మద్యపాన నిషేదం అని చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.⇒1995లో ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి ఎగిరి ఆ కుర్చీలో కూర్చున్న చంద్రబాబు రెండు రూపాయల కిలో బియ్యాన్ని వెంటనే ఐదున్నర రూపాయలు చేశాడు.⇒వ్యవసాయ విద్యుత్లో హార్స్పవర్ రూ.50 ఉన్నదాన్ని రూ.650 చేశాడు.⇒రామారావు గారు పెట్టిన మద్యపాన నిషేదాన్ని ఎత్తేశాడు.⇒అంటే 1994 నుంచే మేనిఫెస్టోపై దగా చేయడం చంద్రబాబుకు అలవాటు.⇒1999లో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోలో 25 లక్షల ఉద్యోగాలిస్తాను..లేకపోతే కుటీర పరిశ్రమలు పెట్టుకోడానికి ఆర్థిక సాయం అన్నాడు.⇒బలహీనవర్గాలకు ఐదేళ్లలో 35 లక్షల ఇళ్ల నిర్మాణం చేస్తానన్నాడు.⇒ఏపీలో ఉన్న ప్రతి ఒక్క పాఠశాలను పక్కా భవంతిగా చేస్తానన్నాడు.⇒చట్టసభల్లో మహిళలకు 3వ వంతు రిజర్వేషన్కి నేను బాధ్యత తీసుకుంటాను అన్నాడు. ⇒ఆయన పోరాటం చేయలేదు.. కనీసం తన పార్టీలో పది శాతం మందికి కూడా టికెట్లు ఇవ్వలేదు.⇒మహిళా బ్యాంకులు ఏర్పాటు చేస్తాను అన్నాడు. ఎక్కడున్నా చూశారా మీరు? ⇒పోస్టు గ్రాడ్యుయేషన్ స్థాయి వరకూ మహిళలకు ఉచిత విద్యాసౌకర్యం అన్నాడు. ఎక్కడన్నా ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాడా?⇒2009లో కూడా మేనిఫెస్టో ఇచ్చాడు కానీ ఆయన మాటలు ఎవరూ నమ్మలేదు.⇒వైఎస్సార్ ఆ రోజు రెండే హామీలిచ్చారు. ప్రతి వ్యక్తికి 6కేజీల బియ్యం, 7 గంటల నిరంతర విద్యుత్ ఇస్తానని చెప్పారు.⇒చంద్రబాబు ఆరోజు డబ్బులు వేస్తానని ఇళ్లలో డమ్మీ ఏటీఎం కార్డులు పంచిపెట్టాడు.రైతు రుణమాఫీ చేయకపోగా... ఆశకు హద్దుండాలన్న వ్యక్తి చంద్రబాబు:⇒2014కు వచ్చే సరికి 600 హామీలు ఇచ్చాడు.. వాటిలో ఒక్కటీ అమలు చేయలేదు.⇒పేదవాళ్లకు మూడు సెంట్లు స్థలం అన్నాడు. అమలు చేయలేదు.⇒పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.25వేలు ఇస్తానన్నాడు. డ్వాక్రా రుణాలు రూ.14వేల కోట్ల రుణాల మాఫీ అన్నాడు. ఏదీ చేయలేదు.⇒రైతులకు రూ.85 వేల కోట్ల రుణమాపీ చేస్తాను అన్నాడు. ⇒వారి అడబిడ్డల నగలను కూడా బ్యాంకుల నుంచి విడిపించి ఇంటికి తెచ్చిస్తానన్నాడు. ⇒మాఫీ చేయకపోగా..ఆశకు హద్దుండాలయ్యా అన్నాడు.⇒మళ్లీ 2024 వచ్చింది. మళ్లీ బయలుదేరి మేనిఫెస్టో అంటాడు.⇒రెండు స్థలం అన్నాడు. 2014లో మూడు సెంట్లు అని మూడు గజాలు కూడా ఇవ్వలేదు.⇒ఇంటికో ఉద్యోగం చొప్పున 20 లక్షల ఉద్యోగాలట. 2014లో కూడా కోటి ఉద్యోగాలు..జాబు రావాలంటే బాబు రావాలన్నాడు. ⇒ఒక్క ఇంటికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు. ఇస్తానన్న నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు.⇒రాష్ట్రంలో ఒక్క బాబుగారి కొడుక్కి తప్ప ఎవరికి జాబు వచ్చింది?⇒లోకేశ్ బాబుకు తప్ప రాష్ట్రంలో ఏ బాబుకూ ఉద్యోగం రాలేదు⇒అందుకే ఈ దొంగ మేనిఫెస్టో నుంచి మోడీ తెలివిగా తప్పుకున్నాడని భావించాలి⇒ఇక పవన్ కల్యాణ్ ఫోటో కూడా మాయమైంది కాబట్టి ఆయననూ బాబు పక్కన పెట్టేసినట్లే⇒వీళ్ల ఫోటోలకు సూపర్ సిక్స్ లో ఇచ్చిన నాలుగు వేల పింఛన్ హామీ కూడా మాయమైపోయింది⇒మోదీ, పవన్ కల్యాణ్లు ఆటలో అరటిపండ్లు..⇒నేను ఎంతటి వాడినైనా మోసం చేయగలను అనే ధీమా చంద్రబాబుది⇒ఈ దగాకోరు, నక్కజిత్తుల చంద్రబాబునాయుడితో తస్మాత్ జాగ్రత్త!⇒ జనసేన కార్యకర్తలు కూడా ఈ రోజు చంద్రబాబు ఇచ్చిన ప్రకటన చూడండి⇒మేమందరం ఒకటే అన్నాడు. నేనూ పవన్ కల్యాణ్ కవల పిలల్లం అన్నాడు⇒పవన్ కల్యాణ్ వీరుడు, సూరుడు ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి వచ్చాడు అన్నాడు..ఏకంగా ఫోటోనే లేపేశాడు⇒ఆంధ్రరాష్ట్ర ప్రజలారా..తస్మాత్ జాగ్రత్త⇒జగన్ అంటే ఒక నడిచే నమ్మకం. చంద్రబాబు అంటే ఒక ముసలి అపనమ్మకం⇒ఒక్కసారి ఆలోచన చేసుకోండి. జాగ్రత్తపడండి⇒చంద్రబాబు కన్నా ఈ రాష్ట్ర ప్రజలు తెలివైన వారని నా నమ్మకం⇒కొడుకు కోసం ఈ మోసపు మాటలతో పిల్లమొగ్గలు వేస్తున్న చంద్రబాబును తెడ్డుకాల్చి వాతపెట్టి పంపిస్తారని నా బలమైన నమ్మకంచంద్రబాబు, నిమ్మగడ్డలకు వృద్ధుల ఉసురు తగలకమానదు:⇒చంద్రబాబు తన బంధువైన నిమ్మగడ్డతో కోర్టుల్లో కేసులు వేయించి పింఛన్ ఇంటికి ఇవ్వకుండా చేశాడు.⇒వాలంటీర్ల ద్వారా సాఫీగా పంచే పింఛను అందించకుండా వృద్ధులను ముప్పుతిప్పలు పెడుతున్న వ్యక్తి చంద్రబాబే.⇒మొన్న సచివాలయాలకు రావాల్సిన పరిస్థితి వస్తే..ఈ రోజు బ్యాంకులకు రావాల్సిన పరిస్థితి వచ్చింది.⇒ఆ చంద్రబాబు బంధువు బ్యాంకుల్లో వేస్తే మంచిదే కదా అని చెప్పుకొస్తున్నాడు.⇒రాష్ట్రంలోని 65 లక్షల మంది పింఛన్దారుల్లో 45 లక్షల మంది ఎకౌంట్లు మైనస్లలో ఉన్నాయి. ⇒ఈ పింఛన్ డబ్బు పడగానే దానికి జమ అయిన పరిస్థితితో వృద్ధులంతా లబోదిబోమంటున్నారు.⇒చంద్రబాబు, ఆయన చుట్టమైన నిమ్మగడ్డకు కచ్చితంగా వృద్ధుల ఉసురు తగులుతుంది. -
టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు
-
కూటమిది అసత్యాల మేనిఫెస్టో
చిలకలపూడి (మచిలీపట్నం): ప్రజలను మరొకసారి మోసం చేసేందుకే ఎన్డీయే కూటమి అసత్యాల మేనిఫెస్టోను విడుదల చేసిందని మాజీమంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు. ఆయన మంగళవారం రాత్రి కృష్ణాజిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మూడు పార్టీలు కలిశామని కూటమి అభ్యర్థులు చెప్పుకొంటున్నా.. మేనిఫెస్టోపై ఒకరి ఫొటో లేకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. మూడుఫోటోలు రెండు ఫోటోలయ్యాయంటే మేనిఫెస్టోలోని అంశాలు ఫొటోలేని వారికి ఇష్టం లేదా అని ప్రశ్నించారు. ఆడిన అబద్ధం ఆడకుండా జరగనవి, అసత్యాల మేనిఫెస్టో రూపొందించిన కూటమి సభ్యులు.. 40 ఏళ్ల రాజకీయ జీవితం, 14 ఏళ్లు ముఖ్యమంత్రి చేశానని చెప్పుకోవటం చూస్తే ప్రజలకే అర్థమవుతోందన్నారు. 50 ఏళ్ల వయసున్న సీఎం జగన్ 2019లో మేనిఫెస్టోను విడుదల చేసి 99 శాతం అమలు చేసి ప్రజలకు మంచిచేస్తేనే నాకు ఓటేయండని ధైర్యంగా అడుగుతున్నారని చెప్పారు. సంవత్సరానికి 71 వేల కోట్లతో సంక్షేమ పథకాలను ధైర్యంగా అమలు చేశారన్నారు.నిజాయితీగల వారైతే చంద్రబాబు 2014 మేనిఫెస్టోలో అమలు చేసిన వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. డ్వాక్రా గ్రూపుల వారికి రూ.14 వేల కోట్ల రుణాలు, రైతులకు రూ.84 వేలకోట్ల రుణాలు మాఫీచేస్తానని చెప్పి.. వాటిని ఎంతవరకు అమలు చేశావో ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు. జన్మభూమి కమిటీల పేరుతో పంచాయతీ వ్యవస్థను సర్వనాశనం చేసింది చంద్రబాబేనన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమిగా ఏర్పడ్డామని, ఎన్డీయేలో కలిశామని చెప్పుకొంటున్న చంద్రబాబు మేనిఫెస్టోలో ప్రత్యేకహోదా, రైల్వేజోన్, విశాఖ స్టీల్ప్లాంట్, కడప స్టీల్ కర్మాగారం ఏర్పాటు విషయాలు ఎందుకు పొందుపరచలేదో చెప్పాలన్నారు. అధికారం కోసమే కూటమి అధికారం కోసమే కూటమిగా ఏర్పడ్డారని ఇప్పటికే ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు. ఏపీలో ఏడాదికి 10 శాతం మాత్రమే పెరుగుతున్న ఆదాయాన్ని బట్టి సీఎం జగన్ మేనిఫెస్టో రూపొందించారన్నారు. ఏడాదికి రూ.2 లక్షల కోట్లు అవసరమయ్యే విధంగా మేనిఫెస్టో రూపొందించిన చంద్రబాబు ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారో, ఏ విధంగా అమలు చేస్తారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి పాటుపడతానని చెబుతున్న చంద్రబాబు ఆయన పాలనలో ముస్లింలకు ఎమ్మెల్యే, మంత్రి పదవి ఇవ్వలేదని గుర్తుచేశారు. రాజ్యాధికారంలో మైనార్టీలు భాగస్వామ్యులు కాకూడదనుకునే బాబుకు ఇప్పుడు వారిపై ప్రేమ పుట్టుకొచ్చిందా అని నిలదీశారు. రజకులకు, కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన హామీలు ఏమయ్యాయన్నారు. నాయీబ్రాహ్మణులకు ఉపకరణాలు ఇస్తామని చెబుతున్న చంద్రబాబు వారి పిల్లలకు చదువులు ఎందుకు చెప్పించవని ప్రశ్నించారు. వారు ఆర్థికంగా, విద్యాపరంగా ఎదగకుండా కులవృత్తిలోనే బతకాలా అని నిలదీశారు. రాష్ట్రంలో ప్రజలకు మేలు జరిగితేనే నాకు ఓటు వేయండని ధైర్యంగా చెబుతున్న సీఎం జగన్లాగా చెప్పగల దమ్ముందా అని చంద్రబాబును ప్రశ్నించారు.చంద్రబాబు ఏది చెబితే అదేనంటూ.. కూటమిలో పార్టీలు బుర్రకథల బ్యాచ్లా ఉన్నాయని ఎద్దేవా చేశారు. 2014లో కోటిమంది నిరుపేదలు ఉన్నప్పుడు ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి చెల్లిస్తానని మాయమాటలు చెప్పి ఏ ఒక్కరికి ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా..ఇప్పుడు 20 లక్షల మందికి ఉద్యోగాలిస్తానని అసత్యాల దొంతర అయిన మేనిఫెస్టోలో చెప్పటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. -
దొంగ హామీల ‘చంద్రబాబు’.. బీజేపీకి అర్థమైపోయింది: పేర్ని నాని
సాక్షి, మచిలిపట్నం: చంద్రబాబు, పవన్ చెప్పే మాటలు అమలయ్యేవి కావని బీజేపీకి అర్థమైపోయిందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘అరచేతిలో వైకుంఠం చూపించే మాటలని కూటమిలోని ఒక సభ్యుడు దూరం జరిగాడు. కూటమి మేనిఫెస్టోలో కనిపించింది మూడు కాదు.. రెండు ఫొటోలే. కూటమి సర్కస్ మొదలైంది’’ అంటూ ఎద్దేవా చేశారు.‘‘చంద్రబాబు మేనిఫెస్టోతో సంబంధం లేదని బీజేపీ చెప్పేసింది. 2014 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారు. రైతు రుణమాఫీ చేస్తామన్నారు చేశారా?. ఇన్ని హామీలిచ్చాం.. ఇన్ని నెరవేర్చామని చెప్పే ధైర్యం కూడా లేదు. ఇద్దరు మోసగాళ్లకు పాత మేనిఫెస్టో చూపించే సత్తాలేదు. రాష్ట్రాన్ని ఉద్దరించడానికి కాదు.. అధికారం కోసమే ముగ్గురూ కలిశారు. రాష్ట్రాన్ని బాగు చేయడానికి మేనిఫెస్టోలో ఏం పెట్టారు?’’ అని పేర్ని నాని ప్రశ్నించారు.‘‘2019లో నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని తిట్టుకున్నారు.. ఇప్పుడెందుకు కలిశారు. కళకళలాడుతుండే డ్వాక్రా గ్రూపులు చంద్రబాబు మూలంగా నాశనమయ్యాయి. ఇప్పుడు మళ్లీ దొంగ హామీలతో చంద్రబాబు జనం ముందుకొస్తున్నారు. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను సీఎం జగన్ నెరవేర్చారు’’ అని పేర్ని నాని పేర్కొన్నారు.పేర్ని నాని ఇంకా ఏం మాట్లాడారంటే:⇒బాబూ...నీలో నిజాయితీ ఉంటే 2014 మేనిఫెస్టోలో ఎన్ని అమలు చేశావో చెప్పు⇒జగన్ మేనిఫెస్టో విడుదల చేసిన తీరు చూడండి. 2019లో నా మేనిఫెస్టో ఇదిగో.. దీనిలో 99 శాతం నేను అమలు చేశానని ధైర్యంగా చెప్పారు.⇒రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో వివరిస్తూ..ఎన్ని ఇబ్బందులున్నా ఏటా రూ.71 వేల కోట్లు నేను పేదల కోసం ఖర్చు పెట్టానని చెప్పారు.⇒రెండు గంటల పాటు ఊకదంపుడు ఉపన్యాసం చెప్పిన చంద్రబాబు 14 ఏళ్ల ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటూ అదేమీ చెప్పలేకపోయాడు. ⇒చంద్రబాబునాయుడు నిజంగా నిజాయితీపరుడైతే 2014లో మూడు పార్టీలు కలిసి సంతకం పెట్టి ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏమేమి అమలు చేశాడో చెప్పాల్సింది. ⇒ఇళ్లు లేని ప్రతి పేదవానికీ 3 సెంట్లు స్థలం ఇస్తానని చెప్పాం..ఎవరికన్నా ఇచ్చాడా? ఎన్ని లక్షల మందికి ఇచ్చాడు? ⇒ఇంట్లో ఆడపిల్ల పుడితే ప్రతి ఆడపిల్లకు రూ.25వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను అన్నాడు. ఎంత మందికి చేశారు? ⇒డ్వాక్రా అక్కచెల్లెమ్మలు తీసుకున్న రూ.14వేల కోట్లు బేషరతుగా రుణమాఫీ చేస్తాం అన్నారు. చేశారా? రైతులకు రూ.85 వేల కోట్ల అప్పులను తీర్చి బ్యాంకుల్లో ఉన్న బంగారాన్ని కూడా తెప్పిస్తానన్నారు. ఎంత మందికి చేశారు?⇒పాత మేనిఫెస్టో చూపించి ఒక్క మాటంటే ఒక్క మాట మాట్లాడారా?⇒అదే ముగ్గురం మేం మళ్లీ వస్తున్నాం...ఇన్ని హామీలిచ్చాం..ఇన్ని నెరవేర్చాం..మళ్లీ హామీలు ఇస్తున్నాం..అని చెప్పే సత్తా లేకపోయింది⇒ఇదే మోసగాళ్లు ఈ రోజు మాట్లాడిన మాటలు కూడా మనం చూశాం⇒ఇప్పుడొచ్చి నేను పంచాయతీరాజ్ వ్యవస్థను ఉద్దరిస్తానంటున్నాడు. 2014–19 మధ్యలో ఆ వ్యవస్థను సర్వనాశనం చేసింది ఎవరు? ⇒పంచాయతీల్లో సర్పంచ్లు, పాలకవర్గం ఉండగా..అధికారమంతా జన్మభూమి కమిటీలకు ఇచ్చి ఏ పథకం కావాలన్నా వారు టిక్ పెడితేనే కాని ఇవ్వకుండా ఆ పంచాయతీలను సర్వనాశనం చేసింది ఎవరు?మమ్మల్ని ఏం ఉద్ధరిద్దామని మీరు ముగ్గురూ కలిశారు?⇒నేను ఈ రాష్ట్ర అవసరాల కోసం మాత్రమే బీజేపీతో కలిశాను అని చంద్రబాబు చాలా గర్వంగా చెప్పాడు. ⇒ఈ రోజు ఇచ్చిన మేనిఫెస్టోలో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి నువ్వేం ఇచ్చావ్..? ⇒ప్రత్యేక హోదా ఇచ్చావా? రైల్వే జోన్ ఇచ్చావా? విభజన హామీల గురించి ఏమైనా రాశావా? ⇒కడప స్టీల్ ప్లాంట్ గురించి ఏమైనా రాశావా? విశాఖ స్టీల్స్ను అమ్మేయకుండా నిలబెడతాం అని ఏమైనా రాశారా? ⇒మరి మమ్మల్ని ఏం ఉద్ధరిద్దామని మీరు ముగ్గురూ కలిశారు? ⇒కేవలం అధికారం కోసమే మీరు ముగ్గురు జట్టు కట్టారు. ⇒ఈ రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క మేలు జరిగేది మీ మేనిఫెస్టోలో ఏముంది? ⇒2019లో మీరంతా తిట్టుకున్నారు కదా.? నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అంటూ ఒకరినొకరు తిట్టుకున్నారు కదా!⇒మీకు మీరే ఒకర్ని ఒకరు దొంగలు అన్నారు. ఇప్పుడు ఈ ముగ్గురు దొంగలు ఎందుకు కలిశారు?⇒అదేమంటే జనం కోసమే మేం ముగ్గురం కలిశాం అంటారు. మీరిచ్చిన మేనిఫెస్టోలో జనం కోసం ఏముంది? ⇒జగన్ అమ్మ ఒడి రూ.15వేలు ఇస్తున్నాడు కాబట్టి నేను రూ.20వేలిస్తానంటాడు. ⇒జగన్ మహిళలకు చేయూత ఇస్తున్నాడు కాబట్టి నేను కూడా పెంచి ఇస్తానంటాడు. ⇒జగన్ మత్స్యకారులకు రూ.10 వేలు ఇస్తున్నాడు కాబట్టి నేను రూ.15వేలు ఇస్తానంటాడు.⇒ ఇదే హామీలను 2014లో కూడా ఇచ్చారు కదా? అవేమయ్యాయి? ⇒ ఈ మేనిఫెస్టోలో 90 శాతం జగన్ గారి మేనిఫెస్టోను కాపీ కొట్టారు. 10 శాతం కర్నాటకలో కాంగ్రెస్ మేనిఫెస్టో కాపీ కొట్టారు.⇒జగన్ ఆదాయం గురించి చెప్పిన విధంగా మీకు చెప్పే దమ్ముందా? ⇒ మన రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత..నేను ఖర్చు పెట్టింది ఎంత అని స్పష్టంగా జగన్ చెప్పారు. ⇒ ఇన్ని కష్టాలు పడి జగన్ గారే రూ.71 వేల కోట్లు ఏటా ఖర్చు చేశారు. ⇒ మీ మేనిఫెస్టో ప్రకారం ఏటా రూ.2 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేయాలి. ⇒ 2014లో మూడు సెంట్లు స్థలం ఇస్తానని ఇవ్వకుండా..ఇప్పుడు రెండు సెంట్లు అంటున్నాడు. ⇒ జగన్ గారు 31 లక్షల మందికి స్థలాలు ఇస్తే ఎక్కడ జగన్ను గుర్తుపెట్టుకుంటారో అని రెండు సెంట్లు ఇస్తానంటున్నారు. ⇒ పాత మూడు సెంట్లు సంగతి ఏంటి? అది కూడా కలిపి ఐదు సెంట్లు ఇస్తావా? ⇒ పాత మూడు సెంట్లు బాకీ ఉన్నావు కదా? డ్వ్రాక్రా అక్క చెల్లెమ్మలకు రూ.14వేల కోట్లు బాకీ ఉన్నావు కదా? ⇒ నీ మూలంగా పచ్చగా ఉన్న డ్వాక్రా సంఘాలు నాశనం అయ్యాయి కదా?సంపద సృష్టించడానికి ఈ రాష్ట్రమేమన్నా అక్షయపాత్రా?⇒సరే హామీలిచ్చారు. ఈ హామీలకు ఎంత ఖర్చు అవుతుందని ఖర్చుల వివరాలు కూడా చెప్పాలి కదా? ⇒రాష్ట్ర ఖజానాలో డబ్బు ఎంత ఉంది? నువ్విచ్చిన హామీలకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తావ్? దొంగనోట్లు ముద్రిస్తావా? ⇒అప్పు తీసుకురాను అంటున్నాడు. మరి అప్పు తేకుండా రాబడి ఎంత?⇒ ఈ రోజుకీ ఉద్యోగుల జీతభత్యాలు, రిటైర్ ఉద్యోగుల పెన్షన్ కలిపి ఏటా రూ.80 వేల కోట్లు ఖర్చు అవుతోంది.⇒రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఉన్న అప్పుల ఇన్స్టాల్మెంట్లు, వడ్డీలు అన్నీ కలిపి ఏటా రూ.55 వేలు కట్టాలి.⇒నీకు నిజాయితీ ఉంటే ఎంత ఆదాయం వస్తుంది..ఎలా ఖర్చు చేస్తావు అనేది చెప్పాల్సింది. ⇒అదేమంటే నేను సంపద సృష్టిస్తాను అంటాడు. ఆ సంపదలో నుంచి పథకాలు అమలు చేస్తాడట. ⇒సంపద సృష్టించాలంటే అదేమన్నా అక్షయపాత్రా? లంకెబిందెలా? రాష్ట్రానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ⇒ ఈ పథకాలన్నీ అమలు చేయడానికి నువ్వు డబ్బెక్కడి నుంచి తెస్తావో ప్రజలకు చెప్పాలి కదా? ⇒ 2014లో ఎలాగైతే పచ్చి దగా, మోసం చేశావో..మళ్లీ ఈ మేనిఫెస్టోను అదే దగాతో విడుదల చేశావు.ఎన్డీయేకి 400 సీట్లు దేనికీ..? ఎవరి పౌరసత్వాలు తీసేయబోతున్నారు?:⇒ఎన్డీయేకి 400 సీట్లు కావాలట. దేనికోసం? ఎంత మందిని కాల్చుకు తినడానికి? ⇒ మైనార్టీలను ఈ దేశంలో లేకుండా తరిమేస్తారా? అత్యధిక మెజార్టీ దేనికి మీకు? ⇒ అత్యధిక మెజార్టీ ఇవ్వడం వల్ల మీరు ఏమేం చేయబోతున్నారు? ⇒ ఎవరివైనా పౌరసత్వాలు, ఓట్లు తీసేయబోతున్నారా? ఏం దుడుకు చర్యలు చేయడానికి 400 సీట్లు అడుగుతున్నారు? ⇒ మీరు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు? ⇒ నిజాయితీగా మాట్లాడటం అనేది చంద్రబాబు జన్మలో ఒక్కసారి కూడా జరగలేదు.⇒ ఎంత సేపు మోసం, దగా. అవసరం ఉన్నప్పుడు అరచేతిలో వైకుంఠం చూపించడం..అవసరం తీరాక తగలబెట్టేయడం. ⇒ మనిషి అన్నాక వంద మాటలు చెప్తే కనీసం 90 మాటలన్నా అమలు చేయాలి కదా? ⇒ మనిషి అన్నాక కనీసం విశ్వసనీయత ఉండాలి కదా? ⇒ చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ లాంటి వల్లే కదా..దేశంలో, రాష్ట్రంలో రాజకీయ నాయకుల విలువ పోతున్నది? ⇒ అవసరం ఉంటే ఓట్ల కోసం ఎన్ని పచ్చి మోసపు మాటలైనా చెప్తారు అనే భావన ప్రజల్లో ఉన్నది మీలాంటి వాళ్ల వల్లనే.⇒ జగన్ పథకాలు అమలు చేయడానికి నువ్వెందుకు బాబూ?:⇒ మీ మేనిఫెస్టో అన్నీ జగన్ గారి పథకాలే కదా? జగన్ గారి పథకాలు అమలు చేయడానికి మీరు కావాలా? జగనే ఉన్నాడుగా..!⇒ మొన్నటి వరకూ వాలంటీర్లు అమ్మాయిలను అమ్మేస్తున్నారు..మిట్ట మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేనప్పుడు తలుపులు కొడుతున్నారు అన్నారు. ⇒ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తాం అన్న వాళ్లు ఇప్పుడు వాళ్లను కొనసాగిస్తాం..పదివేలు గౌరవ వేతనం ఇస్తాం అంటున్నారు. ⇒ మీకు అధికారం ఇస్తే వాలంటీర్ వ్యవస్థను ఏం చేస్తారో జనానికి తెలియదా? ⇒ ఈ రోజు చంద్రబాబుకు కొత్తగా ముస్లింలు, మైనార్టీలపై ప్రేమ వచ్చేసింది. ⇒ నీ ఐదేళ్ల పరిపాలనలో ఒక్కరంటే ఒక్క ముస్లిం మంత్రి లేడు.⇒ అధికారంలో ఉంటే రాజ్యాధికారంలో మైనార్టీలకు వాటా ఇవ్వవు. ⇒ ఇప్పుడు మాత్రం ఓట్ల కోసం ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలకు సంక్షేమం చేసేస్తానంటూ చెప్పుకొస్తున్నాడు.⇒ 2014 మేనిఫెస్టోలో రజకులు, మత్స్యకారులను ఎస్సీలుగా, బోయలను ఎస్టీలుగా, కాపులను బీసీలుగా చేస్తానన్నాడు. ఎవరినన్నా చేశాడా? ⇒ ఎస్సీ వర్గీకరణ చేస్తానంటూ మాల, మాదిగలను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు.⇒ 1999 నుంచి ఢిల్లీలో చక్రం తిప్పాను అంటావు..ఎస్సీల వర్గీకరణ చేశావా? ⇒ మళ్లీ ఇప్పుడు ఎన్నికలు రాగానే ఎస్సీల వర్గీకరణ చేస్తానంటున్నాడు.⇒ మొన్నటి వరకూ రజకులకు ఇస్త్రీ పెట్టె ఇస్తానన్నాడు..ఇప్పుడు కరెంట్ ఇస్త్రీ పెట్టె ఇస్తాడట.⇒ మొన్నటి వరకూ వడ్డెరలకు డ్రిల్లింగ్ మిషన్ ఇస్తానన్నాడు. ఇప్పుడు కరెంట్ డ్రిల్లింగ్ మిషన్ ఇస్తాడట. ⇒ చేనేతలకు మరమగ్గాలు ఇస్తాడట. మరి యాదవులకు కూడా కరెంట్ గొర్రెలను ఇస్తావా?⇒ ఎంత సేపూ వెనుకబడిన వర్గాలు చదువులు లేకుండా, ఉద్యోగాలు లేకుండా కులవృత్తులు చేసుకుంటూనే ఉండాలా? ⇒అసలు ఈ వెనుకబడిన వర్గాలకు చదువు ఎందుకు చెప్పించవు? ⇒ఇంగ్లీషులో చదువు చెప్పించి మీ జీవితాలు బాగుచేస్తానని చెప్పాలి కదా? ⇒ నాయీ బ్రాహ్మణులకు అంతకు ముందు కత్తెర్లు ఇస్తానన్నాడు. ఇప్పుడు ట్రిమ్మర్లు ఇస్తాడట. ⇒వాళ్లకు నాణ్యమైన ఇంగ్లీషు మీడియం విద్యను అందించి దమ్ముగా పెద్దింటి పిల్లలతో పోటీ పడేటట్లు చేయాలి కదా?⇒ఎందుకు ఒక్క రోజన్నా జగన్ గారిలా ఆలోచించలేకపోతున్నావ్..?నీలో నిజాయితీ ఉంటే నీ దగా మేనిఫెస్టోకు ఎంత ఖర్చు అవుతుందో చెప్పు:⇒బుర్రకథ బ్యాచ్లా చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ తయారయ్యాయి. ⇒ఒకరు తానా అంటే మరొకరు తందానా అంటారు. ⇒ చంద్రబాబును నేను చాలెంజ్ చేస్తున్నా. నిజంగా నువ్వు నిజాయితీ గల రాజకీయ నాయకుడివైతే నా సవాల్ను స్వీకరించు.⇒ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత? నువ్వు చెప్పిన ఈ దగా మేనిఫెస్టోకు ఖర్చు ఎంతవుతుందో చెప్పాలి. ⇒ఆ డబ్బు ఎక్కడి నుంచి తెస్తావో చెప్పే నిజాయితీ నీలో ఉందా?⇒అందుకే నువ్వు పింఛన్ 4వేలు ఇస్తానన్నా..జగన్ 3,500 ఇస్తానంటే జనం జగన్వైపే ఉన్నారు. ⇒ 4వేలు చెప్పినా ఇచ్చేది లేదని వాళ్లకి స్పష్టంగా తెలుసు.⇒ జగనంటే ఐదు పదుల నడుస్తున్న నమ్మకం. ⇒ ఈ బుర్రకథ బ్యాచ్ అంటే ఏడున్నర పదుల తిరుగాడే అపనమ్మకం. ⇒ మనకు వయసు ఎంత వచ్చిందనేది కాదు..ఒక్క రోజన్నా నిజాయితీగా బతికామా అన్నదే చూడాలి..⇒ దమ్ముగా జగన్ గారిలా దీనికి ఎంత ఖర్చు అవుతుందో నిజాయితీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. ⇒పేదల్లో పేదరికం పోవాలంటే ఆ ఇంట్లో పిల్లల చదువుల ద్వారానే పోతుందనేది జగన్ గారు గట్టిగా నమ్ముతారు.⇒ అందుకే ఆయన చదువు మీద దృష్టి పెట్టి నాణ్యమైన చదువును అందిస్తున్నారు.⇒ అందుకే ఇప్పటి వరకూ విద్యపై జగన్ గారు రూ.73వేల కోట్లు ఖర్చు చేశారు.⇒ నిజాయితీగా గత ఐదేళ్లలో నేనేం చేశానో మళ్లీ అదే చేస్తాను అని జగన్ చెప్తున్నాడు. దానికి ఎంత గుండె ధైర్యం కావాలి? ⇒ మోసం చేయడానికి ధైర్యం అవసరం లేదు. ఏ వెదవైనా మోసం చేయగలడు.⇒ అమ్మ ఒడి గతంలో కంటే నేను రెండు వేలు పెంచగలను అని చెప్తున్నాడు. చెప్తే నిజాయితీగా అమలు చేయాలి కదా?మోసం చేయడం కంటే చచ్చిపోవడం మేలన్నారు జగన్..!:⇒ పింఛన్ రూ.3,500 ఒకే సారి చెప్పు అంటే లేదంటే లేదన్నాడు జగన్.⇒ దమ్ముగా నేను రూ.3,500 వేలే ఇవ్వగలను. అది కూడా రెండు విడుతల్లో పెంచుతాను అని ఖచ్చితంగా చెప్పాడు.⇒ మోసం చేసే మాటలు చెప్పడం కంటే చచ్చిపోవడం మేలన్నాడు. అలాంటి మోసపు మాటలు నేను చెప్పను అన్నాడు.⇒ అలా చెస్తే ప్రజలు నమ్మకం పెంచుకుంటారు. జగన్ చెప్తే చేస్తాడని ఆశలు పెంచుకుంటారు. అలా మోసం చేయలేను అన్నాడు.⇒ ఈ రాష్ట్రంలో 80 శాతం కుటుంబాలకు మేలు జరిగేలా నేను పరిపాలన చేశానని జగన్ చెప్తున్నారు. ⇒ మీ ఇంట్లో మేలు జరిగితేనే నాకు ఓటేయండి అని కూడా దమ్ముగా చెప్తున్న నాయకుడు వైఎస్ జగన్. ⇒ చంద్రబాబుకు అలాంటి ధైర్యం ఉందా? 2014–19లో తానే పరిపాలన చేశాడో అదే పరిపాలన తెస్తానని చెప్పే ధైర్యం, దమ్ము ఉందా? ⇒ 2014–19 మధ్య ప్రజలు మీకు అధికారం ఇస్తే మేం దిక్కుమాలిన పరిపాలన చేశాం అని మీ నోటితో మీరే సాక్ష్యం చెప్తున్నారు.⇒ 2014లో కోటి పేద, మద్యతరగతి కుటుంబాలున్నాయి. ఇంటికో ఉద్యోగం అన్నాడు..లేదంటే నిరుద్యోగ భృతి అన్నాడు.⇒ ఎంత మందికి ఇచ్చారు..కోటి ఉద్యోగాలు ఇచ్చాడా? నిరుద్యోగ భృతి అయినా ఇచ్చాడా? ⇒ నీ కొడుకు లోకేశ్కు ఉద్యోగం ఇచ్చుకున్నావు తప్ప ఎవరికి ఇచ్చావ్? ⇒ మళ్లీ ఇప్పుడు 20లక్షల ఉద్యోగాలు ఇస్తాను..లేదంటే 3వేల నిరుద్యోగ భృతి అంటున్నాడు.⇒ అతని మేనిఫెస్టో అంతా పాపాల పుట్ట.. అసత్యాల బొంత. -
సూపర్-6.. సూపర్-10 పేరుతో ‘కూటమి’ మరో మోసం: పేర్ని నాని
సాక్షి, గుంటూరు: మరోసారి కూటమి మోసం చేసే ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. సూపర్-6, సూపర్-10 పేరుతో మరోసారి మోసానికి తెరలేపారన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ, 2014లో చంద్రబాబు మాయమాటలు చెప్పారు.. ప్రజల్ని నమ్మించి టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2019లో ఇచ్చిన హామీలను సీఎం జగన్ అమలు చేశారు. మరోసారి ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేస్తామన్నారు.2019లో ఇచ్చిన మేనిఫెస్టోను 99 శాతం అమలు చేశాం: మంత్రి ధర్మానశ్రీకాకుళం: మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ మేనిఫెస్టో ను భగవద్గీత, ఖురాన్, బైబిల్గా భావిస్తామన్నారు. 2019లో ఇచ్చిన మేనిఫెస్టోను 99 శాతం అమలు చేశాం. మేనిఫెస్టోను చంద్రబాబు హేళనగా తీసుకుంటారు. 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పి 20 వేలు కూడా ఇవ్వలేదు. 2014లో చంద్రబాబు మహిళల రుణాలు రద్దు చేస్తామన్నారు. నమ్మి ఓటేసిన మహిళలను చంద్రబాబు మోసం చేశారు’’ అని మంత్రి ధర్మాన మండిపడ్డారు.మోసం చేయకుండా చేసేవి మాత్రమే మేనిఫెస్టోలో పెట్టాం: మంత్రి బొత్సవిశాఖపట్నం: అన్ని వర్గాలకు మంచి జరిగేలా వైఎస్సార్సీపీ మేనిఫెస్టో ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ‘‘మోసం చేయకుండా చేసేవి మాత్రమే మేనిఫెస్టోలో పెట్టాం. గత మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చారు. విద్యా, వైద్యం, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. పేద ఆత్మ గౌరవాన్ని పెంపొందించేలా పథకాలు ఉన్నాయి. లంచాలు, వివక్ష లేకుండా డీబీటీ ద్వారా నగదు జమ చేశాం. గతంలో చంద్రబాబు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశారు. చంద్రబాబు మాయ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.. ఇచ్చిన ప్రతి మాటలను సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. సీఎం జగన్ మేనిఫెస్టోలో పెట్టని అంశాలు కూడా అమలు చేశారు’’ అని మంత్రి బొత్స అన్నారు. ప్రజలను కష్టాల నుంచి బయట పడేసే మేనిఫెస్టో ఇది: తమ్మినేని సీతారాం సంస్కరణల దిశగా వైసీపీ విధానాలు వెళ్తున్నాయి. మేనిఫెస్టోలో విశాఖను క్యాపిటల్ టౌన్గా ప్రకటించడం సంతోషం. ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు అంతా విశాఖ రాజధాని కావాలని కోరుకుంటున్నారు. చంద్రబాబుది కాపీ మేనిఫెస్టో. టీడీపీలాగా సాధ్యం కానీ హామీలు ఇవ్వలేదు. -
సీఎం జగన్ అంటే నడిచే నమ్మకం... మేనిఫెస్టో పేర్ని నాని స్పందన.
-
పేర్ని కిట్టు నామినేషన్ కార్యకర్తగా మారిన పేర్ని నాని