Perni Nani
-
వల్లభనేని వంశీతో ములాఖత్ అయిన సతీమణి పంకజ శ్రీ, పేర్ని నాని
-
చంద్రబాబు బంధువే ఫోన్ ట్యాపింగ్ సూత్రదారి: పేర్నినాని
సాక్షి,విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతోందని మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖలు చేశారు. శుక్రవారం విజయవాడ జిల్లా జైల్లో వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభేనేని వంశీతో ఆయన సతీమణి పంకజశ్రీ, పేర్ని నాని, ఇతర వైఎస్సార్సీపీ నేతలు ములాఖత్ అయ్యారు.ములాఖత్ అనంతరం పేర్నినాని మీడియాతో మాట్లాడారు. అనధికారికంగా కొందరు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల ఫోన్ నెంబర్లను సేకరిస్తున్నారు. నా ఫోన్ ట్యాప్ చేయడంతో పాటు మా పార్టీ కార్యకర్తల ఫోన్ నెంబర్స్ను సేకరించారు. నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని నేను భయపడటం లేదు. గ్రామ స్థాయి లీడర్ల భార్యల ఫోన్ నెంబర్లతో ఏం పని? అని ప్రశ్నించారు. చంద్రబాబు బంధువే ఫోన్ ట్యాపింగ్ సూత్రదారి చంద్రబాబు బంధువు ప్రకాష్ అనే ఒక వ్యక్తి అనదికారికంగా విజయవాడలో రమేష్ ఆసుపత్రి దగ్గర ఆఫీసు పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. ఫోన్ ట్యాప్ చేసి నేతలను బెదిరించాలని చూస్తున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోంది. ఎన్ని తప్పుడు పనులు చేసిన వాళ్ళందరినీ చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు.వల్లభనేనీ వంశీ కేసులో దుర్మార్గంగా పోలీసులువల్లభనేనీ వంశీ కేసులో పోలీసు అధికారులు ఉన్నతాధికారుల పర్యవేక్షణతో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ నాయకులను సంతృప్తి పరచడం కోసం పటమట పోలీసులు పని చేస్తున్నారు. 10వ తేదిన సత్యవర్ధన్ కోర్టుకు వచ్చి తప్పుడు కేసు అని అఫిడవిట్ ఇచ్చారు. టీడీపీ కార్యకర్త ఫణి కుమార్ అనే వ్యక్తి ద్వారా సత్యవర్ధన్, వంశీపై తప్పుడు కేసులు పెట్టించారు. కిరణ్ అనే వ్యక్తి ద్వారా ఇంకో కంప్లైంట్ తీసుకొని కేసులు నమోదు చేశారు. ఊహాజనిత ఫిర్యాదుతో నాన్ బెయిలబుల్ సెక్షన్లు వంశీపై పెట్టారు. నాపైనా కేసులు సత్య వర్ధన్ చెప్పాడో లేదో కూడా తెలియకుండా కేసు పెడతారా? వంశీకి రిమాండ్ విధించే సమయంలో ఎస్సీ,ఎస్టీ కేసుల న్యాయస్థానంలో హాజరు పరచకుండా వేరే కోర్టులో ప్రవేశపెట్టారు. చట్టాలు, కేసులు, సెక్షన్లు అనేవి లేకుండా పోలీసులు వ్యవహరించారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో పర్యటించే సమయంలో నేను లేను. అయినా నాపై కేసులు పెట్టి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కొల్లు రవీంద్రపై పేర్ని ఫైర్ కొల్లు రవీంద్ర మంత్రిగా ప్రజా సేవకు మా ఊరు,రాష్ట్రాన్ని బాగు చేయడానికి పనికిరారు. లోకేష్ ఇస్తే కాసులకు కక్కుర్తి పడే వ్యక్తి. కొడాలి నాని అరెస్టు చేయిస్తా, పేర్ని నానినీ అరెస్టు చేయిస్తా అంటున్నారు. నేనూ ఆరు నెలలుగా మచిలీపట్నం రోడ్లపై తిరుగుతున్నాను. మీరు ఏం చేయలేరు’అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు. -
ఫోన్ ట్యాపింగ్లకు నేను భయపడను: పేర్నినాని
-
తప్పుడు కేసుపై డీజీపీకి పేర్ని నాని ఫిర్యాదు
గుంటూరు, సాక్షి: తనపై తప్పుడు కేసు నమోదు అయిన విషయాన్ని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) డీజీపీకి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు శుక్రవారం ఫిర్యాదు చేస్తూ డీజీపీ(AP DGP) హరీష్ కుమార్ గుప్తాకు ఓ లేఖ రాశారు. గిట్టుబాటు ధర లేక ఆందోళనలో ఉన్న గుంటూరు మిర్చి రైతులను బుధవారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన సంగతి తెలిసిందే. ఆయన జగన్, మరికొందరు వైఎస్సార్సీపీ(YSRCP) నేతలు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారంటూ నల్లపాడు పీఎస్లో టీడీపీ నేతలు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో జగన్ సహా వైఎస్సార్సీపీ నేతలపై కేసు నమోదు అయ్యింది.అయితే ఆ పర్యటనలో పాల్గొనని పేర్ని నాని(Perni Nani)పై కూడా కేసు నమోదు కావడంతో ఆయన స్పందించారు. ఈ పర్యటనలో పాల్గొనకున్నా తన ప్రతిష్టను దెబ్బ తీసేందుకు తనపై ఫిర్యాదు చేశారని డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారాయన. ప్రజాక్షేత్రంలో ఉన్న తనపై ఇలాంటి తప్పుడు కేసు బనాయించడం.. అందరినీ తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని అన్నారాయన. ఈ అంశంపై విచారణ జరిపి తప్పుడు ఫిర్యాదు చేసిన వాళ్లపై, అలాగే బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారాయన. ఇదీ చదవండి: సభ పెట్టలేదు.. మైక్ ముట్టలేదు.. ఇదేమీ దుర్మార్గం -
వీడియో: పోలీసుల అత్యుత్సాహం.. పేర్ని నాని హౌస్ అరెస్ట్
సాక్షి, కృష్ణా: ఏపీలో కూటమి సర్కార్ వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ పాలన చేస్తోంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అనంతరం రాష్ట్రంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.వంశీ అరెస్ట్ నేపథ్యంలో మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం పేర్ని నాని ఇంటి వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. ఏఆర్ ఏఎస్పీ, డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది మోహరించారు. ఈ క్రమంలో నానిని ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో, పోలీసుల తీరుపై పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పేర్ని నాని హౌస్ అరెస్ట్...
-
మాజీ మంత్రి పేర్ని నాని ముందస్తు బెయిల్పై నేడు విచారణ
సాక్షి, అమరావతి : రేషన్ బియ్యం కేసులో మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య అలియాస్ నానిపై ఎలాంటి కఠిన చర్యలేవీ తీసుకోవద్దంటూ ఇటీవల తామిచ్చిన ఉత్తర్వులను హైకోర్టు బుధవారం వరకూ పొడిగించింది. నాని ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి సోమవారం ఉత్తర్వులిచ్చారు. రేషన్ బియ్యం కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ నాని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు రావాల్సి ఉన్నా.. రాకపోవడంతో అత్యవసర విచారణ కోసం నాని తరఫు న్యాయవాది వీసీహెచ్ నాయుడు కోర్టును అభ్యర్థించారు. దీంతో న్యాయమూర్తి లంచ్మోషన్ రూపంలో విచారణకు అంగీకరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యర్థన మేరకు న్యాయమూర్తి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.పెనాల్టీ నోటీసులపై పూర్తి వివరాలివ్వండి.. ఇదే వ్యవహారంలో రూ.1.67 కోట్లు పెనాల్టీ చెల్లించాలంటూ పౌర సరఫరాల శాఖ ఇచి్చన నోటీసులను సవాలు చేస్తూ పేర్ని నాని సతీమణి, గోడౌన్ యజమాని జయసుధ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు పూర్తి వివరాలను తమ ముందుంచాలని పౌర సరఫరాల శాఖను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు సోమవారం ఉత్తర్వులిచ్చారు. ముందస్తు బెయిల్ పిటిషన్ల కొట్టివేత సాక్షి, అమరావతి : గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన కేసులో పలువురు నిందితులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. పిటిషనర్లపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదై ఉన్నందున చట్ట నిబంధనల ప్రకారం కింది కోర్టులోనే పిటి షన్లు దాఖలు చేసుకోవాలంది. అందువల్ల ఈ వ్యాజ్యాలకు విచారణార్హత లేదని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ సోమవారం తీర్పు వెలువరించారు. 2023లో గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. ఈ ఘ టనలో పోలీసులు పలువురిపై కేసులు నమో దు చేశారు. దీంతో కృష్ణారావు మరో 32 మంది హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దా ఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి సోమవారం నిర్ణయాన్ని వెలువరించారు. వారికి నెల రోజుల్లో ట్రాన్సిట్ పర్మిట్లు జారీ చేయండిసాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘించని మైనర్ మినరల్ లీజుదారులకు నెల రోజుల్లో ట్రాన్సిట్ పర్మిట్లు జారీ చేయాలని గనుల శాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. గత ఏడాది అక్టోబర్లో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు లోబడి ఈ ట్రాన్సిట్ పర్మిట్లు ఉండాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ కుంఢజడల మన్మథరావు మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. చట్ట ప్రకారం అన్ని అనుమతులు ఉన్నప్పటికీ తమకు ట్రాన్సిట్ పర్మిట్లు జారీ చేయకపోవడాన్ని సవాలు చేస్తూ ఫెడరేషన్ ఆఫ్ మైనర్ మినరల్స్ ఇండస్ట్రీ (ఫెమ్మీ) సెక్రటరీ జనరల్ చట్టి హనుమంతరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సోమవారం విచారణ జరిపిన జస్టిస్ మన్మథరావు నిబంధనల ప్రకారం ట్రాన్సిట్ పర్మిట్లు జారీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేశారు. అంబటి పిటిషన్లో పూర్తి వివరాలివ్వండి పోలీసులకు హైకోర్టు ఆదేశం సాక్షి, అమరావతి: తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు తనను, తన కుటుంబ సభ్యులను కించపరుస్తూ, అసభ్యకరంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలంటూ తాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ మాజీ మంత్రి అంబటి రాంబాబు దాఖలు చేసిన వ్యాజ్యంలో పూర్తి వివరాలు సమరి్పంచాలని హైకోర్టు సోమవారం పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి ఉత్తర్వులు జారీచేశారు. తాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాధ్యులపై కేసు నమోదు చేసేలా గుంటూరు పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని రాంబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు వచి్చంది. అంబటి రాంబాబు స్వయంగా వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణ ఈ నెలాఖరుకి వాయిదా వేశారు. -
YSRCP సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్నినాని కుటుంబంపై చంద్రబాబు కక్ష
-
బాబ్బాబూ పుణ్యముంటుంది.. ఆయన్ను అరెస్టు చేయండి..
ఇళ్లకొచ్చి అడుక్కునే ముష్టివాళ్ల సంఖ్య ఇప్పుడు తగ్గిపోయింది. ట్రాఫిక్ సిగ్నళ్లలో, గుడులూ, హాస్పిటళ్లూ, హోటళ్ల దగ్గరే ‘బాబ్బాబూ ధర్మం చేయండి బాబూ.. పుణ్యముంటుంది బాబూ..’ అంటూ అడుక్కునే ముష్టివాళ్లు మనకు దండిగా కనిపిస్తుంటారు. ఈ ముష్టివాళ్ల సంగతి సరే.. నిజానికి ఇంకోరకం ముష్టివాళ్లు కూడా ఉంటారు. వారికి అనేకానేక వంకర ప్రయోజనాలు ఉంటాయి. ఆ వంకర ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి అడ్డు పడేవారి మీద కక్ష పెంచుకుంటారు. ఆ కక్ష సాధించుకోవడానికి ఇంకో రకం ముసుగులు తగిలించుకుని, చవకబారు ముష్టెత్తుతూ ఉంటారు.పేర్ని నాని కుటుంబానికి చెందిన గోడౌన్ల నుంచి బియ్యం నిల్వల తేడా వచ్చిన కేసులో అటు పోలీసులకు, ఇటు పౌరసరఫరాల శాఖకు, ప్రభుత్వానికి లేని శ్రద్ధ పచ్చ మీడియాకు మాత్రం విపరీతంగా ఉన్నట్టు కనిపిస్తోంది. చట్టప్రకారం అవకాశం ఉన్నా లేకపోయినా కూడా.. పేర్ని నానిని అరెస్టు చేసేవరకు తాము కారుకూతలు కూస్తూనే ఉంటాం.. బురదచల్లుడు చవకబారు రాతలు రాస్తూనే ఉంటాం.. అనే ధోరణిని పచ్చ మీడియా ప్రదర్శిస్తున్నది.పేర్ని నాని స్వయంగా ప్రభుత్వానికి లేఖ రాసిన తర్వాతనే.. బియ్యం నిల్వల్లో తేడా వచ్చిన సంగతి బయటపడింది. అప్పటికీ నిబంధనల ప్రకారం అధికారులు ఎంత జరిమానా విధించారో.. అదంతా కూడా డీడీల రూపంలో చెల్లించేశారు. అయినాసరే.. పేర్నినానిని అరెస్టు చేసేదాకా పచ్చమీడియా కళ్లు చల్లబడేలా కనిపించడం లేదు.‘మేం కేసు పెడతాం అంతే.. అరెస్టులు మాత్రం చేయం.. మీరు కోర్టుకు వెళ్లి ఉపశమనం పొందేవరకు వేచిచూస్తూ ఉంటాం.. అన్నట్టుగా పోలీసులు వేచిచూస్తున్నారంటూ..’ పచ్చమీడియా వారి వెంటపడుతోంది. పేర్నినాని వ్యవహారం బయటకు వచ్చిన నాటినుంచి.. చట్టం తనశైలిలో తాను పనిచేసుకుంటూ పోతోంది. అయితే పచ్చమీడియా మాత్రం అత్యుత్సాహం ఆపుకోలేక.. ఆయనను అరెస్టు చేయడం లేదు, కొల్లు రవీంద్ర గానీ, పార్టీపెద్దలు గానీ.. ఆయన గురించి విమర్శలు చేయడం లేదు. అరెస్టు చేయాలని పోలీసుల వెంటపడడం లేదు.. పేర్ని నానితో కుమ్మక్కు అయినట్టుగా పనిచేస్తున్నారు.. అంటూ రకరకాల కారుకూతలు, చవకబారు రాతలు రాశారు.తీరా పచ్చమీడియా పోరు పడలేకపోతున్నట్టుగా.. కొల్లు రవీంద్ర కూడా ప్రెస్ మీట్ పెట్టి.. ఏదో పేర్నినాని మీద కొన్ని నిందలు వేసి దులుపుకున్నారు. ఆ తర్వాత.. రకరకాల మలుపులు తిరిగిన వ్యవహారంలో గోడౌన్ యజమానిగా రికార్డుల్లో ఉన్న జయసుధకు ముందస్తు బెయిలు వచ్చింది. పచ్చమీడియా పెద్దలు హతాశులయ్యారు. ఈలోగా పోలీసులు.. ‘విచారణలో తెలిసిన సమాచారం మేరకు..’ అనే ముసుగులో పేర్ని నాని పేరును కూడా ఏ6గా కేసులో చేర్చారు.కక్షపూరితంగా వేధించదలచుకుంటున్నారనే భయంతో పేర్ని కుటుంబం అజ్ఞాతంలోకి వెళితే.. నానా చెత్తరాతలు రాసిన పచ్చమీడియా.. ఇప్పుడు ముందస్తు బెయిల్ తర్వాత జయసుధ విచారణకు హాజరైనా కూడా ఓర్వలేకపోతోంది. కుట్రపూరితంగా తన పేరును కూడా ఇరికించిన నేపథ్యంలో పేర్ని నాని ముందస్తు బెయిలుకోసం దరఖాస్తు చేసుకోవడం కూడా పచ్చమీడియాకు కంటగింపే. ఆయనకు ముందస్తు బెయిల్ రావడం కూడా ఖరారే అని సంకేతాలు అందుతున్న వేళ.. తక్షణం ఆయనను అరెస్టు చేయకుండా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారంటూ పచ్చ మీడియా పాపం.. ఆవేదన చెందుతోంది.టీడీపీ, జనసేనల్లో పేర్ని నాని సన్నిహితులున్నారని, వారే ఆయనను కాపాడుతున్నారని పచ్చ మీడియా పాపం కుమిలపోతున్నది. అయినా.. చట్టప్రకారం ఆయన దోషి అయితే గనుక.. కాపాడటం ఎవరి తరం అవుతుంది? జరిగింది నేరం కానప్పుడు.. బియ్యం నిల్వల తేడాకు సంబంధించి.. ఒప్పందంలో ఉన్న నిబంధనల ప్రకారం జరిమానా మొత్తం చెల్లించేసినప్పుడు.. ఇక ఆయనను ఏ రకంగా శిక్షించగలరని పచ్చ మీడియా ఆరాటపడుతున్నదో అర్థం కావడం లేదు. వ్యవహారం మొత్తం గమనిస్తే.. నాని అరెస్టుకోసం పచ్చ మీడియా ముష్టెత్తుకుంటున్నట్టుగా.. బాబ్బాబూ.. మీకు పుణ్యముంటుంది.. అరెస్టు చేయండి బాబూ.. అని దేబిరిస్తున్నట్టుగా కనిపిస్తోంది.-ఎం.రాజేశ్వరి -
మహిళలను అవమానించేలా కూటమి చర్యలు
-
పేర్ని నాని భార్యను పోలీస్ స్టేషన్ కు రప్పించే కుట్ర
-
కూటమి సర్కార్ ‘రాజకీయ’ కక్ష.. మహిళను అవమానించేలా..
సాక్షి, కృష్ణా జిల్లా: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు కొనసాగిస్తూనే ఉంది. మరోసారి పేర్ని నాని సతీమణి జయసుధకు పోలీసులు నోటీసులిచ్చారు. రాజకీయ కక్ష సాధింపు కోసం మహిళలను అవమానించేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పదే పదే విచారణకు పిలిచి పేర్ని నాని కుటుంబాన్ని అవమానించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ నాడు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు.మధ్యాహ్నం రెండు గంటల్లోగా విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో బందరు తాలుకా పీఎస్కు పేర్ని నాని సతీమణి జయసుధ విచారణకు హాజరయ్యారు. తన న్యాయవాదులతో కలిసి పేర్ని జయసుధ పీఎస్కు వెళ్లారు. ఆమెను సుమారు రెండు గంటల పాటు విచారించారు.ఆరోగ్యం బాగోలేకపోయినా విచారణకు రావాల్సిందే..స్పైనల్ కార్డ్ సమస్యతో బాధపడుతూ జయసుధ విచారణకు హాజరయ్యారు. ఆరోగ్యం బాగోలేకపోయినా విచారణకు రావాల్సిందేనని పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణ సమయంలో జయసుధతో పాటు లాయర్లను పోలీసులు అనుమతించలేదు. జయసుధతో పాటు వచ్చిన వైఎస్సార్సీపీ మహిళా నేతలను సైతం పోలీసులు బయటికి పంపించేశారు. పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.అనారోగ్యంతో ఉన్నప్పటికీ జయసుధ విచారణకు హాజరయ్యారు. పేర్ని జయసుధ తరఫు న్యాయవాది వరద రాజులు మీడియాతో మాట్లాడుతూ, న్యాయస్థానం విధించిన షరతులకు లోబడి పోలీసుల విచారణకు జయసుధ హాజరయ్యారయ్యారని.. జయసుధ స్పైనల్ కార్డ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆరోగ్యం సరిగా లేకపోయినప్పటికీ విచారణకు హాజరయ్యారన్నారు. గంట నుంచి పోలీసులు విచారిస్తున్నారని.. ఆనారోగ్యంతో ఉన్నప్పటికీ పోలీసుల విచారణకు జయసుధ సహకరిస్తున్నారని తెలిపారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఇద్దరి ష్యూరిటీ సర్టిఫికెట్లను పోలీసులకు అందజేశామని వరద రాజులు తెలిపారు.అక్రమ కేసులతో చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో అంతకంతకూ పెట్రేగిపోతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులతో అణచివేసే కుట్రలకు మరింతగా పదనుపెడుతోంది. పేర్ని నాని కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసుల మీద అక్రమ కేసులు నమోదు చేస్తుండటం రాష్ట్రంలో హక్కుల హననానికి తాజా నిదర్శనం. ప్రభుత్వ పెద్దలు చెప్పిందే తడవుగా అధికార యంత్రాంగం ఈ కుట్రలకు వత్తాసు పలుకుతోంది. ఇదీ చదవండి: ఇదీ పన్నాగం.. చంద్రబాబు సర్కార్ బరితెగింపు.. -
పేర్ని నాని భార్యపై వేధింపులు..
-
హైకోర్టులో పేర్ని నానికి ఊరట
-
ఏపీ హైకోర్టులో పేర్ని నాని లంచ్ మోషన్ పిటిషన్
-
ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి పేర్నినానికి ఊరట
సాక్షి, విజయవాడ: ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి పేర్నినానికి ఊరట దక్కింది. పేర్నినాని దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా సోమవారం వరకు పేర్నినానిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి పేర్నినాని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. పౌరసరఫరాల సంస్థకు సంబంధించిన కేసులో పేర్ని నానిని ఏ6గా మచిలీపట్నం పోలీసులు చేర్చారు.పేర్ని నాని పై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. పేర్ని నాని కుటుంబమే లక్ష్యంగా అక్రమ కేసులు పెడుతోంది. రికవరీ మొత్తం చెల్లించినా వదలకుండా వేధింపుల పర్వానికి తెరతీసింది. పేర్ని నాని సతీమణి జయసుధకు ముందస్తు బెయిల్ రాగానే మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే కోటి 68 లక్షలు పేర్ని నాని కుటుంబం చెల్లించింది. మరో కోటి 67 లక్షలు రికవరీ చెల్లించాలంటూ జయసుధకు కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ నోటీసులు పంపించారు. జయసుధకు ముందస్తు బెయిల్ రాగానే పేర్ని నానిని ఏ6గా కేసులో పోలీసులు చేర్చారు.ఇదీ చదవండి: ఇదీ పన్నాగం.. చంద్రబాబు సర్కార్ బరితెగింపు..కాగా, ఈ కేసులో మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) సతీమణి జయసుధకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ మచిలీపట్నంలోని 9వ అదనపు జిల్లా కోర్టు జడ్జి ఎస్.సుజాత సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా పేర్ని జయసుధ కేసులో మచిలీపట్నం రూరల్ పోలీసులు సోమవారం రాత్రి నలుగురి ని అరెస్టు చేశారు. గోడౌన్ మేనేజర్ మానస తేజ, సివిల్ సప్లయీస్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, లారీ డ్రైవర్ మంగారావు, లారీ డ్రైవర్ స్నేహి తుడు ఆంజనేయులును అరెస్టు చేశారు. వీరికి జడ్జీ 12 రోజులు రిమాండ్ విధించారు. -
బాబు సర్కార్ బరితెగింపు
-
ఇదీ పన్నాగం.. చంద్రబాబు సర్కార్ బరితెగింపు..
సాక్షి, అమరావతి: అక్రమ కేసులతో చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో అంతకంతకూ పెట్రేగిపోతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులతో అణచివేసే కుట్రలకు మరింతగా పదనుపెడుతోంది. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసుల మీద అక్రమ కేసులు నమోదు చేస్తుండటం రాష్ట్రంలో హక్కుల హననానికి తాజా నిదర్శనం. ప్రభుత్వ పెద్దలు చెప్పిందే తడవుగా అధికార యంత్రాంగం ఈ కుట్రలకు వత్తాసు పలుకుతోంది.పేర్ని నానిపై కక్ష సాధింపు కుట్రతో ఆయన కుటుంబానికి చెందిన గోదాముల్లో ప్రభుత్వం తనిఖీలు నిర్వహించింది. ఏకంగా 4,500 బియ్యం బస్తాలు తగ్గాయని అధికారులు ఏకపక్షంగా నివేదిక ఇచ్చేశారు. గోదాములకు బియ్యం బస్తాలు తీసుకువచి్చనప్పుడు తేమ శాతం అధికంగా ఉంటుంది. దాంతో బియ్యం నిల్వలు బరువు ఎక్కువ ఉంటాయి. కానీ గోదాముల నుంచి బియ్యాన్ని తరలించేటప్పుడు తేమ శాతం తగ్గుతుంది. దాంతో బియ్యం నిల్వల బరువు తగ్గుతుంది. ఇది సహజం. కానీ దీన్ని ఏమాత్రం పట్టించుకోకుండా 4,500 బస్తాలు తగ్గాయని ఏకపక్షంగా నిర్ధారించేశారు.రూ.1.68 కోట్లు రికవరీ కింద చెల్లించాలని నోటీసులిచ్చారు. తమ తప్పు ఏమాత్రం లేకపోయినప్పటికీ.. అంతా సక్రమంగా ఉన్నప్పటికీ పేర్ని నాని కుటుంబం అందుకు సమ్మతించింది. ఈ వ్యవహారంపై ఓ వైపు న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తూనే మరోవైపు ప్రభుత్వం చెప్పినట్టుగా రూ.1.68 కోట్లు చెల్లించింది. నోటీసులకు వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కాగా రికవరీగా చెల్లించమన్న మొత్తం చెల్లించేయడంతో నిబంధనల ప్రకారం దాంతో ఈ వ్యవహారాన్ని ముగించాలి. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం మాత్రం కేవలం వేధించాలన్న ఏకైక కుట్రతో ఆ గోదాం యజమానిగా ఉన్న పేర్ని నాని సతీమణి జ యసుధపై అక్రమ కేసు నమోదు చేసింది.రికవరీ మొత్తం చెల్లించినప్పటికీ మరోసారి చెల్లించాలంటూ జేసీ ఈనెల 29న ఇచ్చిన నోటీసు బెయిల్ను సహించలేని ప్రభుత్వం ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసును సవాల్ చేస్తూ పేర్ని నాని కుటుంబం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తమ గోదాము వద్ద ఉన్న సీసీ టీవీ కెమెరాల ఫుటేజీలను ఆధారాలుగా న్యాయస్థానానికి సమరి్పంచింది. తాము గోదాము నుంచి బియ్యాన్ని అక్రమంగా తరలించనే లేదని వీడియో ఆధారాలతో సహా తమ వాదనను బలంగా వినిపించింది. పేర్ని నాని కుటుంబ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. పేర్ని జయసుధకు సోమవారం ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది.రికవరీ మొత్తం చెల్లించాలని పేర్ని నాని కుటుంబానికి కృష్ణా జిల్లా జేసీ జారీచేసిన నోటీసుదాంతో చంద్రబాబు ప్రభుత్వం తమ పన్నాగానికి మరింత పదును పెట్టింది. అధికారులను సోమవారం మరోసారి ఆ గోదా ము కు పంపించింది. మరో రూ.1.67 కోట్లు రికవరీ మొత్తంగా చెల్లించాలని నోటీసులు ఇ చ్చింది. తద్వారా తమకు నిబంధనలు పట్టవని.. అక్రమ కేసులతో వేధించడమే తమ ఏకైక లక్ష్యమని చంద్రబాబు ప్రభుత్వం బాహాటంగా వెల్లడించింది. ముందు చెప్పిన రికవరీ మొత్తాన్ని చెల్లించినా సరే మరోసారి రికవరీ మొత్తం చెల్లించాలని నోటీసులివ్వడాన్ని పరిశీలకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని తన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాదిరిగా ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారని విమర్శిస్తున్నారు.ఇదీ చదవండి: ఇంగ్లీష్ మీడియం మన పిల్లలకే..'పేద బిడ్డలకు తెలుగే' -
కూటమి ప్రభుత్వం అక్రమ కేసు.. పేర్ని నాని సతీమణికి ఊరట
సాక్షి,కృష్ణా : కూటమి ప్రభుత్వం నమోదు చేసిన రేషన్ బియ్యం అక్రమ కేసులో మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి ఊరట దక్కింది. పేర్ని నానీ సతీమణి పేర్ని జయసుధకు మచిలీపట్నం కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రేషన్ బియ్యం కేసులో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) ఇప్పటికే ఖండించారు. ఈ విషయంలో అధికారుల దర్యాప్తు కంటే సోషల్ మీడియాలో రచ్చ ఎక్కువైందని, పోలీసుల విచారణ పూర్తి కాకముందే ఉద్దేశపూర్వకంగా తనను దొంగగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారాయన. శనివారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘అద్దె కోసమే గోడౌన్ కట్టుకున్నాం. తప్పుడు పనులు చేయడానికి కాదు. సివిల్ సప్లై అధికారులు నా భార్య జయసుధకు చెందిన గోడౌన్లో స్టాక్ ఉంచారు. మా గోడౌన్లో బియ్యం తగ్గిందని అధికారులు చెప్పారు. టెక్నికల్గా మా తప్పు లేకపోయినా.. నైతికంగా బాధ్యత తీసుకుంటామని చెప్పాం. అధికారులు 3,800 బస్తాలు తగ్గాయని చెబితే.. నగదు చెల్లించాం. అయినా సరే మాపై కక్షగట్టి కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణ పూర్తి కాలేదని పోలీసులే చెబుతున్నారు. ఏదీ తేలకముందే నేనే దొంగనంటూ కూటమి(Kutami) నేతలు కొద్దిరోజులుగా నాపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు’’ అని అన్నారాయన.అయినా కూడా ఈ వ్యవహారంలో డిపార్ట్మెంట్ విచారణ కంటే సోషల్ మీడియా(Social Media) రచ్చ ఎక్కువైంది. మాపై ఎల్లో మీడియా, ఐటీడీపీ తప్పుడు రాతలు రాస్తోంది. కూటమి అనుకూల నేతలు, విశ్లేషకులు ఈ తప్పుడు ప్రచారంలో భాగం అయ్యారు. నేను పారిపోయానంటూ ప్రచారాలు చేశారు. నేనెక్కడికి పారిపోలేదు. 15వ తేదీ నుంచి మూడు రోజులపాటు బందరులోనే ఉన్నా. కేవలం లాయర్ల సూచన మేరకే ఇంతకాలం మీడియా ముందుకు రాలేదు.నాపై ప్రతీకారం తీర్చుకోవాలని నా ఇంట్లో ఆడవాళ్లను ఇబ్బంది పెడుతున్నారు. గోడౌన్ మేనేజర్ను అరెస్ట్ చేసి.. ఆయన ద్వారా నా పేరు చేర్చడానికి ప్లాన్ చేశారు. గోడౌన్ను పగలగొట్టి సరుకును తీసుకెళ్లారు. ఓ సీఐ ఈ స్వామికార్యాన్ని దగ్గరుండి జరిపించారు. ఇలా ఏదో ఒక రకంగా నన్ను, నా భార్యను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. కొన్ని యూట్యూబ్ చానెల్స్లో నా భార్య గురించి దారుణమైన కామెంట్స్ పెట్టారు. ఇప్పటికే చాలామంది స్టేషన్కు తీసుకెళ్లి కొడుతున్నారు. రాజకీయ కక్ష ఉంటే నాపై తీర్చుకోండి. నా ఇంట్లో ఆడవాళ్లతో ఏం పని?’’.... సామాన్య ప్రజలు ఆలోచించాలి. నేను మూడుసార్లు ఎమ్మెల్యేగా చేశా. ప్రభుత్వం రూల్స్ ఏంటో నాకు తెలుసు. నేను మంత్రిగా చేసినప్పుడు.. ఇదే డీజీపీ నా శాఖలో పని చేశారు. ఆయనకు నేనేంటో తెలుసు. నా తల్లి మీద ఒట్టేసి చెబుతున్నా.. ఎలాంటి తప్పు చేయలేదు. నేను, నా భార్య ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. తప్పుడు మార్గంలో సంపాదించాలనే ఆలోచన ఏనాడూ నాకు లేదు. కేవలం నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. తప్పు చేసి ఉంటే ఈ ఐదు నెలలు ఏం చేశారు?. నా మీద అధికార పార్టీ, ఎల్లో మీడియా కక్ష కట్టాయి. వైఎస్ జగన్ కంటే నేనే వాళ్ల మొదటి టార్గెట్. అందుకే నన్ను తప్పుడు కేసులో ఇరికించాలని చూస్తున్నారు. నా వ్యక్తిత్వాన్ని హననం చేయాలనుకుంటున్నారు. త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయి.ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్తే రకరకాల కుట్రలు చేశారు. పీపీలను మారుస్తూ అడ్డంకులు సృష్టించారు. జనవరి 2వ తేదీలోగా నన్ను, నా కుమారుడిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారని తెలిసింది. ఇంకోవైపు.. నా దగ్గర రూ.5 వేల కోట్లు ఉన్నాయని టీడీపీ పత్రికల్లో అసత్య ప్రచారం చేస్తున్నారు. నా దగ్గరే అంత డబ్బు ఉంటే సీజ్ చేస్కోండి. 3 శాతం లంచాలు తీసుకునేవాళ్లు కూడా నాపై ఆరోపణలు చేస్తున్నారు. మంత్రిగా ఉంటూ తన శాఖలోని ఉద్యోగుల బదిలీలకు లంచాలు తీసుకున్నవాళ్లు కూడా నాపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ నెల 30న బెయిల్ తీర్పు ఉన్నందున అన్ని విషయాల గురించి మాట్లాడలేకపోతున్నా’’ అని పేర్ని నాని అన్నారు. -
చంద్రబాబు ప్రభుత్వంపై పేర్నినాని కామెంట్స్
-
నా తల్లి మీద ప్రమాణం చేసి చెబుతున్న
-
కావాలనే ఆ టైం కి నోటీసులు అంటించారు
-
నా పైన ప్రతీకారం తీర్చుకోవడానికి ఇంట్లో మహిళలను ఇబ్బందిపెడుతున్నారు
-
కూటమి నేతలు కొద్దిరోజులుగా నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు
-
నా తల్లి మీద ఒట్టేసి చెబుతున్నా.. ఏ తప్పు చేయలేదు: పేర్ని నాని
గుంటూరు, సాక్షి: రేషన్ బియ్యం మాయం కేసులో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) ఖండించారు. ఈ విషయంలో అధికారుల దర్యాప్తు కంటే సోషల్ మీడియాలో రచ్చ ఎక్కువైందని, పోలీసుల విచారణ పూర్తి కాకముందే ఉద్దేశపూర్వకంగా తనను దొంగగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారాయన. శనివారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘అద్దె కోసమే గోడౌన్ కట్టుకున్నాం. తప్పుడు పనులు చేయడానికి కాదు. సివిల్ సప్లై అధికారులు నా భార్య జయసుధకు చెందిన గోడౌన్లో స్టాక్ ఉంచారు. మా గోడౌన్లో బియ్యం తగ్గిందని అధికారులు చెప్పారు. టెక్నికల్గా మా తప్పు లేకపోయినా.. నైతికంగా బాధ్యత తీసుకుంటామని చెప్పాం. అధికారులు 3,800 బస్తాలు తగ్గాయని చెబితే.. నగదు చెల్లించాం. అయినా సరే మాపై కక్షగట్టి కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణ పూర్తి కాలేదని పోలీసులే చెబుతున్నారు. ఏదీ తేలకముందే నేనే దొంగనంటూ కూటమి(Kutami) నేతలు కొద్దిరోజులుగా నాపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు’’ అని అన్నారాయన. అయినా కూడా ఈ వ్యవహారంలో డిపార్ట్మెంట్ విచారణ కంటే సోషల్ మీడియా(Social Media) రచ్చ ఎక్కువైంది. మాపై ఎల్లో మీడియా, ఐటీడీపీ తప్పుడు రాతలు రాస్తోంది. కూటమి అనుకూల నేతలు, విశ్లేషకులు ఈ తప్పుడు ప్రచారంలో భాగం అయ్యారు. నేను పారిపోయానంటూ ప్రచారాలు చేశారు. నేనెక్కడికి పారిపోలేదు. 15వ తేదీ నుంచి మూడు రోజులపాటు బందరులోనే ఉన్నా. కేవలం లాయర్ల సూచన మేరకే ఇంతకాలం మీడియా ముందుకు రాలేదు. నాపై ప్రతీకారం తీర్చుకోవాలని నా ఇంట్లో ఆడవాళ్లను ఇబ్బంది పెడుతున్నారు. గోడౌన్ మేనేజర్ను అరెస్ట్ చేసి.. ఆయన ద్వారా నా పేరు చేర్చడానికి ప్లాన్ చేశారు. గోడౌన్ను పగలగొట్టి సరుకును తీసుకెళ్లారు. ఓ సీఐ ఈ స్వామికార్యాన్ని దగ్గరుండి జరిపించారు. ఇలా ఏదో ఒక రకంగా నన్ను, నా భార్యను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. కొన్ని యూట్యూబ్ చానెల్స్లో నా భార్య గురించి దారుణమైన కామెంట్స్ పెట్టారు. ఇప్పటికే చాలామంది స్టేషన్కు తీసుకెళ్లి కొడుతున్నారు. రాజకీయ కక్ష ఉంటే నాపై తీర్చుకోండి. నా ఇంట్లో ఆడవాళ్లతో ఏం పని?’’.. .. సామాన్య ప్రజలు ఆలోచించాలి. నేను మూడుసార్లు ఎమ్మెల్యేగా చేశా. ప్రభుత్వం రూల్స్ ఏంటో నాకు తెలుసు. నేను మంత్రిగా చేసినప్పుడు.. ఇదే డీజీపీ నా శాఖలో పని చేశారు. ఆయనకు నేనేంటో తెలుసు. నా తల్లి మీద ఒట్టేసి చెబుతున్నా.. ఎలాంటి తప్పు చేయలేదు. నేను, నా భార్య ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. తప్పుడు మార్గంలో సంపాదించాలనే ఆలోచన ఏనాడూ నాకు లేదు. కేవలం నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. తప్పు చేసి ఉంటే ఈ ఐదు నెలలు ఏం చేశారు?. నా మీద అధికార పార్టీ, ఎల్లో మీడియా కక్ష కట్టాయి. వైఎస్ జగన్ కంటే నేనే వాళ్ల మొదటి టార్గెట్. అందుకే నన్ను తప్పుడు కేసులో ఇరికించాలని చూస్తున్నారు. నా వ్యక్తిత్వాన్ని హననం చేయాలనుకుంటున్నారు. త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయి. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్తే రకరకాల కుట్రలు చేశారు. పీపీలను మారుస్తూ అడ్డంకులు సృష్టించారు. జనవరి 2వ తేదీలోగా నన్ను, నా కుమారుడిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారని తెలిసింది. ఇంకోవైపు.. నా దగ్గర రూ.5 వేల కోట్లు ఉన్నాయని టీడీపీ పత్రికల్లో అసత్య ప్రచారం చేస్తున్నారు. నా దగ్గరే అంత డబ్బు ఉంటే సీజ్ చేస్కోండి. 3 శాతం లంచాలు తీసుకునేవాళ్లు కూడా నాపై ఆరోపణలు చేస్తున్నారు. మంత్రిగా ఉంటూ తన శాఖలోని ఉద్యోగుల బదిలీలకు లంచాలు తీసుకున్నవాళ్లు కూడా నాపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ నెల 30న బెయిల్ తీర్పు ఉన్నందున అన్ని విషయాల గురించి మాట్లాడలేకపోతున్నా’’ అని పేర్ని నాని అన్నారు. -
పోలీసుల నోటీసులను రద్దుచేయండి..
సాక్షి, అమరావతి :రేషన్ బియ్యం కేసులో సాక్షులుగా విచారణకు రావాలంటూ బందరు తాలుకా పోలీసులు తమకు జారీచేసిన నోటీసులను సవాలుచేస్తూ మాజీమంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని సాయి కృష్ణమూర్తి హైకోర్టును ఆశ్రయించారు. నోటీసులను రద్దుచేయాలని కోరుతూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అసలు తమను ఏ విధంగా సాక్షులుగా పరిగణిస్తున్నారో అర్థంకావడంలేదన్నారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం విచారణ జరగనుంది. మమ్మల్ని ఇరికించి అరెస్టుకు పోలీసుల యత్నం..బందరులో పేర్ని నాని భార్య జయసుధ ఓ గౌడన్ నిర్మించి దానిని పౌర సరఫరాల శాఖకు అద్దెకిచ్చారు. ఇందులో నిల్వచేసిన రేషన్ బియ్యంలో కొంత మాయమైనట్లు ఆరోపణలు రావడంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ నిమిత్తం తమ ముందు హాజరుకావాలంటూ నోటీసులివ్వడంతో వాటిపై నాని, ఆయన కుమారుడు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. బియ్యం మాయం కేసులో తమను అక్రమంగా ఇరికించి, అరెస్టుచేసేందుకు పోలీసులు యత్నిçÜ్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. బియ్యం మాయంతో తమకెలాంటి సంబంధంలేదన్నారు. గోడౌన్ను పౌర సరఫరాల శాఖకు అద్దెకిచ్చామని, అందులో ఉన్న బియ్యం మాయమైతే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలిగానీ, అద్దెకిచ్చిన యజమానిపై కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాజకీయ కారణాలతోనే పోలీసులు ఈ కేసు నమోదు చేశారన్నారు. తమ నుంచి ఎలాంటి సమాచారం కావాలో పోలీసులు నోటీసుల్లో పేర్కొనలేదన్నారు. బియ్యం మాయంపై కోటిరెడ్డి అనే అధికారి ఫిర్యాదు ఇచ్చారని, దాని ఆధారంగా నమోదుచేసిన కేసులో విచారణకు రావాలని మాత్రమే నోటీసుల్లో పేర్కొన్నారని వారు తెలిపారు. -
మాజీ మంత్రి పేర్ని నానికి పోలీసుల నోటీసులు
-
కూటమి కక్ష సాధింపు.. కేసుతో సంబంధం లేకున్నా నోటీసులు!
సాక్షి, కృష్ణా: ఏపీలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ కేసుతో సంబంధం లేకపోయినా పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. అంతేకాకుండా మధ్యాహ్నం రెండు గంటలలోపే స్టేషన్కు రావాలని హుకుం జారీ చేస్తున్నారు.మాజీ మంత్రి పేర్ని నానిపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్య కొనసాగుతోంది. కేసుతో సంబంధం లేకపోయినప్పటికీ పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం రెండు గంటలలోపే స్టేషన్కు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. స్టేషన్కు వచ్చి వాస్తవ విషయాలు చెప్పాలని.. అలాగే, అందుబాటులో ఉన్న రికార్డులు ఇవ్వాలని నోటీసులో తెలిపారు. అయితే, కేసుతో సంబంధం లేకపోయినా నోటీసులు ఇవ్వడమేంటని పలువురు వైఎస్సార్సీపీ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. -
మాజీ మంత్రి పేర్ని నానికి YSRCP నేతల పరామర్శ
-
మాజీ మంత్రి పేర్ని నాని సంచలన ఆరోపణలు
-
‘కెన్స్టార్’ షిప్పును పవన్ ఎందుకు వదిలేశారు: పేర్నినాని
సాక్షి,మచిలీపట్నం:డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ఇటీవలి కాకినాడ పోర్టు పర్యటనపై మాజీ మంత్రి,వైఎస్సార్సీపీ సీనియర్ నేత పేర్నినాని సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయమై మచిలీపట్నంలో పేర్నినాని సోమవారం(డిసెంబర్2) మీడియాతో మాట్లాడారు.స్టెల్లాషిప్ను తనిఖీ చేసిన పవన్ కల్యాణ్ కెన్స్టార్షిప్ను ఎందుకు వదిలేశారని మాజీ మంత్రి పేర్నినాని ప్రశ్నించారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి వియ్యంకుడు అందులో బియ్యం తరలిస్తున్నారని తమకు సమాచారం ఉందన్నారు. తన ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కెన్స్టార్షిప్లోకి వెళ్లేందుకు అనుమతి లేదంటున్నారని, అక్కడే ఉన్న అధికారులు కాకుండా ఇంకెవరు అనుమతి ఇవ్వాలో స్పష్టం చేయాలన్నారు. కెన్స్టార్షిప్లోకి వెళ్లకూడదని పవన్కల్యాణ్కు చంద్రబాబు చెప్పారా అని పేర్నినాని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం పోర్టు ఓనర్ అయితే అరబిందో కంపెనీ ప్రస్తావన ఎందుకు వచ్చిందో చెప్పాలన్నారు. -
గన్నవరంలో అక్రమంగా 8 మంది అరెస్ట్.. ఏపీ పోలీసులపై పేర్ని నాని ఫైర్
-
‘గుర్తుంచుకో చంద్రబాబూ.. అధికారం ఎల్లకాలం ఉండదు’
సాక్షి, కృష్ణా జిల్లా: రాష్ట్రంలో శాంతిభద్రతలను చంద్రబాబు సర్కార్ గాలికొదిలేసిందని.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకుందంటూ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తప్పుడు కేసులతో వైఎస్సార్సీపీ శ్రేణులను వేధించడానికే పోలీసులను వాడుతున్నారంటూ ధ్వజమెత్తారు.‘‘పాత కేసులను తిరగదోడి.. తప్పుడు కేసులు పెడుతున్నారు. గన్నవరంలో 8 మంది వైఎస్సార్సీపీ నేతలను అక్రమంగా కేసుల్లో ఇరికించారు. న్యాయమూర్తి 307 కేసును తొలగించారు. కానీ బెయిల్ విషయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పచ్చ చొక్కాల ఒత్తిడికి లొంగిపోయారు. కుంటిసాకులతో రెండురోజుల పాటు కాలయాపన చేసి పోలీస్ కస్టడీ కోరారు. రెండు సార్లు విచారణ అయ్యాక ఏముందని పోలీస్ కస్టడీకి కోరుతున్నారు’’ అని పేర్ని నాని ప్రశ్నించారు...అమాయకులను తెచ్చి ముద్దాయిలను చేశారు. వైఎస్సార్సీపీ జెండా, జగన్ బొమ్మ పెట్టుకుని తిరగకుండా చేయాలని చూస్తున్నారు. అడ్డగోలుగా పోలీసులను వాడుతున్నారు. పాతకేసులను తిరగదోడుతున్నందుకు డీజీపీకి మా సూటిప్రశ్న. పాతకేసులకు సంబంధించి ఎస్సై, సీఐలను సస్పెండ్ చేశారా?. తప్పుడు ఉద్యోగం చేశావని ఒక్కరిపైనైనా చర్యలు తీసుకున్నారా?. చేసేవి దొంగ పనులు కాబట్టి చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఒక్కొక్కరి పై 10, 20 కేసులు పెడుతున్నారు.తమతో పాపాలు చేయిస్తున్నారని కొందరు పోలీసు అధికారులు బాధపడుతున్నారు. ఖాకీ యూనిఫాం వేసుకుని తప్పుడు కేసులు పెట్టి పాపాలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు ఎల్లకాలం సీఎంగా ఉండడు. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ఈ రోజు పసుపు చొక్కేలేసుకుని అక్రమంగా వ్యవహరిస్తున్న అధికారులు తప్పకుండా చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని పేర్ని నాని హెచ్చరించారు. -
పేర్ని నాని నాతో ఎప్పుడూ అనే మాట...
-
దేవుడి దయతో గొప్ప విజయాన్ని చవిచూశాం: YS Jagan
-
సంపద సృష్టిచడం అంటే బొచ్చ పట్టుకొని అడుక్కోవడమా..? బాబుపై పేర్నినాని ఫైర్
-
జగన్ ని పతనం చేయాలనే కుట్రలో భాగంగా..
-
జగన్ ఉన్నప్పుడు అదానీ పెట్టుబడులు పెడితే మీకు చేదు
-
ధర్మం చంద్రబాబు పాదం మీదే నడుస్తుందా..?
-
మార్గదర్శి పాపాల గురించి మీ పేపర్లో ఒక్కరోజైనా రాశారా ..?
-
చంద్రబాబుకు ఆ ఒప్పందాలను రద్దు చేసే దమ్ముందా?: పేర్ని నాని
సాక్షి, గుంటూరు: వైఎస్ జగన్ను పతనం చేయాలనే కుట్రలో భాగంగానే చీకట్లో కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు చేతులు కలిపారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వైఎస్ జగన్పై 15 ఏళ్లుగా ఎల్లో మీడియా విషం చిమ్మనిరోజు లేదన్నారు. జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఎన్ని కుట్రలు చేస్తున్నా వాటిని జగన్ పటాపంచలు చేస్తున్నారని పేర్ని నాని అన్నారు.‘‘రెండు పేపర్లు, పది టీవీ ఛానళ్లతో నిత్యం వైఎస్ జగన్పై విషం చిమ్ముతూనే ఉన్నారు. గతంలో కూడా ఇలాగే అమెరికాలో కేసులు అంటూ విషం చిమ్మారు. అయినా సరే జనం జగన్ను సీఎం చేశారు. ఇప్పుడు మళ్లీ విషం చిమ్మటం మొదలయింది. జగన్కు రూ.1750 కోట్ల లంచాలు అంటూ ఈనాడు రాసింది. సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటే అవినీతా?. పైగా ఇంటర్నేషనల్గా జగన్ పేరు అంటూ టీడీపీ ప్రచారం చేస్తోంది. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ జైలుకు వెళ్లినప్పుడే చంద్రబాబు పేరు అంతర్జాతీయంగా మార్మోగింది. మార్గదర్శి పాపాలను ఈనాడులో ఏనాడైనా రాశారా?’’ అంటూ పేర్ని నాని నిలదీశారు.‘‘అదానీ చంద్రబాబును కలిస్తే ఆహాఓహో అంటూ ఈనాడు రాసింది. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయంటూ పేజీల నిండా రాసింది. అదే అదానీ జగన్ను కలిస్తే పోర్టులు, మైనింగ్ అంతా అదానీకే దోచిపెడుతున్నారంటూ తప్పుడు వార్తలు రాసింది. ఇలా రాస్తే జనం నవ్వుతారని కూడా లేకుండా నిస్సిగ్గుగా వార్తలు రాసింది. కేంద్ర రంగ సంస్థ సెకీతో ఏపీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది. రూ.2.49లకే 25 సంవత్సరాలపాటు విద్యుత్ ఇచ్చేందుకు సెకీ అంగీకరించింది. ఇందులో తప్పేముంది?’’ అని పేర్ని నాని చెప్పారు.‘‘రూ.4.50ల చొప్పున చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే తప్పు కాదా?. అదే రూ.2.49లకే జగన్ కొనుగోలు చేస్తే అవినీతా?. అడ్డగోలు ఒప్పందాలతో చంద్రబాబు జనం మీద భారం వేస్తే అది ఈనాడుకు కనపడదా?. రామోజీరావు సంతాప సభ కోసం ప్రజల సొమ్ము రూ.25 కోట్లు ఖర్చు చేశారు. అందుకని చంద్రబాబు రుణం తీర్చుకోవటానికి ఈనాడు పచ్చి అబద్దాలను అచ్చోసింది. చంద్రబాబు దిగేనాటికి కరెంటు కంపెనీలకు రూ.22 వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయి. జగన్ ప్రభుత్వం కుదుర్చుకున్నది కేంద్ర రంగ సంస్థ కంపెనీ సెకీతోనే.. అదానీతో ఎలాంటి ఒప్పందాలూ కుదుర్చుకోలేదు’’ పేర్ని నాని స్పష్టం చేశారు.‘‘కేంద్ర ప్రభుత్వం ఎవరి దగ్గర కొనుగోలు చేస్తుందో మాకు అనవసరం. జగన్ కంటే సంవత్సరంన్నర ముందు అదే సెకీతో చంద్రబాబు రకరకాల అధిక ధరలతో కొనుగోలు చేశారు. మిగతా రాష్ట్రాల్లో అంతకంటే తక్కువ ధరకు కొనుగోలు జరిగితే చంద్రబాబు ఎందుకు అధిక ధరకు కొనుగోలు చేశారు?. జగన్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు తప్పు అయితే దాన్ని రద్దు చేయాలి. గతంలో జగన్ పై పెట్టిన కేసుల్లో నిజం లేదని సుప్రీంకోర్టు తేల్చేసింది. సంతకాలు పెట్టిన అధికారుల తప్పు లేదని తేల్చింది. అలాంటప్పుడు ఇక జగన్ పేరు ఎందుకు ప్రస్తావన ఉంటుంది?’’ అని పేర్ని నాని ప్రశ్నించారు.ఇదీ చదవండి: సెకీతోనే ఒప్పందం.. ప్రభుత్వానికి అదానీతో ఏం సంబంధం? -
Perni Nani: పుష్ప ఈ మధ్యన ఇంటర్నేషనల్... చంద్రబాబు ఎప్పుడో ఇంటర్నేషనల్
-
పవన్ కళ్యాణ్, చంద్రబాబు పై పేర్ని నాని ఫైర్
-
టపాసుల గొడవ... చిన్నారిపై మర్డర్ కేసు
-
ఫేక్ పోస్టులు పెట్టే సంస్కృతి టీడీపీదే: పేర్నినాని
సాక్షి,కృష్ణాజిల్లా:ఫేక్పోస్టులు పెట్టే సంస్కృతి టీడీపీదేనని మాజీ మంత్రి,వైఎస్సార్సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షులు పేర్నినాని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యుల ఫోటోలతో పెట్టిన పోస్టులు డీజీపీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ మేరకు పేర్నినాని సోమవారం(నవంబర్ 11) మీడియాతో మాట్లాడారు.‘డబ్బులిచ్చి పోస్టులు పెట్టే సంస్కృతికి తెరలేపింది టీడీపీ కాదా. వైఎస్ జగన్ కుటుంబ సభ్యుల ఫోటోలతో పోస్టులు పెట్టిన వారిని చంద్రబాబు,పవన్కు దమ్ముంటే అరెస్ట్ చేయండి. మీ ఇంట్లో ఆడవాళ్లే ఆడవాళ్లా. ఇలాంటి పోస్టులు ఎవరు పెట్టినా తప్పే. వాళ్లు చేసిన తప్పే మనం చేయొద్దు. టీడీపీ,జనసేన,బీజేపీకి చెందిన వాళ్లు తప్పుడు పోస్టులు పెడితే కేసులు పెట్టండి.వాళ్లు బూతులతో ఫోటోలు పెట్టారని మనం పోస్టులు పెట్టొద్దు. మనం సంస్కారవంతంగా వ్యవహరిద్దాం. పెద్దపెద్ద మాటలు చెప్పే చంద్రబాబు,పవన్ను సూటిగా ప్రశ్నిస్తున్నా. నాభార్య గురించి ఎన్నో సార్లు యూట్యూబ్ లో తప్పుడు పోస్టులు పెట్టించారు.మాకు మీలాగా దొంగ ఏడుపులు ఏడవడం రాదు.భయపెట్టాలనే వందల మందిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇక్కడితో అయిపోతుందని అనుకోవద్దు. నక్కిన శ్యామ్ అనే యువకుడిని చిత్రహింసలకు గురిచేశారు. తప్పుడు కేసులు పెట్టే పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది. మీరు రిటైర్ అయ్యేవరకు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉంటాడనుకుంటున్నారా..? సోషల్ మీడియా పేరుతో పెడుతున్న తప్పుడు కేసులపై పోరాడతాం. రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం’అని పేర్నినాని పేర్కొన్నారు.ఇదీ చదవండి: బాబుపై సుమోటో కేసులేవీ పవన్: అంబటి -
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు బహిష్కరిస్తున్నాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక పాలన కారణంగా ఎన్నికలు ధర్మబద్ధంగా నిర్వహించే పరిస్థితి లేనందున గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. గుంటూరు, కృష్ణా, ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనబోవటం లేదని వైఎస్సార్సీపీ నాయకులు వెల్లడించారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తదితరులు ఈ వివరాలు వెల్లడించారు.రాష్ట్రంలో రోజురోజుకీ శాంతి భద్రతలు దిగజారిపోయాయని పేర్ని నాని దుయ్యబట్టారు. 5 నెలల్లో 100 మందికి పైగా బాలికలు, మహిళలపై అత్యాచారాలు జరిగినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల మంచి, చెడు పట్టించుకోవడంలేదని, ఎన్నికల హామీలు కూడా అమలు చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేలా డైవర్షన్ పాలిటిక్స్ అనుసరిస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన తమ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి అర్థరాత్రి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారని ఆరోపించారు.ఎక్కడికి తీసుకెళ్తున్నారో కుటుంబ సభ్యులకు కూడా చెప్పడంలేదని, రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలిందని దుయ్యబట్టారు. 41 – ఎ నోటీసులు అందుకున్న కేసులను కూడా 307 సెక్షన్కు మార్చి, అక్రమంగా జైళ్లకు పంపి దారుణంగా వేధిస్తున్నారని తెలిపారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థ కూటమి ప్రభుత్వానికి, టీడీపీకి ప్రైవేట్ సైన్యంలా మారిందన్నారు. కిరాతకాలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న కూటమి నాయకుల వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా పోలీసులకు లేకుండా పోయిందని చెప్పారు. పోస్టింగ్ల కోసం చట్టాలను అతిక్రమించి, వైఎస్సార్సీపీ జెండా పట్టినా, ప్రభుత్వ చేతకానితనాన్ని ప్రశ్నించినా అడ్డగోలుగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆక్షేపించారు.ఈ పరిస్థితులన్నీ చూశాక కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయన్న నమ్మకం తమకు లేదన్నారు. పోటీ చేసే అభ్యర్థులకు ఓట్లడిగే స్వేచ్ఛను కాలరాసేలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, చివరకు గెలుపును కూడా ఓటమిగా మార్చే దౌర్జన్య విధానాలు అవలంబిస్తున్నారని, అందువల్లే కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు బహిష్కరించాలని వైఎస్సార్సీపీ నిర్ణయించిందని పేర్ని నాని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు వెలంపల్లి శ్రీనివాసరావు, పార్టీ ఎనీ్టఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్ బాబు, కోన రఘుపతి తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ YSRCP గెలవడం ఖాయం
-
‘పవన్ మా సంగతి తర్వాత.. ముందు నిన్ను నమ్మినోళ్ళ సంగతి చూస్కో’ : పేర్ని నాని
సాక్షి,విజయవాడ: ‘అధికారం లేకపోయినా వైఎస్సార్సీపీ జెండా మోసిన కార్యకర్తలు దర్జాగా బతుకుతుంటే.. జనసేన జెండా మోసిన కార్యకర్తలు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. కొడుతున్నారు. కాళ్లు పట్టిస్తున్నారు. నువ్వేం చేస్తున్నావ్ పవన్’ అంటూ మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నలు సంధించారు. ఇవాళ (ఆదివారం) వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా దేవినేని అవినాష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పేర్ని నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ..చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రజలకు అబద్దాలు చెప్పి అధికారం లోకి వచ్చారు.కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైఎస్సార్సీపీ నేతలను, కార్యకర్తలను వేధిస్తున్నారుఈరోజు వేధించే వాళ్ళకి 10 రేట్లు మేము తిరిగి ఇస్తాంనాలుగేళ్లకంటే ముందే...వాళ్ళకి చూపిస్తాంఅధికార మదంతో కూటమి నాయకులు రెచ్చిపోతున్నారువైఎస్సార్సీపీకి కార్యకర్తలే బలంఎంత కొట్టినా, తిట్టినా వైఎస్సార్సీపీ జెండా మోయకుండా ఎవ్వరు ఆపలేరుఅది మా పార్టీ కార్యకర్తల చిత్తశుద్ధిసోషల్ మీడియాలో పోస్టులు పెడితే..అరెస్టులు చేస్తున్నారువైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు భయపడదిలేదుటీడీపీ సోషల్ మీడియాలా డబ్బులకు పని చేసేవాళ్ళు కాదువైఎస్ జగన్ తల్లి, చెల్లెలి గురించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారుచంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీరు తల్లికి, చెల్లికి ఆస్తులు రాసిచ్చారాచంద్రబాబుకి ఎంత మంది చెల్లెలు ఉన్నారో ఎవరికైనా తెలుసాతన చెల్లెళ్లకు చంద్రబాబు ఎంత ఆస్తి రాసిచ్చారువైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చూసి ఎవరు ప్రేమించరువైఎస్ జగన్ని ఓ హీరోగా, ఆదర్శ రాజకీయ నాయకుడిగా ప్రేమిస్తారుసీట్లు చూసుకుని నోరు లేచేది పవన్ కళ్యాణ్ బ్యాచ్మాకు ఎన్ని సీట్లు, ఉన్నా లేకపోయినా మేం పోరాడుతాంమాకు అధికారం ఉన్నా, లేకపోయినా నోరు లేస్తుందివైఎస్సార్సీపీ కార్యకర్తలు నోరు లేపితే తాట తీస్తాడంటనిన్ను నమ్ముకుని నీ జెండాలు మోసిన జనసేన కార్యకర్తల్ని కొడుతుంటే నువ్వేం చేశావ్ పవన్జనసేన కార్యకర్తల్ని టీడీపీ వాళ్ళు కొడుతుంటే..ఏం చేశావ్?అధికారం లేకపోయినా వైఎస్సార్సీపీ జెండా మోసిన కార్యకర్తలు దమ్ముగా బతుకుతున్నారుపవన్ జెండా మోసిన..వాళ్ళు మాత్రం మానసికంగా క్షోభ అనుభవిస్తున్నారుకొడుతున్నారు..కాళ్ళు పట్టిస్తున్నారు..ఎం చేస్తున్నావ్పవన్ కళ్యాణ్ మా సంగతి తర్వాత. నిన్ను నమ్మినోళ్ళ సంగతి ముందు చూస్కోమమ్మల్ని ఎంత వేధించినా ..మేము తగ్గేదే లేదు..నీకు చేతనైంది చేస్కోలోకేష్కి అమెరికా వెళ్లినా వైఎస్సార్సీపీనే గుర్తొస్తుందిఎన్ని కేసులు పెట్టినా.. వైఎస్సార్సీపీ జెండాని వదిలి పెట్టరు ప్రతి కార్యకర్తకు అండగా వైఎస్ జగన్ : దేవినేని అవినాష్కుటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎవరూ భయపడొద్దు.. ప్రతి కార్యకర్తకి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా ఉంటారని దేవినేని అవినాష్ అన్నారు. ఆయన ఇవాళ (ఆదివారం) పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో టీడీపీ, ఎల్లో మీడియా దుష్ప్రచారం వలన ఒడిపోయాం. నాలుగు నెలలకే ప్రజలు ఎందుకు కూటమిని గెలిపించామా అని బాధ పడుతున్నారు. చంద్రబాబు ప్రజలకు అబద్దాలు చెప్పి గెలిచారు. వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రజలకోసం పోరాడుదాం. ఎన్ని కేసులు పెట్టిన ఎవ్వరు భయపడొద్దు. ప్రతి కార్యకర్తకరు వైఎస్ అండగా ఉంటారని హామీ ఇచ్చారు.వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిని చేద్దాం : ఆళ్ల అయోధ్య రామిరెడ్డిఅధికారం లేకపోయినా వైఎస్ జగన్ ఆదర్శంగా పార్టీని నడుపుతున్నారు పార్టీని మరింత బలోపేతం చేసేలా జగన్ పనిచేస్తున్నారుప్రజల్లో నిరంతరం ఉండేలా పార్టీ ఇకమీదట కూడా పనిచేస్తుందిపార్టీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేస్తాంరాష్ట్రంలో జమిలి ఎన్నికలు రాబోతున్నాయిరెండేళ్లకే ఎన్నికల వాతావరణం వస్తుందికచ్చితంగా అధికారంలోకి వచ్చేలా అందరం కలిసి పనిచేస్తాంవచ్చే ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిని చేద్దాం -
చంద్రబాబు వ్యాఖ్యలు.. పేర్నినాని కౌంటర్
-
బాబూ.. ఆస్తులు అమ్మడం సంపద సృష్టా?: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: ప్రజల ఆస్తులను అమ్మడంలో చంద్రబాబు దిట్ట మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. సంపద సృష్టించడం దేవుడెరుగు. సృష్టించిన సంపదను కూడా తెగనమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులను దొడ్డిదారిన చంద్రబాబు తన వారికి కట్టబెడుతున్నారని ఆరోపించారు.మాజీ మంత్రి పేర్ని నాని సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు. సంపద సృష్టిస్తామంటూ మోసపూరిత మాటలు చెప్పారు. సంపద సృష్టించడం దేవుడెరుగు. ఈ ఆర్థిక సంవత్సరంలో 45వేల కోట్లు అప్పులు తెచ్చారు. సృష్టించిన సంపదను కూడా తెగనమ్ముతున్నారు. తమ వారికి సంపదనంతా దోచిపేట్టే కార్యక్రమం చేస్తున్నారు. రాష్ట్రంలో మూడు పోర్టుల నిర్మాణానికి వైఎస్సార్సీపీ హయాంలో వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. నిర్మాణాలు పూర్తి అయినప్పటికీ ఈరోజుకు కూడా పోర్టులో కార్యకలాపాలు ప్రారంభించలేదు.మచిలీపట్నం పోర్టు కృష్ణా జిల్లా ప్రజల ఆకాంక్ష. బందరు పోర్టు కోసం నాడు వైఎస్సార్ అన్ని రకాల అనుమతులు తీసుకువచ్చి పనులు ప్రారంభించారు. చంద్రబాబు హయాంలో పోర్టు పనులు ఆగిపోయాయి. వైఎస్ జగన్ హయంలో బందరు పోర్టు 50 శాతం పూర్తి అయ్యింది. చంద్రబాబు ఆరు నెలల్లోనే బందరు పోర్టు కడతామన్నారు.. ఏమైంది?. బందరు పోర్టు కట్టకపోగా 22 గ్రామాలను ఖాళీ చేయించారు. మూలపేట పోర్టు పనులను కూడా ఈ ప్రభుత్వం నిలిపివేసింది. వైఎస్ జగన్ సృష్టించిన సంపదను కూటమి నేతలు దోచుకుంటున్నారు. ఈ మూడు పోర్టుల పనులను నిలిపేసి అమ్మకానికి పెట్టారు.కరెంట్ ఛార్జీల మోత..2014-19 మధ్య కాలంలో ఇదే కూటమి ప్రభుత్వం ఉంది. ఆ ఐదేళ్లలో రామాయపట్నం పోర్టు ఊసు కూడా ఎత్తలేదు. వాళ్ల సంపద పెంచుకోవడానికి దుర్మార్గపు పనులు చేస్తున్నారు. తెగనమ్ముకోవడాన్ని సంపద సృష్టించడం అంటారా?. 14 మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెట్టారు. ప్రజల ఆస్తులను అమ్మడంలో చంద్రబాబు దిట్ట. ప్రభుత్వ ఆస్తులను దొడ్డిదారిన చంద్రబాబు తన వారికి కట్టబెడుతున్నాడు. చంద్రబాబు పాపపు పనులను ప్రజల్లో ఎండగడతాం. ఎన్నికల సమయంలో బాబు ఒక్క పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పారు. కానీ, ఇప్పుడు రూ.6072 కోట్లు ప్రజలపై భారం మోపుతున్నారు. సుప్రీంకోర్టు చెప్పిందని బాబు అబద్ధాలు చెబుతున్నారు. ఛార్జీలు పెంపు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. ఉచిత ఇసుక పెద్ద మోసం..ఇసుక గురించి నాడు ఇష్టానుసారం మాట్లాడారు. ఇప్పుడు భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి దారుణంగా ఉంది. ఉచిత ఇసుక అంటూ అబద్ధాలు మాట్లాడుతున్నారు. బంగారం ఇచ్చినా ఇసుక దొరకని పరిస్థితికి తీసుకొచ్చారు. టెండర్లను మంత్రులు, ఎమ్మెల్యేలే వేసుకోవాలట. పేరుకు మాత్రం ఉచితం.. అంతా దోపిడీనే. కూటమి సర్కార్ పాలనలో నిత్యవసరాల ధరలు మండిపోతున్నాయి. చంద్రబాబు, లోకేష్, పవన్, పురంధేశ్వరి.. నలుగురు కలిసి జనాన్ని బాదేస్తున్నారు. ధరల నియంత్రణకు బాబు ఏం చర్యలు తీసుకున్నారు. ఇది ఎంత మోసపూరిత ప్రభుత్వమో అర్థం అవుతోంది. ఇంతకంటే దగుల్బాజీ ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా? అని కామెంట్స్ చేశారు. బాలినేనికి కౌంటర్..ఇదే సమయంలో ఆస్తుల విషయంలో విజయమ్మ జడ్జీగా ఉండాలంటూ బాలినేని వ్యాఖ్యలపై పేర్ని నాని స్పందించారు. జడ్జిగా ఉండేవారు మధ్యస్థంగా ఉండాలి కదా?.ఒకరివైపు ఉండేవాళ్లు జడ్జి ఎలా అవుతారు?. ఈ పార్టీ వద్దు అని వెళ్లిపోయిన బాలినేని ఇప్పుడు పెద్ద మనిషి అవతారం ఎందుకు ఎత్తారు?. అవసరాల కోసం చేసే రాజకీయాలే ఇప్పుడు కనిపిస్తున్నాయి. బాలినేని రాజకీయాల కోసం ఏదైనా మాట్లాడతారు. ఇప్పుడు జనసేనలో ఉన్నందున ఆ పార్టీలైన్ మాట్లాడుతున్నారు అంటూ కౌంటరిచ్చారు. -
వైఎస్ఆర్ శత్రువులతో షర్మిల చేతులు కలిపారు: పేర్నినాని
-
అవి జగన్ సొంత సంస్థలు
సాక్షి, అమరావతి: భారతి సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్ సంస్థలు వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత సంస్థలని.. వాటిల్లో షర్మిల వాటాదారు కాదని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తేల్చిచెప్పారు. సోదరి షర్మిలపై ప్రేమ, ఆప్యాయతతో తన స్వార్జితమైన నాలుగు సంస్థల్లో 40 శాతం వాటాను ఇస్తూ జగన్ ఒప్పందం రాసిచ్చారని.. ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్), కోర్టు అనుమతి ఇచ్చాక వాటిని పూర్తి స్థాయిలో బదలాయిస్తానని స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. అయితే ఈడీ జప్తు చేసిన సరస్వతీ పవర్ షేర్లను బదిలీ చేయించి జగన్ బెయిల్ను రద్దు చేయించాలన్న కుట్రలో షర్మిల పావుగా మారారని.. ఆ కుట్రను చిత్తు చేయడానికే ఎన్సీఎల్టీలో జగన్ పిటిషన్ వేశారేగానీ ఆస్తులు వెనక్కి తీసుకోవాలని కాదని స్పష్టం చేశారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. అవన్నీ జగన్ స్వార్జితం: వైవీ సుబ్బారెడ్డి షర్మిల బహిరంగ లేఖ చూశాక కుటుంబపరమైన కొన్ని విషయాలను ప్రజలకు తెలియజేస్తున్నా. సరస్వతీ పవర్ షేర్ల అంశం హైకోర్టులో ఉంది. ఈడీ జప్తు చేసిన ఆ సంస్థ ఆస్తులపై హైకోర్టు స్టేటస్ కో విధించింది. జగన్పై కాంగ్రెస్ పార్టీ అక్రమంగా కేసులు బనాయించి జైలుకు పంపించడంతో ఆయన సంస్థల ఆస్తుల అటాచ్మెంట్ జరిగింది. ఈడీ అటాచ్మెంట్లో ఉన్న షేర్లను బదిలీ చేయించుకున్నారు కాబట్టే దాన్ని ఆపాలని జగన్ ఎన్సీఎల్టీలో పిటిషన్ ఇచ్చారు. అంతేగానీ ఆస్తులు వెనక్కు తీసుకోవాలని కాదు. » జగన్ తన స్వార్జిత ఆస్తిలో షర్మిలకు వాటా ఇస్తూ 2019 ఆగస్టులో ఒప్పందం రాసిచ్చారు. ఆ ఒప్పందంలో జగన్ స్వార్జిత ఆస్తులు అని చాలా స్పష్టంగా ఉంది. అది చూశాకే షర్మిలమ్మ, విజయమ్మ ఇద్దరూ సంతకం పెట్టారు. తన చెల్లిపై ప్రేమ, అభిమానంతో ఆస్తులు ఇస్తున్నట్లు జగన్ ఆ ఒప్పందంలో రాశారు. ఇవన్నీ వాస్తవాలు. వాటిని కప్పి పుచ్చి దుష్ప్రచారం చేస్తున్నారు. » దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నప్పుడే ఆయన ఆస్తులను పంచారు. షర్మిల ఈ ఆస్తులు కావాలని అని నిజంగా అనుకుంటే.. అవి ఇస్తానని జగన్ చెప్పినా.. ఆమె ఇప్పుడేం మాట్లాడుతున్నారో చూస్తుంటే.. ఆమె ఆస్తుల కోసం పోరాడుతున్నారా? లేక జగన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారా? అని అనిపిస్తోంది. » నాకు తెలిసినంతవరకు జగన్ స్వార్జిత ఆస్తిలో ఎక్కడా షర్మిలమ్మ ప్రమేయం లేదు. నిజంగా ఆ ఆస్తుల్లో షర్మిలమ్మకు వాటా ఉండి ఉంటే.. ఆమెపై ఆనాడు కేసులు ఎందుకు నమోదు కాలేదు? కేవలం జగన్ మాత్రమే ఎందుకు జైలుకు వెళ్లారు? జగన్ కంపెనీలో షేర్ హోల్డర్ కాబట్టే ఆయనకు డివిడెండ్ వచ్చింది. దాన్నుంచే ఆయన తన చెల్లికి ఈ పదేళ్లలో రూ.200 కోట్లు ఇచ్చారు. షర్మిల అందులో షేర్ హోల్డర్ కాదు. అవి జగన్ సొంత కంపెనీలు. అందుకే వాటికి భారతి సిమెంట్స్.. తన పేరు, భార్య పేరు కలిసొచ్చేలా జగతి పబ్లికేషన్స్ (సాక్షి గ్రూప్) అని పేరు పెట్టారు. » నలుగురు పిల్లలూ తనకు సమానం అని వైఎస్సార్ అన్నారని షర్మిల లేఖలో రాశారు. అది నిజమే. ప్రేమను పంచడంలో వైఎస్సార్ నలుగురు పిల్లలనూ సమానంగా చూశారు. అయితే వైఎస్సార్ బతికున్నప్పుడే జగన్ స్థాపించిన కంపెనీల్లో ఎక్కడా షర్మిల గానీ, అనిల్ గానీ షేర్హోల్డర్గా లేరు. అది వైఎస్సార్ కోరుకోలేదు. ఒకవేళ ఆయన కోరుకుంటే వారిని ఆ కంపెనీల్లో షేర్ హోల్డర్లుగా పెట్టి ఉండేవారు కదా? తండ్రి మరణం తర్వాత, ప్రజలకు ఇచ్చిన మాట కోసం జగన్ కాంగ్రెస్ పార్టీని వీడి ఓదార్పు యాత్ర చేశారు. ఎన్నో పోరాటాలు చేశారు. 2014లోగానీ మొన్న 2024లోగానీ అబద్ధాలు చెప్పి ఉంటే అధికారంలోకి వచ్చేవారు. అలాంటి మనిషే అయితే చెల్లి విషయంలో మాట తప్పరు కదా? బాబుతో కలసి రాజకీయం చేయడం వైఎస్ అభిమతమా?: పేర్ని నాని » గత మూడు నాలుగు రోజుల నుంచి టీడీపీ నానా హంగామా చేసి చెప్పిన బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే.. షర్మిలమ్మ తన ఆస్తుల పంపకం గురించి అన్నకు రాసిన ఉత్తరం. అది రాష్ట్రానికి, ప్రజలకు అంత ముఖ్యమా? షర్మిలమ్మ పీసీసీ అధ్యక్షురాలు. ఆమె అన్నకు రాసిన ఉత్తరం ఎన్డీఏ అఫీషియల్ వెబ్సైట్లో రావడం అంటే చంద్రబాబు ఎంత అనైతికంగా వ్యవహరిస్తున్నారు? ఎక్కడికక్కడ ఎవరెవరితో కలిసి పని చేస్తున్నారు? అనేది ఆలోచించండి. ఢిల్లీలో కాంగ్రెస్తో కుస్తీ.. ఇక్కడ మాత్రం దోస్తీ! ఏ స్థాయిలో దిగజారి రాజకీయాలు చేస్తున్నాడో చూడండి. లేఖ రాసింది రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలైతే టీడీపీ వెబ్సైట్లో ప్రచారం చేయడం ఏమిటి? » వైఎస్సార్ జీవించి ఉన్నప్పుడు మొదలుపెట్టిన కంపెనీల్లో కుటుంబ సభ్యులంతా వాటాదారులైతే.. భారతి సిమెంట్స్లో షర్మిల పేరు ఎందుకు పెట్టలేదు? షేర్ హోల్డర్లుగా ఎందుకు ప్రకటించలేదు? జగన్ ఆ కంపెనీలకు కేవలం కాపలాదారే అయితే వైఎస్సార్ మిమ్మల్ని కంపెనీల్లో డైరెక్టర్లుగా పెట్టేవారు కదా? అప్పట్లో మీరు విదేశాల్లో కూడా లేరు కదా? » వైఎస్సార్ అభిమతం, ఆశయాలను కొనసాగించాలన్న అంకితభావం ఉంటే.. చంద్రబాబుతో కలిసి ప్రయాణించడం, రాజకీయం చేయడాన్ని ఎవరైనా ఊహిస్తారా? వైఎస్సార్ అదే ఆశించారా? ఆయన్ను అణగదొక్కడానికి చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేశారో తెలుసు కదా? రాజకీయాల్లో ఇద్దరూ బద్ధ శతృవులు. అలాంటి చంద్రబాబుతో కలిసి పని చేస్తారా? ఏబీఎన్ రాధాకృష్ణతో కూడా కలసి పోతారా? వైఎస్సార్ అభిమానుల్లో ఎవరైనా చంద్రబాబుతో కలిసి పని చేస్తున్నారా? కానీ ఆ పని మీరు ఎందుకు చేస్తున్నారు? మీరు కాంగ్రెస్లో ఉంటూ ఎన్డీఏ కూటమితో కలసి ఎలా పని చేస్తున్నారు? అదేనా వైఎస్సార్ అభిమతం? ఆశయం? » వైఎస్సార్ మరణించాక.. జగన్ 10 ఏళ్లు కష్టాలు పడితే.. తాను పార్టీ కోసం పాటుపడ్డాడని, కష్టపడి పని చేశానని షర్మిలమ్మ అంటున్నారు. జగన్ ఎప్పుడు సమస్యలు ఎదుర్కొన్నారో తెలియదా? ఆయన సోనియాను ఎదిరించి బయటకు వచ్చిన తర్వాత అక్రమ కేసులు పెట్టారు. జైల్లో పెట్టారు. అప్పుడు 230 రోజులు షర్మిలమ్మ పాదయాత్ర చేశారు. అది కూడా 2014 ఎన్నికల ముందు మాత్రమే. 2014 తర్వాత ఆమె ఏనాడూ రాలేదు. పార్టీ జెండా మోయలేదు. » వైఎస్సార్సీపీకి 2012 నుంచి ఈరోజు వరకు కర్త, కర్మ, క్రియ, కష్టం నష్టం.. గెలుపు.. అన్నింటిలో పూర్తి భాగస్వామ్య హక్కు జగన్ది మాత్రమే. కేవలం ఆయన వల్లనే పార్టీ ఎదిగింది... నిల్చింది... గెల్చింది. ఆ ఘనత పార్టీది, కార్యకర్తలది. అంటే జగన్, పార్టీ కార్యకర్తలకే ఆ ఘనత దక్కుతుంది. ఇంకా చెప్పాలంటే మాలాంటి వారు చాలా మంది పని చేశారు. పదవులు వదులుకుని వచ్చాం. టీడీపీ నుంచి కూడా పదవులు వీడి వచ్చిన వారు ఉన్నారు. అధికారాన్ని వదులుకుని ప్రతిపక్షంలో ఉన్న పార్టీలోకి వచ్చారు. కానీ ప్రధానంగా పని చేసింది లక్షలాది మంది కార్యకర్తలు, జగన్ మాత్రమే. వారి వల్లనే పార్టీ ఎదిగింది. నిలబడింది. ఇది వాస్తవం. దీన్ని షర్మిలమ్మ గుర్తించాలి. » ఇది చెప్పాలో వద్దో తెలియదు. షర్మిలమ్మ పాదయాత్ర సమయంలో జగన్ జైల్లో ఉంటే నేను స్వయంగా కలిశా. చెల్లితో పాదయాత్ర చేయించడం ఎంత వరకు కరెక్ట్? భవిష్యత్తులో సమస్యలు వస్తాయని చెబితే అలాంటి అవకాశం అసలు ఉండదని నాడు జగన్ అన్నారు. చెల్లిపై ఆయనకు అంత నమ్మకం. కానీ ఈ రోజు నేను అన్నదే జరుగుతోంది. » షర్మిలను పార్టీ కోసం వాడుకుని వదిలేశారని చంద్రబాబు అంటున్నారు. మరి నువ్వు జూనియర్ ఎన్టీఆర్ను పార్టీ కోసం ఎంతగా వాడుకున్నావ్ చంద్రబాబూ..? మీరు కనీసం సభ్యత్వం కూడా ఇవ్వలేదు. అందుకే ఆయన పార్టీని వీడారు కదా? మీరు మీ లాభం కోసం మనుషులను ఎలా వాడుకుంటారో.. స్వయంగా మీ తోడల్లుడు ఏకంగా పుస్తకమే రాశారు కదా! వాడుకోవడం, వదిలేయడం.. అదీ మీ నైజం! అలాంటి మీరు నీతులు చెబుతున్నారు. ఆస్తులు ఇవ్వడం లేదని విమర్శిస్తున్నారు. మరి మీ హెరిటేజ్లో మీ తోబుట్టువులకు ఎంత వాటా ఇచ్చారు? ఏమైనా రాసిచ్చారా? మీకు నిజాయితీ ఉంటే వెంటనే ఆ పని చేసి చూపండి. ఈ వయసులో ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి చంద్రబాబూ!! 40% వాటా కోసం మాట తప్పుతారా? » అన్ని కుటుంబ వ్యాపారాలకు జగన్ కేవలం గార్డియన్ మాత్రమేనని, ఆస్తులను నలుగురికి (మనవళ్లు, మనవరాళ్లు) సమానంగా పంచడం, అది జగన్ బాధ్యత అని.. అది వైఎస్సార్ ఉద్దేశమని.. అది ఆయన సన్నిహితులైన కేవీపీ, సాయిరెడ్డి, సుబ్బారెడ్డికి కూడా తెలుసని షర్మిలమ్మ ఆ లేఖలో రాశారు. ఒకవేళ నిజంగా వైఎస్సార్ ఉద్దేశం అదే అయితే.. ఇంత మందికి ఆయన చెప్పి ఉంటే, జగన్కు కూడా చెప్పి ఉండాలి కదా? ఇద్దరు తల్లిదండ్రులను కూడా కంపెనీ డైరెక్టర్లుగా పెట్టి ఉండాలి కదా? ఇలాంటి మనస్తత్వమా షర్మిలది? »తండ్రి మరణం తర్వాత జగన్ ఓదార్పుయాత్ర చేస్తానంటే.. కాంగ్రెస్ వద్దనడంతో పార్టీని వీడారు. పదవులు ఇస్తామన్నా ఆశ పడలేదు. కేవలం మాట కోసం బయటకు వచ్చారు. రాజీ పడకుండా పోరాడారు. తండ్రి ఆశయం, జనం కోసం, నమ్మిన సిద్దాంతం కోసం ఎంతో పోరాడారు. 16 నెలలు అన్యాయంగా జైలు శిక్ష అనుభవించారు. ఎంతో జీవితాన్ని పోగొట్టుకున్నారు. కానీ ఆశయాన్ని మాత్రం వీడలేదు. జగన్పై ఎన్ని కేసులు పెట్టారు? ఇప్పటికీ వాటిని మోస్తూనే ఉన్నారు. పదవులు ఇస్తామన్నా కేవలం ఇచ్చిన మాట కోసం వదులుకున్నారు. » అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి ఏదో నాలుగు ఆస్తుల్లో 40 పైసల వాటా కోసం మాట తప్పుతారా? ఇచ్చిన మాట నిలబెట్టుకోరా? తనే స్వయంగా రాశారని మీరే చెబుతున్నారు కదా! నమ్మిన సిద్ధాంతం, ఆశయాల కోసం రాజీ పడకుండా అన్ని కష్టాలు అనుభవించిన వ్యక్తి 40 పైసల వాటా కోసం మాట తప్పుతారా? మరి ప్రజలు దీన్ని నమ్ముతారా? »గత పదేళ్లలో మీకు రూ.200 కోట్లు నగదు బదిలీ చేస్తే అది కంపెనీ డివిడెండ్ అని అంటారా? మీరు కంపెనీలో షేర్హోల్డర్ కానప్పుడు మీకు లాభం ఎలా పంచుతారు? అది వచ్చింది మీ అన్న, వదిన నుంచి కాదా? ఇంత దారుణంగా మాట్లాడడం, వ్యవహరించడం ఎంత వరకు సబబు? తండ్రి, అన్న శతృవుతో కలిసి పని చేయడం, ఆస్తుల కోసం జగన్ కోర్టుకు ఎక్కాడని టీడీపీ మీడియాతో కలసి దు్రష్పచారం చేయడాన్ని మీ విజ్ఞత, విచక్షణకే వదిలేస్తున్నాం.రెట్టింపు డబ్బులిస్తాం.. ఫిలిం సిటీ భూములు వదిలేస్తారా?వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు ఒంగోలు సిటీ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సరస్వతి పవర్ ప్రాజెక్టు కోసం రైతుల నుంచి చట్ట ప్రకారం భూములు కొన్నారని, రామోజీరావు అండ్కో లా హైదరాబాద్లో ఫిలిం సిటీ కోసం పేదలను భయపెట్టి భూములు చవగ్గా కొల్లగొట్టలేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు చెప్పారు. రామోజీ అండ్ కో ఫిలింసిటీ కోసం ఎంతో మంది పేదలను భయపెట్టి భూములు లాక్కొన్నారని, ఆరోజు కొన్న రేటుకు రెట్టింపు డబ్బులిస్తాం ఫిలిం సిటీ భూములను వదిలేస్తారా అని ప్రశ్నించారు. జూపూడి శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ చట్టప్రకారం కొన్న భూములపైనా ఎల్లోమీడియా వక్రీకరించడం సమంజసం కాదని అన్నారు. చంద్రబాబుకు సిగ్గు ఉందో లేదో తెలియదు కానీ, రాష్ట్రం మొత్తం చంద్రబాబును చూసి సిగ్గుపడే అంశాలు చాలా ఉన్నాయని విమర్శించారు. జగన్ ఇంట్లో ఆస్తుల తగదాలతో ఆయనకేమిటి సంబంధం అని ప్రశ్నించారు. సంబంధం లేకపోతే షర్మిల లేఖ చంద్రబాబు దగ్గరకు ఎలా వచ్చిందని నిలదీశారు. ఆనాడు సోనియాగాంధీతో కుమ్మక్కైన చంద్రబాబు వైఎస్ జగన్పై తప్పుడు కేసులు బనాయించారని, ఫలితంగా జగన్ ఆస్తులు సీబీఐ, ఈడీ అటాచ్లో ఉన్నాయన్నారు. న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా ఉండటం కోసమే జగన్ ఎన్సీఎల్టీకి అర్జీ పెట్టుకున్నారని వివరించారు. అసలు చంద్రబాబు ఏనాడైనా తన ఆస్తులను తమ్ముళ్లు, చెల్లెమ్మలకు రాసిచ్చారా అని నిలదీశారు. చంద్రబాబు తన ఉనికి కోసం సొంత తమ్ముడు రామ్మూర్తినాయుడిని ఎదగకుండా చేశాడని విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డైవర్షన్ పాలిటిక్స్, ప్రత్యర్థి పార్టీ నాయకులను వేధించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని, శాంతిభద్రతలను పూర్తిగా వదిలేశారని ధ్వజమెత్తారు.అనుబంధాల గురించి షర్మిల మాట్లాడటమా?వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డిప్రొద్దుటూరు: శత్రువులతో చేతులు కలిపిన షర్మిలమ్మ కుటుంబ అనుబంధాలు, ప్రేమల గురించి మాట్లాడటం విడ్డూరమని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. ఆమె ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో కుమ్మక్కై ఆస్తి కోసం సొంత అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బజారుకీడుస్తున్నారని ధ్వజమెత్తారు. శివప్రసాదరెడ్డి శుక్రవారం వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత షర్మిలమ్మపై ప్రేమతో జగన్ స్వార్జితంలో సుమారు రూ.200 కోట్లు నగదు చెల్లించారని చెప్పారు.ఇందుకు భారతమ్మ కూడా పూర్తి సహకారం అందించి గొప్పతనాన్ని చాటుకున్నారని తెలిపారు. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్, మిగతా ఆస్తులలో షర్మిలమ్మకు భాగం ఇవ్వాలనే ఎంఓయూ కుదుర్చుకున్నారన్నారు. అయితే ఆస్తులు ఈడీ అటాచ్మెంట్లో ఉండటతో బదలాయించలేదన్నారు. కేసులు పరిష్కారమయ్యే వరకు, న్యాయ సంబంధమైన సమస్యలు రాకుండా ఉండేందుకు ఎంవోయూ ఇచ్చారన్నారు. షర్మిలకు చెందని ఆస్తి కోసం చంద్రబాబు అండ్ కో తో చేతులు కలిపి వైఎస్ జగన్ను మరో మారు జైలుకు పంపేందుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వైఎస్ జగన్కు రాష్ట్రంలో కోటి కుటుంబాలు అండగా ఉన్నాయన్న విషయం తెలుసుకోవాలన్నారు. షర్మిలమ్మ అత్యాశతో అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అసలు సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలియదని అన్నారు. చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడుకు ఆస్తిలో వాటా ఇవ్వకపోవడంవల్లే మతి స్థిమితం కోల్పోయారని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్, నందమూరి వారసులకు ఆస్తి తగాదాలు లేవా అని ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆయన సతీమణులకు భాగ పరిష్కారాల సమస్య లేదా అని ప్రశ్నించారు. వైఎస్సార్ వ్యతిరేకుల చేతుల్లో షర్మిల కీలుబొమ్మవైఎస్సార్సీపీ మేధావుల ఫోరం అధ్యక్షుడు వై.ఈశ్వరప్రసాద్రెడ్డి సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై షర్మిల చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం లాజిక్లేదని, ఆమె వైఎస్సార్ కుటుంబ వ్యతిరేకుల చేతుల్లో కీలుబొమ్మగా మారిపోయారని వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం అధ్యక్షుడు వై. ఈశ్వర ప్రసాద్రెడ్డి ఆరోపించారు. అటాచ్మెంట్లపై హైకోర్టు ఆంక్షలు భూమికి మాత్రమే వర్తిస్తాయని, వాటాల బదిలీకి కాదని ఆమె చెప్పారని.. నిజానికి, మెజారిటీ షేర్ల బదిలీ అంటే భూమితో సహా అన్ని ఆస్తులను బదిలీ చేయడంతో సమానమని.. ఇది హైకోర్టు అటాచ్మెంట్ ఉత్తర్వులకు విరుద్ధమని శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ విషయంలో షర్మిల, కంపెనీల చట్టం ప్రకారం నిర్దేశించిన విధానాలను అనుసరించకుండా మెజారిటీ షేర్లను బదిలీ చేశారన్నారు. వాటా బదిలీ ఫారంలలో బదిలీదారుల సంతకాలు తీసుకోలేదని.. బదిలీ కోసం షేర్ సర్టిఫికెట్లు అందించలేదని ఆయన పేర్కొన్నారు. జగన్ బెయిల్ రద్దు చేయించాలనే..ఇక జగన్ బెయిల్ రద్దు కావాలంటే ఎలా అని ఆలోచించి.. చివరకు పల్నాడులోని సరస్వతి పవర్ ప్రాజెక్టు ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన అంశాన్ని పట్టుకున్నారన్నారు. తద్వారా.. దాని షేర్లు బదిలీ చేశారని చూపుతూ జగన్ బెయిల్ రద్దు చేయించాలని కుట్ర పన్నినట్లు ఈశ్వర్ప్రసాద్ తెలిపారు. తన బెయిల్ రద్దుచేసి, తిరిగి జైలుకు పంపించే కుట్ర చేస్తుండడంతో జగన్ న్యాయబద్ధంగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)కు అప్పీల్ చేశారని వివరించారు. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని.. షర్మిల ఇప్పటికైనా ఈ దుష్టశక్తుల కుట్రల నుంచి బయటపడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
టీడీపీ కుట్రలో షర్మిల పావు: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి,తాడేపల్లి: టీడీపీ చేసే కుట్రలో షర్మిల పావుగా మారిందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి పేర్నినానితో కలిసి వైవీ సుబ్బారెడ్డి తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం(అక్టోబర్ 25) మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేసే కుట్రలు జరుగుతున్నాయన్నారు.‘జగన్ బెయిల్ రద్దు చేసే కుట్రలు జరుగుతున్నాయి. గతంలో కాంగ్రెస్,టీడీపీ కలిసి వైఎస్జగన్పై కేసు పెట్టాయి. హైకోర్టు స్టేటస్కో ఆదేశాలున్నా షర్మిల సరస్వతి పవర్ కంపెనీ షేర్లు బదలాయించారు. షేర్లను బదలాయించినందువల్లే జగన్ ఎన్సీఎల్టీని ఆశ్రయించారుఆస్తుల్లో వాటా ఉంటే షర్మిలపై ఈడీ కేసులు ఎందుకు పెట్టలేదు. చెల్లిపై ప్రేమ ఉన్నందునే వైఎస్జగన్ షర్మిలకు ఎంవోయూ చేసుకున్నారు. షర్మిల ఆస్తుల కోసం పోరాడుతున్నారా’అని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. వైవీసుబ్బారెడ్డి ఇంకా ఏమన్నారంటే.. సరస్వతి సిమెంట్స్ ప్రాపర్టీ ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి.అయినాసరే షేర్లు బదలాయించుకోవటం వెనుక కుట్ర ఉంది.2019 ఆగస్టులో వైఎస్జగన్, షర్మిల ఎంవోయూ రాసుకున్నారుప్రాపర్టీ చూసుకున్నాకనే షర్మిల సంతకాలు పెట్టారుజగన్ ప్రేమ అభిమానంతోనే షర్మిలకు ఆస్తులు రాసిచ్చారు.కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఇదంతా జరిగింది.ఇప్పుడు షర్మిల చేస్తున్న రాద్దాంతమంతా ఆస్తుల కోసమే అని అర్థం అవుతోంది.షర్మిలకు లీగల్ గా ఆస్తుల మీద హక్కు ఉంటే ఆమె కూడా కేసులు ఎదుర్కొనేవారు.జగన్ ఒక్కరే జైలుకు ఎందుకు వెళ్తారు?జగన్ కు వచ్చిన డివిడెండ్ నుంచి షర్మిలకు రూ.200 కోట్లు ఇచ్చారు.జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్ జగన్ పెట్టుకున్న పరిశ్రమలు.వైఎస్సార్ బతికి ఉన్నప్పుడే ఈ కంపెనీలు పెట్టుకున్నారు.అందులో షర్మిలకు వాటాలు ఉంటే అప్పుడే రాసిచ్చేవారు.షర్మిల అబద్దాలాడుతున్నారువైఎస్ జగన్ ఇంట్లో చిచ్చుపెట్టి చంద్రబాబు చలిమంట కాచుకుంటున్నారు: పేర్నినానివైఎస్సార్ శత్రువులతో షర్మిల చేతులు కలిపారుతండ్రి ఆశయం కోసమైతే చంద్రబాబు కోసం పనిచేస్తారావైఎస్సార్ను అభిమానించేవారు ఇప్పటికీ చంద్రబాబును వ్యతిరేకిస్తున్నారు.గత మూడు నాలుగు రోజులుగా వైఎస్జగన్పై దుష్ప్రచారం చేస్తున్నారు.షర్మిల తాపత్రయం అంతా ఆస్తుల కోసమే..తండ్రి ఆశయాల కోసం కానేకాదువ్యక్తిగతంగా రాసుకున్న ఉత్తరం టీడీపీ అధికారిక వెబ్సైట్లో ఎలా వచ్చింది? చంద్రబాబు అక్రమ రాజకీయాలకు ఇది నిదర్శనంకేంద్రంలో బీజేపీతో ఉంటూ రాష్ట్రంలో కాంగ్రెస్తో అక్రమ బంధాన్ని కొనసాగిస్తున్నారుకాంగ్రెస్కు తాము వ్యతిరేకమని చెప్పి చంద్రబాబు ఇలా ఎందుకు చేస్తున్నారు?రాజకీయ వింత బంధాలను ఏపీలోనే చూస్తున్నాంవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టడంవెనుక జగన్ కష్టం,కార్యకర్తలే కారణంషర్మిలతో మాలాంటోళ్లు చాలామంది పని చేశాంమాలాంటి 30,40 మంది పదవులు వదులుకుని వచ్చారుటీడీపీ నుండి చాలామంది వైఎస్సార్సీపీలోకి వచ్చారుకానీ ప్రధానమైన కష్టం,నష్టం అంతా జగన్,కార్యకర్తలదేషర్మిలతో పాదయాత్ర వద్దని నేనే స్వయంగా జగన్తో చెప్పానుభవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని కూడా జగన్కి చెప్పానుకానీ నా కుటుంబంలో అలాంటివేమీ రావని జగన్ చెప్పారుకంపెనీల్లో షర్మిలకు వాటాలు ఉంటే ఆమెని కూడా డైరెక్టర్గా వైఎస్సార్ పెట్టేవారుఅలా జరగ లేదంటే షర్మిలకు సంబంధం లేదనే అర్థం కదాచంద్రబాబు అనవసరంగా జగన్ కుటుంబ సభ్యుల గొడవల్లో జోక్యం చేసుకుంటున్నారుజూనియర్ ఎన్టీఆర్ను ఎన్నికలకు వాడుకుని ఎందుకు వదిలేశారు?చంద్రబాబు నైజంపై ఆయన తోడళ్లుడే పుస్తకం వేశారుఅసలు చంద్రబాబు తన తోడబుట్టినవారికి ఏం ఆస్తులు రాసిచ్చారు?చంద్రబాబు చేతిలో షర్మిల పావుగా మారింది ఇదీ చదవండి: ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యావు షర్మిలా..? -
పక్కింట్లో గొడవైతే చంద్రబాబుకు ఎందుకంత సంబరం ?
-
‘పక్కింట్లో గొడవైతే చంద్రబాబుకు ఎందుకంత సంబరం?’
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ వ్యవహారంపై వాస్తవాలను పట్టించుకోకుండా అత్యంత దుర్మార్గంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న ఎల్లో మీడియా, కూటమి నేతలపై మాజీ మంత్రి పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్నినాని మీడియాతో మాట్లాడారు.హత్యలు,అత్యాచారాలు జరుగుతుంటే సీఎం చంద్రబాబు, ఎల్లో మీడియా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని పేర్ని నాని ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ విషయాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందేలా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పేర్ని నాని ఏమన్నారంటే..మూడ్రోజులుగా హైడ్రామా:గత మూడు రోజుల నుంచి పచ్చ మీడియా నానా హంగామా చేస్తోంది. రాష్ట్రం తలకిందులైపోతుంది అని ప్రచారం చేస్తోంది. ఇది టీడీపీ అంటే పడిచచ్చే ఛానల్స్ కాకుండా, టీడీపీకి ఊడిగం చేస్తున్న పేపర్లు కాకుండా, టీడీపీ అఫీషియల్ ట్విట్టర్లో బాగా ప్రచారం చేశారు. ఇది ఏ పేపర్, ఛానల్ చేస్తే వేరు. కానీ పార్టీ ట్విట్టర్ వేదికగా చేయడం ఆశ్చర్యకరం.రాష్ట్రంలో రోజూ ఆడపిల్లలపై హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా, టీడీపీకి పట్టదు. ట్విట్టర్లో అసలు ప్రస్తావించరు.కానీ రాష్ట్రంలో ఏదో జరుగుతుంది అంటూ నానా హంగామా చేసి, ప్రచారం చేశాక, వారు బయట పెట్టిందేమిటంటే.. జగన్గారు, తన తల్లి, చెల్లిపై కేసు పెట్టారని. ఆ తర్వాత ఎల్లో మీడియాలో పుంఖానుపుంఖాలుగా కధలు వండి వార్చారు. ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తూ, కధనాలు రాశారు. దుర్మార్గమైన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. జగన్గారిపై ప్రజల్లో ఉన్న యశస్సుని మసక బారేలా చేయాలి. రాజకీయంగా ఆయన్ను ఎదుర్కోలేక పోతున్నాం కాబట్టి, ఇలా వ్యక్తిత్వ హననం చేయాలన్న ప్రయత్నం.అవన్నీ జగన్గారి స్వార్జితం:వైఎస్సార్ మరణించక ముందే పిల్లలకు ఆస్తులు పంచారు. జగన్కి ఇచ్చేవి ఆయనకు ఇచ్చారు. షర్మిలకి ఇచ్చేవి కూడా ఇచ్చారు. ఆ తర్వాత జగన్ వ్యాపారాలు మొదలుపెట్టిన తర్వాత, ఆ ఆదాయాల ద్వారా వ్యాపారాలు పెంచుకుంటూ పోయారు. భారతి సిమెంట్స్, సాక్షి మీడియా గ్రూప్, పల్నాడు జిల్లా గురజాలలో సరస్వతి పవర్ కంపెనీ.. ఇవన్నీ జగన్ స్వార్జితం.ఎవరికైనా అనుమానాలు ఉంటే, రికార్డులు చూసుకోవచ్చు. 2009 నుంచి ఆయన అఫిడవిట్స్ కానీ, ఐటీ రిటర్న్ల్లో కూడా చూడొచ్చు. అన్నీ ఆన్ రికార్డ్. సరస్వతి పవర్ ప్రాజెక్టు ల్యాండ్ గవర్నమెంట్ లీజ్ భూమి కాదు. కానీ దీనిపై ఒక టీడీపీ నాయకుడు అసత్యాలు చెబుతున్నారు. అది రైతుల నుంచి కొనుక్కున్న భూమి.అక్రమ కేసులతో అటాచ్మెంట్ఘెస్సార్ మరణం తర్వాత, జగన్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత, చంద్రబాబు.. కాంగ్రెస్ నాయకులు కూడబలుక్కుని జగన్గారిపై తప్పుడు కేసులు నమోదు చేయించారు. ఆయనపై సీబీఐ దాడులు కూడా చేయించారు. ఆయన ఆస్తులను కూడా సీబీఐ, ఈడీ ద్వారా అటాచ్ చేయించారు. 2011 నుంచి 2016 వరకు ఆయనకు నరకం చూపించారు. ఆ పనుల్లో చంద్రబాబు ఎన్ని కుట్రలు చేశారో అందరికీ తెలుసు.35 ఏళ్ల యువకుడిని ఎదుర్కోవడానికి సోనియా, చంద్రబాబు ఎన్ని పిల్లిమొగ్గలు వేశారో అందరికీ తెలుసు. 2019లో ఆయన గెల్చారు.జగన్కు ఆస్తిపై మక్కువ ఉండి ఉంటే..ఇందాక షర్మిల అంటున్నారు. అది మా అన్న స్వార్జితం కాదు అని.. మరొకరు అంటారు.. జగన్కి ఆస్తి అంటే పిచ్చి అని.అదే నిజమైతే, ఆయన తన ఆస్తులను తల్లి, చెల్లికి ఎందుకు రాసిచ్చారు? ఆయన ప్రభుత్వం కూడా ఏర్పాటైంది. అధికారంలో ఉన్నా, తన చెల్లి మీద ఉన్న ప్రేమతో ఆస్తులు రాసిచ్చారు. నిజంగా ఆయనకు ప్రేమ లేకపోతే, బాధ్యత లేకపోతే ఆస్తులు ఎందుకు ఇస్తారు? తండ్రి చనిపోయిన ఇన్నేళ్లకు, ఆమె పెళ్లి తర్వాత ఇన్నేళ్లకు ఇలా ఎవరైనా ఆస్తులు పంచుతారా?అసలు చంద్రబాబు తన ఆస్తులు ఎవరికైనా పంచారా? ఆయనకున్న ఆస్తులు విలువ ఎంత? ప్రభుత్వ ధరల ప్రకారమే, ఆయన అఫిడవిట్ ప్రకారమే రూ.1400 కోట్ల ఆస్తి. మరి ఆ ఆస్తిలో చంద్రబాబు తన అక్కచెల్లెమ్మలు, తమ్ముడికి ఏమైనా రాసిచ్చాడా?స్వార్జితం అయినా వాటా ఇస్తామన్నారుజగన్ ఆస్తులన్నీ కూడా.. చంద్రబాబు, సోనియా కుట్రల వల్ల తప్పుడు కేసులతో సీబీఐ, ఈడీ అటాచ్లో ఉన్నాయి కాబట్టి.. నేరుగా బదిలీ కాకుండా ఎంఓయూ రాశారు. భారతి సిమెంట్స్లో 40 శాతం వాటా గిఫ్ట్ ఇస్తున్నట్లు రాశారు. ఆయనకు నిజంగా డబ్బుపై మమకారం ఉంటే, ఇలా ఆస్తి తన చెల్లికి రాసిస్తారా? చంద్రబాబు తన తమ్ముడికి, అక్కకి ఒక్కటంటే ఒక్క ఆస్తి అయినా రాశారా? సరస్వతి పవర్ ప్రాజెక్ట్, క్యారమిల్.. వీటన్నింటిలో వాటా ఇస్తూ, ఈడీ అటాచ్ అయిపోగానే, తన చెల్లికి ఇవన్నీ ఇస్తానంటూ.. రాసిచ్చారు. అలాగే సరస్వతి పవర్లో తన అమ్మగారికి కూడా వాటా రాశారు. ఈడీ కేసు అయిపోయిన తర్వాత, ఆ ఆస్తులు దఖలు చేసేలా రాసిచ్చారు.హైకోర్ట్ స్టేటస్కో ఆర్డర్వాస్తవాలు ఇలా ఉంటే.. ఇందాక షర్మిలగారు మాట్లాడుతున్నారు. ఈడీ ఆస్తుల అటాచ్మెంట్ ఏమీ లేదని. కానీ వాస్తవం ఏమిటంటే..2019లో ఈడీ అప్పిలేట్ అథారిటీలో జగన్గారికి అనుకూలంగా తీర్పు ఇస్తే, వారు హైకోర్టులో మూవ్ చేస్తే.. అదే ఏడాది చివర్లో స్టేటస్కో ఇచ్చింది. ఎక్కడ ఉన్నది అలాగే కొనసాగాలని. కానీ, దీనిపై షర్మిలగారు హైకోర్టు ఆదేశం లేదని అబద్ధం చెబుతున్నారు.ఆ తగాదాతో చంద్రబాబుకు ఏ సంబంధం?ఇంకా ఆమె ఏమంటున్నారు? అమ్మను బజారుకీడ్చారని, కోర్టుకు లాగారు. ఈ ఆస్తుల పంపకం బజార్లో పెట్టుకోవడం అవసరమా? అంటారు. ఇక చంద్రబాబు ఏమన్నారు. దేశంలోనే తొలిసారిగా సొంత తల్లిపై కేసు పెట్టిన శాడిస్టు కొడుకు. ఇలాంటి వారితోనా తాను రాజకీయం చేయాలి.. అంటున్నారు.నిజానికి ఇలాంటి దిక్కుమాలిన, దగుల్బాజీ పార్టీతో జగన్ రాజకీయాలు చేయడం శాపం కాదా? జగన్ ఇంట్లో ఆస్తుల తగాదా అయితే, మీకేమిటి సంబరం? ఇది రాష్ట్రానికి, దేశానికి, ప్రజలకు ఏం సమస్య? చంద్రబాబుకు ఈ పులకరింత ఎందుకు? పతిత కధలు చెబుతున్నావు. ఎదుటి వారి ఇంట్లో ఆస్తుల తగాదా వస్తే. నీకేమిటి?ఈ తగాదా వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయా? ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయా? ప్రజలకు ఏమైనా ఇబ్బంది వచ్చిందా?హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ..ఆ ఎంఓయూ ప్రకారం.. విజయమ్మ గారికి ఏం రాసిచ్చారంటే.. కోర్టులో అటాచ్మెంట్ వ్యవహారం తేలాక, ఆస్తుల బదలాయింపు ఉంటుందని. అంతవరకు సరస్వతి పవర్లో 2 శాతం వాటా విజయమ్మగారి పేరుమీదే ఉండగా, మరో 48 శాతం విజయమ్మగారి పేరు మీద బదలాయింపునకు అంగీకారం తెలుపుతూ, అన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్.. తెల్లకాగితం మీద రాసి, విజయమ్మగారి దగ్గర పెట్టడం జరిగింది. అయితే షేర్ సర్టిఫికెట్లు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేసి, కొత్త షేర్ల కాపీలు తీసుకుని, వాటిని విజయమ్మగారి పేరుమీద బదిలీ చేసి, కంపెనీలో బోర్డు డైరెక్టర్లను మార్చేశారు. అలా హైకోర్టు ఆదేశాలను పూర్తిగా బేఖాతరు చేశారు.చంద్రబాబు కుట్ర. డెరెక్షన్ఇదంతా చంద్రబాబునాయుడు నుంచి డైరెక్షన్ వచ్చాకే జరిగింది. ఆయన నుంచి డైరెక్షన్ వచ్చింది. మీరు మూవ్ అయ్యారు. జగన్గారి బెయిల్ రద్దు కావాలంటే.. ఏ కేసులో అయితే, ఆయన బెయిల్ మీద బయట ఉన్నారో.. ఆ కేసులో సాక్షులను బెదిరించినా.. బెయిల్ రద్దు అవుతుంది. అయితే ఆయన ఆ పని చేయడం లేదు. మరి ఆయన ఎలా దొరుకుతాడు.. అని ఆలోచించి, పల్నాడులోని సరస్వతి పవర్ ప్రాజెక్టులో ఈడీ ఆస్తులు అటాచ్ చేసినా, జగన్గారు బెయిల్ కండిషన్ను బేఖాతరు చేసి, షేర్లు బదిలీ చేశారని చూపుతూ.. జగన్గారి బెయిల్ రద్దు చేయించాలన్న కుట్రతో ఎవరితోనో ఒకరితో ఫిర్యాదు చేయించి, ఆ పని చేయాలని చూశారు.ఆయనకున్న ప్రత్యామ్నాయం ఏమిటి?మరి జగన్ ఈ పరిస్థితిలో ఏం చేయాలి?. ఆయనకు అమ్మ అన్నా, చెల్లి అన్నా ప్రేమ. కానీ వారు శత్రువులచేతుల్లోకి పోయి, తన బెయిల్ రద్దు చేసే ప్రయత్నం చేస్తే.. ఆయన ఏం చేస్తారు? చెప్పండి.ఎమ్మెల్యే అయి, మంత్రి అయినా చంద్రబాబుకు ఎవరూ పిల్లను ఇవ్వలేదు. కానీ రామారావుగారు ఇచ్చారు. కానీ ఆయనకే వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు.అలాంటి చంద్రబాబుతో మీరు కలిసి కుట్ర చేసి, తన బెయిల్ రద్దు చేసి, తిరిగి జైలుకు పంపించే కుట్ర చేస్తుండడంతో, ఆయన మాత్రం ఏం చేస్తారు? అందుకే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)కు అప్పీల్ చేశారు. చంద్రబాబు కుట్రలో భాగస్వాములై, ఆయన్ను తిరిగి జైలుకు పంపే యత్నం చేస్తుంటే, తాను ఏం చేస్తాడు?ఏనాడైనా నోరు మెదిపారా?రాష్ట్రంలో రోజూ అమ్మాయిలపై హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే, ఒక్కనాడు మీరు నోరు మెదపలేదు. జగన్గారు ఓడిపోయారు. ఎలా అనేది వేరే విషయం. అయినా ఆయనపై ఎందుకంత కక్ష.ఎక్కడైనా అధికారపార్టీపై విమర్శలు చేస్తారు. కానీ ఇక్కడ ప్రతిపక్షంపై అదే పనిగా విమర్శలు చేస్తున్నారు. ఒక అధికార పార్టీ నాయకుడు, ప్రతిపక్షం నాయకురాలని పొగుడుతున్నారు. ఇలా ఎక్కడైనా జరుగుతుందా?చంద్రబాబు చేస్తున్న దగుల్బాజీ రాజకీయం, కుటుంబంలో తగాదాను అడ్డు పెట్టుకుని చేస్తున్న కుట్రకు బలి కాకుండా.. చంద్రబాబు చేతిలో పావుగా మారిన చెల్లెమ్మ కోసం.. అంత కంటే ఏం చేస్తారు?అందుకే ఎన్సీఎల్టీకి అర్జీ పెట్టారు.ప్రేమ లేకపోతే ఆస్తులు రాసిస్తారా?:అటాచ్మెంట్ రిలీజ్ కాగానే, ఆయన కచ్చితంగా షేర్లు బదలాయిస్తారు. మీకూ తెలుసు. జగన్గారిపై పెట్టిన కేసులేవీ నిల్చేవి కావని. అందుకే కదా, మీరు ఆ ఒప్పందానికి ఒప్పుకున్నారు. ప్రతి పేపర్మీద సంతకాలు పెట్టారు.భారతి సిమెంట్స్లో, సాక్షి గ్రూప్లో 40 శాతం చొప్పున, పల్నాడులోని సరస్వతి పవర్ ప్రాజెక్టులో 100 శాతం వాటాకు ఒప్పుకుని, ఎంఓయూ రాసుకుని ఒప్పుకున్నారు కదా. అన్నకు నీ మీద ప్రేమ లేకపోతే, అలా ఆస్తులు ఇస్తానని రాసిస్తాడా? ఎందుకంటే అవన్నీ ఆయన స్వార్జితం. ఆయనకు నిజంగా డబ్బు పిచ్చి ఉంటే, అలా ఆస్తులు ఇస్తానని రాసిస్తాడా? ప్రతి పేజీలో ఇద్దరూ సంతకాలు పెట్టారు కదా? ఇవన్నీ పబ్లిక్ డాక్యుమెంట్ కదా?భూముల కబ్జాపై చంద్రబాబు కుట్ర ఇన్ని కుట్రలు చేసిన చంద్రబాబు పతిత కబుర్లు చెబుతున్నారు. చంద్రబాబుకు వయసొచ్చింది. కానీ నైతికత లేదు. సరస్వతి పవర్ ప్రాజెక్టు కోసం రైతుల నుంచి భూములు కొనుగోలు చేస్తే.. 2014–19 మధ్య, చంద్రబాబు స్వయంగా గురజాల ఎమ్మెల్యే ద్వారా రౌడీలను పంపించి, ఆ భూములు కబ్జా చేసే ప్రయత్నం చేశారా? లేదా?.ఇవాళ షర్మిలగారు చాలా మంచి అమ్మాయి అంటున్నావు కదా? మరి ఆరోజు ఆమె ఆస్తిని కబ్జా చేసేందుకు మీరు ప్రయత్నించారు. దాన్ని మాచర్ల ఎమ్మెల్యే ద్వారా జగన్గారు అడ్డుకున్నారు. ఇవాళ అందరూ ఉన్నారు. అన్నీ అందరికీ తెలుసు.అన్ని కుట్రలు, కుతంత్రాలు చేసి, ఇప్పుడు కూడా అదే చేస్తున్న చంద్రబాబు మొసలికన్నీరు కారుస్తున్నారు. కానీ, అవి షర్మిలమ్మకు అర్ధం కావడం లేదు. ఆయన్నే నమ్ముతున్నారు.శవ రాజకీయాలు చేసింది ఎవరు?ఇవాళ పేపర్ చూస్తే.. రోజూ అమ్మాయిలపై హత్యలు. అత్యాచారాలు. పరిస్థితి దారుణం. వాటి నుంచి డైవర్షన్ కోసమే కదా? ఇవన్నీ చేస్తోంది?మీరు అధికారంలోకి వచ్చాక, కనీసం ఒక్క కుటుంబాన్ని ఓదార్చారా? అమ్మాయిని కోల్పోయిన వారిని పరామర్శించారా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే పనిగా వెళ్లారు కదా? ప్రభుత్వంతో వేధింపులకు గురవుతున్నారు చాలా మంది. మరి వారిని ఓదార్చేది ఎవరు? అందుకే జగన్గారు వెళ్తున్నారు. వారికి కలుస్తున్నారు. జగన్గారు శవాల దగ్గరకు వెళ్తున్నారని విమర్శిస్తున్నారు. అసలు మీకు సిగ్గుందా?మీరు అధికారంలో లేకపోతే, ప్రభుత్వం డబ్బు ఇస్తే, డబ్బుతో ప్రాణాలు వస్తాయా? అంటారు. అదే ఇప్పుడు జగన్గారు ఇస్తుంటే కూడా తప్పు బడుతున్నారు. అసలు మీ వంటి వారితో రాజకీయాలు చేయాలంటే నిజంగా సిగ్గు వేస్తోంది.ఆనాడు చంద్రబాబు ఏం చేశారు?అన్నను తిట్టొద్దంటూ రామ్మూర్తినాయుడికి అమ్మ అమ్మణమ్మ ద్వారా చెప్పించే ప్రయత్నం’.. అంటూ వార్త కథనాన్ని చూపిన పేర్నినాని, ఆ అంశాన్ని వివరించారు.తన ఉనికి కోసం కాంగ్రెస్లో చేరిన నారా రామ్మూర్తినాయుడు, తన అన్న చంద్రబాబుపై అదేపనిగా విమర్శలు చేయడం, చాలా నష్టం కలిగిస్తోంది కాబట్టి, అమ్మ ద్వారా చెప్పించే ప్రయత్నం చేశారని.. ఆ వార్త.ఇది దాదాపు 30 ఏళ్ల క్రితం జరిగింది. ఆయన కాంగ్రెస్లో చేరారు. అప్పుడు చంద్రబాబు సీఎంగా ఉన్నారు. అయినా కాంగ్రెస్లో చేరి, చంద్రబాబును తిట్టారు. ఎందుకు తిట్టారు?మరి ఆయనకేమైనా చంద్రబాబు ఆస్తులు పంచారా? కనీసం అక్క చెల్లెమ్మలకు అయినా ఆస్తులు పంచారా? అదే జగన్గారు, తన తండ్రి చెల్లికి ఆస్తులు పంచినా, తన స్వార్జితంలో కూడా, తండ్రి చనిపోయిన 10 ఏళ్ల తర్వాత కూడా, ఆస్తులు పంచి ఇస్తున్నట్లు రాసిచ్చారు. చంద్రబాబు నీ జీవితంలో ఎప్పుడైనా, ఎవరికైనా అలా రాసిచ్చావా?.హైదరాబాద్లో 5 ఎకరాల ఫామ్హౌజ్ను చంద్రబాబు అమ్మ అమ్మణమ్మ, తన మనవడు నారా లోకేష్కు ఎలా గిఫ్ట్ డీడ్ ఇచ్చారు. ఆమెకు అంత మంది మనవళ్లు, మనవరాళ్లు ఉంటే, కేవలం చంద్రబాబు కొడుక్కే ఎందుకు ఆ ఆస్తి గిఫ్ట్డీడ్గా ఇచ్చింది?.ఆ ఆస్తి వద్దని తల్లికి ఎందుకు చెప్పలేదు? కనీసం ఇప్పుడైనా ఆ ఆస్తి తమకు వద్దని చంద్రబాబు కొడుక్కి చెప్పొచ్చు కదా?ఇది కుట్ర కాక మరేమిటి?ఇది జగన్ బెయిల్ రద్దు కోసం చేసిన కుట్ర కాక, మరేమిటి? షేర్లు బదలాయించడం, కంపెనీ డైరెక్టర్లను మార్చడం. వీటిలో దోషి ఎవరు? అటాచ్మెంట్లో ఉన్న ఆస్తులు. వాటిపై స్టేటస్కో కొనసాగించాలని హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినా, అలా బదలాయింపు చేయడం ఎంత వరకు కరెక్ట్?.కావాలంటే తెలంగాణ హైకోర్టు ఆదేశాలు చూడొచ్చు. కాగితం మీద రాసిచ్చిన వాడు, నిజంగా ఆస్తి ఇవ్వడా? అయినా ఎందుకు బదలాయించుకున్నారు? ఇది కుట్ర కాక మరేమిటి?.చెప్పేవన్నీ శ్రీరంగ నీతులునెల్లూరులో ఒక గజనీ మహ్మద్ ఉన్నారు. ఆయన ఓడి ఓడి మొన్న గెల్చాడు. ఏదో సినిమా బిట్ చూపి, జగన్గారిపై విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు గురించి మాట్లాడాలంటే, మన తెలుగు సినిమాల్లో ఏ విలన్ను చూసినా కనిపించేది చంద్రబాబే. ఆయన చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు. మరి చేతలు మాత్రం శూన్యం.జగన్.. ఎన్టీఆర్లా కాదు.జగన్మోహన్రెడ్డి వ్యక్తిత్వాన్నికించపర్చాలని, నాశనం చేయాలని, ఆయన్ను రాజకీయంగా ఎదుర్కోలేక, మీరిచ్చిన హామీలు అమలు చేయలేక, జగన్కి ఇంకా పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక, ఆయన్ను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలన్న కుట్రతో, ఆయన బెయిల్ రద్దు చేయించాలన్న మీ ప్రయత్నం నెరవేరదు. ఎందుకంటే, మీ కుట్రలు, కుతంత్రాలకు బలవ్వడానికి ఆయన ఎన్టీఆర్ కాదు.హోం మంత్రి అనిత ఒక గురువింద గింజ మాదిరిగా మాట్లాడుతున్నారు. అనిత మాదిరిగా జగన్పై చెక్ బౌన్స్ కేసు లేదు కదా? చెల్లెలు ఇలా వ్యవహరిస్తే ఎవరికైనా బాధలేచెల్లెలు ఇలా వ్యవహరిస్తే జగన్కే కాదు, చంద్రబాబుకీ బాధ తప్పదు. తన పేరుమీద ఉన్న ఆస్తులు మొత్తం.. అవన్నీ ఆయన స్వార్జితం. ఇది ఆన్ రికార్డ్. జగన్ స్వయంగా సంతకం పెట్టారు. ఆస్తి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఇది కుటుంబ వ్యవహారం. నాలుగు గోడల మధ్య జరిగిన విషయం. మరి ఇవాళ అది బజార్లోకి తెచ్చింది ఎవరు? అలా పెట్టింది ఎవరు? అలా బజార్లో పెట్టిన వాళ్లే.. విమర్శలు చేస్తే ఎలా?. నింద వేస్తే ఎవరికి చెప్పుకోవాలి? అందుకే ప్రజలకు చెబుతున్నామని పేర్నినాని వివరించారు. -
కాలర్ ఎగరేసి చెప్పండి మా దమ్ము.. ధైర్యం జగన్ అని
-
దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం.. కూటమి నేతలకు పేర్ని నాని వార్నింగ్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్కు అధికారం లేకపోయినా ప్రజాబలం ఉందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. కూటమి సర్కార్ వైఎస్సార్సీపీ కార్యకర్తలను వెంటాడి వేధిస్తోంది.. మేము తిరగబడితే కూటమి నేతలు కొట్టుకుపోతారని హెచ్చరించారు.మాజీ మాంత్రి పేర్ని నాని తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్కు ప్రజాబలం ఎక్కువ. జన బలం ఎవరికి ఉందో ఈవీఎం బ్యాచ్కి బాగా తెలుసు. ప్రజలను మోసం చేయడానికి వైఎస్ జగన్ ఎర్ర పంచ కట్టలేదు. వైఎస్ జగన్ సింగిల్గా వచ్చి గెలిస్తే.. చంద్రబాబు పొత్తుతో వచ్చాడు. కూటమి సర్కార్ వైఎస్సార్సీపీ కార్యకర్తలను వెంటాడి వేధిస్తోంది. మేము తిరగబడితే మీరు ఎక్కడ ఉంటారో ఒక్కసారి ఆలోచించుకోండి అని హెచ్చరించారు.అలాగే, వైఎస్ జగన్ దగ్గర అధికారం లేకపోవచ్చు.. కానీ మోసపు మాటలు మాత్రం లేవు. పవన్ తనకు కులం లేదు అని మొన్న చెప్పి.. ఇవాళ కులం ఉంది, మతం ఉందని డ్రామాలాడుతున్నారు. చంద్రబాబుకు అధికారం ఏమైనా శాశ్వతంగా ఉందా?. 2019లో వైఎస్ జగన్ను 151 సీట్లతో అధికారంలోకి తెచ్చింది కార్యకర్తలే. ఇప్పుడు 2029లో కూడా 175 సీట్లతో కార్యకర్తలే వైఎస్సార్సీపీని తిరిగి అధికారంలోకి తెస్తారు అంటూ వ్యాఖ్యలు చేశారు. -
చంద్రబాబుకు పేర్ని నాని సూటి ప్రశ్న
-
నీ చెంచా గాళ్ళు కు ఎవడూ భయపడడు పవన్ కు పేర్ని నాని స్ట్రాంగ్ వార్నింగ్
-
నీ ఉడత ఊపులకు భయపడం.. పవన్కు పేర్ని నాని స్ట్రాంగ్ వార్నింగ్
సాక్షి, కృష్ణా జిల్లా: డిప్యూటీ సీఎం పదవిలో ఉండి ఇలాంటి రాజకీయాలేంటి? అంటూ పవన్ కల్యాణ్పై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. పవన్ చేసిన వ్యాఖ్యలను ఎండగడితే తప్పేంటి? అంటూ ప్రశ్నించారు. గురువారం ఆయన మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ, ఇళ్ల మీదకు కిరాయి మనుషుల్ని పంపిస్తే భయపడతామా?. మీ ఉడత ఊపులకు మేం భయపడబోం’’ అని ధ్వజమెత్తారు. మచిలీపట్నం పోలీసులపైనా పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘సినిమాల్లో నాలుగు డ్యాన్స్లు వేసి రాజకీయాల్లోకి వచ్చావ్. నోటికి ఏదొస్తే అది నువ్వు మాట్లాడుతున్నావ్. కులం లేదు, మతం లేదంటూ మతాలను రెచ్చగొడతావ్. క్రిస్టియన్లకు, ముస్లింలకు ఉన్న ఐక్యత మీకు లేదా అంటూ హిందువులను రెచ్చగొడతావ్. ఎన్నికల ముందు కులాలను రెచ్చగొట్టావ్. ఈ రోజు మతాలను రెచ్చగొడుతున్నావ్. డిప్యూటీ సీఎంగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి. .బాధ్యత లేకుండా ప్రవర్తించడం సిగ్గుమాలినతనం’’ అంటూ పేర్ని నాని నిప్పలు చెరిగారు.‘‘గుడివాడ వెళితే నా కారుపై రాళ్లు వేయించావ్. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో.. మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం అని గుర్తుంచుకో పవన్. మచిలీపట్నం పోలీసులను కూడా హెచ్చరిస్తున్నా. తప్పుడు ఉద్యోగం చేయడం మీరు మొదలుపెడితే హింసా రాజకీయాలు మొదలవుతాయి. మేం చాలా ప్రశాంతంగా ఉన్నాం. మందు పోయించి మా ఇళ్ల పైకి మందిని పంపిస్తే. పరిస్థితులు మరోలా ఉంటాయి’’ అంటూ పేర్ని నాని హెచ్చరించారు. ‘‘పవన్ తప్పుడు రాజకీయాలు మానుకోవాలి. నిన్నటి దాకా కులం అయిపోయింది. ఇప్పుడు కాషాయ దుస్తులు ధరించావ్. కాషాయ దుస్తులు తీసేసి.. సినిమాల్లో అమ్మాయిలతో డాన్స్లు చేసి రావడమేంటి?. లడ్డూలో నిజంగానే తప్పులుంటే ఈ డ్రామాలెందుకు?. తప్పుడు రాజకీయాలు చేస్తూ విద్వేషాలు రెచ్చగొట్టి పాపం మూటగట్టుకుంటున్నారు. దిష్టిబొమ్మ తగలేసి. శునకానందం పొందడం మానుకో. హుందాగా రాజకీయం చేయండి. పోతు పేరంటాళ్లలాగా మెట్లకు పసుపులు రాయడం కాదు’’ అని పేర్ని నాని దుయ్యబట్టారు.ఇదీ చదవండి: గెలిచే ముందు ఒక అవతారం.. గెలిచాక ఇంకో అవతారం.. ఏది నిజం?వైజాగ్ స్టీల్ కార్మికులతో ఏం చెప్పావో మర్చిపోయావా?. ఒక్క ఎంపీ ఇవ్వండి పార్లమెంట్ను బద్ధలు కొట్టేస్తా అన్నావ్. చంద్రబాబు, నువ్వు స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు. స్టీల్ ప్లాంట్ కాపాడతానని సొల్లు కబుర్లు చెప్పారు కదా. మీరు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోండి. నేను గెలిచిన 24 గంటల్లో సుగాలి ప్రీతికి న్యాయం చేస్తానన్నావ్. వంద రోజులైంది. ఏమైంది సుగాలి ప్రీతి కేసు. ఎన్నికల ముందు 30 వేల మంది ఆడపిల్లలు మాయమైపోయారన్నావ్ కదా. డిప్యూటీ సీఎం అయ్యావు.. అప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు ఏమైపోయాయి. నా కారు పై రాళ్లేయించినా.. డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయించినా తగ్గేదే లేదు.. ఆగేదే లేదు. నీకు చేతనైతే.. నికార్సైన రాజకీయ నాయకుడివైతే.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చు’’ అని పేర్ని నాని హితవు పలికారు. ‘‘బందరు పోర్టు, మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెట్టారు. ఇలాంటి పాపాలు చేయడం మానుకోండి. లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందని నువ్వూ... నీ ముఖ్యమంత్రి చెబుతారు. లోకేష్.. నీ ఆర్థిక మంత్రి నెయ్యి కలపలేదంటారు. దేవుడితో దుర్మార్గమైన నీచ రాజకీయాలు మాని.. ప్రజలకు మంచి చేయండి’’ అని పేర్ని నాని అన్నారు. -
'పేర్ని నాని ఇంటి వద్ద' జన సైకోలు ఓవరాక్షన్
-
చంద్రబాబుకు వైఎస్ఆర్ సీపీ నేతల హెచ్చరిక..
-
తిరుపతి లడ్డు వివాదంపై పేర్ని నాని ఫస్ట్ రియాక్షన్
-
చంద్రబాబు పాపాలు కడిగేందుకే పూజలు: పేర్నినాని
సాక్షి,తాడేపల్లి:రాజకీయాల కోసం చంద్రబాబు దైవాన్ని కూడా వదల్లేదని మాజీ మంత్రి పేర్నినాని అన్నారు. పార్టీ నేతలు కొడాలినాని, వల్లభనేనివంశీతో కలిసి తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో బుధవారం(సెప్టెంబర్25) పేర్నినాని మీడియాతో మాట్లాడారు.‘తిరుమలలో నెయ్యిని వెనక్కి పంపామని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. చంద్రబాబు, లోకేశ్ మాత్రం అబద్ధాలు చెబుతున్నారు.లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. తన కుట్ర రాజకీయాల కోసం కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీశారు.లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు మాట్లాడారు.అలాంటిదేమీ లేదని ఈవో శ్యామలరావు చెప్తుంటే చంద్రబాబు అడ్డమైన ఆరోపణలు చేశారు.లోకేష్ అయితే ఏకంగా పందికొవ్వు కలిసిందన్నారు.పవన్ కళ్యాణ్ కూడా అదే దారిలో ఆరోపణలు చేశారు.ఈ కూటమి పాపాన్ని ప్రక్షాళన చేయాలని వైఎస్ఆర్సీపీ భావించింది. వారి పాపాలను క్షమించి వదిలేయమని శనివారం(సెప్టెంబర్28) రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పూజలు చేయాలని పిలుపునిస్తున్నాం.శరీరం, ఆత్మ వేరైనా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఒకటే.అందుకే చంద్రబాబు మాట్లాడిన మలినపు మాటలకు పవన్ కూడా వత్తాసు పలికారు.ఎన్నికలకు ముందు చంద్రబాబు అనేక హామీలు ఇస్తే వాటికి పవన్ కూడా హామీ ఇచ్చారు.బస్సులో ఉచిత ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, అమ్మకు రూ.18 వేలు.. ఇలా అనేక హామీలు ఇచ్చారుఅవేమీ అమలు చేయలేదు కాబట్టి వారంతా లోలోపల మదనపడుతున్నారు.అందుకే పాపపరిహార్ధం ప్రాయశ్చిత్త శిక్ష వేసుకున్నారు.తాను బాప్టిజం తీసుకున్నట్టు పవన్ చెప్పారు.జనం ఏదీ మర్చిపోరు.నెయ్యి వెయ్యి రూపాయలు ఉందని చంద్రబాబు అంటున్నారు.మరి ఆయన హయాంలో ఏనాడైనా వెయ్యి రూపాయలకు కొన్నారా?జగన్ ప్రభుత్వం కంటే తక్కువ ధరకే చంద్రబాబు హయాంలో కొనుగోలు చేశారు.హెరిటేజ్ లో ఆవునెయ్యి నాలుగు వందలకు ఎలా ఇస్తున్నారు’అని పేర్ని నాని ప్రశ్నించారు.చంద్రబాబు నిజంగా శ్రీవారి భక్తుడేనా: కొడాలి నానిస్వామివారి ప్రతిష్టను మంటకలిపేలా చంద్రబాబు ఆరోపణలు చేశారువైఎస్సార్సీపీ హయాంలో 18 సార్లు కల్తీ ట్యాంకర్లను వెనక్కు పంపాంప్రతి ట్యాంకర్ను నిబంధనలకు అనుగుణంగా టెస్టులు చేశాంవందల ఏళ్లుగా ఇలాంటి ఆనవాయితీ కొనసాగుతోందిజులై 17 న ఒక ట్యాంకర్లో నెయ్యి సరిగా లేదని వెనక్కి పంపారుఆ నెయ్యిని లడ్డూలో వాడలేదుకానీ చంద్రబాబు మాత్రం అడ్డమైన ఆరోపణలు చేశారుఅపవిత్రమైన లడ్డూలను భక్తులు తిన్నారని చంద్రబాబు అన్నారుజగన్ని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని ఇలాంటి దుర్మార్గపు ఆరోపణలు చేశారుచంద్రబాబుకు బుద్ది రావాలని వెంకటేశ్వర స్వామి ని కోరుకుంటున్నాంవెంకటేశ్వరస్వామిని కూడా రాజకీయాలకు వాడుకున్న దుర్మార్గుడు చంద్రబాబుఏ ల్యాబ్ కూడా కల్తీలు జరిగినట్టు రిపోర్టు ఇవ్వలేదుకల్తీ జరిగే అవకాశం ఉందని మాత్రమే చెప్పాయిదాన్ని పట్టుకుని చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయం చేశారుచంద్రబాబు అసలు వెంకటేశ్వర స్వామి భక్తుడేనా?నిజమైన భక్తుడే ఐతే ఎన్నిసార్లు తలీలాలు అర్పించారో చెప్పాలిసుప్రీంకోర్టు న్యాయమూర్తికి కూడా జగన్ లేఖ రాశారువిచారణ జరపాలని కోరాంసిట్ అంటే కూర్చునే, స్టాండ్ అంటే నిలపడే అధికారులతో సిట్ వేస్తే ఏం లాభం?టీడీపీ ఆఫీసులో లోకేష్ చెప్పినట్టు రిపోర్ట్ రాసే వారు ఇంకేం విచారణ చేస్తారు?చంద్రబాబు చేసిన పాపానికి ఆయనకే శిక్ష వేయాలిరాష్ట్రం సౌభాగ్యంగా ఉండాలని కోరుతూ శనివారం ప్రత్యేక పూజల కార్యక్రమానికి పిలుపునిస్తున్నాఇదీ చదవండి: తాము తీసుకున్న గోతిలోనే బాబు అండ్ కో -
వైఎస్సార్సీపీ కేడరే కూటమి టార్గెట్
నగరంపాలెం(గుంటూరు): టీడీపీ కార్యాలయంపై దాడి కేసు అంటూ గుంటూరు, కృష్ణా జిల్లాలోని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో అక్రమంగా అరెస్టయి, గుంటూరుజిల్లా కారాగారంలో ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్, విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజ భర్త శ్రీనివాసరెడ్డిని పేర్ని నాని, ఎమ్మెల్సీ బొమ్మి ఇశ్రాయేల్, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్, గుంటూరు ప్రత్తిపాడు ఇన్చార్జి బలసాని కిరణ్కుమార్, నందిగం సురేష్ కుటుంబ సభ్యులు శుక్రవారం ములాఖత్లో విడివిడిగా కలిశారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా ఉన్న నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి జైళ్లకి పంపిస్తున్నారని, టీడీపీ కార్యకర్తలతో దొంగ సాక్ష్యాలు ఇప్పిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ కార్యాలయం బాత్రూంలు, పరిసరాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయని, సీసీటీవీల ఫుటేజీ పోలీసుల వద్ద ఉందని టీడీపీ నాయకులు చెబుతున్నారని, ఆ పుటేజీల్లో ఎక్కడా లేని మాజీ ఎంపీ నందిగం సురే‹Ù, శ్రీనివాసరెడ్డిని ఎలా అరెస్ట్ చేస్తారని నిలదీశారు. ఈ కేసులో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో క్రియాశీలకంగా ఉన్న 171 మందిని తీసుకువచ్చారని, వారెవరూ సీసీ టీవీ ఫుటేజీల్లో లేరని తెలిపారు. తప్పుడు కేసులతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను కుంగదీయాలనే కూటమి పెద్దలు ఇలా చేస్తున్నారని, వారి ఆశలు నెరవేరవని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరినీ జైళ్లలో వేసినా తమ పార్టీకి ఏమీ కాదని, వారంతా తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కోసం రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారని తెలిపారు. ఓవైపు వరదలతో ప్రజలు అనేక కష్టాలు పడుతున్నా, అనేక మంది మృత్యువాత పడుతున్నా కూటమి ప్రభుత్వానికి పట్టడంలేదని అన్నారు. కేవలం వైఎస్సార్సీపీ వారిపై కక్ష సాధించాలన్న తపనే ప్రభుత్వంలో కనపడుతోందన్నారు. ప్రభుత్వ పెద్దల తప్పుడు చర్యలే వరదలకు, భారీ నష్టానికి కారణమన్నారు. వరద బాధితులను కాపాడేందుకు, వారికి ఆహారాన్ని అందించేందుకు పోలీసులను పంపడంలేదని, వైఎస్సార్సీపీ మాజీ మంత్రి జోగి రమే‹Ùను పట్టుకునేందుకు ఓ వంద మంది, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ఆచూకీ కోసం మరో 200 మంది పోలీసులను పంపించడం కూటమి ప్రభుత్వ నీచత్వానికి పరాకాష్ట అని అన్నారు. -
అక్కడ వందలమంది చావుబతుకుల్లో ఉంటే.. ఇక్కడేమో చంద్రబాబు శవ రాజకీయం..
-
నందిగం సురేష్ అరెస్ట్ పై పేర్నినాని రియాక్షన్
-
పోలీసుల సమక్షంలోనే పేర్ని నానిపై దాడి
-
పేర్ని నాని లక్ష్యంగా టీడీపీ, జనసేన శ్రేణుల వీరంగం
సాక్షి, అమరావతి/గుడివాడటౌన్/తాడేపల్లి/నెహ్రూనగర్: కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో ఆదివారం జనసేన, టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) లక్ష్యంగా బీభత్సం సృష్టించారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ప్రతినిధి ఇంటూరి రవికిరణ్ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. రవి కిరణ్కు బెయిల్ ఇచ్చి విడుదల చేయించేందుకు పేర్ని నాని, పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ పోలీస్ స్టేషన్కు వచ్చారు. స్టేషన్లో రవికిరణ్కు బెయిల్ ఇప్పించిన అనంతరం పేర్ని నాని ఆయన అనుచరులతో కలిసి రాజేంద్రనగర్లోని వైఎస్సార్సీపీకి చెందిన తోట శివాజీ ఇంటికి వెళ్లారు. పేర్ని నాని పట్టణానికి వచ్చిన సమాచారం అందుకున్న జనసేన, టీడీపీ నేతలు ఒక్కసారిగా రెచ్చిపోయారు.తోట శివాజీ ఇంటి వద్దకు చేరుకుని పేర్ని నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆదివారం కావడం, ఇతర కార్యక్రమాలు లేకపోవడంతో కార్యకర్తలు భారీగా గుమికూడారు. ఇంటిబైట ఉన్న నాని కారును ధ్వంసం చేశారు. రాళ్లతో కారు అద్దాలు పగలగొట్టారు. కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పేర్ని నాని.. జనసేన నాయకులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారించినప్పటికీ ఫలితం లేకపోయింది. సుమారు రెండు గంటలు పైబడి పేర్ని నానికి, వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.పోలీసుల సమక్షంలోనే ఈ దౌర్జన్యం, దాడులు కొనసాగాయి. దాడుల విషయం తెలుసుకుని టిడ్కో గృహాల వద్ద మరో కారుతో పేర్ని నాని డ్రైవర్ సిద్ధంగా ఉండగా.. అక్కడకూ వెళ్లి ఆ కారుపైనా దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే ఈ దాడులు జరుగుతున్నా వారు చేష్టలుడిగి చూస్తుండిపోయారు. అనంతరం పోలీసులు జనసేన శ్రేణులను అక్కడ నుంచి పంపించి.. పేర్ని నానిని పట్టణం దాటించారు. కాగా, పేర్ని నానిపై టీడీపీ, జనసేన నేతల దాడిపై మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆటవిక పాలనకు ఇలాంటి ఘటనలే తార్కాణమన్నారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్ అరెస్టును ఆ పార్టీ లోక్సభ పక్ష నాయకుడు పెద్దిరెడ్డి మిథున్రెడ్డి ఖండించారు. -
కక్షసాధింపు ఆపకపోతే తిరగబడతారు: అంబటి రాంబాబు
సాక్షి,గుంటూరు: మాజీ మంత్రి పేర్నినాని, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ గుడివాడలో నాని బంధువును పలకరించడానికి వెళితే రాళ్లు రువ్వారని వైఎస్సార్సీపీ నేత అంబటిరాంబాబు అన్నారు. ఈ ఘటనపై తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం(సెప్టెంబర్1) అంబటి మీడియాతో మాట్లాడారు.పేర్నినానిపై జరిగిన దాడిపై ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. జిల్లా ఎస్పీకి తమ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స ఫోన్ చేసినా ఎస్పీ ఫోన్ తీయలేదన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని మండిపడ్డారు. అంబటి ప్రెస్మీట్ ముఖ్యాంశాలు..మాజీ మంత్రిని తిరగటానికి వీళ్ళేదని అనటం సమంజసమాచట్టబద్దంగా వ్యవరిస్తామని చంద్రబాబు పదేపదే చెబుతున్నారుఇంటూరు రవి కిరణ్ ఎన్నికల ముందు సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారని పోలీసులు అదుపులోకి తీసుకున్నారుఅతన్ని న్యాయవాదుల సాయంతో పేర్ని నాని పీఎస్ నుంచి బయటకు తీసుకొచ్చారుఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాక మరేంటిపోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయి రాష్ట్రంలో అరాచకత్వం ప్రబలుతోందిపోలీసులు రక్షణ కల్పించకపోవడం ధర్మమేనావరద బాధితులకు సాయం చేయాల్సిన సమయంలో ఇటువంటి దాడులు చేస్తారాహోంమంత్రి సమాధానం చెప్పాలిఇది సరైన విధానం కాదుతప్పుడు కేసులు పెడుతూనే దౌర్జన్యాలకు పాల్పడుతున్నారుకక్ష సాధింపు చర్యలు మానుకో కుంటే మావాళ్ళు తిరగబడతారుపోలీసులపై కూడా కేసులు పెడతామంటున్నారుముంబై నటి కేసులో ముగ్గురు ఐపిఎస్ లపై కేసు పెడతామంటున్నారుప్రభుత్వాలు మారతాయి. కొత్త సాంప్రదాయాలకు అధికారులు తెర తీయవద్దుపోలీసుల్లో ఒక వర్గాన్ని గుర్తించి వారిని అణిచి వేయాలని సూచిస్తున్నారురెడ్ బుక్ లో రాసిన వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పపడుతున్నారుగడ్లవల్లేరు కాలేజ్ చిన్న సంఘటన అంటూ లోకేష్ మాట్లాడుతున్నారుమీ ప్రభుత్వంలో జరిగితే చిన్న విషయమాచర్యలు తీసుకోవాల్సిన బాధ్యత లేదాప్రకాశం బ్యారేజి నుండి ఎనిమిది లక్షల క్యూసెక్కుల నీరు విడుదల అవుతుందిదీంతో చంద్రబాబు ఇల్లు మునుగుతుందిసీఎం మచిలీపట్నం అతిధి గృహంలో ఉంటారంటున్నారుఅక్రమ కట్టడంలో చంద్రబాబు ఉంటున్నారని మీము మొదట నుండి చెబుతున్నాంనది గర్భంలో ఉన్న ఇంటిలో ఉంటే వరద వచ్చినప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాల్సి ఉంటుందిసాక్షాత్తు సీఎం సురక్షిత ప్రాంతానికి తరలి పోతున్నారులోకేష్ పరిధిలోని విద్యాశాఖలోని ట్రిబుల్ ఐటీ కాలేజ్, గుడ్లవల్లేరు కాలేజీ ఘటనలపై లోకేష్ విఫలమయ్యారు. -
రాష్ట్రంలో ఆటవిక పాలనకు ఇదే నిదర్శనం : బొత్స
సాక్షి,అమరావతి : గుడివాడలో పేర్నినాని కారుపై దాడి ఘటనను వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఖండించారు. ఈ మేరకు బొత్స పోలీసు అధికారులు ఫోన్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు సన్నగిల్లుతున్నాయని అన్నారు. పార్టీ నాయకులకు ఏమైనా జరిగితే పోలీసులు బాధ్యత వహించాల్సి ఉంటుందని బొత్స సత్యనారాయణ ఎస్పీకి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆటవిక పాలనకు ఇలాంటి ఘటనలే నిదర్శనమన్నారు బొత్స.కొనసాగుతున్న రెడ్ బుక్ రాజ్యంగంరాష్ట్రంలో ఆటవిక పాలన, రెడ్బుక్ రాజ్యాంగం కొనసాగుతుంది. గుడివాడలో పేర్ని నాని లక్ష్యంగా రెండు సార్లు దాడులు జరిగాయి. సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్కు అండగా న్యాయ సహాయం కోసం గుడివాడ వెళ్లారు పేర్నినాని,కైలే అనిల్. ఇంటూరిని విడిపించిన తర్వాత స్నేహితుడి ఆహ్వానం మేరకు టీ తాగేందుకు వారి ఇంటికి వెళ్లారు పేర్ని నాని. దీంతో రెచ్చి పోయిన జనసేన, టీడీపీ కార్యకర్తలు పేర్నినాని కారుపై రాళ్ల దాడి చేశారు. అద్దాలు పగుల గొట్టారు.పోలీసుల సమక్షంలోఇక ఈ ఏపిసోడ్ మొత్తం పోలీసుల సమక్షంలో జరగడం గమనార్హం. పోలీసుల సమక్షంలో దాడులకు తెగబడ్డారు టీడీపీ, జనసేన కార్యకర్తలు. అటు దాడులు గురించి సమాచారం తెలుసుకుని టిడ్కో గృహాల వద్ద మరో కారును ఉంచారు పేర్ని నాని కారు డ్రైవర్. అయితే, అక్కడకు వెళ్లిమరీ కారుపై దాడి చేశారు. -
గుడివాడలో పేర్నినాని కారుపై రాళ్ల దాడి
సాక్షి,అమరావతి : గుడివాడలో మాజీ మంత్రి పేర్ని నాని కారుపై రాళ్ల దాడి కలకలం రేపుతుంది. వైఎస్సార్సీపీ నేత వైసీపీ నేత తోట శివాజీ మాజీ మంత్రి పేర్ని నాని,మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ వెళ్లారు. ఆ ఇద్దరు నేతలు శివాజీ ఇంట్లో ఉన్న సమయంలో.. ఇంటి బయటే టీడీపీ, జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. పరుష పదజాలంతో దూషిస్తూ.. తాము దాడి చేసేందుకు వచ్చామంటూ హెచ్చరికలు జారీ చేశారు.టీడీపీ, జనసేన నేతల దాడిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అయినప్పటికీ వారిని నిలురించే ప్రయత్నం చేయలేదు. సుమారు రెండు గంటలకు పైగా పేర్నినాని శివాజీ ఇంట్లోనే ఉన్నారు.ఏపీలో ఆటవిక పాలన, రెడ్బుక్ రాజ్యాంగంఏపీలో ఆటవిక పాలన, రెడ్బుక్జ్యాంగం కొనసాగుతోంది. గుడివాడలో మాజీ మంత్రి పేర్ని నాని లక్ష్యంగా రెండు సార్లు దాడులకు పాల్పడ్డారు టీడీపీ, జనసేన నేతలు. కారుపై దాడిచేసి అద్ధాలు పగలగొట్టారు టీడీపీ, జనసేన నాయకులు. పోలీసుల సమక్షంలో దాడులకు పాల్పడ్డారు.సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్కు అండగా ఉండేందుకు న్యాయ సహాయం కోసం పేర్ని నాని, కైలే అనిల్లు గుడివాడ వెళ్లారు. ఈ క్రమంలోనే పేర్ని నాని కారుపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు కూటమి నేతలు. టిడ్కో గృహాల వద్ద మరో కారును పేర్ని నాని డ్రైవర్ ఉంచగా. అక్కడకు వెళ్లిమరీ కారుపై దాడికి పాల్పడ్డారు. -
బాబూ ఎందుకీ ‘కొనుగోలు’ డ్రామాలు..
-
బాబుకు పేర్నినాని కౌంటర్
-
మా జగన్ ఎన్టీఆర్ లా అమాయకుడు కాదు నీ ఆటలు సాగవ్
-
చంద్రబాబూ ఎందుకీ ‘కొనుగోలు’ డ్రామాలు: పేర్ని నాని
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో చంద్రబాబు అతిపెద్ద రాజకీయ ఆషాడభూతి.. నమ్మిన వారిని మోసం చేయడం ఆయనకు అలవాటు.. అది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అంటూ మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఏనాడూ తన సొంత బలంతో గెలవలేదని గుర్తు చేశారు. ఇంకా ప్రలోభాలు, కొనుగోళ్లు చంద్రబాబుకు అలవాటు అని, ఇప్పుడు కూడా యథేచ్ఛగా తమ పార్టీ ఎంపీలను కొనుగోలు చేశారని, అది చూస్తుంటే ఆయనపై జాలి కలుగుతోందన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా తమ పార్టీ చెక్కుచెదరదని, తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ని ఏమీ చేయలేరని పేర్ని నాని స్పష్టం చేశారు.ఆ భయం చంద్రబాబును వెంటాడుతోంది..వైఎస్ జగన్ తనకు రాజకీయంగా అడ్డు పడతారన్న భయం చంద్రబాబును వెంటాడుతోందని, అందుకే 2011 నుంచి ఆయనను రాజకీయాల నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని పేర్ని నాని తెలిపారు. ఆ ప్రక్రియలోనే జగన్గారిని అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టారని, అయినా ఆయన ధైర్యం కోల్పోకుండా ప్రజల్లో నిల్చి, తొలుత 67 సీట్లు గెల్చి సత్తా చూపారని గుర్తు చేశారు. అప్పుడు కూడా తమ పార్టీని, జగన్ని నిర్వీర్యం చేసేందుకు సంతలో పశువుల్లా 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను కొనుగోలు చేశారని చెప్పారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా..టీడీపీలోకి ఎవరైనా రావాలంటే రాజీనామా చేశాకే ఆ పని చేయాలని చెబుతున్న చంద్రబాబు, అప్పుడు ఆ 23 మందితో ఎందుకు రాజీనామా చేయించలేదని పేర్ని నాని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా విజయవాడ, విశాఖ కార్పొరేషన్ల నుంచి టీడీపీ కండువాలు కప్పుకున్న మేయర్లు, కార్పొరేటర్లతో ఎందుకు రాజీనామా చేయించలేదని నిలదీశారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా రాజకీయంగా జగన్ని ఒక్క అంగుళం కూడా తగ్గించలేరని తేల్చి చెప్పారు.జగన్ గెలవాలంటే జనం సాయం చాలు‘చంద్రబాబు గెలవాలంటే ఇతర పార్టీల సాయం అవసరం. అదే జగన్ గెలవాలంటే జనం సాయం చాలు’.. అని మాజీ మంత్రి స్పష్టం చేశారు. స్వార్థంతో రాజకీయాలు చేసే జంప్ జిలానీ బ్యాచ్లు జగన్ని అవసరం లేదని తేల్చి చెప్పారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, 2029 ఎన్నికల్లో ప్రజలు వారికి కచ్చితంగా తగిన బుద్ధి చెబుతారని అన్నారు. వెనకబడిన వర్గాలకు రాజకీయాల్లో ప్రాధాన్యం ఇచ్చిన జగన్, వారికి పదవులు కట్టబెట్టారని పేర్ని నాని గుర్తు చేశారు. ఇప్పుడు రాజ్యసభలో ఖాళీ అయిన రెండు పదవుల్లో చంద్రబాబు అదే సామాజిక వర్గాల వారిని నియమించాలని సవాల్ చేశారు.ప్రజల దృష్టి మళ్లించేందుకే డైవర్షన్ పాలిటిక్స్కేవలం జగన్ వల్లనే ఒక మత్స్యకారుడు పెద్లలసభలో అడుగుపెట్టగలిగాడని పేర్ని నాని గుర్తు చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలమైన చంద్రబాబు, వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు (డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ) ఇలా ప్రలోభాలతో ఎంపీలను కొనుగోలు చేస్తున్నారని అన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా, శాంతి భద్రతల గురించి అస్సలు ఆలోచించకుండా, బాధ్యతను పూర్తిగా మర్చిన హోం మంత్రి, ఇష్టానుసారం మాట్లాడుతున్నారని పేర్ని నాని ఆక్షేపించారు.మీడియా ప్రశ్నలకు సమాధానంగా..ఆనాడు తమ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి ఉంటే, టీడీపీలో ఒక్కరు కూడా మిగిలే వారు కారన్న పేర్ని నాని.. ఇప్పుడు లావాదేవీలే తప్ప రాజకీయాలు లేవని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చినా, నిత్యం మాపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ కూటమి, ఎల్లో మీడియా.. తాజాగా ఒక సినీ నటి కేసు టేకప్ చేశారని చెప్పారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో అభియోగాలు ఎదుర్కొంటూ, కేసులు నమోదైన ఆమెను తెరపైకి తీసుకొచ్చి, ఇక్కడ అనేక మంది ఐపీఎస్ అధికారులను వేధించడమే లక్ష్యంగా ఎల్లో మీడియా డ్రామా చేస్తోందని వెల్లడించారు. 2014లో మా పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత, ఏనాడూ మా పార్టీ గుమ్మం తొక్కని కుక్కల విద్యాసాగర్ను, ఇప్పుడు మా పార్టీకి అంటగడుతున్నారని, ఇదంతా టార్గెటెడ్ ఐపీఎస్ అధికారులను వేధించడమే లక్ష్యంగా జరుగుతున్న కుట్ర అని పేర్ని నాని తెలిపారు. ఆ నటి వ్యవహారాలన్నీ త్వరలోనే బయటకు వస్తాయని చెప్పారు. -
చంద్రబాబుకు పాలించే సత్తా లేకే జగన్ పై ఏడుపు
-
జగన్ మీద పడి ఏడవటం కాదు..
-
బాబూ.. దమ్ముంటే ఆ లెక్కలు బయటపెట్టు: పేర్ని నాని
సాక్షి, గుంటూరు: వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా చేసిన మంచిని కూటమి ప్రభుత్వం చూడలేక పోతోందని.. ప్రజల బాగోగులు వదిలేసి ఆయనపై అభాండాలు వేస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘రూ.3.63 కోట్లతో ఎగ్పఫ్లు తిన్నారని తప్పుడు పోస్టులు పెట్టారు. బాబుకు చిత్తశుద్ధి ఉంటే ఆ లెక్కలన్నీ బయటపెట్టాలి’’ అని పేర్ని నాని సవాల్ విసిరారు.‘‘బొద్ధింకలు, ఎలుకలను పట్టుకునేందుకు బాబే కోట్లు చెల్లించారు. పాలించే సత్తాలేక జగన్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దుష్ప్రచారంపై కాదు.. హామీల అమలుపై దృష్టిపెట్టండి’’ అని పేర్ని నాని హితవు పలికారు.‘‘జీఏడీ చంద్రబాబు చేతిలో ఉంది. జగన్ ప్రభుత్వంలో అలాంటి తప్పుడు పనులు చేయలేరు. చంద్రబాబు హయాంలో బల్లులు, బొద్దింకలు, ఎలుకలను పట్టుకునేందుకు కోట్లు చెల్లించారు. ఆ ఘనత చంద్రబాబు ప్రభుత్వానిది. టమోటా రైతులను దత్తత తీసుకుంటానని లోకేష్ పాదయాత్రలో చెప్పారు. ఇప్పుడు ఆ రైతులు అలోలక్ష్మణా అని బాధ పడుతుంటే.. మరి లోకేష్ ఏం చేస్తున్నారు?’’ అంటూ పేర్ని నాని నిలదీశారు.‘‘మెడికల్ కాలేజీల్లో సీట్లు అమ్ముకుంటున్నారంటూ అప్పట్లో గొడవ చేశారు. మరి దళితులు, పేదలు చదవకూడదా?. అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగ, అధికారంలోకి వచ్చాక ఇంకోలా మాట్లాడటం ఎందుకు?. ప్రభుత్వం వచ్చి వంద రోజులు అవుతున్నా టమోటా రైతులను ఎందుకి దత్తత తీసుకోలేదు?. వైఎస్సార్సీపీ వారిపై దాడి చేయటం కాదు.. జనానికి ఉపయోగపడే పనులు చేయాలి. చంద్రబాబుకు దమ్ముంటే పఫ్ల లెక్కలు బయటపెట్టాలి.. పరిపాలన చేయటం చేతకాక జగన్పై పడి ఏడవటం మానుకోవాలి. జీఏడీ శాఖ మంత్రిగా కూడా ఉన్న చంద్రబాబు పఫ్ల ఖర్చు ఫైల్ బయట పెట్టగలరా?’’ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు.ఎంగిలి బిస్కెట్లకి ఆశపడి @ysjagan గారిపై ఉద్దేశపూర్వకంగా బురద చల్లుతున్న పచ్చమందసిగ్గులేకుండా తప్పుడు వార్తలు రాస్తున్నారే.. ఇది జర్నలిజమా.. బ్రోకరిజమా? దమ్ము, ధైర్యముంటే సాక్ష్యాలతో నిరూపించండి. లేదా తప్పుడు సమాచారం ఇచ్చినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. pic.twitter.com/RYSchbcDBn— YSR Congress Party (@YSRCParty) August 21, 2024 -
నువ్వు ఏమన్నా చేసుకో మేం భయపడం