Petroleum Prices
-
ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు టీడీపీకి లేదు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు టీడీపీకి లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు నిర్వాకంతోనే పెట్రోల్ ధరలు పెరిగాయని చెప్పారు. 2015లోనే చంద్రబాబు పెట్రోల్, డీజిల్పై రూ.4 అదనంగా పెంచారని వివరించారు. పెట్రోల్, డీజిల్ ధరలపై టీడీపీ విమర్శలు హాస్యాస్పదమని తెలిపారు. చంద్రబాబు హయాంలో ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచారని గుర్తుచేశారు. ఆయన హయాంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులు లేవు అని పేర్కొన్నారు. తాడేపల్లిలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సజ్జల మాట్లాడుతూ.. ‘బాబు హయాంలో ధరలు పెరిగినప్పుడు ఎల్లో మీడియా ఏం చేసింది? బాబు హయాంలో రోడ్ల మరమ్మతులను పట్టించుకోలేదు. బాబు అడ్డంగా దోచుకోవడం వల్లే ఈ పరిస్థితి. రెవెన్యూ తగ్గినా సీఎం జగన్ ప్రజలపై భారం మోపలేదు’ అని స్పష్టం చేశారు. ప్రజా ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదు ఈ సమయంలో అమర్రాజా కంపెనీ వ్యవహారంపై స్పందించారు. ‘అమర్రాజ్ కంపెనీ విషపూరితమైన కాలుష్యం వెదజల్లుతోంది. ప్రజల ఆరోగ్యం కంటే ప్రభుత్వానికి ఏదీ ముఖ్యం కాదు. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని కోర్టు హెచ్చరించింది. అమర్రాజా వ్యవహారంపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోంది. ప్రజలకు హాని కలిగించని పరిశ్రమలు ఉండాలన్నదే సీఎం ఉద్దేశం. ప్రజలకు ఇబ్బంది కలిగించే అన్ని పరిశ్రమలపై చర్యలు ఉంటాయి’. రాష్ట్రంలో తీవ్ర ఆర్ధిక సంక్షోభం ఉందని సజ్జల తెలిపారు. చంద్రబాబు అప్పులు, కరోనా వల్ల ఆర్ధిక సంక్షోభం ఏర్పడిందని వివరించారు. పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వొద్దని చెప్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి రూపాయి దుబారా అవుతుందా? అని ప్రశ్నించారు. కేంద్రం అప్పులు చేస్తుంది రాష్ట్ర బీజేపీ నేతలకు తెలియదా? అని మండిపడ్డారు. -
ఇంధన ధరలు - యూపీఏ విఫలం..!! : మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఇంధన ధరల్లో ఈ భారీ పెరుగుదల కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం విఫలమైందనడానికి సంకేతం. దీని ఫలితంగా గుజరాత్ రాష్ట్రంపై వందల కోట్ల అదనపు భారం పడుతుంది’ ఇది నేటి ప్రధాని నరేంద్ర మోదీ నాడు గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి మాట. ‘పెట్రోలు, డీజిల్ ధరల్లో పెరుగుదలతో సామాన్యుడి బతుకు మరింత దుర్భరం. ప్రజా జీవితాల పట్ల స్పందించే గుణం లేని యూపీఏ సర్కార్తో వాహన దారుల కష్టాలు రెట్టింపయ్యాయి’ ఇది నేటి విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఆవేదన. ‘పెట్రోలు ధర పెరిగిందని చింతించొద్దు. మీకు పశువుల పేడ ఫోటో పంపుతున్నా. దాంతో గోబర్ గ్యాస్ తయారు చేసుకోండి’ ఇది బాలీవుడ్ కండల వీరుడు నాడు కేంద్రంపై విసిరిన ట్వీట్. ఇలా యూపీఏ సర్కార్ పాలనలో పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలపై నేటి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నుంచి బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ వరకు సగటు ఇంధన వినియోగ దారుడిపై చూపించిన జాలి. మరి గతంలో చేసిన ఈ ట్వీట్లపై వారు ఇప్పుడెలా స్పందిస్తారో చూడాలి..!! రికార్డులకెక్కిన ఇంధన ధరలు.. కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందేమోనని భావించిన కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరల జోలికి వెళ్లలేదు. ఆ ఎన్నికల అనంతరం పెట్రోలు, డీజిల్ ధరలకు రెక్కలొచ్చాయి. రికార్డు స్థాయిలో ధరలు పెరిగి వాహన దారుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. గడిచిన తొమ్మిది రోజుల్లో పెట్రోలు ధర రూ.2.24 పైసలు, డీజిల్ ధర రూ.2.15 పైసలు పెరిగి రికార్డు సృష్టించాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలు 76.87 రూపాయలకు, లీటరు డీజిల్ 2.24 రూపాయలకు లభ్యమవుతోంది. సామాన్యుడి నడ్డి విరిచేలా పెరిగిన ఈ ధరల నుంచి ఉపశమనానికి ఆయా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని ఒక పెట్రోలియం శాఖ ఉన్నతాధికారి అన్నారు. 20 నుంచి 35 శాతం అమ్మకం పన్ను విధిస్తున్న రాష్ట్రాలు ఆ విషయంగా ఆలోచించాలని ఆయన వెల్లడించారు. భారీగా పెరుగుతున్న ఇంధన ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు తీసుకోనుందని ఆయన తెలిపారు. రూపాయి విలువ 16 నెలల కనిష్టానికి పడిపోవడం కూడా పెట్రోలు, డీజిల్ ధరల్లో అసాధారణ పెరుగుదలకు కారణమని ఆయన అన్నారు. Massive hike in #petrol prices is a prime example of the failure of Congress-led UPA. This will put a burden of hundreds of crores on Guj. — Narendra Modi (@narendramodi) May 23, 2012 Petrol price hiked again - another blow to the common man from an insensitive Government. — Sushma Swaraj (@SushmaSwaraj) November 3, 2011 Don't worry abt petrol , sending u a pic of gobar all u hv to do vit it is make gas. N v hv gobargas http://twitpic.com/1no7hh — Salman Khan (@BeingSalmanKhan) May 14, 2010 -
పెట్రో ధరలను తగ్గించాలి
కాంగ్రెస్, సీపీఐ సహా విపక్షాల డిమాండ్ న్యూఢిల్లీ: పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలను తక్షణమే ఉపసంహరించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సామాన్యుడి కష్టాల నుంచి లాభాలు గడించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తింది. శుక్రవారం రాత్రి నుంచి పెట్రోల్పై లీటరుకు రూ. 3.31, డీజిల్ ధరను లీటరుకు రూ. 2.71 చొప్పున పెంచిన విషయం తెలిసిందే. కేవలం 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు భారీగా పెట్రో ధరలను పెంచటం సామాన్యులను, రైతులను దారుణంగా దెబ్బతీస్తోందని కాంగ్రెస్ పార్టీ సమాచార విభాగం ఇన్చార్జ్ రణ్దీప్ సుర్జేవాలా తప్పుపట్టారు. పెట్రోలుపై లీటరుకు అదనంగా రూ. 19.49 చొప్పున, డీజిల్పై లీటరుకు అదనంగా రూ. 15.11 చొప్పున వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ఏడాది నవంబర్లో పెంచిన ఎక్సైజ్ సుంకాన్ని, కస్టమ్స్ సుంకాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేసింది. డాలర్తో పోలిస్తే రూపాయి ధర పతనమవటం వల్ల పెట్రో ధరలు పెంచాల్సి వచ్చిందన్న ప్రభుత్వ వాదనలో నిజంలేదన్నారు. తాజా పెట్రో ధరల పెంపు ప్రజా వ్యతిరేకమని.. ఈ పెంపును తక్షణమే ఉపసంహరించాలని సీపీఐ డిమాండ్ చేసింది.