PG semester examination
-
ఆర్యూలో మాస్ కాపీయింగ్!
కర్నూలు(ఆర్యూ): రాయలసీమ యూనివర్సిటీలో పీజీ సెమిస్టర్ పరీక్షల్లో పెద్ద ఎత్తున మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతనెల 21 నుంచి వర్సిటీ ప్రాంగణంలో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మాస్ కాపీయింగ్ విషయంలో అధ్యాపకులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడంతో విద్యార్థులు మరింత రెచ్చిపోతున్నట్లు సమాచారం. కొందరు విద్యార్థులు ఏకంగా సెల్ఫోన్లు వెంట తెచ్చుకుని కాపీయింగ్కు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఈనేపథ్యంలో మంగళవారం నుంచి పరీక్షల పరిశీలకులను నియమించారు. అయినా కాపీయింగ్ జోరుకు అడ్డుకట్ట పడలేదని సమాచారం. కొందరు విద్యార్థులు కాపీయింగ్ చేస్తూ పట్టుబడినా అధికారులు చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా శుక్రవారం జరిగిన ఇంగ్లిష్ విభాగం పరీక్షల్లో ఓ విద్యార్థి తనకు కేటాయించిన స్థానంలో కాకుండా మరొకరి స్థానంలో కూర్చొని పరీక్ష రాసినట్లు సమాచారం. ఈ విషయంలో విద్యార్థికి ఇన్విజిలేటర్కు మధ్య గొడవ జరగ్గా చివరకు అధికారులు ఇన్విజిలేటర్నే మార్చినట్లు తెలిసింది. పరీక్షలను వర్సిటీ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు పర్యవేక్షించారు. మాస్కాపీయింగ్పై వివరణ కోరగా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. -
సెమిస్టర్ పరీక్షలకు 77 మంది గైర్హాజరు
తెయూ(డిచ్పల్లి), న్యూస్లైన్ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న పీజీ సెమిస్టర్ పరీక్షలకు బుధవారం రెండో రోజు 77 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ నసీం తెలి పారు. తెయూ ప్రధాన క్యాంపస్తో పాటు భిక్కనూర్ సౌత్ క్యాం పస్, నిజామాబాద్, ఆర్మూర్, కామారెడ్డి, బోధన్, బాన్సువాడ కేంద్రాల్లో జరుగుతున్న సెమిస్టర్ పరీక్షల్లో మొత్తం 1,449 మందికి గాను 1,372 మంది విద్యార్థు లు పరీక్షలకు హాజరైనట్లు ఆమె తెలిపారు. ప్రధాన క్యాంపస్లో పరీక్షా కేంద్రాన్ని బుధవారం ప్రిన్సిపల్ కనకయ్య, వైస్ ప్రిన్సిపల్ మమత సందర్శించారు.