వడదెబ్బతో సింగరేణి కార్మికుడు మృతి
కరీంనగర్: గోదావరిఖనిలోని విజయానగర్లో పిక్కల ఓదేలు(59) అనే సింగరేణి కార్మికుడు ఆదివారం వడదెబ్బతో మరణించాడు. వడదెబ్బ తగలడంతో శనివారం సింగరేణి ఏరియా ఆసుపత్రికి కుటుంబసభ్యులు తరలించారు. చికిత్సపొందుతూ ఆదివారం మృతిచెందాడు. ఓదేలు సింగరేణిలోని ఆర్జీ-1 జీఎం ఆఫీసులో అటెండర్గా పనిచేస్తుండే వాడు.
(గోదావరిఖని)