Potti Rambabu
-
కల నెరవేరకుండానే..
హాస్యనటుడు పొట్టి రాంబాబు మృతి వందకు పైగా సినిమాల్లో వివిధ పాత్రలు హీరోగా సినిమా పూర్తికాకుండానే కన్నుమూత జగ్గంపేట : చిన్ననాటి నుంచి ఆయనకు నాటకాలంటే మక్కువ. ఊళ్లో ఏ ఉత్సవం జరిగినా అక్కడ వేదికపై ఆయన ప్రదర్శన ఉండేది. తనదైన శైలిలో అందర్నీ మెప్పించి ‘మనోడు నటనలో గట్టివాడు’ అనిపించుకునేవారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఓ నాటక ప్రదర్శన ఆయన సినీ రంగంలోకి సోపానం అరుుంది. ప్రముఖ నటుడు విజయ్చందర్.... రాంబాబు ప్రతిభను గుర్తించి సినీ అవకాశాన్ని కల్పించారు. వందకు పైగా సినిమాల్లో వివిధ పాత్రల్లో నవ్వుల పువ్వులు పూయించి, ఎంతో గుర్తింపు తెచ్చుకున్న పొట్టి రాంబాబు అందరికీ విషాదం మిగిల్చి వెళ్లిపోయూడు! హైదరాబాద్ శ్రీనగర్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం తెల్లవారుజామున మరణించారు. ఆయన స్వగ్రామం కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పొట్టి రాంబాబు అసలు పేరు కనపర్తి రాంబాబు (43). ‘ఈశ్వర్’తో పరిశ్రమకు పరిచయమై వందకుపైగా సినిమాల్లో నటించారు. రాంబాబుకు భార్య మంగ, మూడేళ్ల కుమారుడు వేణు, ఏడాది వయసు గల కుమార్తె ఉన్నారు. హైదరాబాద్లో మకాం ఉంటున్నా ఎక్కువగా జగ్గంపేటలోనే ఉండేవారు. సినిమా షూటింగ్ల కోసం జిల్లాకు వచ్చిన సందర్భంలో ఎక్కువగా తోటి నటులను జగ్గంపేట తీసుకువచ్చి స్థానికులు, స్నేహితులకు పరిచయం చేసేవారు. వారం రోజుల క్రితం రాజమండ్రిలో జరిగిన ఓ సినిమా షూటింగ్లో నటించారు. ‘తూర్పు’ యాసతో హాస్యం పండించాడు.. ఈశ్వర్ సినిమాలో హీరో మిత్ర బృందంలో పనసకాయ పట్టుకుని తిరిగే క్యారెక్టర్లో తూర్పు గోదావరి యాసతో రాంబాబు హాస్యాన్ని పండించారు. ఆ తర్వాత చంటిగాడు చిత్రంలో కోటప్పకొండ పాత్రలో కడుపుబ్బ నవ్వించారు. జగ్గంపేట గ్రామ దేవత రావులమ్మ తల్లి అంటే రాంబాబుకు ఎంతో భక్తి. స్వగ్రామానికి వచ్చిన ప్రతిసారీ అమ్మవారి దర్శనం చేసుకునేవారు. తమిళంలో కూడా రెండు చిత్రాల్లో నటించారు. రాంబాబు హీరోగా ‘పులిరాజా ఐపీఎస్’ చిత్రాన్ని ఈ ఏడాది ప్రారంభించారు. చిత్రం షూటింగ్ దశలో ఉండగా తండ్రి పాత్రలో నటిస్తున్న ఎంఎస్ నారాయణ మృతి చెందడంతో కొన్నాళ్లు షూటింగ్ వాయిదాపడింది. స్వగ్రామంలో విషాదఛాయలు రాంబాబు మృతితో బూరుగుపూడిలో విషాదఛాయలు నెలకొన్నాయి. అతడి తల్లి, భార్యను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. రాంబాబుతో అనుబంధాన్ని స్థానికులు గుర్తుచేసుకుని కన్నీటిపర్యంతమయ్యారు. రాంబాబు మృతదేహానికి బుధవారం బూరుగుపూడిలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. -
పొట్టి రాంబాబు మృతిపై ప్రముఖుల స్పందన
-
హాస్యనటుడు పొట్టి రాంబాబు మృతి
-
హాస్యనటుడు పొట్టి రాంబాబు మృతి
టాలీవుడ్కు 2015 అచ్చిరానట్లుంది. ఎంతో మంది సినీ ప్రముఖులు ఈ ఏడాదిలో దివం గతులయ్యారు. తాజాగా మరో హాస్య నటుడు పొట్టి రాంబాబు (35) అనారోగ్యంతో మంగళ వారం మృతి చెందారు. రాజమండ్రి సమీపంలోని బూరుగుపూడి గ్రామానికి చెందిన రాంబాబు తెలుగుతెరపైకి వచ్చింది హీరో ప్రభాస్ తొలి చిత్రం ‘ఈశ్వర్’తో. ‘చంటిగాడు’, ‘దొంగ -దొంగది’, ‘కథానాయకుడు’, ‘దొంగల బండి’, ‘ అస్త్రం’, ‘గోపి-గోపిక-గోదావరి’ తదితర 40కి పైగా చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న ‘పులిరాజా ఐపీఎస్’ నిర్మాణంలో ఉంది. మెదడులో రక్తం గడ్డ కట్టడంతో మూడు రోజుల క్రితం ఆయనను ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి, చికిత్స అందిస్తున్నారు. చివరకు ఆస్పత్రిలోనే ఆయన తుది శ్వాస విడిచారు. రాంబాబుకు భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. రాంబాబు మృతి పట్ల సినీ, టీవీ కళాకారులు సంతాపం తెలిపారు. ఆస్పత్రి బిల్లు చెల్లించడానికి కానీ, చివరకు అంబులెన్స్కు చెల్లించడానికి కానీ డబ్బులు లేని పరిస్థితుల్లో రాంబాబు కన్నుమూయడం విషాదం. ఈ పరిస్థితుల్లో ‘మా’ అధ్య క్షుడు రాజేంద్రప్రసాద్, లక్ష్మీ మంచు, శివాజీ రాజా, కాదంబరి కిరణ్, అభినయ కృష్ణ, ప్రభా కర్, విజయ్రెడ్డి, శ్రీరామ్, వినోద్బాల, నిరు పమ్, భావన, నిర్మాత బిఏ రాజు, దర్శకుడు రాఘవ స్పందించి ఆర్థికసాయం చేశారు. -
‘పొట్టి రాంబాబు’ హీరోగా ‘పులిరాజా ఐపీఎస్’
జగ్గంపేట : సాధారణంగా పోలీసయ్యేందుకు పొడవు ఒక ప్రధాన కొలమానమని, అయితే మూడు నాలుగడుగుల పొడవే ఉన్నా పోలీస్ అవ్వాలన్నది లక్ష్యంగా పెట్టుకుని వ్యక్తి కథతో తీస్తున్న చిత్రమే ‘పులిరాజా ఐపీఎస్’ అని హాస్యనటుడు పొట్టి రాంబాబు, ఆ చిత్రం డెరైక్టర్ రాఘవ తిరువానిపాటి తెలిపారు. ఆదివారం జగ్గంపేట వచ్చిన వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పొట్టి రాంబాబు హీరోగా నటిస్తున్న ‘పులిరాజా ఐపీఎస్’ గురించి వివరించారు. తూర్పుగోదావరి జిల్లాలోనే ఈ చిత్రాన్ని ఎక్కువ శాతం నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ నెల 29 నుంచి రెగ్యులర్గా షూటింగ్ జరుపుతామని డెరైక్టర్ రాఘవ తెలిపారు. హీరో పొట్టి రాంబాబుకు తండ్రిగా ఎంఎస్ నారాయణ నటిస్తున్నారని, ఆయన ఈ చిత్రంలో కానిస్టేబుల్ పాత్రను పోషిస్తున్నారని చెప్పారు. ఆయన కుమారుడైన రాంబాబును పోలీసు చేయాలని కలలు కంటారని, అయితే తక్కువ పొడవున్న రాంబాబు ఏ విధంగా ఐపీఎస్ అవుతాడనేదే కథలో ప్రధానమని వివరించారు. హీరోగా తనకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని, చిత్రం విజయానికి శ్రమించి పనిచేస్తున్నానని రాంబాబు తెలిపారు. వీరితో పాటు హాస్యనటుడు బబ్లూ ఉన్నారు.