Prahlad
-
ప్రభుత్వంలోకి రావడానికి ముందు మీరూ అదే పని చేశారుగా..!
ప్రభుత్వంలోకి రావడానికి ముందు మీరూ అదే పని చేశారుగా..! -
ఎంపీ పదవికి 10 మంది రాజీనామా
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్తోపాటు పలువురు బీజేపీ ఎంపీలు తమ పార్లమెంట్ సభ్యత్వానికి బుధవారం రాజీనామా సమరి్పంచారు. ఇటీవల జరిగిన రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో వీరు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. ఇకపై ఎమ్మెల్యేలుగానే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. మొత్తం 12 మంది బీజేపీ ఎంపీలు పార్లమెంట్ సభ్యత్వం వదులుకుంటున్నారు. వీరికి సొంత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి లేదా మంత్రి పదవులు దక్కుతాయని ప్రచారం సాగుతోంది. బుధవారం 10 మంది బీజేపీ ఎంపీలు రాజీనామా చేశారు. మధ్యప్రదేశ్కు చెందిన రాకేశ్ సింగ్, ఉదయప్రతాప్ సింగ్, రితీ పాఠక్, రాజస్తాన్కు చెందిన కిరోడీలాల్ మీనా, దియా కుమారి, రాజవర్దన్ సింగ్ రాథోడ్, ఛత్తీస్గఢ్కు చెందిన గోమతిసాయి, అరుణ్ సావో రాజీనామా సమరి్పంచారు. వీరిలో కిరోడీలాల్ మీనా ఒక్కరే రాజ్యసభ సభ్యుడు. మిగిలినవారంతా లోక్సభ సభ్యులు. మరో కేంద్ర మంత్రి రేణుకా సింగ్తోపాటు ఎంపీ మహంత్ బాలక్నాథ్ యోగి అతి త్వరలో రాజీనామా చేస్తారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. నరేంద్రసింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, రేణుకా సింగ్ కేంద్ర మంత్రి పదవుల నుంచి తప్పుకోనున్నారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో నూతన ముఖ్యమంత్రులను బీజేపీ అధిష్టానం ఇంకా నియమించలేదు. ఎంపీ పదవులకు రాజీనామా చేసిన వచ్చిన వారిలో కొందరికి ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించబోతున్నానని తెలుస్తోంది. మరోవైపు కేంద్రంలో మూడు మంత్రి పదవులు ఖాళీ అవుతున్నాయి. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కంటే ముందే ఈ మూడు పదవులను భర్తీ చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోచిస్తున్నట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల్లో పార్టీకి లబ్ధి చేకూరేలా ఈ భర్తీ ఉంటుందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. -
బీజేపీలోకి అజ్మీరా చందూలాల్ కుమారుడు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, దివంగత అజ్మీరా చందూలాల్ కుమారుడు, బీఆర్ఎస్ నాయకుడు అజ్మీరా ప్రహ్లాద్ బీజేపీలో చేరారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, జాతీయ కార్యవర్గసభ్యుడు గరికపాటి మోహన్రావుల సమక్షంలో ఈ చేరిక కార్యక్రమం జరిగింది. ఈటల రాజేందర్, ప్రహ్లాద్కు కాషాయకండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ బీజేపీ అన్ని వర్గాలకు సముచిత స్థానం ఇస్తుందన్నారు. కేంద్ర కేబినెట్లోని 75 మంది మంత్రుల్లో 27 మంది బీసీలు, 12 మంది ఎస్సీలు, 8 మంది గిరిజనులు ఉన్నారని, బీజేపీ ప్రభుత్వంతోనే ఇది సాధ్యమైందని చెప్పారు. అలాగే ఆదివాసీ మహిళకు అత్యున్నత రాష్ట్రపతి పదవి ఇచ్చింది కూడా బీజేపీనేనన్నారు. పార్టీ మారితే పెన్షన్ తీసేస్తామని బెదిరించడం సరికాదని, పెన్షన్ డబ్బులు ప్రజలవే తప్ప సీఎం కేసీఆర్ ఇంట్లో నుంచి ఇవ్వడం లేదని ఈటల మండిపడ్డారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఈ రాష్ట్రానికి ఒక సంకేతం ఇచ్చిందని, కేసీఆర్ డబ్బు సంచులు, మందు సీసాలకు ప్రజలు లొంగకుండా తనను గెలిపించారని అన్నారు. -
76 ఏళ్లుగా తిండీ, నీళ్లు ముట్టని యోగి కన్నుమూత
గాంధీనగర్: 76 ఏళ్లుగా అన్నపానీయాలు ముట్టుకోని యోగి ప్రహ్లాద్ జాని(90) మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. భక్తుల సంర్శనార్థం ఆయన మృతతదేహాన్ని రెండు రోజుల పాటు బనస్కంతలోని ఆశ్రమంలో ఉంచనున్నారు. అనంతరం గురువారం నాడు అదే ఆశ్రమంలో అంత్యక్రియలు చేపట్టనున్నారు. కాగా ప్రహ్లాద్ జాని గుజరాత్లోని చరడా గ్రామంలో జన్మించారు. ఈ యోగిని అతని భక్తులు ప్రేమగా "చునిర్వాలా మాతాజీ" అని పిలుస్తారు. గుజరాత్లో ఇతని పేరు తెలియని వారు ఉండరనడంలో అతిశయోక్తి లేదు. తిండీ, నీళ్లు లేకుండా 76 ఏళ్లుగా జీవించడంతో అతనిపై ఎంతోమంది శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. అందులో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ కూడా ఒకరు. ఏమీ తినకుండా ఎలా జీవిస్తున్నారో అర్థం కాక చాలా మంది సైంటిస్టులు తలలు పట్టుకున్నారు. (ఆశ్రమంలో ఇద్దరు సాధువుల హత్య) ఎన్నో రకాలుగా ప్రయత్నించినప్పటికీ అసలు కారణాన్ని మాత్రం రాబట్టలేకపోయారు. 2010లో డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఓ అధ్యయనం నిర్వహించాయి. అందులో భాగంగా యోగిని 15 రోజుల పాటు ఒక గదిలో ఉంచి వీడియో మానిటరింగ్ నిర్వహించారు. అనంతరం ఎమ్ఆర్ఐ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్, తదితర వైద్య పరీక్షలు జరిపారు. ఈ ఫలితాల్లో ఆయనకు అసాధారణ రీతిలో ఆకలి, దాహాన్ని తట్టుకునే లక్షణాలున్నాయని వెల్లడైంది. అయితే ధ్యానమే తనను బతికిస్తోందని యోగి గతంలోనే సమాధానమిచ్చారు. కాగా ఆయన ఆశ్రమాన్ని సందర్శించిన వారిలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉండటం గమనార్హం. (శివాలయంలో సాధువుల దారుణ హత్య) -
దేవాస్ బరిలో ప్రసిద్ధ గాయకుడు ప్రహ్లాద్
నీటికీ, కన్నీటికీ రంగు ఉంటుందా? చెట్టుకీ అది పంచే గాలికీ కులముం టుందా? ఇవన్నీ ప్రతి ఒక్కరికీ బతుకునిచ్చేందుకు కాక మరెందుకు అంటారు కబీర్ కవితలనూ, గీతాలనూ, భజనలరూపంలో దేశవిదేశాల్లో ప్రదర్శిస్తూ సంగీతానికి సరిహద్దుల్లేవని చాటిచెప్పిన ప్రహ్లద్. మధ్యప్రదేశ్ దేవాస్ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న ప్రహ్లాద్ సింగ్ తిపానియా మధ్యప్రదేశ్ ప్రజలకు సుపరిచితుడు. కబీర్ కవిత్వాన్ని విభిన్న గొంతుకలతో వినిపిస్తోన్న జానపదగాయకుడు ప్రహ్లాద్ సంగీతంతో ప్రజలమదిని మెప్పించినా తాజాగా రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కబీర్ గానంతో సంగీత సామ్రాజ్యంలో తనదైన స్థానాన్ని నిలుపుకున్న ప్రహ్లాద్ని కాంగ్రెస్ పార్టీ దేవాస్ని నిలబెట్టడంతో సంగీతాభిలాషుల దృష్టి ఈ నియోజకవర్గంపై పడింది. దేవాస్లో గత (2014) ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మనోహర్ ఉంత్వాల్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సజ్జన్ సింగ్ వర్మపై 2,60,313 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2009లో కాంగ్రెస్ ఈ సీటుని కైవసం చేసుకుంది. అయితే ఈసారి ఎలాగైనా ఈ స్థానాన్ని నిలబెట్టుకుకోవాలని బీజేపీ యత్నిస్తోన్న తరుణంలో కబీర్ గానాన్ని దశదిశలా వ్యాపింపజేస్తోన్న సం గీతకారుడు ప్రహ్లాద్సింగ్ సంగీతాన్ని విజ యపాచికగా వేసింది. దీంతో ఇక్కడి ప్రజలు కళాకారుడికి పట్టంకడతారా లేక తిరిగి బీజేపీకే పవర్ ఇస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. మాల్వ ప్రాంతంలో 1954 సెప్టెంబర్ 7న బలాయీ దళిత కుటుంబంలో జన్మించిన ప్రహ్లాద్ మాల్వి జానపద శైలి రేడియో శ్రోతలకు సుపరిచితం. ఇండోర్, భోపాల్, జబల్పూర్, పట్నా, లక్నోవాంద్, కాన్పూర్ ఆకాశవాణి స్టేషన్లలో ప్రహ్లాద్ కబీర్ గానాలాపనకు చెవికోసుకోని వారుండరు. సాంప్రదాయక వాయిద్యాలైన తంబూర, ఖార్తాల్, మంజీర, ఢోలక్, హార్మోనియం, తిమ్కీ, వయోలిన్లతో ప్రహ్లాద్ భిన్నమైన జానపద కంఠంతో సంగీత ప్రియులను ఆకట్టుకున్నారు. అమెరికా కబీర్ యాత్ర పేరుతో సంగీత యాత్రను నిర్వహించిన ప్రహ్లాద్ తిపానియా అమెరికా, కెనడా, పాకిస్తాన్, లండన్ తదితర దేశాల్లో ప్రహ్లాద్ విస్తృతంగా కబీర్ కవితాగానం చేశారు. తొలుత సాధారణ స్కూల్ టీచర్గా ఉన్న ప్రహ్లాద్ క్రమేణా కబీర్ ప్రపంచంలో తలమునకలయ్యారు. జానపద సాహిత్యంలో భాగమైన కబీర్ కవితాగానాన్ని ఒడిసిపట్టుకున్న ప్రహ్లాద్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేయడం ఇటు సంగీత ప్రపంచంలోనూ, అటు సినీ వర్గాల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. 2011లో పద్మశ్రీ అవార్డుతో సహా ప్రముఖ అవార్డులెన్నింటినో సొంతం చేసుకున్న కబీర్ మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలోని లూన్యఖేది అనే కుగ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టారు. ఆత్మారామ్జీ, సంపత్బాయిల సంతానమైన ప్రహ్లాద్ తన సంగీతానికి సంబంధించి బీజేపీ నుంచి విమర్శలెదుర్కొంటున్నారు. అయితే గాలికీ, నీటికీ లేని కులం, మతం సంగీతానికెందుకని సున్నితంగా సమాధానమిస్తున్నారు ప్రహ్లాద్. -
స్మృతికి మోదీ సోదరుడి షాక్
ఘజియాబాద్: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఊహించని పరిణామం ఎదురైంది. స్మృతి డిగ్రీ పట్టాలను పరిశీలించాలని ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ అన్నారు. స్మృతి నకిలీ సర్టిఫికెట్లు పొందారన్న ఆరోపణలపై విచారణ చేయాలని అభిప్రాయపడ్డారు. అఖిల భారత రేషన్ డీలర్ల ఉపాధ్యక్షుడయిన ప్రహ్లాద్ ఘజియాబాద్లో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ మాజీ న్యాయ శాఖ మంత్రి, ఆప్ ఎమ్మెల్యే జితేందర్ సింగ్ తోమర్ కేసులాగే స్మృతి విషయంలో వ్యవహరించాలని ప్రహ్లాద్ మోదీ కోరారు. స్మృతి నకిలీ డిగ్రీలు పొందారని ఆరోపిస్తూ, వీటిపై విచారణ చేపట్టాలని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ప్రధాని సోదరుడు ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడం స్మృతికి ఇబ్బందికర పరిస్థితి. నల్లధనం అంశం గురించి అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ.. విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెలికితీసేందుకు భారత ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీకి వీసా మంజూరు విషయంలో కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్పై వచ్చిన ఆరోపణలపై మాట్లాడుతూ.. మానవతా దృక్పథంతో సాయం చేశారని ప్రహ్లాద్ మోదీ అన్నారు. -
'ఇన్స్టాంట్ క్రికెట్తోనే ఇక్కట్లు పెరిగాయి'