Advertisement
Radaha krishna
-
ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద ఆందోళన
సాక్షి, కృష్ణా: విజయవాడ నగరంలోని ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద క్రిస్టియన్, దళిత సంఘాలు గురువారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీసే విధంగా పలు కథనాలను ఇచ్చిన ఏబీఎన్ ఛానెల్ ఛైర్మెన్ రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. రాధాకృష్ణ డౌన్.. డౌన్.. అంటూ నినాదాలతో హోరెత్తించారు. తప్పుడు కథనాలకు బాధ్యతవహిస్తూ.. క్షమాపణ చెప్పాలని ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. రాధాకృష్ణ తన తీరు మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని కార్యాలయ సిబ్బందిని ఆందోళనకారులు హెచ్చరించారు. చంద్రబాబుతో చేతులు కలిపిన రాధాకృష్ణ దళితులను, క్రైస్తవులను అవమాన పరుస్తున్నాడని రిపబ్లికన్ పార్టీ అఫ్ ఇండియా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బోరుగడ్డ అనీల్ ఆరోపించారు. మూడు రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేసి ఆంధ్రజ్యోతి కార్యకలాపాలు ఎక్కడికక్కడ స్తంభింపచేస్తామని ఆయన హెచ్చరించారు. -
వైఎస్ కుటుంబానికి దూరం చేసేందుకు కుట్ర
నంద్యాల, న్యూస్లైన్: వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం, తమకూ మధ్య దూరం పెంచేం దుకు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించవని వైఎస్సార్సీపీ నేత భూమానాగిరెడ్డి అన్నారు. మంగళవారం ‘ఆంధ్రజ్యోతి ’ దినపత్రికలో తమకు వ్యతిరేకంగా ప్రచురితమైన కథనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో మంగళ వా రం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఆ కథనంలో ఏమాత్రం వాస్తవమున్నా తాను రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధమన్నారు. లేని పక్షంలో రాధాకృష్ణ తన పేపర్, చానల్ను మూసుకునేందుకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. ఈ నెల 22న ఆ పత్రిక కార్యాలయంలో రాధాకృష్ణను కలుస్తానని, అసత్య కథనంపై న్యాయపోరాటం చేస్తానన్నారు. వైస్సార్సీపీ తరపున నంద్యాల అసెంబ్లీ టికెట్ తనకు.. ఎంపీ టికెట్ ఎస్పీవై రెడ్డికి ఖరారైన విషయాన్ని రాధాకృష్ణ తెలుసుకుంటే మంచిదన్నారు. నంద్యాలలో పలువురు టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తలు, పార్టీ లో చేరుతుండడంతో ముందుగానే మాట ఇచ్చా నని, అలాగే ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి స్థాని కంగా రచ్చబండలో పాల్గొనాల్సి ఉండడంతో తాము పార్టీ సమావేశానికి వెళ్లలేక పోయామన్నారు.