Rajathi Ammal
-
కరుణానిధి భార్య ఇంట్లో కలకలం
చెన్నై: అన్నాడీఎంకే సంక్షోభంతో రాష్ట్రమంతా రాజకీయ చర్చోపచర్చలు జరుగుతుండగా డీఎంకే అధినేత కరుణానిధి సతీమణి ఇంట్లోకి దుండగుడు చొరబడడం కలకలం రేపింది. కరుణానిధి భార్య రజతి అమ్మాల్ ఇంట్లోకి దొంగతనంగా చొరబడిన దుండగుడు ఆమెను తుపాకీతో బెదిరించాడు. రంగంలోకి దిగిన మైలాపూర్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడు ట్రిప్లేన్ ప్రాంతానికి చెందిన రాజేంద్రన్ గా పోలీసులు గుర్తించారు. అతడు ఎందుకు ఇంట్లోకి ప్రవేశించాడనే కారణాలపై దర్యాప్తు చేపట్టారు. దొంగతనం చేయడానికి చొరబడ్డాడా, మరేదైనా కారణం ఉందా అనే దానిపై ఆరా తీస్తున్నారు. రాజకీయ వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో జరిగిన ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
కరుణకు జయలలిత నెచ్చెలి పరామర్శ
సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఆరోగ్యం గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి జె జయలలిత నెచ్చెలి శశికళ వాకబు చేసినట్టు సమాచారం. కరుణానిధి సతీమణి రాజాత్తి అమ్మాల్ను శశికళ పరామర్శించినట్టు డీఎంకేలో చర్చ సాగుతోంది. డీఎంకే అధినేత ఎం కరుణానిధి కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్టు డీఎంకే వర్గాలు ప్రకటించాయి. ఆయనకు మధుమేహం, రక్త పోటు వంటి సమస్యలు లేదని వైద్యులు తేల్చారు. కేవలం బెంగళూరులో ఉన్న పెద్దకుమార్తె సెల్వి ఇంట్లో కొంత కాలం ఉండి విశ్రాంతి తీసుకోవాలన్న కాంక్షతోనే ముందస్తు వైద్య పరీక్షల నిమిత్తం కావేరిలో కరుణానిధి చేరినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే, దీనిని డీఎంకే వర్గాలు ధ్రువీకరించడం లేదు. ఇక, కరుణానిధి ఆరోగ్యం దేశ వ్యాప్తంగా నాయకులు ఆయన కుమారుడు స్టాలిన్, కుమార్తె కనిమొళిల వద్ద విచారిస్తున్నారు. ఈ సమయంలో కరుణానిధి ఆరోగ్యం గురించి జయలలిత నెచ్చెలి శశికళ పరామర్శించినట్టు డీఎంకేలో చర్చ సాగుతుండడం గమనార్హం. జయలలిత ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి స్టాలిన్ అపోలో ఆసుపత్రికి వెళ్లి మరీ విచారించిన విషయం తెలిసిందే. అలాగే, కరుణానిధి సతీమణి రాజాత్తి అమ్మాల్ కూడా అపోలోకు వెళ్లి మరీ పరామర్శించినట్టు ప్రచారం సాగింది. ఈ పరిస్థితుల్లో కరుణానిధి ఆరోగ్యం గురించి రాజాత్తి అమ్మాల్ ను శశికళ అడగడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. -
జయకు కరుణానిధి భార్య పరామర్శ
-
జయకు కరుణానిధి భార్య పరామర్శ
డీఎంకే అధినేత కరుణానిధి భార్య రాజాతి అమ్మాళ్ చెన్నైలోని అపోలో ఆస్పత్రికి వెళ్లి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. జయలలిత సన్నిహితురాలు శశికళను కలసి వివరాలు తెలుసున్నారు. జయలలిత త్వరగా కోలుకోవాలని అమ్మాళ్ ఆకాంక్షించారు. అమ్మాళ్ శుక్రవారం రాత్రి అపోలో ఆస్పత్రికి వెళ్లినట్టు అన్నా డీఎంకే, డీఎంకే వర్గాలు ధ్రువీకరించాయి. కరుణానిధి కుమారుడు ఎంకే స్టాలిన్ ఇటీవల అపోలోకు వెళ్లి జయలలిత ఆరోగ్యం గురించి వాకబు చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 22 నుంచి తమిళనాడు సీఎం అపోలోలో చికిత్స పొందుతున్నారు. చాలా మంది ప్రముఖులు అపోలోకు వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య నిన్న అపోలో ఆస్పత్రిని సందర్శించారు.