Ram Charan
-
జాన్వీని చూసి రామ్ చరణ్ షాక్ అయ్యాడట.. ఎందుకంటే?
-
ఇదో అందమైన జ్ఞాపకం.. చేతికైన గాయం గురించి చెప్పిన రామ్ చరణ్
-
'పెద్ది'.. సమస్యలన్నీ క్లియర్
తెలుగు సినీ ఇండస్ట్రీలో గత కొన్నిరోజుల నుంచి పర్సంటేజీ వివాదం నడుస్తోంది. మల్టీప్లెక్స్లకు ఇస్తున్నట్లే తమకు కూడా షేరింగ్ ఇవ్వాలని సింగిల్ స్క్రీన్స్ నిర్వహిస్తున్న ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్నారు. కొన్నిరోజుల క్రితమే ఇరువురి మధ్య మీటింగ్ జరిగింది. ఈ క్రమంలోనే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఓ కమిటీ కూడా వేసింది. అయితే 'పెద్ది'కి కూడా పర్సంటేజీ ఇవ్వనున్నారని తెలిసింది. సోమవారం హైదరాబాద్లో జరిగిన మీటింగే దీనికి కారణం. ఇప్పుడు ఈ విషయంపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ స్వయంగా ఓ నోట్ రిలీజ్ చేసింది.ఆంధ్రాలో 'పెద్ది' టికెట్ ధరల పెంచితే అందులో 7.5 శాతం సదరు సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లకు చెల్లించాల్సి ఉంటుంది. ప్రీమియర్ షోల కోసమైతే ఏ సెంటర్లో ప్రతి షోకు రూ.25 వేలు, బి సెంటర్లో ప్రతి షోకు రూ.15 వేలు, సి సెంటర్లో ప్రతి షోకు రూ.10 వేలు చొప్పున నిర్మాత చెల్లించాలి.తెలంగాణలో టికెట్ ధరలు పెంచితే పై నిబంధనలు వర్తిస్తాయి. టికెట్ ధర పెంపు లేకపోతే వారు ఎప్పటిలానే డిస్ట్రిబ్యూటర్లతో చర్చించి పరస్పర అంగీకారంతో పరిష్కరించుకుంటారని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ స్పష్టం చేసింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పర్సంటేజీ విధానాన్ని అమలు చేసేందుకు అంగీకరించారని కూడా తెలిపింది.జూన్ 4న పెద్ది సినిమా థియేటర్లలోకి రానుంది. సోమవారం ట్రైలర్ రిలీజ్ చేయగా కొందరికి నచ్చితే మరికొందరికి ల్యాగ్ అనిపించింది. ఇందులో రామ్ చరమ్.. క్రాస్ ఓవర్ అథ్లెట్గా కనిపిస్తాడు. అంటే క్రికెట్, కుస్తీ, రన్నింగ్ చేస్తాడు. జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు. బుచ్చిబాబు దర్శకుడు. -
పెద్ది.. జాన్వీకి మైనస్ కానుందా?
సినిమా ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్కు ఎంట్రీ ఈజీగానే ఉంటుంది, కానీ తమని తాము నిరూపించుకోవడమే అసలైన టాస్క్. అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా బాలీవుడ్లోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ కెరీర్ ప్రస్తుతం ఒక కీలకమైన మలుపులో ఉంది. ముఖ్యంగా సౌత్ ఇండియాలో బిగ్ బ్రేక్ కోసం చూస్తున్న ఈ బ్యూటీకి, ఇక్కడి కమర్షియల్ ఫార్మాట్ ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా అనే చర్చ జోరుగా సాగుతోంది.'దేవర'లో గ్లామర్ షోకే పరిమితంభారీ అంచనాల మధ్య వచ్చిన ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాతో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 'తంగం' అనే పల్లెటూరి పడచు పాత్రలో జాన్వీ లుక్స్, ముఖ్యంగా ‘చుట్టమల్లే’ పాటలో ఆమె పండించిన గ్లామర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే, ఒక నటిగా చూస్తే మాత్రం దేవరలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదనే చెప్పాలి. కేవలం గ్లామర్ షోకే, కమర్షియల్ ఎలిమెంట్స్కే ఆమెను పరిమితం చేసేశారనే విమర్శలు వచ్చాయి.'పెద్ది’లోనూ అదే రిపీట్ అవుతుందా?ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే, నిన్న రిలీజైన ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే.. ఇందులోనూ ఆమె కేవలం అందాల ఆరబోతకే పరిమితం అయినట్లుగా అర్థమవుతుంది. కమర్షియల్ సినిమాలకు హీరోయిన్ గ్లామర్ ప్లస్ కావచ్చు. కానీ, ‘పెద్ది’ లాంటి రా అండ్ రస్టిక్, ఇంటెన్స్ కథలకు గ్లామర్ మాత్రమే నమ్ముకుంటే అది సినిమాకే మైనస్ అయ్యే ప్రమాదం ఉంది. ఒకవేళ ‘పెద్ది’ సినిమాలోనూ జాన్వీ పాత్రకు నటన పరంగా స్కోప్ లేకపోతే, ఆమె టాలీవుడ్ కెరీర్కు అది పెద్ద మైనస్ అవుతుంది. టాలీవుడ్లో లాంగ్ రన్ ఉండాలంటే కేవలం అందం మాత్రమే సరిపోదు, బలమైన పాత్రలు కూడా పడాలి.దాచి పెట్టారా?గ్లింప్స్, ట్రైలర్లో జాన్వీ గ్లామర్ షోకే పరిమితం చేశారు. ప్రతి సీన్ లో పైట గాల్లోకి ఎగరేస్తూ నడుము హైలైట్ అయ్యేలా పదే పదే ఫ్రేమ్ సెట్ చేశాడు దర్శకుడు. కానీ హీరో రామ్ చరణ్ మాత్రం జాన్వీ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నాడు. పెద్దిలో జాన్వీ నటన ఓ రేంజ్లో ఉంటుందని చెబుతున్నాడు. డాన్స్ కూడా అద్భుతంగా చేసిందని ప్రశంసించాడు. చరణ్ మాటల బట్టి చూస్తే.. ట్రైలర్లో జాన్వీని కావాలనే గ్లామర్ డాల్గా చూపించినట్లు తెలుస్తోంది. ఆమె నటనకు సంబంధించిన సీన్ని పెడితే.. రిలీజ్ ముందే కథపై ఊహగానాలు ఎక్కువైపోతాయని దర్శకుడు భావించాడట. అందుకే ట్రైలర్లో చరణ్ని మాత్రమే హైలెట్ చేస్తూ.. మిగతావాళ్ల సీన్లను దాచిపెట్టాడని టాలీవుడ్ టాక్. ఒకవేళ అదే నిజమై.. జాన్వీకి మంచి సీన్లు పడితే ఒకే. కేవలం పాటలకే పరిమితం అయితే మాత్రం.. ఆమె కెరీర్కి ఇబ్బంది తప్పదని సినీ పండితులు చెబుతున్నారు. -
‘పెద్ది’కి పర్సెంటేజ్ కావాల్సిందే!
మల్టీప్లెక్స్ తరహాలోనే సింగిల్ స్క్రీన్స్లోనూ పర్సెంటేజ్ విధానం అమలు చేయాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేయడం.. ఇప్పటికిప్పుడు వీలుకాదంటూ ‘యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్’ సభ్యులు మాట్లాడటం తెలిసిందే. ఈ సమస్యపై చర్చించేందుకు ‘తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్’ అధ్యక్షుడు డి.సురేశ్ బాబు ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సంస్థ కార్యాలయంలో గత శుక్రవారం నిర్మాతలు, ఎగ్జిబిటర్స్తో సమావేశం నిర్వహించారు. పర్సెంటేజ్ విధానంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేందుకు ఏడుగురు నిర్మాతలు, ఏడుగురు ఎగ్జిబిటర్లు, ఏడుగురు డిస్ట్రిబ్యూటర్లు (మొత్తం 21 మంది)తో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. రెండు నెలల్లో ఈ కమిటీ నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే... హైదరాబాద్లోని ఫిల్మ్ చాంబర్లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సోమవారం మరోసారి అత్యవసరంగా సమావేశమయ్యారు. సుదీర్ఘంగా సాగిన ఈ చర్చల్లో మూడు వర్గాల మధ్య సయోధ్య కుదరలేదట. ‘పెద్ది’ సినిమా ప్రదర్శనలో తమకు పర్సెంటేజ్ కావాల్సిందేనని ఎగ్జిబిటర్లు పట్టుబట్టారట. థియేటర్ రెంట్తో పాటు అదనంగా 7.5 శాతం పర్సెంటేజ్ ఇచ్చేందుకు సిద్ధమేనని నిర్మాతలు చెప్పారని తెలిసింది. అయితే ‘పెద్ది’కి మాత్రమే పర్సెంటేజ్ ఇస్తే సరిపోదని, తర్వాతి చిత్రాలకు కూడా ఎంత మేర పర్సెంటేజ్ ఇస్తారు? అనే విషయంపై ‘పెద్ది’ రిలీజ్కు ముందే తమకు రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని ఎగ్జిబిటర్లు కోరారట. ఈ డిమాండ్పై అంతర్గతంగా చర్చించుకుని, తమ నిర్ణయాన్ని నేడు చెబుతామని నిర్మాతలు చెప్పినట్లు సమాచారం. -
పెద్దితో జాన్వీ శ్రీదేవి గారి రేంజికి వెళ్ళిపోతారు
-
పెద్ది తర్వాత బుచ్చిబాబుతో చరణ్ మరో మూవీ
-
రామ్ చరణ్ పెరఫార్మెన్స్ కి బాక్సాఫీస్ బద్దలవడం ఖాయం
-
‘పెద్ది’ .. నా లైబ్రరీలో ఎప్పటికీ దాచుకునే మూవీ : రామ్ చరణ్
‘‘నా కెరీర్లో చేసిన మోస్ట్ ఇన్ స్పైరింగ్ ఫిల్మ్ ‘పెద్ది’. ఇలాంటి చిత్రాలు దశాబ్దంలో ఒకసారి మాత్రమే వస్తాయి. ‘మగధీర’, ‘రంగస్థలం’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాలు తరచుగా రావు. అవి రావాలంటే సంవత్సరాలు పడుతుంది. ‘పెద్ది’ కూడా అలాంటి అరుదైన సినిమా. నా లైబ్రరీలో ఎప్పటికీ దాచుకునే మూవీ ఇది’’ అని హీరో రామ్చరణ్ తెలిపారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్చరణ్, జాన్వీకపూర్ జోడీగా నటించిన చిత్రం ‘పెద్ది’. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ మూవీ జూన్ 4న విడుదలకానుంది. సోమవారం ముంబైలో జరిగిన ‘పెద్ది’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో బుచ్చిబాబు సానా మాట్లాడుతూ– ‘‘నా రెండో సినిమాకే ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన రామ్ చరణ్గారికి రుణపడి ఉంటాను’’ అన్నారు ‘‘మా అమ్మగారు(శ్రీదేవి), చిరంజీవిగారు కలిసి నటించిన సినిమాలపై ప్రేక్షకులు ఎంతో ప్రేమ చూపించారు. చరణ్గారు–నా కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’ నాకు చాలా ప్రత్యేకం’’ అని జాన్వీ కపూర్ చెప్పారు. ‘‘నేరుగా తెలుగు సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ‘పెద్ది’ రూపంలో ఆ అవకాశం వచ్చింది’’ అన్నారు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఈ వేడుకలో నిర్మాత సతీష్ కిలారు, నటుడు దివ్యేందు శర్మ, కెమెరామెన్ రత్నవేలు మాట్లాడారు. -
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'పెద్ది' స్టోరీ ఏంటి? ఊహించని ట్విస్ట్ గురించి అప్పుడే
'పెద్ది' ట్రైలర్ వచ్చేసింది. కొందరికి నచ్చింది. మరికొందరికి నచ్చలేదు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో అసంతృప్తి ఎక్కువగా వినిపిస్తోంది. అదే టైంలో కంటెంట్ పరంగా మాత్రం స్టోరీపై రకరకాల డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇంతకీ 'పెద్ది' స్టోరీ ఏమై ఉండొచ్చు? ఊహించని ట్విస్ట్ ఏంటి?(ఇదీ చదవండి: చేతికైన గాయం గురించి క్లారిటీ ఇచ్చిన చరణ్)ఇప్పటివరకు వచ్చిన 'పెద్ది' ప్రమోషనల్ కంటెంట్లో హీరో పాత్ర క్రికెట్, కుస్తీ ఆడతాడు అన్నట్లు మాత్రమే చూపించారు. కానీ ట్రైలర్లో రన్నర్ అని కూడా రివీల్ చేశారు. అయితే క్రికెట్, రెజ్లింగ్కి సంబంధించిన సీన్స్ చూపించారు గానీ రన్నింగ్కి సంబంధించిన ఒక్క షాట్ కూడా పెట్టలేదు. చివరలో రన్నింగ్ ట్రాక్పైకి పెద్ది వెళ్తున్న సీన్ చూపించారు. 'పెద్ది బ్యాక్ ఆన్ హిజ్ ఫీట్' అనే డైలాగ్ వినిపించారు. దీంతోనే డిస్కషన్స్ మొదలయ్యాయి.బెల్లం ఫ్యాక్టరీలో పనిచేసే పెద్ది.. క్రికెట్, కుస్తీ, రన్నింగ్లో ఎక్స్పర్ట్. కానీ అనుకోని సంఘటనల వల్ల 'పెద్ది'.. ఒంటి కాలి వ్యక్తి అవుతాడు. అయినా సరే తనకున్న ప్రతిభతో పారా ఒలింపిక్స్ వరకు వెళ్తాడు. ఇదే ట్విస్ట్ అనిపిస్తోంది. గత కొన్నిరోజుల నుంచి ఇందులో రామ్ చరణ్ పాత్రకు కాలు ఉండదనే రూమర్స్ వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లే దర్శకుడు బుచ్చిబాబు కూడా మూవీ చివరి 50 నిమిషాల ఎమోషనల్గా ఉంటుందని, చూస్తున్న ప్రతి ఒక్కరూ డిస్ట్రబ్ అవుతారని ఇంటర్వ్యూలో చెప్పాడు.డైరెక్టర్ బుచ్చిబాబు చెప్పిన మాటలు.. ట్రైలర్ చివరలో పెద్ది పాత్ర కుంటుతూ నడుస్తున్నట్లు అనిపించడం లాంటివి చూస్తుంటే.. ఈ దర్శకుడి గత చిత్రం 'ఉప్పెన'లానే ఇందులో 'కటింగ్' గ్యారంటీనా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో నిజానిజాలేంటి? అనేది తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.(ఇదీ చదవండి: ఆటకూలీ పోరాటం.. 'పెద్ది'పైనే టాలీవుడ్ భారమంతా!) -
పెద్ది సినిమా ట్రైలర్ వచ్చేసింది..
-
చేతికైన గాయం గురించి క్లారిటీ ఇచ్చిన చరణ్
రామ్ చరణ్ 'పెద్ది' విడుదలకు సిద్ధమైంది. వచ్చే నెల 4న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. సోమవారం మధ్యాహ్నం ముంబైలో ట్రైలర్ లాంచ్ అయింది. ఈ కార్యక్రమంలోనే తన చేతికైనా గాయం గురించి రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)'చెయ్యి బాగానే ఉంది. బుచ్చిబాబు(దర్శకుడు) ఇచ్చిన బహుమతి ఇది. గత 25-30 రోజుల నుంచి కుస్తీ సన్నివేశాల షూటింగ్ చేశాం. ట్రైన్డ్ ఆర్టిస్టులని తీసుకురమ్మంటే నిజమైన పహిల్వాన్లని తీసుకొచ్చాడు. యాక్షన్ చెప్పగానే వాళ్లు బలంగా పట్టేసుకున్నారు. అందుకే చేతికి గాయమైంది. మణికట్టు దగ్గర ఎముక విరిగింది. 'పెద్ది'కి సంబంధించి ఇదో అందమైన జ్ఞాపకం' అని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు.'పెద్ది' షూటింగ్ టైంలో మూడుసార్లు చరణ్ గాయపడ్డారు. కుస్తీ ప్రాక్టీస్ చేస్తున్న టైంలో ఓసారి గాయపడగా.. రీసెంట్గా చేసిన చిత్రీకరణలో కంటికి, మణికట్టుకి గాయాలయ్యాయి. రెండు మూడు రోజుల్లో వాటికి సంబంధించి సర్జరీలు జరగనున్నాయని నిర్మాత చెప్పారు. అయితే మణికట్టుకి ఎలా గాయమైందని ఇప్పుడు చరణ్ స్వయంగా చెప్పాడు.స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్.. క్రికెటర్, రెజ్లర్, రన్నర్గా కనిపించబోతున్నాడు. పల్లెటూరిలో ఉండే ఇతడు ఢిల్లీకి వెళ్లి కూలీపని ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ ప్రయాణంలో పెద్ది ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడనేదే స్టోరీలా అనిపిస్తుంది. ట్రైలర్లో మూవీ ఎలా ఉండబోతుందో చూపించారు గానీ స్టోరీపై పెద్దగా హింట్ ఇవ్వలేదు. బుచ్చిబాబు దర్శకుడు కాగా జాన్వీ కపూర్ హీరోయిన్. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు.(ఇదీ చదవండి: ఆటకూలీ పోరాటం.. 'పెద్ది'పైనే టాలీవుడ్ భారమంతా!) -
'పెద్ది'పైనే టాలీవుడ్ భారమంతా!
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా మరికొన్నిరోజుల్లో థియేటర్లలోకి రానుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. రెగ్యులర్ కమర్షియల్ అంశాలతో పాటే సమ్థింగ్ డిఫరెంట్గానూ అనిపించింది. 'గేమ్ ఛేంజర్' డిజాస్టర్ దెబ్బకు డీలా పడిపోయిన మెగా ఫ్యాన్స్.. ఇది ఎలాగైనా సరే హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. వీళ్లే కాదు టాలీవుడ్ కూడా అదే అనుకుంటోంది. మొత్తం భారమంతా ఈ మూవీపైనే ఉంది. ఎందుకంటే పరిస్థితి అలా ఉంది మరి!(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)ఈ ఏడాది సంక్రాంతిని టాలీవుడ్ గ్రాండ్గా మొదలుపెట్టింది. చిరంజీవి సినిమాకు రూ.300 కోట్లు వచ్చాయని అందరూ సంబరపడ్డారు. కానీ ఈ ఆనందం ఎన్నిరోజులు నిలబడలేదు. తర్వాత నుంచి ఇప్పటివరకు నాలుగు నెలలు గడిచాయి. ఒక్కటంటే ఒక్క మూవీ కూడా సరైన స్థాయిలో ఆడలేదు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలలో వచ్చిన చిత్రాలు భారీగా నిరాశపరిచాయి. దీంతో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు పెట్టుబడులన్నీ నష్టపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఈ ఏడాది వేసవి సీజన్.. టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత దారుణమైనదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.సరిగ్గా ఇలాంటి టైంలో అంటే జూన్ 4న 'పెద్ది' థియేటర్లలోకి వస్తోంది. దీంతో టాలీవుడ్ ఆశలన్నీ దీనిపైనే పెట్టుకుంది. ఇది హిట్ అవ్వడం చిత్రబృందానికే కాదు తెలుగు సినీ పరిశ్రమకు కూడా చాలా కీలకం. ఎందుకంటే థియేటర్లు గతకొన్నాళ్లుగా బోసిపోయాయి. ప్రేక్షకులు కూడా సరైన మూవీ ఎప్పుడొస్తుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్లే ఈ మూవీ..బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్ట్రాంగ్ ఓపెనింగ్స్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అనుకుంటున్నాయి. పాజిటివ్ టాక్ వస్తే చాలు ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశమైతే కనిపిస్తోంది. మరి 'పెద్ది' ఏం చేస్తాడనేది చూడాలి?ట్రైలర్ బట్టి చూస్తే బెల్లం ఫ్యాక్టరీలో పనిచేసే పెద్ది అనే ఓ పల్లెటూరి కుర్రాడు.. క్రికెట్, కుస్తీ, రన్నింగ్లో ఆటకూలీగా ఎలాంటి ప్రతిభ చూపించాడు. ఈ ప్రయాణంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడనేదే కాన్సెప్ట్లా అనిపిస్తుంది. మూవీ ఎలా ఉండబోతుందో చూపించారు గానీ స్టోరీ గురించి మాత్రం పెద్దగా హింట్ ఇవ్వలేదు. 'పెద్ది గాడు గుడిలో దేవుడు కాదు గ్రౌండ్లో దేవుడు సారు' లాంటి డైలాగ్స్ బాగానే అనిపించాయి. స్పోర్ట్స్ డ్రామాగా తీసిన ఈ చిత్రానికి బుచ్చిబాబు దర్శకుడు. జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు.ఇదీ చదవండి: 'బూతు'ని కంట్రోల్ చేసుకోలేకపోయిన రష్మిక -
రామ్ చరణ్ 'పెద్ది' ట్రైలర్ రిలీజ్
మెగా హీరో రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా 'పెద్ది'. లెక్క ప్రకారం మార్చిలోనే రావాలి కానీ రెండుసార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు వచ్చే నెల 4న థియేటర్లలోకి వచ్చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ముంబైలో ట్రైలర్ లాంచ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉంటూ మూవీపై అంచనాలని పెంచేస్తోంది.(ఇదీ చదవండి: 'బూతు'ని కంట్రోల్ చేసుకోలేకపోయిన రష్మిక)బెల్లం ఫ్యాక్టరీలో పనిచేసే పెద్ది అనే పనోడు.. క్రికెట్, కుస్తీలో ఎలాంటి ప్రతిభ చూపించాడు. జీవితంలో ఇతడికి ఎదురైన సవాళ్లు ఏంటనేది కాన్సెప్ట్. చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. జగపతిబాబు, దివ్యేందు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. బుచ్చిబాబు దర్శకుడు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు. ఇప్పటికే వచ్చిన రెండు పాటలు హిట్ అయ్యాయి. ఇప్పుడు ట్రైలర్ కూడా ఆ జోష్ని కొనసాగించేలానే ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు) -
నిజ జీవిత స్ఫూర్తితో పుట్టిన ‘పెద్ది’
మెగా పవర్స్టార్ రామ్చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. తాజాగా ఈ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు ‘పెద్ది’ సినిమా టైటిల్ వెనక ఉన్న ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పెద్దిరాజు అనే వ్యక్తి నుంచి ఈ టైటిల్ పుట్టిందని ఆయన తెలిపారు. పెద్దిరాజు తాపీ పని చేస్తూనే క్రికెట్, బాస్కెట్బాల్ బాగా ఆడేవారు. తనది పేద కుటుంబం కావడంతో ఎవరు డబ్బు ఇస్తే వాళ్ల తరఫున ఆడేవాడట. ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొంది కథను రాసుకున్నానని బుచ్చిబాబు చెప్పారు. అయితే ఈ సినిమా బయోపిక్ కాదు. నిజజీవితం నుంచి స్ఫూర్తిపొంది, దానికి కొంత ఫిక్షన్ కూడా జోడించి కథను రూపొందించానని ఆయన స్పష్టం చేశారు. అలా టైటిల్ కోసం పెద్దిరాజు పేరులోని ‘పెద్ది’ అనే పదాన్ని ఎంచుకున్నాను.ఇది కోడి రామ్మూర్తి బయోపిక్ అని, జూ.ఎన్టీఆర్ కోసం రాసిన కథ అని వస్తున్న పుకార్లను బుచ్చిబాబు ఖండించారు. ఉప్పెన రిలీజ్కు ముందే ఈ కథ రాసుకున్నానని ఆయన క్లారిటీ ఇచ్చారు. మొదట ఈ సినిమాను గోదావరి యాసలో తీద్దామనుకున్నాను. అయితే ఇప్పటికే రామ్ చరణ్ తన గురువు సుకుమార్ దర్శకత్వంలో చేసిన 'రంగస్థలం' ఆ నేపథ్యమే కావడంతో తన సినిమా ‘పెద్ది’ కోసం విజయనగరం బ్యాక్డ్రాప్ను ఎంచుకున్నానని దర్శకుడు వెల్లడించారు. మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలో స్పెషల్ సాంగ్లో శృతిహాసన్ స్పెషల్ అట్రాక్షన్గా నిలవనుంది. ఇక ఈ చిత్రంలో జగపతిబాబు, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. ‘పెద్ది’ సినిమా ట్రైలర్ను ఈ నెల 18న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ చిత్రం సందడి చేయనుంది. -
రామ్ చరణ్కు మరో ఆపరేషన్.. ?
రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ మరికొద్ది రోజుల్లో(జూన్ 4) ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు రెండేళ్లుగా ఈ చిత్రం కోసం రామ్ చరణ్ కష్టపడ్డాడు. దర్శకుడు బుచ్చిబాబు రాసుకున్న ‘పెద్ది’ పాత్ర కోసం చరణ్ పడిన కష్టం గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, యాక్షన్ కొరియోగ్రాఫర్తో పాటు నిర్మాత కూడా చరణ్ పడిన కష్టం గురించే చెబుతున్నారు. యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించే క్రమంలో చాలా సార్లు ప్రమాదానికి గురయ్యారట. దాదాపు మూడు పెద్ద గాయాలు అయ్యాయట. కానీ బయటకు మాత్రం కంటికి గాయం అయిందన్న విషయమే తెలిసిందే. ఓ యాక్షన్ ఎపిసోడ్ తెరకెక్కిస్తున్నప్పుడు చరణ్ మణికట్టుకు కూడా తీవ్రంగా గాయం అయిందట. అయినా కూడా షూటింగ్కి బ్రేక్ ఇవ్వలేదట. ఇప్పుడా నొప్పి కాస్త ఎక్కువైపోవడంతో వైద్యులను సంప్రదిస్తే.. సర్జరీ చేయాలని చెప్పారట. రెండు రోజుల్లో చరణ్ మణికట్టు దగ్గర చిన్న సర్జరీ చేయించుకోబుతున్నారు. ఈ విషయాన్ని నిర్మాత వెంకట సతీష్ వెల్లడించారు. తాజాగా ఆయన మీడియాతో ముచ్చటిస్తూ.. చరణ్కు తగిలిన గాయాల గురించి వివరించాడు.‘పెద్ది’ సినిమా కోసం రామ్ చరణ్ చాలా కష్టపడ్డాడు. షూటింగ్ సమయంలో ఆయనకు మూడు గాయాలు అయ్యాయి. అయినా కూడా విశ్రాంతి తీసుకోకుండా షూటింగ్లో పాల్గొన్నాడు. కంటికి మాత్రమే కాదు మణికట్టు దగ్గర కూడా గాయం అయింది. ఇప్పుడా నొప్పితో బాధపడుతున్నాడు. ఎల్లుండి(మంగళవారం) ఆపరేషన్ ఉంది. షూటింగ్ సమయంలో కండరాలు పట్టేసేవి. షూటింగ్ గ్యాప్లో జిమ్ చేసి వచ్చేవాడు. కుస్తీ పోటీలకు సంబంధించిన సన్నివేశాల షూటింగ్లో ఆయన కండరాలు పట్టేశాయి. కాలు కూడా బెణికింది. ఆయన కోసం ప్రత్యేకంగా ఫిజియో థెరపిస్ట్ పెట్టాల్సివచ్చింది. ఈ సినిమా కోసం ఆయన ప్రాణం పెట్టి నటించాడు. సినిమా చూస్తే అందరికి ఆ విషయం అర్థవవుతుంది. సినిమా ప్రారంభం నుంచే పెద్ది ప్రపంచంలోకి వెళ్తారు’ అని సతీష్ చెప్పుకొచ్చాడు. కాగా, ఇటీవల చరణ్ కంటికి చిన్న సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మణికట్టుకు కూడా మరో సర్జరీ అని తెలియడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. -
పెద్ది హీరోయిన్ జాన్వీ కపూర్ కాదు.. ఎవరంటే?
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ వెయిటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలో స్పెషల్ సాంగ్లో కోలీవుడ్ భామ శృతిహాసన్ స్పెషల్ అట్రాక్షన్గా నిలవనుంది.అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ టాక్ నెట్టింట వైరల్గా మారింది. ఈ సినిమాలో మొదట హీరోయిన్గా జాన్వీ కపూర్ను ఎంపిక చేయలేదట. ఈ చిత్రంలో మొదట జాన్వీ కపూర్ సిస్టర్ ఖుషీ కపూర్ను అనుకున్నారట. ఏమైందో ఏమో తెలియదు కానీ చివరికీ మళ్లీ జాన్వీ కపూర్ వైపే మొగ్గుచూపారు. ఒక వేళ్ల జాన్వీ కపూర్ ప్లేస్లో ఖుషి కపూర్ చేసి ఉంటే తనకిది బిగ్గెస్ట్ టాలీవుడ్ డెబ్యూ అయ్యి ఉండేదని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.కాగా.. ఈ చిత్రంలో జగపతిబాబు, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. ఈ చిత్ర ట్రైలర్ను ఈ నెల 18న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
తప్పు తనదే అన్నాడు.. చరణ్లా ఏ హీరో ఒప్పుకోరు : ఫైట్ మాస్టర్
రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పెద్ది’. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ సినిమా జూన్ 4న విడుదల కానుంది. ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్గా వర్క్ చేసిన నబా కాంత్ శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ–‘‘మాది మణిపూర్. నా చిన్నప్పుడే నాన్నగారు హైదరాబాద్ వచ్చారు. నాన్నగారి స్ఫూర్తితో ఇదే ఫీల్డ్లో 14 ఏళ్ల వయసు నుంచి ఉన్నాను. స్టంట్స్లో నాకు 18 ఏళ్ల అనుభవం ఉంది. విజయ్, రామ్–లక్ష్మణ్ మాస్టర్ల దగ్గర అసిస్టెంట్ మాస్టర్గా వర్క్ చేశాను. ‘పుష్ప’ చిత్రంతో యాక్షన్ కొరియోగ్రాఫర్ అయ్యాను. ఆ సినిమా క్లైమాక్స్ సీక్వెన్స్ చూసి, ‘మా పేరు నిలబెట్టావ్’ అని రామ్–లక్ష్మణ్ మాస్టర్లు అన్నప్పుడు సంతోషంగా అనిపించింది. పుష్ప 2, మన శంకర వరప్రసాద్గారు, డెకాయిట్’ సినిమాలకు వర్క్ చేశాను. తాజాగా ‘పెద్ది’ సినిమా చేశాను. ఫస్ట్ గ్లింప్స్లో సరికొత్త బ్యాటింగ్ స్టైల్తో చరణ్గారు సిక్సర్ కొట్టే షాట్ను నేనే కంపోజ్ చేశాను. మా గురువుగారు రామ్–లక్ష్మణ్మాస్టర్లు ఈ సినిమాలోని ఓ పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ చేశారు. ఈ సినిమాలో ఓ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు చరణ్కి గాయమైంది. ఓ రోల్ మూమెంట్లో తనకి పొరపాటున అలా జరిగింది. ఆ క్షణంలో నేను ఏడ్చేశాను. కానీ, చరణ్ మాత్రం పొరపాటు తనవైపే ఉందని చెప్పారు. నిజంగా ఏ హీరో అలా ఒప్పుకోరు. తనకంటే ముందు ఎదురుగా ఉన్న ఫైటర్కి ఏమైందో చూడమని అందరికీ చెప్పారు. ఆయన కుట్లు వేయించుకుని మరుసటి రోజే షూట్కి వచ్చేశారు. నేనైతే షాక్ అయిపోయా.ఇందులో కుస్తీ సీక్వెన్స్ కోసం బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్గారి నాన్నగారు శ్యామ్ కౌశల్ను సంప్రదించాం. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ‘పెద్ది’ ప్రపంచంలోకి వెళ్లిపోతారు. ఎమోషన్స్కు కనెక్ట్ అవుతారు. ప్రస్తుతం నాని ‘ది ప్యారడైజ్’, విజయ్ దేవరకొండ ‘రౌడీ జనా ర్ధన’, చిరంజీవి–బాబీ, సల్మాన్ఖాన్–వంశీగార్ల సినిమాలు చేస్తున్నాను’’ అని అన్నారు. -
చిరంజీవి-బాబీ, రామ్ చరణ్-సుకుమార్.. హిట్ కాంబినేషన్ రిపీట్
ఓ సినిమా హిట్ అయిందంటే ఆ చిత్రకథానాయకుడు–దర్శకుడు, హీరో–హీరోయిన్... వీరిది ‘హిట్ కాంబినేషన్’ అనే ఇమేజ్ ఏర్పడుతుంది. ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హిట్ కాంబినేషన్స్ రిపీట్ ట్రెండ్ బాగా కొనసాగుతోంది. ఓ హీరో–ఓ డైరెక్టర్ కాంబినేషన్లో ఒక హిట్ మూవీ వచ్చిందంటే చాలు.. వారి కాంబినేషన్లో మరో సినిమా ఎప్పుడు వస్తుందా అనే ఆసక్తి సగటు సినీ ప్రేక్షకుల్లో ఉంటుంది. ఇప్పటికే తమకు హిట్ ఇచ్చిన దర్శకులతో పని చేయడానికి హీరోలు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. పైగా హిట్ హీరో–డైరెక్టర్ కాంబోని రిపీట్ చేసేందుకు నిర్మాతలు కూడా ఏమాత్రం ఆలోచించడం లేదు. ఎందుకంటే హిట్ కాంబినేషన్లో మరో మూవీ వస్తోందంటే బిజినెస్ పరంగానూ నిర్మాతలకు బాగా కలిసి వస్తుంది. అలాగే ప్రస్తుతం చిరంజీవి–బాబీ, వెంకటేశ్, కల్యాణ్ రామ్–అనిల్ రావిపూడి, బాలకృష్ణ– గోపీచంద్ మలినేని, రామ్చరణ్–సుకుమార్, నాని–శ్రీకాంత్ ఓదెల, విజయ్ దేవరకొండ–రాహుల్ సాంకృత్యాయన్, శ్రీ విష్ణు– రామ్ అబ్బరాజు వంటి హీరోలు–డైరెక్టర్స్ కాంబినేషన్స్ రిపీట్ అవుతున్నాయి. అయితే ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘సలార్’కి సీక్వెల్గా ‘సలార్ 2’, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రానున్న ‘కల్కి 2898 ఏడీ 2’, ఎన్టీఆర్–కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర 2’ వంటి సీక్వెల్ సినిమాలు కూడా రానున్నాయి. ఆ విధంగా వీరి కాంబినేషన్ రిపీట్ అవుతున్నట్లే. అయితే సీక్వెల్స్తో కాకుండా డైరెక్ట్ మూవీస్తో సిల్వర్ స్క్రీన్పై మరోసారి హిట్ మ్యాజిక్ని రిపీట్ చేయనున్న హీరోలు–దర్శకుల సినిమాల గురించి తెలుసుకుందాం. రెండోసారి... హీరో చిరంజీవి–డైరెక్టర్ బాబీ కొల్లిలది (కేఎస్ రవీంద్ర) హిట్ కాంబినేషన్ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. 2023 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన ఈ మూవీ మంచి హిట్గా నిలిచింది. ఈ చిత్రంలో చిరంజీవి తమ్ముడి పాత్రలో హీరో రవితేజ నటించడం విశేషం. ‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్ మూవీ తర్వాత చిరంజీవి– బాబీ కొల్లి కాంబినేషన్లో రెండో సినిమాకి శ్రీకారం చుట్టారు. చిరంజీవి కెరీర్లో 158వ చిత్రమిది. ‘చిరుబాబీ2’ అనే వర్కింగ్ టైటిల్తో ఈ మూవీని అనౌన్స్ చేశారు. కేవీఎన్ ప్రొడక్షన్స్పై వెంకట్ కె. నారాయణ ఈ సినిమా నిర్మించనున్నారు. ఈ మూవీకి సంబంధించి చిరంజీవి లుక్ టెస్ట్ని కూడా పూర్తి చేసినట్లు ఏప్రిల్ 28న చిత్రయూనిట్ ప్రకటించింది. ‘‘చిరుబాబీ2’ మరో ప్రతిష్టాత్మక ్ర΄ాజెక్ట్తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ మూవీ లుక్ టెస్ట్ విజయవంతంగా పూర్తయింది. ఈ సినిమాలో పవర్ఫుల్, స్ట్రైకింగ్ లుక్లో చిరంజీవి కనిపించబోతున్నారు. మాస్ ఎంటర్టైన్మెంట్ను తనదైన స్టైల్లో అద్భుతంగా అందించే బాబీ ఈసారి చిరంజీవి కోసం మరింత ఇంటెన్స్ క్యారెక్టర్ను డిజైన్ చేశారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ను మరింత ఎలివేట్ చేసేలా స్క్రిప్ట్ సిద్ధం అవుతోంది. ఈ కాంబినేషన్ నుంచి ఓ భారీ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ రాబోతోంది. ఈ చిత్రం ప్రారంభోత్సవానికి సంబంధించిన ముహూర్తం, రెగ్యులర్ షూటింగ్ వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత చిరంజీవి–బాబీ కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్పై ఇటు ట్రేడ్ వర్గాల్లో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి’’ అని చిత్రయూనిట్ తెలిపింది. కాగా ఈ చిత్రానికి ‘కాకాజీ’ అనే టైటిల్ పరిశీలనలో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే... ఈ నెల చివరి వారంలో ఈ సినిమాని ప్రారంభించి జూన్లో రెగ్యులర్ షూటింగ్ ఆరంభించనున్నారని టాక్. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతికి విడుదల చేయాలనే లక్ష్యంతో శరవేగంగా తెరకెక్కించనున్నారట బాబీ. క్రేజీ మల్టీస్టారర్ హీరో వెంకటేశ్–డైరెక్టర్ అనిల్ రావిపూడిలది క్రేజీ కాంబినేషన్ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘ఎఫ్ 2’. ఈ మూవీలో వరుణ్ తేజ్ మరో హీరోగా నటించారు. 2019 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజైన ఈ మూవీ థియేటర్లలో వినోదాల జల్లులు కురిపించింది. ‘ఎఫ్ 2’ వంటి హిట్ మూవీ తర్వాత వెంకటేశ్–వరుణ్ తేజ్లతో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘ఎఫ్ 3’ 2022 మే 27న రిలీజై విజయం సాధించింది. వెంకటేశ్ సోలో హీరోగా అనిల్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజైన ఈ చిత్రం బ్లాక్బస్టర్గా నిలిచింది. అంతేకాదు... వెంకటేశ్ తొలిసారి రూ. 300 కోట్ల క్లబ్లో చేశారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ‘మన శంకర వరప్రసాద్గారు’ సినిమాతో మరో హిట్ని తన ఖాతాలో వేసుకున్నారు అనిల్ రావిపూడి. చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రంలో వెంకటేశ్ వెంకీ గౌడ అనే కీలకమైన పాత్రలో అలరించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే... హీరోలు వెంకటేశ్–కల్యాణ్ రామ్ హీరోలుగా ఓ క్రేజీ మల్టీస్టారర్ మూవీని ప్రకటించారు అనిల్ రావిపూడి. ‘పటాస్’ (2015) సినిమాతో అనిల్ రావిపూడిని దర్శకుడిగా పరిచయం చేశారు కల్యాణ్ రామ్. పదేళ్ల తర్వాత వీరి కాంబినేషన్ రెండోసారి రిపీట్ అవుతుండటం విశేషం. ‘‘ఈ కొత్త చిత్రాన్ని క్లీన్, టిపికల్ ఎంటర్టైనర్గా అందరికీ కనెక్ట్ అయ్యే కథాంశంతో రూ΄÷ందించనున్నారు అనిల్ రావిపూడి. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే కంప్లీట్ ఎంటర్టైనర్లా ఉంటుంది. అనిల్ ట్రేడ్ మార్క్ స్టయిల్, హ్యూమర్, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్తో రూపొందించనున్న మా సినిమా 2027 సంక్రాంతికి ఫెస్టివ్ ట్రీట్గా నిలిచేలా ఉంటుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ–్ర΄÷డక్షన్ దశలో ఉంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది.పవర్ఫుల్ జడల్ హీరో నాని పూర్తి స్థాయి ఫుల్ మాస్ లుక్లో కనిపించిన చిత్రం ‘దసరా’. ఈ మూవీతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అయ్యారు. తొలి చిత్రంతోనే నాని వంటి క్లాస్ హీరోని ఊర మాస్ లుక్లో చూపించి, హిట్ అందుకున్నారు దర్శకుడు. ఎస్ఎల్వీ సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా 2023 మార్చి 30న విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. ‘దసరా’ వంటి హిట్ కాంబినేషన్ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మంచు మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు కీలక ΄ాత్రలు ΄ోషిస్తున్నారు. ‘దసరా’లో నానీని ఫుల్ మాస్ లుక్లో చూపించిన శ్రీకాంత్ ఓదెల ‘ది ప్యారడైజ్’లో అంతకు మించి అన్నట్లుగా రా రస్టిక్ పాత్రలో చూపించనున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో జడల్ అనే శక్తిమంతమైన ΄ాత్రలో నాని కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన స్టిల్లో నాని రెండు జడలు వేసుకుని, పక్కా మాస్ లుక్లో కనిపించగా మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో జరుగుతోంది. ఈ సినిమా తెలుగుతో ΄ాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ఆగస్టు 21న విడుదల కానుంది.మరోసారి... హీరో బాలకృష్ణ– డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం ‘వీర సింహారెడ్డి’. 2023 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ‘వీర సింహారెడ్డి’ వంటి హిట్ మూవీ తర్వాత వీరిద్దరి కలయికలో రూ΄÷ందుతోన్న ద్వితీయ చిత్రం ‘ఎన్బీకే 111’ (వర్కింగ్ టైటిల్). వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముంబయ్ నేపథ్యంలో సాగే స్టైలిష్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీ కథ ఉంటుందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని జన్వాడలో జరుగుతోంది. ఇప్పటివరకు జరిపిన షెడ్యూల్స్తో సుమారు 30 శాతం పూర్తయినట్లు సమాచారం. మిగిలిన భాగాన్ని కూడా వేగంగా పూర్తి చేసి, దసరా సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ΄్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఎన్బీకే 111’లో హీరోయిన్గా తొలుత నయనతార పేరు వినిపించింది. ఆ తర్వాత ఆమె స్థానంలో కాజల్ అగర్వాల్ నటించనున్నారనే వార్తలు కూడా వచ్చాయి. ఆర్సీ 17 కోసం... రామ్ చరణ్ కెరీర్లోని హిట్ మూవీస్లో ‘రంగస్థలం’ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ‘చిరుత’ (2007) ‘ధృవ’ (2016) వరకూ లవర్ బాయ్గా, స్టైలిష్ క్యారెక్టర్స్లో కనిపించిన ఆయన్ను ‘రంగస్థలం’ చిత్రంలో పూర్తి స్థాయి మాస్ లుక్లో చూపించారు సుకుమార్. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘రంగస్థలం’. 2018 మార్చి 30న విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది. ప్రత్యేకించి ఈ సినిమా కోసం ఫుల్ మాస్ లుక్లో రామ్చరణ్ మేకోవర్ అయిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. ‘రంగస్థలం’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత రామ్ చరణ్– సుకుమార్ కాంబినేషన్లో రెండో సినిమా ఎప్పుడు వస్తుందా అనే ఆసక్తి మెగా అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో నెలకొంది. ‘రంగస్థలం’ తర్వాత అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప: ది రైజ్’ (2021), ‘పుష్ప 2: ది రూల్’ (2024) వంటి సినిమాలు తెరకెక్కించి, పాన్ ఇండియా హిట్స్ అందుకున్నారు సుకుమార్. ఈ చిత్రాల తర్వాత రామ్ చరణ్ హీరోగా ‘ఆర్సీ 17’ (వర్కింగ్ టైటిల్) చేయనున్నారు సుకుమార్. ‘పుష్ప’ చిత్రాల తర్వాత ఆయన దర్శకత్వం వహించనున్న సినిమా కావడంతో ప్రకటనతోనే ‘ఆర్సీ 17’పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ‘పెద్ది’ రిలీజ్ తర్వాత ‘ఆర్సీ 17’ షూటింగ్లో పాల్గొంటారట రామ్ చరణ్. ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిందని సమాచారం. జూన్ 25 నుంచి ఈ మూవీ షూటింగ్ ్ర΄ారంభం కానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో కూడా సుకుమార్ ఒక వినూత్నమైన ΄ాయింట్ను ఎంచుకున్నట్లు తెలిసింది.ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేలా ఉంటుందని ఇన్సైడ్ టాక్. వాస్తవ ఘటనలతో... హీరో విజయ్ దేవరకొండ–డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాయన్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘టాక్సీవాలా’. 2017 నవంబరు 17న విడుదలైన ఈ మూవీ హిట్గా నిలిచింది. ‘టాక్సీవాలా’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ–రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో రూ΄÷ందుతోన్న రెండో చిత్రం ‘రణబాలి’. ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న భారీ ΄ాన్ ఇండియా మూవీ ఇది. 1854–1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూ΄÷ందుతోంది. మే 9న విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి మేకర్స్ స్పెషల్ మేకింగ్ గ్లింప్స్ రిలీజ్ చేయగా, అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంలోని హార్స్ రైడింగ్ సన్నివేశాల కోసం స్టాలియన్ బ్రీడ్ గుర్రాలపై స్వారీ చేయడానికి విజయ్ ఎలాంటి కఠినమైన శిక్షణ తీసుకున్నారు? ఈ క్రమంలో గాయాల్ని తట్టుకుని ఎలా విజయవంతంగా స్వారీ చేశారు? అన్నది ఈ గ్లింప్స్లో చూపించారు. ‘‘రణబాలి’లో ఈ సన్నివేశాలు స్క్రీన్ మీద చూసేందుకు చాలా బాగుంటాయి. అందుకే ఇలాంటి కష్టతరమైన సీన్స్ చేస్తున్నాను’ అని విజయ్ దేవరకొండ చెప్పారు. ‘‘19వ సెంచరీ నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ ΄ాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా ‘రణబాలి’ రూపొందుతోంది. రణబాలి పాత్రలో విజయ్ హార్స్ రైడింగ్ సీన్స్, భారీ యాక్షన్ సీక్వెన్సులు హైలైట్గా నిలుస్తాయి. సెప్టెంబరు 11న ఈ సినిమాని రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. -
చిరు లీక్స్.. 'పెద్ది' ట్రయిలర్కి ముందే పెంచేసిన హైప్
టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి చేసే లీక్స్కి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన తన సినిమాలే కాదు, ఇతర సినిమాల సంగతుల్ని కూడా అప్పుడప్పుడూ బయటపెడుతుంటారు. ఈసారి రామ్చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా ట్రయిలర్ విషయాలు ముందుగానే చెప్పేశారు. తాజాగా పెద్ది ట్రయిలర్ను చిరంజీవితో పాటు కొంతమంది మీడియా వ్యక్తులకు చూపించారు. ఆ విషయం అందరూ గోప్యంగానే ఉంచారు. అయితే మెగాస్టార్ మాత్రం ట్రయిలర్లోని ఓ కీలక డైలాగ్ను లీక్ చేశారు. “మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు, నేను పోరాడాను సార్” అనే డైలాగ్ ట్రయిలర్లో ఉంటుందని వెల్లడించారు. “సారీ బుచ్చి.. ట్రయిలర్ చూశాక కంట్రోల్ తప్పింది” అంటూ హాస్యంగా కొనసాగించారు. అంతేకాదు పెద్ది సినిమా ట్రయిలర్ 3 నిమిషాల నిడివి కలిగి ఉందని కూడా చిరంజీవి బయటపెట్టారు. చరణ్, దర్శకుడు బుచ్చిబాబు, సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ ముగ్గురూ తమ బెస్ట్ ఇచ్చారని ఆయన ప్రశంసించారు. ఆడియన్స్ ఊహించిన దానికంటే ఎక్కువగానే ట్రయిలర్ ఉంటుంది. అంతా కలిసి రఫ్ఫాడించారని మెగాస్టార్ ట్రయిలర్పై ఉన్న హైప్ను అమాంతం పెంచేశారు. ఈ నెల 18న రిలీజ్ కానున్న పెద్ది ట్రయిలర్పై చిరంజీవి చేసిన ఈ లీక్స్ ఫ్యాన్స్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. ఆయన రివ్యూ వల్ల ట్రయిలర్పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. -
రామ్చరణ్ చేతికి గాయం? హీరోకు ఏమైంది?
గేమ్ ఛేంజర్తో భారీ డిజాస్టర్ను మూటగట్టుకున్న రామ్చరణ్ ఈసారి పెద్దితో హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్ సినిమాపై అంచనాల్ని భారీగా పెంచేశాయి. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 4న విడుదల కానుంది. అయితే అప్పటివరకు గ్యాప్ లేకుండా భారీ ఈవెంట్లు ప్లాన్ చేసింది చిత్రయూనిట్. బ్యాండేజ్తో చరణ్?మే 18న ముంబైలో ట్రైలర్ లాంచ్తో ఈ ప్రమోషన్స్ జర్నీ మొదలు కానుంది. పలు నగరాల్లో అనేక ఈవెంట్లను ఏర్పాటు చేశారు. చివరగా జూన్ 2న హైదరాబాద్లో ప్రీరిలీజ్ ఫంక్షన్ జరగనుంది. ఈ క్రమంలోనే ముంబై వెళ్లిన రామ్చరణ్ చేతికి బ్యాండేజ్తో కనిపించాడు. శుక్రవారం నాడు ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ హెయిర్ స్టయిలిస్ట్ హకీం ఆలిం సెలూన్కు వెళ్లాడు చరణ్. చరణ్కు ఏమైంది?అనంతరం బయటకు వస్తుండగా అతడి కుడి చేతికి సపోర్ట్ బ్రేస్ (రిస్ట్ బ్యాండేజ్) ఉంది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో చరణ్కు ఏమైందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే షూటింగ్లో చరణ్ చేతికి చిన్న గాయమైందని, దాన్నుంచి త్వరగా కోలుకోవడానికే ఈ బ్యాండేజ్ ధరించాడని తెలుస్తోంది. #RamCharan - MAINTAINING HOLLYWOOD STAR LEVEL OF LOOKS - and Ram Charan is absolutely owning that long hair look🔥#ramcharan 💥 pic.twitter.com/SJ5IW73K9j— ROYAL BHARAT (INDIAN)🇮🇳 (@royal_mogile) May 16, 2026 చదవండి: స్క్రిప్ట్ చదివే అలవాటే లేదు: సల్మాన్ ఖాన్ -
పెద్ది మూవీ హీరోయిన్.. అందుకే దూరంగా ఉందా?
ప్రస్తుతం టాలీవుడ్లో అందరి చూపులు పెద్ది సినిమా వైపే ఉన్నట్లు కనిపిస్తోంది. రామ్ చరణ్ హీరోగా వస్తోన్న ఈ చిత్రం జూన్ 4న థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్తో ఫుల్ బిజీ అయిపోయారు. ఈ నెల 18న పెద్ది ట్రైలర్ రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. డైరెక్టర్ బుచ్చిబాబు సనా సైతం పెద్ది ప్రమోషన్స్లో ఫుల్ యాక్టివ్గా పాల్గొంటున్నారు. అంతేకాకుండా ట్రైలర్ కోసం మెగా ఫ్యాన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ నేపథ్యంలోనే పెద్ది మూవీ గురించి మరో చర్చ మొదలైంది. ఈ సినిమా హీరోయిన్ జాన్వీ కపూర్ ఎక్కడా కనిపించకపోవడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మూవీ ప్రమోషన్స్ వీడియోల్లోనూ జాన్వీ పెద్దగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో జాన్వీ పెద్ది ప్రమోషన్స్కు దూరంగా ఉండడంపై టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.కారణం అదేనా??అయితే జాన్వీ కపూర్ కేవలం భారీ రెమ్యూనరేషన్ కోసమే ఈ ప్రాజెక్టుకు సంతకం చేసిందని ఓ టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా సినిమాలో తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం వల్లే ప్రమోషన్లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని ఓ కథనంలో వెల్లడైంది.ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే ట్రైలర్ రిలీజ్కు వేడుకలోనైనా జాన్వీ కపూర్ కనిపించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ముంబయిలో ట్రైలర్ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఒకవేళ ప్రమోషన్ల విషయంలో జాన్వీ వెనక్కి తగ్గితే అది ఆమె కెరీర్పై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ‘పెద్ది’ లాంటి పాన్ ఇండియా చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే అవకాశాన్ని బాలీవుడ్ బ్యూటీ మిస్ చేసుకున్నట్లే. -
రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ ఈ ఫోటోలు చూశారా...(ఫొటోలు)
-
దేశవ్యాప్తంగా రయ్ రయ్మంటూ ‘పెద్ది’ ప్రచారం!
రామ్ చరణ్- బుచ్చిబాబు సాన కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ ‘పెద్ది’. ఈ సినిమాకు సంబంధించిన ప్రచారం రయ్ రయ్ మంటూ మొదలుకానుంది. ఇప్పటివరకు నిశ్శబ్దంగా సాగిన ప్రమోషన్లు మే 18 నుంచి వేగం అందుకోనున్నాయి. జూన్ 2 వరకు దశలవారీగా భారీ ఈవెంట్లు ప్లాన్ చేసినట్లు యూనిట్ ప్రకటించింది. ముందుగా మే 18న ముంబయిలో ట్రైలర్ లాంచ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి చరణ్ హాజరవుతాడు. ఆ తర్వాత మే 22న హైదరాబాద్ ఉప్పల్లో మరో భారీ ప్రచార కార్యక్రమం షెడ్యూల్ చేశారు. దీనికి కూడా చరణ్ హాజరవుతాడు. ఆ మరుసటి రోజు, అంటే మే 23న భోపాల్లో స్పెషల్ సాంగ్ రిలీజ్ జరగనుంది. మొదట భోపాల్లోనే ట్రైలర్ లాంచ్ చేయాలని అనుకున్నారు కానీ ప్లాన్ మార్చి అక్కడ పాట విడుదలకు నిర్ణయించారు. శృతిహాసన్, చరణ్పై చిత్రీకరించిన స్పెషల్ సాంగ్ను భోపాల్లో రిలీజ్ చేయనున్నారు. అయితే ఆ ఈవెంట్కు చరణ్ హాజరవ్వడం లేదట. శృతిహాసన్ మాత్రమే పాల్గొననుందని సమాచారం. ఇక తదుపరి ప్రచార కార్యక్రమాల విషయానికి వస్తే.. మే 24న బెంగళూరులో, మే 28న ఢిల్లీలో, మే 30న చెన్నైలో ఈవెంట్లు జరుగుతాయని సమాచారం. జూన్ 1న ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో ఓ ప్రత్యేక కార్యక్రమం ప్లాన్ చేస్తున్నారట. అలాగే జూన్ 2న హైదరాబాద్లో గ్రాండ్గా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ జరగనుంది. జూన్ 3న ప్రీమియర్స్తో ‘పెద్ది’ సందడి థియేటర్లలో మొదలవనుంది. ప్రస్తుతానికి యూనిట్ అనుకుంటున్న ప్రమోషనల్ ప్లాన్ ఇదే. అయితే రాబోయే రోజుల్లో ఈ షెడ్యూల్లో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇందులో చరణ్ ఎన్ని ఈవెంట్లకు హాజరవుతాడనే అంశంపై కూడా త్వరలోనే స్పష్టత రానుంది. మొత్తంగా, మే 18 నుంచి జూన్ 2 వరకు దేశవ్యాప్తంగా ‘పెద్ది’ ప్రచారం రయ్ రయ్మంటూ సాగనుంది. అభిమానుల్లో ఆసక్తి పెంచేలా యూనిట్ వ్యూహాత్మకంగా కార్యక్రమాలను అమలు చేస్తోంది. చరణ్-జాన్వి కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ ఓ ప్రత్యేక గీతంలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా ఇదే కావడంతో మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
టాలీవుడ్లో పర్సంటేజీ వివాదం.. పెద్ది మూవీకే ప్లస్ కానుందా?
ప్రస్తుతం టాలీవుడ్లో బిగ్ మూవీ రిలీజ్కు సిద్ధమైంది. సరిగ్గా ఈ సమయంలోనే టాలీవుడ్లో సమస్య మొదలైంది. సింగిల్ స్క్రీన్స్ ఎగ్జిబిటర్స్ తమకు పర్సంటేజీ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పెద్ది రిలీజ్కు ముందే టాలీవుడ్లో వివాదం ముదురుతోంది. అది కాస్తా నిర్మాతలు, ఎగ్జిబిటర్స్కు మధ్య వార్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఇది టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారంది. పెద్ది సమయంలో ఇలాంటి వివాదం తలెత్తడంతో నిర్మాతలు రవిశంకర్, నాగవంశీ ఫైరయ్యారు.ఇక వివాదం పక్కనపెడితే.. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ పెద్ది కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ మూవీ రిలీజ్పై ప్రభావం పడనుందా? అనే చర్చ మొదలైంది. ఇలాంటి పరిస్థితిలో ‘పెద్ది’ సినిమాకు స్క్రీన్ సమస్యలు రావొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చాలా సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు రెంటల్ సిస్టమ్కు వ్యతిరేకంగా పెద్దికి థియేటర్లు ఇవ్వొద్దనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. మరోవైపు ఈ వివాదం కూడా టాలీవుడ్కు ప్లస్ అవుతుందా? అని కొందరు భావిస్తున్నారు. టాలీవుడ్ ఫ్యూచర్కే టర్నింగ్ పాయింట్ అవుతుందా? అన్న చర్చ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. మేకర్స్ అదే ఛాలెంజ్ను అవకాశంగా మార్చుకుంటే? పీవీఆర్ ఐనాక్స్, ప్రసాద్స్, అల్లు సినిమాస్ వంటి ఇండిపెండెంట్ థియేటర్లలో మాత్రమే రిలీజ్ చేసి.. పరిమిత స్క్రీన్లతోనే భారీ కలెక్షన్లు కొడితే మాత్రం ఇండస్ట్రీ డైనమిక్స్ పూర్తిగా మారిపోవచ్చని అంచనా వేస్తున్నారు.ఎందుకంటే.. స్టార్ హీరోల సినిమాలు తక్కువ స్క్రీన్లతో సక్సెస్ అయితే.. భవిష్యత్తులో పెద్ద నిర్మాతలు సింగిల్ స్క్రీన్ నెట్వర్క్పై ఆధారపడే అవకాశాలు తగ్గే ఛాన్స్ ఉంది. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ లాంటి నిర్మాణ సంస్థ వద్ద ‘ఫౌజీ’, ‘డ్రాగన్’ లాంటి భారీ ప్రాజెక్టులు కూడా లైనప్లో ఉన్నాయి. ఈ వివాదం ఇలాగే కొనసాగితే.. చివరికి ఎక్కువ నష్టం ఎవరికి? నిర్మాతలకా? ఎగ్జిబిటర్లకా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఈ వివాదానికి ఎప్పుడు ఫుల్స్టాప్ పడుతుందో మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. -
పెద్ది రిలీజ్ ముందు ఈ గలాటా ఏంటి..!
-
‘పెద్ది’లో ఆటే కాదు.. అసలు కథే వేరే!
టాలీవుడ్ బాక్సాఫీస్ గత కొంతకాలంగా డల్ అయిపోయింది. చాలా వారాలుగా పెద్ద సినిమాలేవి విడుదల కావడం లేదు. చిన్న చిత్రాలేవి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో థియేటర్స్ దగ్గర సందడే కనిపించడం లేదు. మళ్లీ ఆ సందడి రావాలంటే ఓ భారీ చిత్రం రావాలి.. సూపర్ హిట్ కొట్టాలి. అందుకే ఇప్పుడు అందరి చూపులు ‘పెద్ది’వైపు ఉన్నాయి. చాలా రోజుల తర్వాత తెలుగు నుంచి విడుదల అవుతున్న పాన్ ఇండియా చిత్రం ఇది. జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఒక్క రోజు ముందే అంటే జూన్ 3నే ప్రీమియర్లతో పెద్ది సందడి మొదలవుంది. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలయ్యాయి. వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మే 18న ట్రైలర్ రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత రామ్ చరణ్ కూడా ప్రమోషన్లలో పాల్గొంటాడు. ఇలా నెల మొత్తం ఇండస్ట్రీలో పెద్ది టాపిక్కే నడుతుంది.ఇదిలా ఉండగా.. పెద్దికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఇది కేవలం గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాదట. అంతకు మించిన స్టోరీ సినిమాలో ఉందట. ఆటతో పాటు ఊరికి సంబంధించిన ఎమోషన్ని ఈ కథలో బలంగా చూపించబోతున్నాడట దర్శకుడు బుచ్చిబాబు. ఊరి బాగుకోసం హీరో ఏం చేశాడనేది ఈ సినిమా కథ. దానికి స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ని ఎంచుకొని.. అద్భుతమైన సన్నివేశాలను అల్లాడట బుచ్చిబాబు.కోచ్గా శివరాజ్ కుమార్, హీరో తండ్రిగా జగపతిబాబు పాత్రలను కూడా బలంగా తీర్చిదిద్దాడట. హీరోతో పాటు ఈ రెండు పాత్రల నిడివి కూడా ఎక్కువగానే ఉంటుందని సమాచారం. సినిమాలలో కీలక పాత్రల తీరు ఎలా ఉంటుందో ట్రైలర్లో చూపించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు పెద్ది కథ ఏంటి అనేది ఎవరికీ తెలియదు. ఎక్కడ లీక్ కూడా కాలేదు. ట్రైలర్ వస్తే కానీ అసలు ఈ సినిమా స్టోరీ ఏంటి అనేది తెలియదు. కుస్తీ, క్రికెట్ ఆటలకు ఈ కథతో ఉన్న సంబంధం ఏంటనేది కూడా ట్రైలర్లో చూపించే అవకాశం ఉంది. -
రామ్ చరణ్ పెద్ది.. నార్త్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ పెద్ది. ఈ మూవీలోని రామ్ చరణ్ పహిల్వాన్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడినా ఈ చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ మూవీకి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. పెద్ది ట్రైలర్ను మే 18న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు.తాజాగా ఈ మూవీ నార్త్ ఇండియా రైట్స్ను ప్రముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ దక్కించుకుంది. ఈ విషయాన్ని అఫీషియల్గా ప్రకటించారు. హీందీతో పాటు తెలుగు హక్కులను కూడా జియో స్టూడియోస్ సొంతం చేసుకుంది. కాగా.. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించనుంది. పెద్ది మూవీ స్పెషల్ సాంగ్లో కోలీవుడ్ భామ శృతిహాసన్ స్టెప్పులు వేయనుంది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. Excited to bring Peddi to theatres across North India in Hindi & Telugu.Peddi in cinemas worldwide on 4th June.#GetReadyForPeddi 💥💥Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli @bomanirani… pic.twitter.com/TvSYP8hRzt— Jio Studios (@jiostudios) May 12, 2026 -
PEDDI ఐటెం సాంగ్ అరాచకం..! చరణ్ అన్న ఇరగదీసాడు
-
వెయిటింగ్ ఈజ్ ఓవర్.. పెద్ది ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్ ప్రమోషన్స్తో బిజీ అయిపోయారు. ఈ నేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్ డేట్ను ప్రకటించారు.ఈనెల 18న పెద్ది మూవీ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని దర్శకుడు బుచ్చిబాబు సనా ప్రకటించారు. ఈ మేరకు పెద్ది మూవీ పోస్టర్ను పంచుకున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ బిగ్ ఈవెంట్ ఎక్కడనేది అనేది మాత్రం వెల్లడించలేదు. ఈ సారి పుష్ప-2 తరహాలో నార్త్లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే వేదికపై కూడా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.#PEDDI will stay in your hearts❤️TRAILER From 18th May💥💥#PEDDI WORLDWIDE RELEASE IN CINEMAS ON JUNE 4th, with PREMIERES on JUNE 3rd Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli @bomanirani… pic.twitter.com/4Ub5AiwEGH— BuchiBabuSana (@BuchiBabuSana) May 11, 2026 -
రామ్ చరణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'పెద్ది' ట్రైలర్ ఈవెంట్ డేట్ ఫిక్స్?
-
రామ్ చరణ్ పెద్ది గాయాల కథ...
-
పుష్ప-2 బాటలో పెద్ది.. రన్ టైమ్ అన్ని గంటలా?
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కనిపించనుంది. త్వరలోనే పెద్ది ట్రైలర్ను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ గ్లింప్స్, రామ్ చరణ్ లుక్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో బుచ్చిబాబు సనా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.తాజాగా ఈ మూవీ రన్టైమ్ నెట్టింట చర్చ మొదలైంది. ఈ సినిమా నిడివి దాదాపు 3 గంటల 20 నిమిషాలు ఉండనుందని తెలుస్తోంది. గతంలో రిలీజైన యానిమల్, కల్కి, పుష్ప-2, ఆర్ఆర్ఆర్ సినిమా రన్ టైమ్ కూడా 3 గంటలకు పైగానే ఉంది. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచాయి. తాజాగా ఈ రన్ టైమ్ చూస్తుంటే పెద్ది కూడా సూపర్ హిట్ కావడం ఖాయమని సినీ వర్గాల టాక్. అంతేకాకుండాఉత్తరాదిలో ట్రైలర్ రిలీజ్..పెద్ది ట్రైలర్ విషయంలో బుచ్చిబాబు పుష్ప-2 ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో పుష్ప-2 ట్రైలర్ను బిహార్లోని పాట్నాలో రిలీజ్ చేశారు. దీంతో నార్త్ ఆడియన్స్లోనూ ఓ రేంజ్లో వసూళ్లు సాధించింది. ఇప్పుడు అదే బాటలో పెద్ది మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ను ఈ నెల 17న ఇండోర్ లేదా పాట్నాలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని టాలీవుడ్లో ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. కాగా.. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
పెద్ది సెట్స్లో మెగాస్టార్ సందడి.. వీడియో వైరల్
రామ్ చరణ్ మూవీ పెద్ది షూటింగ్ సెట్లో మెగాస్టార్ సందడి చేశారు. షూటింగ్ సెట్కు వెళ్లిన దర్శకుడు బుచ్చిబాబు, సుకుమార్తో ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియోను బుచ్చిబాబు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ది బాస్, మై గురు పెద్ది సెట్స్లో అడుగుపెట్టారని.. ఇది నా జీవితంలో ఓ మధురమైన జ్ఞాపకమంటూ పోస్ట్ చేశారు. పెద్దిని ఆదర్శంగా తీసుకుని నా కండలు పెంచానని ఫన్నీగా రాసుకొచ్చారు. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ మూవీలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్లో కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ సందడి చేయనుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. త్వరలోనే పెద్ది ట్రైలర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.The BOSS and my GURU on sets of #Peddi...It's one of the best memories ❤️And yes...I've built a bit of muscle with my Peddi's inspiration 💪🏻😅@KChiruTweets Sir @AlwaysRamCharan Sir ❤️❤️❤️🤗🤗🤗 pic.twitter.com/gvgcNmkffZ— BuchiBabuSana (@BuchiBabuSana) May 8, 2026 -
ఇంకా ట్రైలర్ రాలేదు.. అప్పుడే పెద్ది రికార్డ్..!
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. గురువారం నుంచే ఓవర్సీస్ ఆడియన్స్కు టికెట్స్ బుకింగ్స్ అందుబాటులోకి వచ్చేశాయి.ఓవర్సీస్లో తొలి రోజే ఊహించని రెస్పాన్స్ వచ్చింది. రిలీజైన 24 గంటల్లోపే లక్ష టికెట్స్ బుకింగ్స్ పూర్తయ్యాయి. నార్త్ అమెరికాలో అభిమానులు టికెట్ల కోసం ఎగబడ్డారు. జూన్ 3వ తేదీన ప్రీమియర్ షోల టికెట్స్ ఓపెన్ అవ్వగా కేవలం కొన్ని గంటల్లోనే కొనేశారు. దీంతో ఉత్తర అమెరికాలో అత్యంత వేగంగా లక్షకు పైగా టికెట్స్ అమ్ముడైన చిత్రంగా పెద్ది నిలిచింది. ఇటీవలే ఈ మూవీ ఫైనల్ కాపీ కూడా రెడీ అయిందని మేకర్స్ వెల్లడించారు. త్వరలోనే పెద్ది ట్రైలర్ను రిలీజ్ చేయనున్నారు.ట్రైలర్ రిలీజ్ కాకపోయినా పెద్దికి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే రిలీజైన టీజర్ గ్లింప్స్, రామ్ చరణ్ లుక్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో బుచ్చిబాబు సనా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ALL TIME RECORD 💥#PEDDI - FASTEST $100K+ Pre-Sales for North America Premieres🔥🔥🔥#PEDDITakeOver 🧨⚡️MEGA POWERSTAR #RamCharan's MASS HYSTERIA 💥💥MASSIVE Release by @PrathyangiraUS, Premieres On JUNE 3rd 🔥@AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana… pic.twitter.com/NkA8VDFKwi— Prathyangira Cinemas (@PrathyangiraUS) May 8, 2026 -
రామ్ చరణ్ పెద్ది ట్రైలర్ రెడీ.. మూడో లుక్ పై సస్పెన్స్..
-
రామ్ చరణ్ 'పెద్ది' గాయాల కథ
పెద్ది సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ ఊహించని విధంగా గాయపడిన విషయం అప్పట్లో పెద్ద చర్చగా మారింది. కంటికి దెబ్బ తగిలిన వెంటనే అతడ్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చిన్నపాటి సర్జరీ చేసి ఇంటికి పంపించారు. ఒక్క రోజు విశ్రాంతి తీసుకుని చరణ్ మళ్లీ వెంటనే సెట్స్లో జాయిన్ కావడం అతడి ప్రొఫెషనలిజాన్ని చూపించింది. కంటిపైన ప్లాస్టర్తో చరణ్ కనిపించిన ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అభిమానులు ఎంతో బాధపడ్డారు. అయితే తాజాగా ఆ గాయానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకొచ్చాయి. చాలామంది అది క్రికెట్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో చరణ్కి బాల్ తగిలి గాయమైందని అనుకున్నారు. కానీ నిజానికి పహిల్వాన్ గెటప్లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు ఏదో బరువైన వస్తువు కంటికి తగిలి గాయం జరిగింది. ఆ గాయం ఇప్పటికీ చరణ్ కంటి పైభాగంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల ఓ సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అది బయటపడింది. చరణ్కి ఇది మాత్రమే కాదు, జిమ్లో వర్కవుట్ చేస్తున్నప్పుడు, 'చికిరి చికిరి' పాట షూటింగ్ సమయంలో కూడా గాయాల పాలయ్యాడని సమాచారం. ఇక పెద్ది విషయానికి వస్తే.. రామ్ చరణ్ గత చిత్రం ‘గేమ్ ఛేంజర్’ ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, ‘పెద్ది’పై అంచనాలు మాత్రం తగ్గలేదు. ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్ మంచి స్పందన తెచ్చుకోవడంతో సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని వచ్చే నెల 4న విడుదల చేయబోతున్నారు. త్వరలోనే ట్రయిలర్ రిలీజ్కానుంది. దాంతో ఇప్పుడు అందరి దృష్టి ట్రయిలర్పైనే ఉంది. ముఖ్యంగా చరణ్ మూడో లుక్ ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. -
మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చరణ్, సుకుమార్ సినిమా..
-
రామ్ చరణ్ పెద్ది.. ఫైనల్ కాపీ రెడీ.. ప్రీమియర్స్ ఎప్పుడంటే?
రామ్ చరణ్ పెద్ది మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ సినిమా జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఐటమ్ సాంగ్ షూటింగ్ కూడా పూర్తి కావడంతో మేకర్స్ ఫైనల్ కాపీని రెడీ చేస్తున్నారు. తాజాగా పెద్ది ఫైనల్ కాపీ కూడా పూర్తయిందని మేకర్స్ వెల్లడించారు. ఎడిటింగ్ పూర్తి కావడంతో ఎడిటర్తో కలిసి దర్శకుడు బుచ్చిబాబు దిగిన ఫోటోను షేర్ చేశారు.పెద్ది ఫైనల్ కాపీ సిద్ధం కావడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమా ప్రీమియర్స్ ఉన్నాయని నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ ప్రకటించింది. జూన్ 3న సాయంత్రం నుంచే పెద్ది ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలోని ప్రత్యేక సాంగ్లో కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ సందడి చేయనుంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించిన సంగతి తెలిసిందే. The #PEDDI Edit has been locked🔒All set and ready for massive premieres from JUNE 3rd 2026💥💥💥#PEDDI WORLDWIDE RELEASE IN CINEMAS ON June 4th ❤🔥#GetReadyForPeddi 💥💥Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman… pic.twitter.com/e240haEItl— Vriddhi Cinemas (@vriddhicinemas) May 7, 2026 -
పెద్ది కథ విన్నాక తేరుకోలేకపోయా..! ఆర్ట్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
-
‘పెద్ది’లో వాటిని గుర్తుపట్టలేరు.. నేనే షాకయ్యా : అవినాష్
‘‘పెద్ది’ కథ విని షాక్ అయ్యాను. నా పదేళ్ల కెరీర్లో ఒక సినిమా కథకు ఇంతలా ఎగ్జైట్ కావడం ఇదే తొలిసారి. ఈ సినిమా కథ అంతలా నన్ను కదిలించింది’’ అని తెలిపారు ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా. రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘పెద్ది’. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ సినిమా జూన్ 4న విడుదల కానుంది. బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో అవినాష్ కొల్లా మాట్లాడుతూ– ‘‘విజయనగరం నేపథ్యంలో 1970–1980 కాలంలో జరిగే కథ ఇది. గతంలో కొన్ని పీరియాడికల్ సినిమాలకు పని చేసిన అనుభవం నాకు ఉంది. అది ‘పెద్ది’కి ఉపయోగపడింది. ఈ సినిమాలో స్క్రాచ్ నుంచి వేసిన సెట్స్ 24 ఉంటాయి. అలా కాకుండా సెటప్స్ అయితే దాదాపు 60–70 పైనే ఉంటాయి. విజయనగరం ఏరియాలోని క్లాక్ టవర్, అక్కడి వీధులు... వీటన్నింటిని రీ క్రియేట్ చేశాం. విజయనగరం చుట్టుపక్కల ప్రాంతాలను కూడా డిజైన్ చేశాం. కుస్తీ సన్నివేశాల కోసం అండర్గ్రౌండ్ సెటప్ వేశాం. ఒక సినిమాకి సెట్ వేసినప్పుడు అది ప్రేక్షకులకు సెట్ అని తెలియకూడదు. నా వరకు ‘పెద్ది’ సినిమాకు వేసిన సెట్స్ను అవి సెట్స్ అని ప్రేక్షకులు గ్రహించలేరు. ఈ సినిమాకి ఓ హిల్ స్టేషన్లా ఉండే ఊరు కావాలి. ఈ సెట్ను హైదరాబాద్లోని బూత్ బంగ్లాలో వేశాం. ఈ సెట్ వేయడం సవాల్గా అనిపించింది. ప్రస్తుతం నానీగారి ‘ది ప్యారడైజ్’ సినిమా చేస్తున్నాను. అలాగే చిరంజీవి–బాబీగార్ల కాంబినేషన్లోని సినిమాకు వర్క్ చేస్తున్నాను’’ అని చెప్పారు. -
రామ్ చరణ్ 'పెద్ది' ట్రయిలర్ రెడీ.. మూడో లుక్పై సస్పెన్స్
రామ్ చరణ్- బుచ్చిబాబు సాన కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రెండు లుక్స్ విడుదలయ్యాయి. మొదట పల్లెటూరి క్రికెటర్గా, ఆ తర్వాత పహిల్వాన్ గెటప్లో కనిపించిన చరణ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఈ రెండింటికీ అదనంగా మూడో లుక్ కూడా ఉందన్న విషయం ఇటీవలే ప్రచారంలోకి వచ్చింది. కానీ దాన్ని మాత్రం చిత్రబృందం రహస్యంగా ఉంచుతోంది. తాజా సమాచారం ఏంటంటే పెద్ది సినిమా ట్రయిలర్ కట్ ఇప్పటికే రెడీ అయింది. దాన్ని ఈ నెల మూడో వారంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ట్రయిలర్లో మూడో లుక్ను చూపిస్తారా లేక సినిమా విడుదలయ్యాక థియేటర్లోనే చూడాలా అనేది ప్రస్తుతానికి మాత్రం సస్పెన్స్. దర్శకుడు బుచ్చిబాబు ఇప్పటివరకు ఈ సినిమా కథాంశంపై స్పష్టత ఇవ్వలేదు. కానీ ట్రయిలర్లో మాత్రం కథను కొంతవరకు టచ్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పెద్ది సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏఆర్ రెహమాన్ రీ-రికార్డింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శృతిహాసన్ ఓ ఐటెం సాంగ్ చేసింది. ‘గేమ్ ఛేంజర్’ ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, ‘పెద్ది’పై అంచనాలు మాత్రం తగ్గలేదు. ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్ మంచి స్పందన తెచ్చుకోవడంతో సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని వచ్చే నెల 4న విడుదల చేయబోతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ట్రయిలర్పైనే ఉంది. ముఖ్యంగా చరణ్ మూడో లుక్ ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. -
రామ్ చరణ్ - సుకుమార్ మూవీ క్రేజీ అప్డేట్.. మెగా ఫ్యాన్స్ కు పండగే..
-
థాంక్యూ చరణ్ బావ
-
మా బావ రామ్ చరణ్కి స్పెషల్ థాంక్స్ : లావణ్య త్రిపాఠి
‘ఎంతో బిజీగా ఉన్నప్పటికీ అడగగానే మా కోసం ‘సతీ లీలావతి’ట్రైలర్ రిలీజ్ చేయడానికి ఒప్పుకున్న మా బావ గారు రామ్ చరణ్కి థాంక్స్. ఆయన రిలీజ్ చేయడం వల్ల మా ట్రైలర్కి, మా సినిమాకు రీచ్ పెరిగింది’ అన్నారు మెగా కోడలు లావణ్య త్రిపాఠి. ఆమె, దేవ్ మోహన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సతీ లీలావతి’. ఈ చిత్రాన్ని మే 8న వరల్డ్ వైడ్గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో శనివారం నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేశారు.ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ .. ‘‘సతీ లీలావతి’ కోసం మేం పెట్టిన శ్రమ, మా ప్రేమ, మా కష్టం అంతా తెరపై ఆడియెన్స్ చూస్తారు. సత్య గారు, ఉదయ్ గారు మంచి కథను నా వద్దకు తీసుకు వచ్చారు. ‘సతీ లీలావతి’ అద్భుతంగా వచ్చింది. ఈ చిత్రం కోసం నాగ మోహన్ గారు చాలా కష్టపడ్డారు. నేను చిత్రీకరణ సమయంలో ప్రెగ్నెంట్ అని తెలిశాక టీం మొత్తం సపోర్ట్ చేసింది. మే 8న మా సినిమాని చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.దేవ్ మోహన్ మాట్లాడుతూ .. ఇందులో నేను పోషించిన పాత్ర చాలా కొత్తగా, డిఫరెంట్గా ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. లావణ్య గారితో నటించడం ఆనందంగా ఉంది. మే 8న మా సినిమా రాబోతోంది. అందరూ తప్పకుండా చూసి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో తాతినేని సత్య, నాగ మోహన్, తాగుబోతు రమేష్ , సప్తగిరి తదితరులు పాల్గొని మాట్లాడారు. -
'ఆ విషయంలో నన్ను క్షమించండి.. పెద్ది తీసేయడం అంత ఈజీ కాదు'
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న పెద్ది మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ మూవీని జూన్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఇవాళ విడుదల తేదీని రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని జూన్ 4న రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్గా వెల్లడించారు. హైదరాబాద్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన మేకర్స్ రిలీజ్ తేదీని ముందుకు తీసుకొచ్చారు. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన పెద్ది డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.బుచ్చిబాబు మాట్లాడుతూ.. 'ఏప్రిల్ 30న మేం రానందుకు నన్ను క్షమించండి. జూన్ 4న వస్తున్నందుకు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికీ థ్యాంక్ యూ సో మచ్. పెద్ది మీ అందరికీ కనెక్ట్ అవుతుంది. పెద్దిని మీ హృదయాల్లోంచి తీసేయడం అంత ఈజీ కాదు. జూన్ 4న చరణ్ సార్పై ఉన్న నా ప్రేమను చూస్తారు. ఈ అవకాశమిచ్చిన చరణ్ సార్కు ధన్యవాదాలు' తెలిపారు. ఈ ప్రెస్మీట్కు దర్శకుడు సుకుమార్, నిర్మాత సతీశ్ కిలారు, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కూడా హాజరయ్యారు. -
మెగా ఫ్యాన్స్కు పండగే.. కాస్తా ముందుగానే పెద్ది రిలీజ్
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న పెద్ది మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ మూవీని జూన్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఇవాళ విడుదల తేదీని రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని జూన్ 4న రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్గా వెల్లడించారు. దీంతో కాస్తా ముందుగానే పెద్దిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు.ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలోని ఐటమ్ సాంగ్లో కోలీవుడ్ భామ శృతిహాసన్ కనిపించనుంది. ఇప్పటికే ఈ సాంగ్ షూట్ కూడా పూర్తయింది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన పెద్దిని ఎట్టకేలకు జూన్ 4న బిగ్ స్క్రీన్పైకి తీసుకొస్తున్నారు. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న మెగా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. -
'పెద్ది'లో చరణ్ మూడో లుక్..? మెగా అభిమానులకు సర్ ప్రైజ్!
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం పెద్ది. పెద్దిపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు లుక్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాలో చరణ్కు మూడో లుక్ కూడా ఉందని తెలుస్తోంది. కానీ దాన్ని సీక్రెట్గా ఉంచుతున్నారట. ఈ విషయాన్ని రామ్ చరణ్ ఫిట్నెస్ ట్రయినర్ వెల్లడించినట్టు వార్తలు వస్తున్నాయి.పెద్ది సినిమా తొలి టీజర్లో చరణ్ పల్లెటూరి క్రికెటర్గా కనిపించాడు. ఇటీవల పెద్ది పహిల్వాన్ లుక్ ను కూడా విడుదల చేశారు. ఈ రెండూ మాత్రమే కాకుండా చరణ్కు ఈ చిత్రంలో మరో లుక్ కూడా ఉందనేది తాజా సమాచారం. ఈ మూడో లుక్ మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులందరికీ పెద్ద సర్ప్రైజ్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.ఇక ఇదిలా ఉంటే.. మరోవైపు పెద్ది విడుదల తేదీపై సస్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల స్వయంగా దర్శకుడు బుచ్చిబాబు జూన్ చివరి వారం రిలీజ్ అని ప్రకటించాడు. కానీ ఇప్పుడు కొత్త ఊహాగానం చెలరేగుతోంది. టాక్సిక్ విడుదల వాయిదా పడటంతో ఆ తేదీకి, అంటే జూన్ 4వ తేదీకి పెద్ది వస్తుందనే ప్రచారం మొదలైంది.చరణ్-జాన్వి కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ ఓ ప్రత్యేక గీతంలో కనిపించనుంది. ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా ఇదే కావడంతో మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
రామ్ చరణ్ పెద్ది.. రిలీజ్ డేట్ మారనుందా?
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పెద్ది. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా జూన్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని జూన్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామి బుచ్చిబాబు ఇటీవలే ఓ ఈవెంట్లో ప్రకటించారు. ఓ ఐటమ్ సాంగ్ షూట్ పెండింగ్లో ఉండగా.. దాదాపు అది కూడా ఈ రోజుతో పూర్తయింది. దీంతో మూవీ టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు.రిలీజ్ డేట్ మారే ఛాన్స్..?అయితే పెద్ది మూవీ కాస్తా త్వరగానే ప్రేక్షకుల ముందుకు రానుందని నెట్టంట టాక్ వినిపిస్తోంది. జూన్ 4 రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే ఆ రోజు విడుదల కావాల్సిన యశ్ టాక్సిక్ ఊహించినట్లే వాయిదా పడింది. దీంతో పెద్దిని 4 వ తేదీని రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే మెగా ఫ్యాన్స్కు పండగే. అనుకున్న టైమ్ కంటే ముందుగానే పెద్దిని బిగ్ స్క్రీన్పై చూసే అవకాశం రానుంది. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
పెద్ది, ది ప్యారడైజ్ చిత్రాలకు ఒకేరోజు లీకుల షాక్
టాలీవుడ్ అభిమానులు రెండు భారీ బడ్జెట్ సినిమాల విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ 'పెద్ది', నాని 'ది ప్యారడైజ్' ఈ రెండు చిత్రాలు ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద ఒకేసారి విడుదల కావాల్సి ఉండగా తర్వాత వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, ఒకేరోజు ఈ రెండు సినిమాల షూటింగ్ సెట్స్ నుంచి కొన్ని వీడియో క్లిప్ప్ లీక్ అయ్యాయి. దీంతో మేకర్స్ కూడా ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.దర్శకుడు బుచ్చిబాబు ఒక సినిమా ఈవెంట్లో మాట్లాడుతూ.. జూన్ 25న పెద్ది సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుందని తెలిపారు. ప్రస్తుతం స్పెషల్ సాంగ్ షూటింగ్ చేస్తున్నామని బుచ్చిబాబు అన్నారు. హైదరాబాద్లో వేసిన ఒక సెట్స్లో పెద్ది ఐటెమ్ సాంగ్ జరుగుతుంది. తాజాగా రామ్ చరణ్, శ్రుతి హాసన్ డ్యాన్స్ క్లిప్పింగ్స్ షూటింగ్ ప్రదేశం నుంచి లీక్ అయ్యాయి. పెద్ది ఐటెమ్ సాంగ్పై భారీ క్రేజ్ ఉంది. ‘ఆగడు’ సినిమాలో ‘జంక్షన్లో...’ అంటూ మహేష్ బాబుతో స్టెప్పులు వేసిన శ్రుతి హాసన్.. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు రెండోసారి ఐటెమ్ సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్లో క్రేజ్ను పెంచారు.నాని 'ది ప్యారడైజ్' నుంచి కూడా ఒక ఒక ఫైట్ సీన్ లీక్ అయింది. ఇలా రెండు భారీ సినిమాల నుంచి కొన్ని వీడియోలు లీక్ కావడంతో అభిమానులలో ఉత్సాహం పెరిగినప్పటికీ, చిత్రనిర్మాతలలో ఆందోళన నెలకొంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న 'ది ప్యారడైజ్' ఆగష్టు 21, 2026న రానుంది. -
రెండోసారి పెద్ది వాయిదా.. అసలు కారణం ఇదే..!
రామ్ చరణ్- బుచ్చిబాబు సనా కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడడంతో అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఓ ఐటమ్ సాంగ్ మినహా ఈ మూవీ షూట్ మొత్తం దాదాపు పూర్తయింది. ఈ స్పెషల్ సాంగ్లో కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ రామ్ చరణ్తో కలిసి డ్యాన్స్ చేయనుంది. అయితే పెద్ది మూవీ జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ రెండుసార్లు వాయిదా పడడంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అసలు కారణాలేంటని నెట్టింట తెగ వెతికేస్తున్నారు. ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్ వల్లే వాయిదా వేశారని కొందరు భావిస్తున్నారు. కానీ ఇతర కారణాల వల్లే రెండోసారి వాయిదా వేశారని అంటున్నారు. అసలు ప్రధాన కారణం ఇదేనని సోషల్ మీడియాలో వైరలవుతోంది.పెద్ది మూవీ ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్లో చరణ్ గెటప్కు సంబంధించిన సీజీ వర్క్ ఇంకా పూర్తి కాలేదని సమాచారం. అందువల్లే ఏప్రిల్ 30 నుంచి జూన్కు పోస్ట్పోన్ చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది. పీరియాడిక్ నేపథ్యానికి తగ్గనట్లుగా ప్రతి ఫ్రేమ్ను జాగ్రత్తగా రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అభిమానులకు మరింత అనుభూతి ఇచ్చేందుకే ఈ మూవీని వాయిదా వేయాల్సి వచ్చిందని మేకర్స్ చెప్పిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ సినిమాలో చెర్రీ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని జూన్ 25 రిలీజ్ చేయనున్నారు. -
టాలీవుడ్ అప్డేట్స్.. ఏ హీరో ఎక్కడున్నాడో తెలుసా?
టాలీవుడ్ నుంచి ఇప్పుడు వరుస పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలంతా ఇప్పుడు షూటింగ్లో బిజీ అయిపోయారు. వీరితో పాటు సీనియర్ హీరోలు నాగార్జున, బాలకృష్ణ, వెంకటెశ్ కూడా సమ్మర్లోనూ సెట్స్లోనే ఉంటున్నారు. మరి ఏ హీరో ఎక్కడ ఉన్నాడు? కొత్త సినిమాల షూటింగ్ ఎక్కడెక్కడ జరుగుతుంది? ఓ లుక్కేయండి.🎥 ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది🎥 అల్లు అర్జున్ అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న రాకా మూవీ షూటింగ్ ముంబై లో జరుగుతుంది. ప్రస్తుతం బన్నీ ముంబైలోనే ఉన్నాడు.🎥 ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. అక్కడ వేసిన ఓ సెట్లో కీలకమైన సన్నివేశలు షూట్ చేస్తున్నారు.🎥 రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా షూటింగ్ వన్ స్టూడియో శంకరపల్లి లో జరుగుతోంది. అక్కడే ఓ సెట్లో ఐటమ్ సాంగ్ షూట్ చేస్తున్నారు.🎥 నందమూరి బాలకృష్ణ మలినేని గోపీచంద్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ జన్వాడ గుంటూరు కారం సెట్ లో జరుగుతోంది.🎥 కార్తీక్ డైరెక్షన్లో నాగార్జున హీరోగా కెక్కుతున్న సినిమా షూటింగ్ ఎల్బీ నగర్ లో జరుగుతుంది. నాగార్జున కెరీర్లో 100వ సినిమా ఇది.🎥 వెంకటేష్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకర్స్ లో జరుగుతోంది.🎥 నాని శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ ముచ్చింతల్ లో జరుగుతుంది.🎥 విజయ్ దేవరకొండ రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో నటిస్తున్న రణబాలి సినిమా షూటింగ్ గండిపేట సెట్ లో జరుగుతుంది.🎥 రవితేజ శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కుతున్న ఇరుముడి సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది.🎥 శర్వానంద్ సంపత్ నంది కాంబోలో తెరకెక్కుతున్న భోగి సినిమా షూటింగ్ ముచ్చింతల్ లో జరుగుతోంది.🎥 రష్మిక , రవీంద్ర పుల్లే డైరెక్షన్ లో నటిస్తున్న మైసా సినిమా షూటింగ్ కేరళ లో జరుగుతోంది.🎥 శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ శంకర పల్లి లో జరుగుతుంది.🎥 గోపీచంద్ సంకల్ప్ రెడ్డి కాంబోలో తెరకెక్కుతున్న భరతవర్ష సినిమా షూటింగ్ అజీజ్ నగర్ లో జరుగుతోంది. -
'పెద్ది' సందేహాలన్నీ క్లియర్ చేసిన బుచ్చిబాబు
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా వాయిదా మీద వాయిదా పడుతూనే ఉంది. ఎట్టకేలకు జూన్లో వస్తుందని అధికారికంగా ప్రకటించారు గానీ తేదీ ఎప్పుడనేది ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు. అలానే ఐటమ్ సాంగ్ షూటింగ్ ఎప్పుడు చేస్తారు? అందులో చేసే బ్యూటీ ఎవరు? తదితర వివరాలపై స్పష్టత రాకపోయేసరికి అభిమానులు ఫ్రస్టేట్ అవుతున్నారు. ఇప్పుడు వీటన్నింటిపై దర్శకుడు బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చేశారు.(ఇదీ చదవండి: ఇవి ఉన్నాయి.. అవి వదిలేశా.. సమంత పోస్ట్ వైరల్)ధనుష్ 'కర' సినిమా ఈనెల 30న తెలుగు, తమిళంలో రిలీజ్ కానుంది. దీని ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఆదివారం రాత్రి హైదరాబాద్లో జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న దర్శకుడు బుచ్చిబాబు.. జూన్ 25న 'పెద్ది' సినిమా థియేటర్లలోకి వస్తుందని ప్రకటించాడు. అలానే ఐటమ్ సాంగ్ చిత్రీకరణ జరుగుతుందని చెప్పాడు. దీంతో చరణ్ అభిమానులు ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కథతో 'పెద్ది' తీస్తున్నారు. చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్. శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తుండగా.. జగపతిబాబు, దివ్యేందు తదితరుల ఇతర పాత్రలు చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ చేయగా అవి రెండూ సూపర్ హిట్ అయ్యాయి.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకుని షాకిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. భర్త ఎవరంటే?)#Peddi - 25th June 🔒#RamCharan pic.twitter.com/Jnrer2KFrY— Suresh PRO (@SureshPRO_) April 26, 2026 -
రామ్ చరణ్ పెద్ది రిలీజ్.. భారీ రికార్డ్కు మేకర్స్ ప్లాన్..!
రామ్ చరణ్- బుచ్చిబాబు సనా కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడడంతో అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఓ ఐటమ్ సాంగ్ మినహా ఈ మూవీ షూట్ మొత్తం దాదాపు పూర్తయింది. ప్రస్తుతం ఈ సాంగ్ను హైదరాబాద్లోనే షూట్ చేస్తున్నారు. ఈ స్పెషల్ సాంగ్లో కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ రామ్ చరణ్తో కలిసి స్టెప్పులు వేయనుంది.అయితే పెద్ది మూవీ జూన్లో రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అంతలోనే పెద్ది ప్రీమియర్స్కు సంబంధించిన మరో క్రేజీ టాక్ వినిపిస్తోంది. పెద్ది సినిమా ప్రీమియర్స్ విషయంలో కొత్త రికార్డ్ సెట్ చేయనుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జూన్ 24 న సాయంత్రం ఆరు గంటల నుంచే పెద్దఎత్తున ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ఈ విషయంపై మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మరోవైపు రామ్చరణ్ స్పెషల్ సాంగ్లో స్టెప్స్ ఫ్యాన్స్కు గూస్ బంప్స్ తెప్పిస్తాయని అంటున్నారు. దీంతో పెద్ది మూవీపై అభిమానుల్లో అంచనాలు మరింత పెంచేసింది. కాగా.. ఈ సినిమాలో చెర్రీ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. త్వరలోనే పెద్ది రిలీజ్ డేట్పై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. -
పెద్ది ఐటమ్ సాంగ్.. శృతి హాసన్కు భారీ రెమ్యునరేషన్..!
రామ్ చరణ్- బుచ్చిబాబు సనా కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడడంతో అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఓ ఐటమ్ సాంగ్ మినహా ఈ మూవీ షూట్ మొత్తం దాదాపు పూర్తయింది. పెద్ది ఐటమ్ సాంగ్ కోసం పలువురు హీరోయిన్స్ను పరిశీలించగా.. చివరికీ కోలీవుడ్ భామ శృతిహాసన్ పేరు ఖరారు చేశారు.ప్రస్తుతం ఈ సాంగ్ను హైదరాబాద్లోనే షూట్ చేస్తున్నారు. ఇవాళ ఈ సాంగ్ షూటింగ్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో శృతిహాసన్ రెమ్యునరేషన్పై టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ స్పెషల్ ఐటమ్ సాంగ్ కోసం దాదాపు రూ.3 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే ఈ కోలీవుడ్ బ్యూటీ జాక్పాట్ కొట్టేసినట్లే. కాగా.. ఈ పాటను టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కంపోజ్ చేస్తున్నారు. ఈ స్పెషల్ సాంగ్ను ఏప్రిల్ 30వ తేదీ నాటికి పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.కాగా.. పెద్ది మూవీ రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్కుమార్ సైతం కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తోన్న సంగతి తెలిసిందే. రెండుసార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని జూన్కు పోస్ట్పోన్ చేశారు. -
రామ్ చరణ్ పెద్ది రిలీజ్.. ఆ డేట్నే ఫిక్స్ చేశారా?
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీకి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఓ ఐటమ్ సాంగ్ మినహా దాదాపు షూటింగ్ అంతా పూర్తయింది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ రెండోసారి కూడా వాయిదా పడింది. ఏప్రిల్ 30న థియేటర్లలోకి రావాల్సిన పెద్దిని జూన్కు షిఫ్ట్ చేశారు.అయితే రిలీజ్ తేదీని మాత్రం అఫీషియల్గా ప్రకటించలేదు. దీంతో పెద్ది విడుదల తేదీపై నెట్టింట చర్చ మొదలైంది. ఈ మూవీ రిలీజ్ డేట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పెద్దిని జూన్ 25న విడుదల చేస్తారని లేటేస్ట్ టాక్. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుందన్న వార్త హల్చల్ చేస్తోంది. ఈ విషయంపై ఇప్పటి వరకు పెద్ది మేకర్స్ స్పందించలేదు. రాబోయే రోజుల్లో పెద్ది రిలీజ్ డేట్పై క్లారిటీ రానుంది.కాగా.. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలోని స్పెషల్ సాంగ్ కోసం శృతి హాసన్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. -
పెద్దిలో శృతి స్పెషల్ సాంగ్.. బుచ్చి ప్లాన్ మాములుగా లేదుగా
-
పెద్ది ఐటమ్ సాంగ్.. ఎట్టకేలకు స్టార్ హీరోయిన్ ఫిక్స్..!
రామ్ చరణ్ పెద్ది మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు రిలీజ్ వాయిదా వేయడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇంకా ఓ ఐటమ్ సాంగ్ షూట్ పెండింగ్లో ఉండడంతో ఏప్రిల్ 30న రావాల్సిన పెద్ది జూన్కు షిఫ్టయ్యాడు. అయితే ఇప్పటి వరకు ఐటమ్ సాంగ్ కోసం హీరోయిన్ ఎంపిక చేయకపోవడంతో ఫ్యాన్స్లో క్యూరియాసిటీ మరింత పెరుగుతోంది. రోజుకొక హీరోయిన్ పేరు వినిపిస్తున్న వీటిపై అధికారిక ప్రకటనైతే రాలేదు.ఇటీవలే సంయుక్త మీనన్ ఈ ఐటమ్ సాంగ్ చేయనుందని టాక్ వినిపించింది. గతంలో మృణాల్ ఠాకూర్, మానస అని పలువురు కూడా తెరపైకొచ్చాయి. కానీ అంతలోనే ఊహించని మరో స్టార్ హీరోయిన్ పేరు బయటకొచ్చింది. పెద్ది ఐటమ్ సాంగ్లో కోలీవుడ్ భామ శృతి హాసన్ చేయనుందని లేటేస్ట్ టాక్ నడుస్తోంది. దాదాపు శృతిని మేకర్స్ ఖరారు చేశారని తెలుస్తోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఒకవేళ ఇదే నిజమైతే పెద్ది సరసన శృతి హాసన్ చిందులేయనుంది. ఈ ఐటమ్ సాంగ్ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఫ్యాన్స్లో క్యూరియాసిటీ మరింత పెరిగింది. ఈ సాంగ్ కచ్చితంగా స్పెషల్గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాని బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నారు. -
'పెద్ది' ఇంకెన్నాళ్లు? అప్డేట్ ఇచ్చిన బుచ్చిబాబు
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా షూటింగ్ సాగుతూ..నే ఉంది. లెక్క ప్రకారం గత నెలలో రిలీజ్ అని చాన్నాళ్ల క్రితం ప్రకటించారు. తీరా డేట్ దగ్గరపడేసరికి నెల తర్వాత అంటే ఏప్రిల్ 30 పక్కా విడుదల చేస్తామని ఏకంగా పోస్టర్ వదిలారు. కొన్నిరోజుల ముందు మళ్లీ వాయిదా అని షాకిచ్చారు. జూన్లో వస్తుందని ప్రకటించారు కానీ డేట్ చెప్పలేదు. జూన్ కూడా వాయిదా పడొచ్చనే రూమర్స్ వినిపిస్తున్నాయి. సరిగ్గా ఈ టైంలో దర్శకుడు బుచ్చిబాబు.. షూటింగ్ అప్డేట్ ఇచ్చాడు. పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు డిస్ట్రబింగ్ సినిమా)మరో ఆరు రోజుల షూటింగ్ మాత్రమే మిగిలుందని చెప్పిన డైరెక్టర్ బుచ్చిబాబు.. 'మై పెద్ది' అని క్యాప్షన్ ఇచ్చి రామ్ చరణ్తో దిగిన ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇతడు చెప్పిన దానిబట్టి చూస్తే ఐటమ్ సాంగ్ చిత్రీకరణ చివరలో పెట్టుకున్నారనమాట. ఈ పాటలో చరణ్తో డ్యాన్స్ చేసేందుకు హీరోయిన్ సంయుక్తని తీసుకున్నారని రూమర్స్ వచ్చాయి. బహుశా ఈమెనే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. షూటింగ్ పూర్తయితే రెహమాన్ వర్క్ మొదలవుతుంది. ఈయన టైంకి ఔట్పుట్ డెలివరీ చేస్తేనే జూన్కి సినిమా వస్తుంది. లేదంటే మళ్లీ వాయిదా తప్పదు.విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీగా తీస్తున్న 'పెద్ది'లో చరణ్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లు. శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఇందులోని ఐటమ్ సాంగ్ కోసం మృణాల్ ఠాకుర్, మానస వారణాసి తదితరుల పేర్లు వినిపించాయి. ఈ స్పెషల్ సాంగ్ కోసం బ్యూటీ దొరక్కే షూటింగ్ ఇన్నాళ్ల పాటు ఆలస్యమైందనే టాక్ కూడా ఇండస్ట్రీలో ఉంది. ఏదైతేనేం ఎట్టకేలకు షూటింగ్ అయితే ముగించేస్తున్నారనమాట.(ఇదీ చదవండి: అందరూ ఫెయిల్! మలయాళీ సినిమాలే ఎందుకు ఆడుతున్నాయి?) View this post on Instagram A post shared by Buchi babu sana (@buchibabu_sana) -
'సారీ చరణ్.. మగధీర సినిమాలో చేయొద్దని చెప్పా'
డిస్కో శాంతి అప్పటి తెలుగు సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. ఐటం సాంగ్స్తో సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె అసలు పేరు శాంత కుమారిగా కాగా.. సినిమాల్లో నటనతో డిస్కో శాంతిగా ముద్రపడిపోయింది. 1965న జన్మించిన డిస్కో శాంతి దాదాపు 900కి పైగా చిత్రాలలో కనిపించింది. ఆమె ఎక్కువగా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, ఒడియా భాషల్లో నటించారు.టాలీవుడ్ హీరో శ్రీ హరితో పెళ్లి..ఐటమ్ సాంగ్స్తో ఫేమస్ అయిన డిస్కో శాంతి.. టాలీవుడ్ హీరో శ్రీహరిని 1996లో ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లయిన తర్వాత కుటుంబాన్ని చూసుకోవడానికే పరిమితమైంది. కానీ ఊహించని విధంగా శ్రీహరి అక్టోబరు 9, 2013న కాలేయ సంబంధ వ్యాధితో ముంబైలో కన్నుమూసిన సంగతి తెలిసిందే.మగధీరలో వద్దని బావకు చెప్పా..తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన డిస్కో శాంతి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. మగధీర చిత్రంలో సపోర్టింగ్ క్యారెక్టర్ చేయొద్దని బావ శ్రీహరికి చెప్పానని తెలిపింది. ఒక హీరో భార్యగా.. హీరో వేరు.. సపోర్టింగ్ క్యారెక్టర్ వేరు కదా అనే ఆలోచన నాలో ఉండేదని పేర్కొంది. రాజమౌళి సినిమాలో హీరోగా అయితే చేయమని చెప్పేదాన్ని.. కానీ సపోర్టింగ్ రోల్ అనే సరికి వద్దని చెప్పానని డిస్కో శాంతి వెల్లడించింది. మొదట బావ నాకు మగధీర కథ చెప్పలేదని తెలిపింది. కానీ మగధీర సినిమాలో ఈ క్యారెక్టర్ లేకపోతే సినిమానే లేదనే విషయం నాకు తర్వాత అర్థమైందని శాంతి చెప్పుకొచ్చింది. రాజమౌళి గారు ఈ క్యారెక్టర్ను ఎంత మనసు పెట్టి చేయించారోనని పంచుకుంది. కాగా.. డిస్కో శాంతి 1986లో తొలిసారి ఉదయగీతం చిత్రంలో నటించారు. మొదట కొన్ని సినిమాల్లో సహాయ నటిగా నటించింది. అదే సమయంలో ఐటెం సాంగ్స్లో నర్తించే అవకాశం వచ్చింది. దాదాపు 11 ఏళ్ల పాటు సినీ పరిశ్రమలో ఉన్నారు. అతని తండ్రి సీఎల్ ఆనందన్ సినిమాల్లో కూడా నటించాడు. తమిళం, తెలుగు సినిమాల్లో ప్రముఖ పాత్రలు పోషించారు. -
'పెద్ది' కష్టం.. 5 నిమిషాల సీన్కు 3నెలల సమయం
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘పెద్ది’.. దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జూన్లో విడుదల కానుంది. ఈ మూవీ కోసం పనిచేసిన ఫ్రేమ్ ఎక్స్ వీఎఫ్ఎక్స్ సంస్థ అధినేత నిలేష్ పలు వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇంగ్లీష్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన మూవీ వీఎఫ్ఎక్స్ పనిగురించి మాట్లాడారు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు ఈ మూవీని నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీత స్వరకర్త.పెద్ది సినిమా వీఎఫ్ఎక్స్ వర్క్కు సంబంధించి ఫ్రేమ్ ఎక్స్ అనే సంస్ధ పనిచేస్తుంది. మూవీలోని కొన్ని సీన్స్ గురించి ఆ సంస్థ అధినేత నిలేష్ పలు వ్యాఖ్యలు చేశారు.పెద్ది సినిమాలోని 5 నిమిషాల రెజ్లింగ్ సీన్ వీఎఫ్ఎక్స్ కోసం చాలా ఎక్కువ సమయం పడిందని ఆయన అన్నారు. ఈ సీన్ పూర్తి చేసేందుకు సుమారు 3నెలల సమయం పడినట్లు ఆయన గుర్తుచేసుకున్నారు. వీఎఫ్ఎక్స్ పని ఫ్రేమ్ వారీగా ఉంటుందని, ఒక నిమిషానికి 1440 ఫ్రేమ్లు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అందువల్ల, ప్రతి ఫ్రేమ్లో చేసిన మెరుగుదల పరిధిని బట్టి పని ఖర్చు మారుతుంది" అని ఆయన చెప్పారు.పెద్ది గురించి నిలేష్ ఇచ్చిన అప్డేట్ అభిమానులను ఖచ్చితంగా సంతోషపరుస్తుంది. ఎందుకంటే ఎలాంటి రాజీ లేకుండా ప్రేక్షకులకు సాధ్యమైనంత ఉత్తమమైన అనుభూతిని అందించాలనే లక్ష్యంతో చిత్ర బృందం విఎఫ్ఎక్స్ (VFX) కోసం తగినంత సమయాన్ని కేటాయిస్తోంది. పెద్ది మూవీలో రామ్చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలక పాత్రలలో కనిపించనున్నారు. -
'పెద్ది' ఐటమ్ కోసం ఊహించని హీరోయిన్?
రామ్ చరణ్ 'పెద్ది' సినిమాకు మామూలు కష్టాలు లేవు. మార్చి, ఏప్రిల్లో రిలీజ్ అనుకుంటే రెండుసార్లు వాయిదా పడింది. జూన్లో కచ్చితంగా వస్తుందని నిర్మాత ప్రకటించారు కానీ తేదీ ఎప్పుడు అనేది ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు 'పెద్ది'తో కాలు కదిపేందుకు ఐటమ్ సాంగ్ హీరోయిన్ దొరకట్లేదు. మృణాల్, మానస అని పలువురు బ్యూటీస్ పేర్లు గతంలో వినిపించగా ఇప్పుడు ఊహించని భామ పేరు తెరపైకి వచ్చింది.(ఇదీ చదవండి: 'పెద్ది' కొత్త రిలీజ్ డేట్ ఫిక్సయిందా?)మలయాళ భామ సంయుక్తని ప్రస్తుతం 'పెద్ది' ఐటమ్ కోసం పరిశీలిస్తున్నారట. ఈమె అయినా ఫిక్సవుతుందా లేదా అనేది పక్కనబెడితే సంయుక్త పేరు మాత్రం ఎవరూ ఊహించి ఉండరు. కెరీర్ ప్రారంభం నుంచి పెద్దగా గ్లామర్ చూపించని ఈమె.. గత చిత్రం 'అఖండ 2'లో జాజికాయ అంటూ సాగే పాటలో మాత్రం అందాలన్ని ఆరబోసింది. అటు డ్యాన్స్, ఇటు అందంతో ఆకట్టుకుంది. బహుశా ఆ సాంగ్ చూసి 'పెద్ది' కోసం అడిగారేమో అనిపిస్తుంది.సంయుక్త హీరోయిన్గా చేసిన 'స్వయంభు'.. పాన్ ఇండియా విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు 'బ్లాక్ గోల్డ్' అనే లేడీ ఓరియెంటెడ్ తెలుగు మూవీ చేస్తోంది. విజయ్ సేతుపతితో చేసిన 'స్లమ్ డాగ్' కూడా రిలీజ్ కావాల్సి ఉంది. హిందీ, తమిళ, మలయాళంలో తలో చిత్రం చేస్తోంది.భీమ్లా నాయక్, బింబిసార, సర్, విరూపాక్ష, నారీ నారీ నడుమ మురారీ తదితర చిత్రాలతో సక్సెస్లు అందుకున్న సంయుక్త.. 'పెద్ది'లో ఐటమ్ సాంగ్ చేస్తే మాత్రం కచ్చితంగా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ అవుతుంది.(ఇదీ చదవండి: లెజెండరీ డైరెక్టర్ ఇలా అయిపోయారేంటి? వైరల్ వీడియో) -
లేట్ అయినా లేటెస్ట్గా...
చిత్ర పరిశ్రమలో సినిమాకి కొబ్బరికాయ కొట్టిన రోజే విడుదల తేదీ ప్రకటిస్తుంటారు కొందరు మేకర్స్. మరికొందరు సినిమా షూటింగ్, ఔట్పుట్, పోస్ట్ ప్రోడక్షన్ పనులు పూర్తయ్యే సమయాన్ని బట్టి రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తుంటారు. ఇంకొందరేమో సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి, క్రిస్మస్ వంటి పండగలతో పాటు వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని తమ సినిమాలను ఫలానా తేదీకి విడుదల చేస్తామని ప్రకటిస్తుంటారు. అయితే చెప్పిన తేదీకి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పరిస్థితులు ఒక్కోసారి ఉండక పోవచ్చు.షూటింగ్స్ ఆలస్యం, పోస్ట్ ప్రోడక్షన్, వీఎఫ్ఎక్స్, డేట్స్ క్లాష్... వంటి కారణాల వల్ల సినిమాల విడుదల తేదీల్లో మార్పులు చేర్పులు జరుగుతుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో కామన్ అయింది. ఏది ఏమైనా కానీ కంటెంట్, ఔట్పుట్, క్వాలిటీ... ఇలా ఏ విషయంలోనూ తగ్గేదే లే అంటూ లేట్ అయినా లేటెస్ట్గా వస్తాం అంటున్నారు తమ సినిమా విడుదలను వాయిదా వేసుకున్న కొందరు దర్శక–నిర్మాతలు. ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’, ఎన్టీఆర్ ‘ఎన్టీఆర్నీల్’, రామ్చరణ్ ‘ పెద్ది’, నాని ‘ది ప్యారడైస్’, అఖిల్ ‘లెనిన్’, నిఖిల్ ‘స్వయంభు’, సాయిదుర్గా తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’, తమిళ హీరో విజయ్ ‘జన నాయగన్’ వంటి సినిమాల విడుదల తేదీలు ముందే ఖరారు అయినప్పటికీ వాయిదా పడ్డాయి. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం... విశ్వంభర ఎప్పుడు? చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ‘శుభలేఖ’ సుధాకర్, కునాల్ కపూర్, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి, రావు రమేశ్, రాజీవ్ కనకాల తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించినప్పటికీ చివరి నిమిషంలో వాయిదా వేశారు. తనయుడు రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ సినిమా కోసం తన ‘విశ్వంభర’ విడుదలని వాయిదా వేసుకున్నారు చిరంజీవి. రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గేమ్ చేంజర్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10న రిలీజ్ చేశారు. ‘‘గేమ్ చేంజర్’ సినిమా కోసం ‘దిల్’ రాజుగారు అడగడంతో ‘విశ్వంభర’ సినిమా విడుదలను వాయిదా వేశాం’’ అంటూ నిర్మాతల్లో ఒకరైన విక్రమ్ రెడ్డి గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. 2025 సంక్రాంతికి విడుదల వాయిదా పడిన ‘విశ్వంభర’ వేసవిలో విడుదలవుతుందని అందరూ భావించినప్పటికీ రిలీజ్ కాలేదు. 2025 మే 9న సినిమా విడుదల కానుందనే వార్తలు గతంలో వినిపించాయి. ఆ తర్వాత జూలై 24న ‘విశ్వంభర’ థియేటర్లలోకి రానున్నట్లు ప్రచారం జరిగినప్పటికీ రాలేదు. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో భారీ గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్కి ప్రాధాన్యం ఉందట. ఈ పనుల ఆలస్యం వల్లే రిలీజ్ పోస్ట్ పోన్ అయినట్లు చిత్రయూనిట్ పేర్కొంది. 2025 జనవరి 10న రిలీజ్ వాయిదా పడిన ‘విశ్వంభర’ కొత్త విడుదల తేదీపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తన పుట్టినరోజున (ఆగస్టు 22) చిరంజీవి ఓ వీడియో రిలీజ్ చేసి, ‘‘చందమామ కథలాంటి ‘విశ్వంభర’ సినిమా 2026 వేసవిలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది’’ అని స్పష్టం చేశారు. ఇప్పటికే వేసవి మొదలైనప్పటికీ ఈ చిత్రం విడుదల తేదీపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు మేకర్స్. మరి... ‘విశ్వంభర’ ప్రేక్షకుల ముందుకు వచ్చేదెన్నడు? అనే ప్రశ్నకు సమాధానం కోసం మరికొన్ని రోజులు నిరీక్షణ తప్పదు. జూన్లో ఎన్టీఆర్ నీల్? ‘దేవర: పార్ట్ 1’ వంటి హిట్ మూవీ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్ 1, 2, సలార్’ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ మూవీకి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ మేకోవర్ అయిన తీరు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఓ పాత్రలో కాస్త బొద్దుగా కనిపించే ఆయన మరో పాత్ర కోసం బాగా సన్నబడ్డారు. జిమ్లో వర్కౌట్ చేస్తున్న ఫొటోని ఇటీవల ఆయన షేర్ చేయగా కండలు తిరిగిన దేహంతో ఉన్న ఈ పిక్ వైరల్గా మారింది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతిదీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మూడువేల మంది జూనియర్ ఆర్టిస్టులతో చిత్రీకరించిన ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్, అలాగే సుమారు 2000 మందితో తెరకెక్కించిన ఓ పాట, హైదరాబాద్ సమీపంలోని ఓ స్టూడియోలో సుమారు రూ. 15 కోట్ల తో ఎన్టీఆర్ ఇంటి సెట్ని నిర్మించడం హైలెట్గా మారాయి. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతోన్న ఈ పాన్ ఇండియన్ మూవీని 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తొలుత ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తేదీకి సినిమాని రిలీజ్ చేయడం లేదని యూనిట్ ప్రకటించింది. జనవరి 9న కాకుండా జూన్ 25న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ జూన్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తుందా? లేదా అన్నది వేచి చూడాలి. జూన్లో పెద్ది రెడీరామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండి యన్ మూవీ ‘పెద్ది’. తొలి సినిమా ‘ఉప్పెన’తో (2021) బ్లాక్బస్టర్ అందుకున్న బుచ్చిబాబు సానా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. జగపతిబాబు, శివ రాజ్కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. రూరల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ కోసం రామ్చరణ్ ఫుల్æమాస్ లుక్లోకి మారి పోయారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్లకి అద్భుతమైన స్పందన వచ్చింది.ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి రిలీజైన ‘చికిరి చికిరి..., రై రై రారా...’ పాటలు చార్ట్ బస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘పెద్ది’ నుంచి విడుదల చేసిన రామ్ చరణ్ శక్తివంతమైన కొత్త పోస్టర్కి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే... రామ్చరణ్ బర్త్ డే కానుకగా 2026 మార్చి 27న ‘పెద్ది’ మూవీని విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తొలుత ప్రకటించినప్పటికీ వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఏప్రిల్ 30న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసినప్పటికీ రెండోసారి వాయిదా వేశారు.జూన్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ‘‘మాపై మీరు (ప్రేక్షకులు) చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. మీ ఓపికకు తగిన ప్రతిఫలం దక్కేలా అత్యుత్తమమైన కంటెంట్తో వస్తాం. విడుదల తేదీని త్వరలోనే వెల్లడిస్తాం’’ అని ‘పెద్ది’ చిత్రయూనిట్ పేర్కొంది. ఇదిలా ఉంటే... సినిమాలోని టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. కేవలం ఒక స్పెషల్ సాంగ్ షూటింగ్, నేపథ్య సంగీతం మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆగస్టులో ప్యారడైస్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘దసరా’. ఈ చిత్రంలో నానీని ఫుల్ మాస్ లుక్లో చూపించారు శ్రీకాంత్ ఓదెల. కీర్తీ సురేష్ హీరోయిన్గా నటించిన ఈ మూవీని ఎస్ఎల్వీ సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. 2023 మార్చి 30న విడుదలైన ఈ మూవీ బ్లాక్బస్టర్ అందుకుంది. ‘దసరా’ వంటి హిట్ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ది ప్యారడైస్’. ఈ మూవీలో మంచు మోహన్బాబు, రాఘవ్ జుయల్ కీలక పాత్రలు పోషి స్తున్నారు.పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో జడల్ అనే శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు నాని. ఇప్పటికే విడుదల చేసిన స్టిల్లో నాని రెండు జడలు వేసుకుని, పక్కా మాస్ లుక్లో కనిపించగా అద్భుతమైన స్పందన వచ్చింది. నాని లుక్, స్టోరీ, టేకింగ్... ఇలా ప్రతిదీ వైవిధ్యంగా ఉండేలా తెరకెక్కిస్తున్నారు శ్రీకాంత్ ఓదెల. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ఈ ఏడాది మార్చి 26న విడుదల చేయనున్నట్లు తొలుత చిత్రయూనిట్ ప్రకటించింది.అయితే మార్చి 27న రామ్ చరణ్ ‘పెద్ది’ విడుదల అవుతుండటంతో డేట్స్ క్లాష్ అయ్యే కారణం వల్ల ఈ మూవీ రిలీజ్ ఉండక పోవచ్చనే చర్చ జరిగింది కూడా. అనుకున్నట్టుగానే ఈ మూవీ విడుదల వాయిదా పడింది. ఆగస్టు 21న రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలు, పాటలు, ఫైట్స్ దాదాపు పూర్తయినప్పటికీ టాకీ పార్ట్ షూటింగ్ బ్యాలెన్స్ ఉందట. అందుకే లేట్ అయినా క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా లేటెస్ట్గా ఆడియన్స్ ముందుకు రావాలన్నది మేకర్స్ ఆలోచన.ఇదిలా ఉంటే.. ఆగస్టు 21న ‘ది ప్యారడైస్’ రిలీజ్ డేట్కి వరుసగా మూడు వారాల పాటు ఓనం, మిలాద్–ఉన్–నబీ, రాఖీ, శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి పండగలు కలిసి రానున్నాయి. ఈ సెలవులు తమ సినిమాకి కలిసొస్తాయని చిత్రబృందం భావించి, ఈ తేదీ ఫిక్స్ చేసినట్లు టాక్. కాగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి నానీపై ఇప్పటికే విడుదల చేసిన ‘ఆయా షేర్..’ అంటూ సాగే ఇంట్రో సాంగ్కి అద్భుతమైన స్పందన వచ్చింది. లెనిన్ డేట్ ఫిక్స్అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘లెనిన్’. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రదర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పీ, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ‘లెనిన్’ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రాయలసీమ నేపథ్యంలో రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా కోసం పక్కా మాస్ లుక్లోకి మారి పోయారు అఖిల్. పోడవాటి హెయిర్ స్టైల్, గెడ్డంతో మేకోవర్ అయిన లుక్ ఆకట్టుకుంటోంది. పైగా రాయలసీమ యాసలో అఖిల్ చెప్పిన డైలాగులకు కూడా మంచి స్పందన వస్తోంది.తమన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన తొలి సాంగ్ ‘వారేవా వారేవా...’కి చాలా మంచి స్పందన వచ్చింది. అదే విధంగా ఈ నెల 16న ఈ మూవీలోని ‘ఎట్టా ఎట్టా..’ అంటూ సాగే సెకండ్ సాంగ్ను రిలీజ్ చేశారు. అఖిల్, భాగ్యశ్రీ బోర్సే మధ్య కెమిస్ట్రీ ఈ పాటలో హైలైట్గా నిలిచింది. అఖిల్ తన మాస్ స్టెప్స్తో అదరగొట్టగా, భాగ్యశ్రీ తన చార్మ్తో మెప్పించారు. ఇదిలా ఉంటే... ‘లెనిన్’ని మే 1న విడుదల చేయనున్నట్లు తొలుత అధికారికంగా ప్రకటించింది యూనిట్. అయితే రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదలను మార్చి 27 నుంచి ఏప్రిల్ 30కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో రెండు సినిమాల మధ్య కేవలం ఒక రోజు మాత్రమే గ్యాప్ ఉండటంతో ‘లెనిన్’ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ మూవీ విడుదలను మే 1వ తేదీ నుంచి జూన్ 26వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు మేకర్స్. అయితే అనూహ్యంగా ‘పెద్ది’ సినిమా కూడా ఏప్రిల్ 30 నుంచి జూన్కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. కానీ తేదీ మాత్రం ఖరారు కాలేదు. ఈ లెక్కన చూస్తే ఇటు ‘పెద్ది’, అటు ‘లెనిన్’ సినిమాలు జూన్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ‘‘పూర్తి వినోదాత్మకంగా రూపొందుతోన్న చిత్రం ‘లెనిన్’. బలమైన భావోద్వేగాలు, ఆకట్టుకునే కథతో మురళీ కిశోర్ తెరకెక్కిస్తున్నారు. మా మూవీ ప్రేక్షకులకు మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. మేలో స్వయంభు ‘కార్తికేయ 2’ (2022) సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకోవడంతో పాటు అదే స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరో నిఖిల్ సిద్ధార్థ. ఆ సినిమా తర్వాత ఆయన నటించిన మరో పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభు’. నిఖిల్ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్గా ఈ మూవీ రూపొందింది. ఈ సినిమాకి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్పై భువన్, శ్రీకర్ నిర్మించారు. భారీ పీరియాడిక్ యాక్షన్ చిత్రంగా రూపొందిన ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లో 2026 ఫిబ్రవరి 13న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ తొలుత అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే టాకీ పార్ట్ షూటింగ్ బ్యాలెన్స్ వల్ల ఫిబ్రవరి 13 నుంచి ఏప్రిల్ 10కి విడుదల వాయిదా వేశారు. కానీ ఆ తేదీకి కూడా రిలీజ్ని పోస్ట్ పోన్ చేశారు. అయితే కొత్త విడుదల తేదీ ఎప్పుడనే విషయాన్ని చిత్రయూనిట్ స్పష్టం చేయాలి. వార్తల్లో ఉన్న ప్రకారం మేలో విడుదలయ్యే చాన్స్ ఉంది. ఇదిలా ఉంటే... నిఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ వారియర్ పాత్రలో కనిపించనున్నారాయన. ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రోడక్షన్ పనులు, విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా పూర్తి కాక పోవడంతో రిలీజ్ వాయిదా పడిందని ఫిల్మ్నగర్ టాక్.ఈ మూవీని 2డీ, త్రీడీ ఫార్మాట్లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. ‘కేజీఎఫ్’, ‘సలార్’ మూవీస్ ఫేమ్ రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ‘‘దర్శకుడు భరత్ కృష్ణమాచారి తన విజన్ను ‘స్వయంభు’లో భారీ స్థాయిలో ప్రజెంట్ చేశారు. ప్రత్యేకించి యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తాయి. ‘స్వయంభు’ మూవీ పాన్ ఇండియా స్థాయిలో త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది’’ అని యూనిట్ పేర్కొంది. సంబరాలు ఎప్పుడు?సాయిదుర్గా తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటించగా, జగపతి బాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘హను–మాన్’ (2024) వంటి పాన్ ఇండియన్ హిట్ మూవీ నిర్మించిన ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ‘సంబరాల ఏటిగట్టు’ రూపొందించారు. యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రం కోసం సాయిదుర్గా తేజ్ ప్రత్యేకంగా కండలు తిరిగిన దేహంతో, గుబురు గడ్డంతో ఫుల్గా మేకోవర్ అయ్యారు. ‘సంబరాల ఏటిగట్టు’ సినిమాని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో 2025 సెప్టెంబరు 25న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తొలుత ప్రకటించింది. అయితే ఆ తేదీకి రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. అనంతరం పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది? అనే విషయంపై చిత్రబృందం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు.పైన పేర్కొన్న సినిమాలే కాదు... మరికొన్ని చిత్రాల విడుదల తేదీల్లోనూ మార్పులు జరిగే అవకాశం లేక పోలేదు. – డేరంగుల జగన్ మోహన్ -
'పెద్ది' కొత్త రిలీజ్ డేట్ ఫిక్సయిందా?
రామ్ చరణ్ 'పెద్ది' చిత్రానికి కష్టాలు మామూలుగా లేవు. తొలుత మార్చిలో రిలీజ్ అన్నారు. పని ఇంకా పూర్తవ్వకపోయేసరికి ఏప్రిల్ చివరలో కచ్చితంగా విడుదల చేస్తాం అని మాటిచ్చారు. తీరా ఈసారి కూడా మాట తప్పి జూన్లో థియేటర్లలోకి వస్తామని అధికారికంగా ప్రకటించారు. ఈసారి తేదీ వెల్లడించనప్పటికీ బయట రూమర్స్ మాత్రం వినిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: తల్లి కాబోతున్న మరో తెలుగు సీరియల్ హీరోయిన్)ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రకారం.. 'పెద్ది' మూవీని జూన్ 4న థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారట. ఈ తేదీ దాదాపుగా ఖరారు అయినప్పటికీ పనులన్నీ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత దీనిని అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. అయితే ఈ డేట్కి వస్తామని ఇప్పటికే యష్ 'టాక్సిక్' సినిమా ఖర్చీఫ్ వేసుకుంది. మరి 'పెద్ది' కూడా అదే తేదీకి వస్తే రెండు పాన్ ఇండియా చిత్రాల మధ్య పోటీ నెలకొంటుంది. అప్పుడు ఇద్దరిలో పైచేయి ఎవరిది అవుతుందో చూడాలి?స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న 'పెద్ది'లో చరణ్.. క్రికెట్, కుస్తీ క్రీడాకారుడిగా కనిపించబోతున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా కన్నడ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నాడు. బుచ్చిబాబు దర్శకుడు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడేసరికి చాలామంది దీనిపై మెల్లగా ఆసక్తి తగ్గుతోంది. ఒకవేళ మూడోసారి కూడా వాయిదా పడితే గనుక మరింత డ్యామేజీ కావడం గ్యారంటీ. మరి టీమ్ ఈసారి ఏం చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: 'దేవర 2' కంటే ముందు కొరటాల నుంచి మరో హిట్ సినిమా సీక్వెల్?) -
'అదే నాన్నలో చాలా ప్రత్యేకం'.. మెగాస్టార్పై తనయుడి ప్రశంసలు
టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా మరోసారి వాయిదా వేశారు. జూన్లో ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఒక పాట మినహాయిస్తే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది. మరింత థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసమే వాయిదా వేస్తున్నామని నిర్మాణ సంస్థ నోట్ రిలీజ్ చేసింది.అయితే ఇటీవలే గ్లోబల్ స్టార్ మరో అరుదైన ఘనత సాధించారు. జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ఈ ఘనత అందుకున్న హీరోగా నిలిచాడు. ప్రముఖ ఈ స్క్వేర్ ఇండియా మ్యాగజైన్పై రామ్ చరణ్ ఫోటోను ముద్రించారు. అంతకుముందు కేవలం ఎన్టీఆర్ ఫోటో మాత్రమే ఈ మ్యాగజైన్లో ప్రచురించారు. తాజాగా ఈ ఘనతను మన రామ్ చరణ్ అందుకున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.తన తండ్రి మెగాస్టార్ చిరంజీవిపై రామ్ చరణ్ ప్రశంసలు కురిపించారు. నాన్న ఎంతో మందిపై ప్రభావం చూపారని అన్నారు. ప్రతిరోజు ఆయనను చూస్తూ పెరగడం వల్ల నాపై ప్రభావం మరింత ఎక్కువగా ఉందన్నారు. నా జీవితంలో రియల్ హీరో నాన్నే అని వెల్లడించారు. కుటుంబంతో పాటు సినీ ఇండస్ట్రీలో ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే.. ముందు స్పందించే వ్యక్తి ఆయనేనని తెలిపారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకు వెళ్లడం నాన్న నైజమన్నారు.నాన్న వారసత్వాన్ని మేము చాలా సులభంగానే అందిపుచ్చుకున్నామని రామ్ చరణ్ తెలిపారు. ఎంత స్టార్డమ్ ఉన్నా ఇంటి దగ్గర అందరి తండ్రుల్లాగే సింపుల్గా ఉండేవారని.. అదే ఆయనతో చాలా ప్రత్యేకమైన విషయమన్నారు. ఇక సినిమా కోసం రోజులో కేవలం నాలుగు గంటలే నిద్రపోయిన సందర్భాలు చాలా ఉన్నాయని వెల్లడించారు. అదే సమయంలో వరుస షూటింగ్ల నుంచి మూడు రోజులు విరామం తీసుకుని కుటుంబ సభ్యులతో సమయం గడిపేవారని అన్నారు. ఆయన అటు పని.. ఇటు ఫ్యామిలీని సమన్వయం చేసేవారని చెర్రీ పేర్కొన్నారు. ఈ విషయంలో తాను కూడా నాన్ననే ఫాలో అవుతున్నానని రామ్ చరణ్ స్పష్టం చేశారు. -
పెద్ది స్పెషల్ సాంగ్ లో మృణాల్ ఫిక్స్.. హింట్ ఇచ్చిన చెర్రీ..!
-
అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు రామ్ చరణ్.. ప్రముఖ మ్యాగజైన్పై గ్లోబల్ స్టార్ (ఫోటోలు)
-
పెద్ది మరోసారి వాయిదా...రామ్ చరణ్ అనుకున్నదే జరిగింది.
-
అనుకున్నదే జరిగింది.. పెద్ది మరోసారి వాయిదా
రామ్ చరణ్ పెద్ది విషయంలో అనుకున్నదే జరిగింది. ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది మూవీ టీమ్. ఈ చిత్రాన్ని జూన్కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. దీంతో మెగా ఫ్యాన్స్కు మరోసారి నిరాశే ఎదురైంది. మార్చి 19న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఏప్రిల్ 30న రానుందని ముందుగా ప్రకటించారు. తాజాగా మరోసారి వాయిదా వేశారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ నోట్ రిలీజ్ చేసింది.నిర్మాణ సంస్థ తమ నోట్లో రాస్తూ.. 'మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు. గ్లింప్స్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పెద్ది మూవీ పట్ల మీ ప్రేమకు చాలా సంతోషంగా ఉన్నాం. ఇప్పటికే సినిమా టాకీ పార్ట్ పూర్తయింది. కేవలం ఓ సాంగ్ షూట్ మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడే ఎడిట్ కాపీని చూశాం. అద్భుతంగా వచ్చింది. కానీ మీకు మరింత అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అందించడం కోసం కృషి చేస్తున్నాం. మరింత ఫర్ఫెక్షన్తో మీ ముందుకొస్తాం. జూన్లో పెద్దిని మీ ముందుకు తీసుకొస్తాం. విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం. మీ సపోర్ట్, ఓపికకు మరోసారి ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు.కాగా.. ఈ సినిమాకు ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో గ్లోబల్ స్టార్ చెర్రీ రెజ్లర్ లుక్లో అభిమానులను ఆకట్టుకున్నారు.We want to give our audience nothing but the best.#PEDDI in cinemas this June ❤🔥 pic.twitter.com/jA5aq7dnW0— Vriddhi Cinemas (@vriddhicinemas) April 15, 2026 -
అయ్యప్ప దీక్ష నా వ్యక్తిత్వాన్ని మార్చేసింది
-
చిరంజీవి వారసత్వం, పిల్లల పెంపకంపై చరణ్ వ్యాఖ్యలు
మెగా హీరో రామ్ చరణ్ తాజాగా ప్రముఖ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ కవర్ పేజీపై స్టైలీష్గా కనిపించారు. ఈ క్రమంలోనే వారికి ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. అందులో తన సినిమాలతో పాటు కుటుంబ విషయాలను పంచుకున్నారు. గతంలో ఇదే మ్యాగజైన్లో జూనియర్ ఎన్టీఆర్ మెరిశారు. తర్వాత ఆ గౌరవాన్ని అందుకున్న నటుడిగా చరణ్ రికార్డ్ క్రియేట్ చేశారు.పిల్లలను స్ట్రాంగ్గా పెంచుతానురామ్ చరణ్- ఉపాసన దంపతులకు మొదట క్లింకార జన్మించగా రీసెంట్గా కవలలు (ఒక బాబు, ఒక పాప) కలిగిన విషయం తెలిసిందే.. శివ రామ్ కొణిదెల, అన్వీర దేవి కొణిదెల అని నామకరణం కూడా చేశారు. అయితే, పిల్లల పెంపకంపై చరణ్ ఇలా చెప్పుకొచ్చారు. 'ఇంట్లో పిల్లలు చేసే అల్లరిని చూసి వాళ్లను మరింత ఎంకరేజ్ చేస్తాను. వారి విషయంలో నేను కాస్త రఫ్గానే ఆలోచిస్తాను. పిల్లలను దూకనిస్తాను.. వారు పడిపోయినప్పటికీ మళ్లీ నిలబడేలా చూస్తాను. మట్టిలో ఆటలాడినా.. ఎత్తుపల్లాలు ఎక్కినా నేను అసలు భయపడను. వాళ్లు చిన్నతనం నుంచే ధైర్యంతో పాటు సాహసం నింపుకొని పెరగాలని ఆశిస్తాను. కానీ, వాళ్ల అమ్మ చాలా సున్నితంగా చూసుకుంటుంది. పిల్లల విషయంలో ఎక్కువ కంగారుపడుతుంది. అయితే, వాళ్ల అమ్మ ఎప్పుడైనా తిట్టినప్పుడు క్లీంకార నా దగ్గరకు వచ్చేస్తుంది.' అని తెలిపారు.నాన్న చెప్పడంతోనే అయ్యప్ప దీక్షఅయ్యప్ప దీక్ష గురించి కూడా రామ్ చరణ్ పలు విషయాలు పంచుకున్నారు. నాన్న (చిరంజీవి) సూచనతో 17ఏళ్ల వయసులో తొలిసారి అయ్యప్ప దీక్ష ప్రారంభించినట్లు చరణ్ గుర్తుచేసుకున్నారు. తన ఆలోచనలతో పాటు క్రమశిక్షణను అయ్యప్ప దీక్ష పెంచిందని ఆయన అన్నారు. చిరంజీవి వారసత్వంతో పాటు కష్టపడి పనిచేయడం కూడా తాను తీసుకున్నట్లు పేర్కొన్నారు. -
'పెద్ది' సర్ప్రైజ్.. పదేళ్ల తర్వాత మళ్లీ చరణ్తో సినిమా
రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న క్రేజీ మూవీ ‘పెద్ది’. కొద్దిరోజుల క్రితం విడుదలైన గ్లింప్స్ వీడియో సినిమాపై భారీ బజ్ను క్రియేట్ చేసింది. దీంతో పెద్ది రాక కోసం సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే, తాజాగా ఈ ప్రాజెక్ట్లోకి సీనియర్ నటుడు కీలక పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడైంది. సడెన్ సర్ప్రైజ్ ఇచ్చేలా ఉన్న ఈ అప్డేట్ చాలామందిలో ఆసక్తిని పెంచుతుంది.గ్రామీణ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న 'పెద్ది'లో సినీయర్ నటుడు సాయికుమార్ నటిస్తున్నారని క్లారిటీ వచ్చేసింది. ఇటీవల ఒక అభిమాని చిత్రీకరించిన వీడియోతో ఈ చిత్రంలో ఆయన కూడా భాగమని వెల్లడైంది. పదేళ్ల క్రితం విడుదలైన 'ఎవడు' తర్వాత రామ్ చరణ్తో ఆయన తిరిగి కలవడం ఇదే మొదటిసారి. ఈ వార్త అభిమానులను ఉత్సాహపరుస్తున్నప్పటికీ, ఆయన పాత్ర వివరాలు ఇంకా గోప్యంగానే ఉన్నాయి. ఈ అంశం పెద్దిపై మరింత క్రేజ్ పెంచుతోంది. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణపు చివరి దశలో ఉంది. ఇంకా ఒక ప్రత్యేక గీతాన్ని చిత్రీకరించాల్సి ఉంది. అది పూర్తయిన తర్వాత, చిత్ర బృందం కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివరాజ్కుమార్, జగపతిబాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రలలో నటిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్పై, ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో ఘనంగా విడుదల చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఏప్రిల్ 30న ‘పెద్ది’ విడుదల కానుందని ప్రకటించారు. అయితే, మరోసారి వాయిదా పడే ఛాన్స్ ఉంది. -
చరణ్ సినిమా.. ఆదిత్య ధర్–భన్సాలీ పేర్ల హడావిడి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లైనప్పై బాలీవుడ్ నుంచి వరుసగా లీకులు వస్తున్నాయి. ఇప్పటివరకు సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉందనే క్లారిటీ ఉండగా, తాజాగా ఆదిత్య ధర్ – సంజయ్ లీలా భన్సాలీ పేర్లు వినిపించడం ఆసక్తికరంగా మారింది. ధురంధర్-2 వంటి సూపర్ హిట్ తర్వాత ఆదిత్య ధర్ ఒక మల్టీస్టారర్ కథను సిద్ధం చేస్తున్నాడని, అందులో రామ్ చరణ్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కథ చాలా కాలంగా పెండింగ్లో ఉంది. అయితే ఇప్పుడు చరణ్ పేరు మరోసారి తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ – చరణ్ కాంబోపై కూడా వార్తలు వస్తున్నాయి. అటవీ నేపథ్యంలో హిస్టారికల్ అడ్వెంచర్ కథను భన్సాలీ తెరకెక్కించే అవకాశం ఉందని కథనాలు వస్తున్నాయి. గతంలో ‘మహారాజా సుహేల్ దేవ్’ అనే ప్రాజెక్ట్పై వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. అయితే అది ఎందుకో కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మళ్లీ ఈ కాంబోపై చర్చ మొదలవడంతో అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే దర్శకుడు సుకుమార్, చరణ్తో చేయాల్సిన సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడం వల్లే ఈ గాసిప్పులు ఎక్కువయ్యాయి. చరణ్ బర్త్డే సందర్భంగా ఏదైనా ప్రకటన వస్తుందని అభిమానులు ఆశించారు. కానీ అలాంటిదేం జరగలేదు. దాంతో బాలీవుడ్ వైపు నుంచి వరుసగా ఇలాంటి లీకులు వస్తున్నాయి. -
పెద్దిలో స్పెషల్ సాంగ్..?
-
అశ్వత్థామగా రామ్ చరణ్.. ఆదిత్య ధర్ తో చర్చలు
-
పెద్ది ఐటమ్ సాంగ్.. టాలీవుడ్ యంగ్ హీరోయిన్కు ఛాన్స్.!
రామ్ చరణ్ పెద్ది మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీని రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్లో ఈ స్టోరీ ఉండనుంది. ఇటీవల రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. రామ్ చరణ్ రెజ్లర్ లుక్ హైలెట్గా నిలిచింది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ 30న పెద్ది థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో ఓ స్పెషల్ ఐటమ్ సాంగ్ కూడా ఉండనుంది. ఈ పాటకు ఇప్పటికే మృణాల్ ఠాకూర్ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.తాజాగా టాలీవుడ్లో మరో యంగ్ హీరోయిన్ పేరు వినిపిస్తోంది. ఇటీవలే కపుల్ ఫ్రెండ్లీ మూవీలో హిట్ కొట్టిన మానస వారణాసిని ఎంపిక చేసేందుకు మొగ్గు చూపుతున్నారని టాక్. యంగ్ హీరోయిన్ అయితే ఈ పాట మరింత హైలెట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సాంగ్ చేసేందుకు మృణాల్ ఠాకూర్ నో చెప్పినట్లు సమాచారం. అయితే మానస వారణాసి ఎంపికపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అంతకుముందు మానస వారణాసి మహేశ్ బాబు మేనల్లుడు గల్లా జయదేవ్ హీరోగా నటించిన 'దేవకీ నందన వాసుదేవ' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. -
'పెద్ది'.. అనుకున్నదే జరగనుంది!
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా ఇప్పటికే రెండోసారి వాయిదా పడింది. ఈ నెల 30న థియేటర్లలోకి రావాల్సి ఉంది. అయితే చెప్పినట్లు వస్తుందా రాదా అనేది ఇప్పటికీ సస్పెన్సే. రీసెంట్గానే ఓ మూవీ ప్రమోషన్లలో భాగంగానే 'పెద్ది' కూడా టైంకి వస్తుందని చెప్పండ్రా అంటూ స్వయంగానే చరణే అన్నాడు. కానీ తర్వాత హనుమాన్ జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో తేదీ ఏం వేయలేదు. దీంతో కొత్త అనుమానాలు పుట్టుకొచ్చాయి.(ఇదీ చదవండి: 'అశ్వత్థామ'గా రామ్చరణ్.. ఆదిత్య ధర్తో చర్చలు?)ప్రస్తుతం చాలామంది అభిప్రాయపడుతున్నట్లే 'పెద్ది' మరోసారి వాయిదా పడటం దాదాపు కన్ఫర్మ్ అయిందని తెలుస్తోంది. జూన్ నెలలోనే తొలివారం లేదా చివరి వారాన్ని పరిశీలిస్తున్నారట. రాబోయే రెండు మూడు రోజుల్లో ఈ విషయాన్ని టీమ్ అధికారికంగా ప్రకటించబోతుందని టాక్. ఇది జరగడానికి చాలానే కారణాలున్నాయి. అందులో మొదటిది షూటింగ్ సమయానికి పూర్తి కాకపోవడం. ఇప్పటికీ ఓ పాట షూటింగ్తో పాటు రీ రికార్డింగ్ పనులు పెండింగ్లో ఉన్నాయి.పాన్ ఇండియా మూవీ కాబట్టి అందుకు తగ్గట్లే దేశమంతా తిరిగి ప్రమోషన్లు చేయాల్సి ఉంది. చేతిలో మరో 20 రోజులు కూడా లేవు. ఇన్ని పనులు పూర్తి చేసి సినిమాని 30వ తేదీన తీసుకురావడం కష్టమే అనిపిస్తుంది. అందుకు జూన్ 4 లేదా 25వ తేదీకి వాయిదా పడనుందనే రూమర్స్ మళ్లీ వస్తున్నాయి. ఇకపోతే స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన 'పెద్ది'లో జాన్వీ కపూర్ హీరోయిన్. కన్నడ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. జగపతిబాబు, దివ్యేందు ఇతర కీలక పాత్రలు చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు. ఇప్పటికే రిలీజైన రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. బుచ్చిబాబు దర్శకుడు.(ఇదీ చదవండి: అక్షయ్ కుమార్ 'భూత్ బంగ్లా' ట్రైలర్ రిలీజ్) -
'అశ్వత్థామ'గా రామ్చరణ్.. ఆదిత్య ధర్తో చర్చలు?
బాలీవుడ్లో రాబోయే భారీ ప్రాజెక్టులపై ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ‘యూరి: ది సర్జికల్ స్ట్రైక్’తో బిగ్ హిట్ అందుకున్నాడు దర్శకుడు ఆదిత్య ధర్. కొంతకాలం క్రితం ‘ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ అనే కథను తెరపైకి తీసుకురావాలని ప్రయత్నించాడు. ఆ సమయంలో జియో స్టూడియోస్తో ఒప్పందం కుదుర్చుకుని, ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరిగింది. అయితే ఆ సమయంలో కొన్ని అనివార్య కారణాలతో ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది. ఆ ప్రాజెక్టుకు రామ్చరణ్ పేరు బలంగా వినిపించింది. అప్పుడే ‘ఆర్ఆర్ఆర్’ విజయంతో ఆయనపై బాలీవుడ్ దృష్టి పడింది. అశ్వత్థామ పాత్రకు చరణ్ సరైన ఎంపిక అవుతాడని అంతా అనుకున్నారు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ ఈ కథపై చర్చలు మొదలయ్యాయి. దానికి కారణం.. ఆదిత్య ధర్ రూపొందించిన ‘ధురంధర్’ ఫ్రాంచైజీ. ధురంధర్ చిత్రం రెండు భాగాలతో భారీ విజయాన్ని సాధించిన ఆదిత్య ధర్పై నిర్మాణ సంస్థలు నమ్మకం పెంచుకున్నాయి. కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ‘ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మెగా ఫ్యాన్స్ మాత్రం అప్పటి పుకారు ఇప్పుడు నిజమవ్వాలని కోరుకుంటున్నారు. రామ్చరణ్ ఈ ప్రాజెక్టులో భాగమైతే, బాలీవుడ్లో మరో భారీ అడుగు వేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. -
చరణ్, నాని.. షేర్ ఎవరు..?
ది ప్యారడైజ్ సినిమాలోని ఆయా షేర్ పాట ప్రేక్షకులను మెప్పించింది. యూట్యూబ్ లైక్ల విషయంలో రామ్ చరణ్ ‘పెద్ది’లోని ‘చికిరి చికిరి’ పాటను చాలా తక్కువ సమయంలోనే అధిగమించింది. డిజిటల్ వ్యూస్ పరంగా అరుదైన మైలురాయిని చేరుకుంది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పెద్ది’. ఇందులోని ‘చికిరి చికిరి’ (Chikiri Chikiri) అంటూ సాగే ఈ పాట 24గంటల్లోనే 46 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక్కరోజులో ఇన్ని వ్యూస్ సాధించిన తొలిసాంగ్గా రికార్డు నెలకొల్పింది.ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ‘పెద్ది’ పాట (తెలుగు) నాలుగు నెలల్లో 13,32,838 లైక్లను సాధించింది. దీనితో పోలిస్తే, అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన ‘ఆయా షేర్ (తెలుగు)’ పాట విడుదలైన కేవలం ఒక నెలలోనే 13,35,424 లైక్లను దాటింది. సంఖ్యాపరంగా ఈ వ్యత్యాసం స్వల్పంగా ఉన్నప్పటికీ లాంగ్ రన్లో మరింత ఈ నంబర్ పెరగవచ్చు. అయితే, వ్యూస్ పరంగా చికిరి పాట 197 మిలియన్లు సాధించి టాప్లో ఉంది... ఆయా షేర్ పాట 91 మిలియన్ల వ్యూస్ రాబట్టింది. ‘చికిరి చికిరి’ పాటకు స్థిరమైన, దీర్ఘకాలిక ఆదరణ లభించగా, ‘ఆయా షేర్’ ప్రారంభంలో మాత్రమే జోరు చూపింది. అయితే, ఇప్పటికీ రామ్ చరణ్ చికిరి పాటనే టాప్లో కొనసాగుతుంది. పెద్ది సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుండగా.. ది ప్యారడైజ్ చిత్రం ఆగస్టు 21న రిలీజ్ కానుంది. -
పెద్ది అడ్వాన్స్ బుకింగ్స్ డేట్ ఫిక్స్.. ఫ్యాన్స్ రెడీ అయిపోండమ్మా..!
-
పెద్ది రిలీజ్ పై స్వయంగా క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్
-
హనుమాన్ జయంతి సందర్భంగా...
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియన్ మూవీ ‘పెద్ది’. ‘ఉప్పెన’ మూవీ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. క్రీడల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు.క్రికెట్, కుస్తీ వంటి క్రీడలతో పాటు కబడ్డీ కూడా ఈ సినిమాలో ఉంటుందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. గురువారం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ‘పెద్ది’ నుంచి రామ్ చరణ్ కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు. -
'పెద్ది' విడుదలపై క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్
రామ్ చరణ్ కొత్త సినిమా 'పెద్ది' విడుదల తేదీపై ప్రస్తుతం గందరగోళం నెలకొంది. లెక్క ప్రకారం మార్చి 27న రావాలి. కానీ అనివార్య కారణాల వల్ల ఏప్రిల్ 30కి వాయిదా వేశారు. అయితే ఈ తేదీన కూడా రావట్లేదని చెప్పి కొన్నిరోజుల నుంచి ప్రచారం సాగుతోంది. రీసెంట్గా మరో మూవీ ఈవెంట్లో నిర్మాత ఎస్కేఎన్ కూడా జూన్ 26న 'పెద్ది' వస్తుందనేసరికి అభిమానులు కంగారుపడ్డారు. తర్వాత తనకు తెలియకుండానే చెప్పేశానని క్లారిటీ ఇచ్చినప్పటికీ అందరికీ విడుదల తేదీపై సందేహం అలానే ఉండిపోయింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న బిగ్బాస్ ఫేమ్ ట్రాన్స్జెండర్ తమన్నా)సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్స్ అన్నింటికీ ఇప్పుడు స్వయంగా రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చేశారు. మెగా డాటర్ నిహారిక నిర్మించిన 'రాకాస' ప్రమోషన్ల సందర్భంగా టీమ్ అంతా వెళ్లి చరణ్ని కలిశారు. మాటల మధ్యలో 'పెద్ది' లేట్ అవ్వట్లేదని కొంచెం ప్రమోట్ చెయ్యండ్రా అని ఫన్నీగా చెబుతూనే క్లారిటీ ఇచ్చేశారు. చెప్పిన తేదీకి రావడం పక్కా అనే స్పష్టత వచ్చేసింది.విడుదలకు మరో నెల కూడా లేదు. అయినా ఇప్పటికీ షూటింగ్ జరుగుతోంది. ఒకటి రెండు పాటలు పెండింగ్లో ఉన్నాయని టాక్. మరి షూటింగ్ పూర్తి చేసి, పాన్ ఇండియా మూవీ కాబట్టి అందుకు తగ్గట్లే ప్రమోషన్స్ చేసుకోవడానికి టైమ్ ఉంటుందా? లేదంటే చివరి నిమిషంలో మళ్లీ వాయిదా అని చెప్పి ఏమైనా షాకిస్తారా అనేది చూడాలి?స్పోర్ట్స్ డ్రామాగా తీస్తున్న 'పెద్ది'లో రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లు. కన్నడ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. జగపతిబాబు, దివ్యేందు కీలక పాత్రలు చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించగా.. రిలీజ్ చేసిన రెండు పాటలు ఇప్పటికే హిట్ అయ్యాయి. బుచ్చిబాబు దర్శకుడు.(ఇదీ చదవండి: 'ధురంధర్'లా హిట్ అవుతుందనుకున్నా.. కానీ జనాలు చూడలేదు: గుణశేఖర్) -
పెద్ది కోసం చరణ్ బిస్ట్ లుక్ ఆ కండల వెనుక రహస్యం ఇదే..!
-
డబుల్ ట్రీట్
అభిమాన హీరోలు స్క్రీన్పై ఒక గెటప్లో కనిపిస్తేనే వారి ఫ్యాన్స్ కేరింతలతో థియేటర్స్ మారు మోగిపోతాయి. అలాంటిది ఒకే టికెట్పై ఒక బొమ్మలో తమ అభిమాన హీరోను రెండు గెటప్స్, రెండు క్యారెక్టరైజేషన్స్తో చూసినప్పుడు అభిమానుల ఆనందానికి హద్దులు ఉండవు. ఇలా ప్రేక్షకులను అలరించేందుకు కొందరు తెలుగు హీరోలు ద్విపాత్రాభినయంతో కూడిన సినిమాలు చేస్తున్నారు. వెండితెరపై డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న హీరోలపై ఓ లుక్ వేయండి.. మరోసారి డబుల్ ధమాకా ‘విక్రమార్కుడు, దరువు, పవర్’ వంటి చిత్రాల్లో రవితేజ ద్విపాత్రాభినయం చేసి ఆడియన్స్ని మెప్పించారు. కొంత గ్యాప్ తర్వాత రవితేజ మళ్లీ ‘ఇరుముడి’ సినిమాలో డబుల్ రోల్లో కనిపించనున్నట్లుగా తెలిసింది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. ఈ థ్రిల్లర్ సినిమాలో ఒక పాత్రలో తండ్రిగా, మరో పాత్రలో కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న వ్యక్తిగా రవితేజ కనిపిస్తారట. ఈ సినిమాలో రవితేజ భార్యగా ప్రియ భవానీశంకర్, కుమార్తెగా బేబీ నక్షత్ర నటిస్తున్నారు. అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్, రాజ్ కుమార్ కసిరెడ్డి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే థియేటర్స్లో రిలీజ్ కానుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు.రుద్ర... రాముడు మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వారణాసి’. ఈ టైమ్ ట్రావెల్ అండ్ మైథలాజికల్ అడ్వెంచరస్ యాక్షన్ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రుద్ర పాత్రలో మహేశ్బాబు నటిస్తున్నారు. అలాగే రాముడి పాత్రలోనూ కనిపించనున్నారు. ‘వారణాసి’ సినిమాలో రుద్ర, రాముడిగా... ద్విపాత్రాభినయం చేస్తున్నట్లుగా ఇటీవల మహేశ్బాబు ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ప్రధాన తారాగణం పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉంటే... సమ్మర్ సమయం కనుక వేసవి తాకిడికి కాస్త దూరంగా ఉండాలని మహేశ్బాబు అండ్ టీమ్ భావిస్తున్నారట.ఇందులో భాగంలో ఈ వేసవి సమయంలో మహేశ్బాబు ఓ వెకేషన్ను ప్లాన్ చేసుకున్నారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో తెరపైకి వచ్చింది. మేలో మళ్లీ షూటింగ్ను స్టార్ట్ చేస్తారు. జూన్లో ‘వారణాసి’ సినిమా యూనిట్ అంటార్కిటికా లొకేషన్స్లో చిత్రీకరకణను ప్లాన్ చేసినట్లుగా తెలిసింది. ఈ ప్రదేశంలో చిత్రీకరణ జరుపుకోబోయే తొలి తెలుగు చిత్రంగా ‘వారణాసి’ చరిత్రలో నిలిచిపోనుంది. ఈ షెడ్యూల్లో మహేశ్బాబు, ప్రియాంకా చోప్రాతో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటారని తెలిసింది. ఓ పాట చిత్రీ కరణ కూడా ఉంటుందట. అలాగే రాముడి పాత్రలో మహేశ్బాబు కనిపించే సీక్వెన్స్ దాదాపు అరగంట పాటు ఉంటుందని తెలిసింది.ఇంకా ‘వారణాసి’ సినిమాను తొలుత రెండు భాగాలుగా రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ ఆ తర్వాత ఒక భాగంగానే రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినట్లుగా రాజమౌళి ఇటీవల ఓ సందర్భంగా చెప్పా రు. కానీ ఇటీవల వచ్చిన హిందీ చిత్రం ‘ధురంధర్’ రెండు భాగాలుగా విడుదలై, బంపర్ బ్లాక్బస్టర్హిట్గా నిలిచింది. ఈ నేపథ్యంలో రాజమౌళి కూడా ‘వారణాసి’ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేసే అవకాశం ఉందనే టాక్ తెరపైకి వచ్చింది. పైగా ‘బాహుబలి’ సినిమాను రెండు భాగాలుగా తీసిన అనుభవం రాజమౌళికి ఉంది. మరి... ‘వారణాసి’ సినిమా రెండు భాగాలుగా వస్తుందా? లేదా అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.ఈ చిత్రంలో రుద్ర పాత్రలో మహేశ్బాబు, మందాకిని పాత్రలో ప్రియాంకా చోప్రా, కుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్, శివభక్తుడిగా ప్రకాశ్రాజ్ నటిస్తున్నారు. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ‘వారణాసి’ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ‘కొడుకు దిద్దిన కాపురం’ చిత్రంలో మహేశ్బాబు చైల్డ్ ఆర్టిస్టుగా ద్విపాత్రాభినయం చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో సూపర్స్టార్ కృష్ణ హీరోగా నటించగా, విజయశాంతి హీరోయిన్గా నటించారు.డ్రాగన్లో డ్యూయల్ రోల్? ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న తాజా సినిమా ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ పీరియాడికల్ గ్యాంగ్స్టర్ డ్రామాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. ఇందుకు కారణం లేకపోలేదు. ఈ సినిమా చిత్రీకరణ స్టార్టింగ్లో ఎన్టీఆర్ కాస్త బొద్దుగా కనిపించారు. కొంత షూటింగ్ పూర్తయిన తర్వాత లీన్ లుక్లోకి వచ్చేశారు. దీంతో ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఏమైనా ద్విపాత్రాభినయం చేస్తున్నారా? అనే టాక్ తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు.అనిల్ కపూర్, కాజోల్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారని భోగట్టా. నందమూరి కల్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. త్వరలోనే విడుదల తేదీపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘దేవర’. ఈ చిత్రంలో తండ్రీకొడుకు దేవ, వర పాత్రల్లో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా తొలి భాగం 2024లో విడుదలైంది. మలి భాగం చిత్రీకరణ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నందమూరి కల్యాణ్రామ్, కొసరాజు హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ ‘దేవర’ సినిమాను నిర్మిస్తున్నారు.పెద్ది ఆట రామ్ చరణ్ టైటిల్ రోల్ చేస్తున్న తాజా సినిమా ‘పెద్ది’. ఈ రూరల్ బ్యాక్డ్రాప్ మల్టీస్పోర్ట్స్ పీరియాడికల్ యాక్షన్ సినిమాకు ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రకారం రామ్ చరణ్ క్రికెటర్గా, కుస్తీ క్రీడాకారుడిగా కనిపించారు. ఇటీవల ‘పెద్ది పహిల్వాన్’ అంటూ ‘పెద్ది’ సినిమా నుంచి ఓ వీడియో విడుదలైంది. ఈ సినిమాలో క్రికెటర్గా ఉన్న రామ్చరణ్, కుస్తీ చాలెంజ్ను స్వీకరించినట్లుగా కనిపిస్తోంది.కానీ క్రికెటర్ నుంచి రామ్ చరణ్ కుస్తీ వైపు అడుగులు వేయడానికి బలమైన కారణం ఉందని, తన తండ్రి కోసమే రామ్ చరణ్ అలా మారతారని ఫిల్మ్నగర్ భోగట్టా. అయితే ఈ తండ్రి పాత్రలోనూ రామ్ చరణే కనిపిస్తారట. అలా తండ్రీకొడుకులుగా ‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 30న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఇటీవల ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది.కాకపోతే... ఈ సినిమా రిలీజ్ డేట్లో మార్పు ఉండొచ్చని, ‘పెద్ది’ సినిమా ఈ వేసవిలో రిలీజ్ కావడం లేదని, జూన్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలిసింది. రెండు పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉండటం, పోస్ట్ ప్రోడక్షన్స్ వర్క్స్ విషయంలో టీమ్ హడావిడి చేయకుండా క్వాలిటీ కోసం టైమ్ కేటాయించాల్సి రావడం, ఇటీవల రామ్ చరణ్ కంటికి చిన్న గాయం కావడం వంటి అంశాలు ‘పెద్ది’ సినిమా రిలీజ్ వాయిదా పడటానికి కారణమై ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.బ్రదర్స్గా... కెరీర్లో ఇప్పటి వరకు 21 సినిమాలను పూర్తి చేశారు అల్లు అర్జున్. కానీ వెండితెరపై అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయలేదు. ఇప్పుడు ఆ సమయం వచ్చిందని తెలిసింది. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ తొలిసారి బ్రదర్స్గా ద్విపాత్రాభినయం చేస్తున్నారని, ఆయన డిఫరెంట్ లుక్స్లో కనిపిస్తారని ఫిల్మ్నగర్ సమాచారం. ఇందుకు తగ్గట్లుగానే ఇటీవలి కాలంలో రెండు డిఫరెంట్ లుక్స్లో అల్లు అర్జున్ కనిపించారు.దీంతో అల్లు అర్జున్లోని ఈ డిఫరెంట్ మేకోవర్ అట్లీ సినిమా కోసమే అనే ప్రచారానికి బలం చేకూరి నట్లయింది. ఈ నెల ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఇంకా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో దీపికా పదుకోన్ నటిస్తున్నారు. అలాగే జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, భాగ్యశ్రీ భోర్సే... వంటి హీరోయిన్స్ కూడా భాగం కానున్నారని, త్వరలోనే ఈ అంశాలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలిసింది. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.అయితే తన వంతు షూటింగ్ను మాత్రం అల్లు అర్జున్ త్వరితగతిన పూర్తి చేసి, లోకేశ్ కనగరాజ్తో చేయాల్సిన సినిమా షూటింగ్లో పాల్గొంటారు. అట్లీతో అల్లు అర్జున్ చేస్తున్న చిత్రానికి భారీ వీఎఫ్ఎక్స్ వర్క్స్ చేయాల్సి ఉంది. దీంతో పోస్ట్ ప్రోడక్షన్స్ కోసం ఈ మూవీ టీమ్ ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంది. అందుకే ఈ చిత్రాన్ని ఈ ఏడాది రిలీజ్ చేయడం సాధ్యపడదట.తొలిసారిగా..! ఈ మధ్య ‘ఎక్స్ట్రా, రాబిన్హుడ్’ వంటి మాస్ కమర్షియల్ సినిమాలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్తో కూడిన ‘తమ్ముడు’ వంటి యాక్షన్ డ్రామా చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు నితిన్. తాజాగా ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ సైన్ చేశారని సమాచారం. ‘ఎక్కడికి పోతావు చిన్న వాడా, ఒక్క క్షణం, ఊరు పేరు భైరవకోన’ వంటి చిత్రాలను తెరకెక్కించిన వీఐ ఆనంద్ దర్శకత్వంలో హీరోగా నటించేందుకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఈ సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనింగ్ మూవీలో నితిన్ ద్విపాత్రాభినయం చేయనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. పవన్కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. 30 సినిమాలకుపైగా చేసిన నితిన్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయనున్న చిత్రం ఇది. కామ్రేడ్ కల్యాణ్ ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతమైన విశాఖ జిల్లా మాడుగుల గ్రామం నేపథ్యంలో రూపొందుతున్న సినిమా ‘కామ్రేడ్ కల్యాణ్’. 1992 నేపథ్యంలో సాగే ఈ సినిమాకు జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. గత ఏడాది దసరా సందర్భంగా ఈ సినిమా ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ప్రోమోను బట్టి ఈ చిత్రంలో శ్రీ విష్ణు ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో కామ్రేడ్ కల్యాణ్గా, గ్రామంలోని ఓ చురుకైన వ్యక్తిగా శ్రీ విష్ణు నటిస్తున్నట్లు సమాచారం. వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.నాగబంధం విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నాగబంధం’. ఈ సినిమాలో డిఫరెంట్ గెటప్స్లో విరాట్ కర్ణ కనిపించనున్నట్లుగా ఇటీవల ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్ వచ్చింది. ఇందులో లార్డ్ శివగా, ఓ మాములు మోడ్రన్ అబ్బాయిగా విరాట్ కర్ణ కనిపిస్తున్నారు. సో... ‘నాగబంధం’లో విరాట్కర్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారని ఊహించవచ్చు మరి... ఈ సినిమాలో విరాట్ కర్ణ రోల్ ఎలా ఉండబోతుంది అనేది జూన్ 3న తెలిసిపోతుంది. ఎందుకంటే.. ఈ సినిమాను ఆ రోజే రిలీజ్ చేస్తున్నారు. ‘‘భారతదేశంలోని ప్రాచీన విష్ణు ఆలయాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది.శతాబ్దాలుగా రహస్యంగా కొనసాగుతున్న నాగబంధం అనే ఆధ్యాత్మిక సంప్రదాయం చుట్టూ ‘నాగబంధం’ సినిమా కథనం సాగుతుంది. పద్మనాభస్వామి, పూరి జగన్నాథ్ ఆలయాల ధన నిధుల మిస్టరీల స్ఫూర్తితో ఈ సినిమా స్టోరీ సాగుతుంది’’ అని మేకర్స్ తెలిపారు. నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్స్గా నటిస్తున్న ఈ సినిమాలో రిషబ్ సాహ్ని, జగపతిబాబు, గరుడ రామ్, మహేశ్ మంజ్రేకర్, జయప్రకాశ్, మురళీ శర్మ, అనసూయ భరద్వాజ్, బీఎస్ అవినాష్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అభిషేక్ నామా దర్శకత్వంలో కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగి రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇలా ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను అలరించనున్న హీరోలు మరికొంతమంది ఉన్నారు. ఇంకొంతమంది హీరోలు ఈ తరహా కథలను చేసేందుకు చర్చలు జరుపుతున్నారని ఫిల్మ్నగర్ సమాచారం.– ముసిమి శివాంజనేయులు -
DSPని పక్కన పెట్టిన సుకుమార్.. రంగంలోకి ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్
-
పెద్ది రిలీజ్ పై బిగ్ ట్విస్ట్.. మళ్లీ వాయిదా!
-
పెద్ది రిలీజ్ డేట్.. నన్ను క్షమించండి: నిర్మాత ఎస్కేఎన్
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న పెద్ది మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే చెర్రీ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేయగా.. రెజ్లర్ లుక్లో కనిపించిన ఆకట్టుకున్నారు. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్పై టాలీవుడ్లో మాత్రం పెద్ద సస్పెన్స్ కొనసాగుతోంది. మరోసారి వాయిదా పడనుందని టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే నిర్మాత ఎస్కేఎన్ చేసిన కామెంట్స్ పెద్ది రిలీజ్ డేట్పై గందరగోళం క్రియేట్ చేశాయి. ఈ నేపథ్యంలోనే ఆయన క్లారిటీ ఇచ్చారు.చెన్నై లవ్ స్టోరీ సాంగ్ ఈవెంట్లో మా సినిమా రిలీజ్ డేట్ గురించి చర్చించుకున్నామని ఎస్కేఎన్ తెలిపారు. అదే సందర్భంలో జూన్ 25న పెద్ది రిలీజ్ అవుతుందేమోనని సాయి రాజేశ్ అన్నారు. కానీ అక్కడ గందరగోళంలో పెద్ది రిలీజ్ అనౌన్స్ చేశారమో అనుకున్నానని వెల్లడించారు. నేను తప్పుగా అర్థం చేసుకుని అలా చెప్పా.. అంతేకానీ పెద్ది మూవీ రిలీజ్ వాయిదా అనేది అఫీషియల్గా రాలేదని చెప్పారు. నా కామెంట్స్ వల్ల చిన్న పొరపాటు జరిగిందని.. ఇలా అయినందుకు మీ అందరికీ సారీ అంటూ నిర్మాత ఎస్కేఎన్ క్లారిటీ ఇచ్చారు.కాగా.. రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో పెద్ది మూవీ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఓ సారి వాయిదా పడిన ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. Producer @SKNonline clarification regarding #Peddi release date which he announced at #ChennaiLoveStory song launch Event #KiranAbbavaram #SKN #Ramcharan pic.twitter.com/uDCbkinMbJ— Milagro Movies (@MilagroMovies) March 30, 2026 -
'పెద్ది' మళ్లీ వాయిదా నిజమే.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా మరోసారి వాయిదా పడింది. మీరు విన్నది నిజమే. గత కొన్నిరోజుల నుంచి ఈ రూమర్స్ వస్తూనే ఉన్నాయి. టీమ్ మౌనవ్రతం పాటిస్తుండగా.. అభిమానుల మాత్రం అలాంటిదేం ఉండదని అనుకున్నారు. కానీ ఇప్పుడు చిత్రబృందం ఏం చెప్పనప్పటికీ.. టాలీవుడ్ నిర్మాత ఎస్కేఎన్, సోమవారం సాయంత్రం జరిగిన ఓ మూవీ ఈవెంట్లో మాట్లాడుతూ 'పెద్ది' కొత్త విడుదల తేదీని బయటపెట్టేశాడు.(ఇదీ చదవండి: తెలుగు సినిమా 'చైనా పీస్'పై కేంద్రం నిఘా?)మార్చి 27న చరణ్ పుట్టినరోజున 'పెద్ది' రిలీజ్ చేస్తామని తొలుత అనౌన్స్ చేశారు. తీరా డేట్ దగ్గరపడేసరికి ఏప్రిల్ 30న వస్తామని అన్నారు. కానీ ఐటమ్ సాంగ్తో పాటు మరో పాట షూటింగ్ పెండింగ్లో ఉండటం, ఈ మధ్యే చరణ్ కంటికి గాయం కావడం తదితర అంశాలతో చెప్పిన తేదీకి రావడం కష్టమే అని అంతా భావించారు. ఇప్పుడు ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించడానికి ముందే లీకులు వచ్చేస్తున్నాయి.జూన్ 25న 'పెద్ది' సినిమా థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. ఇది రిలీజ్ అవుతుందని అఖిల్ 'లెనిన్'ని జూన్ 26కి వాయిదా వేశారు. మరి 'పెద్ది' తప్పుకొంది కాబట్టి 'లెనిన్'.. ముందే చెప్పినట్లు మే 1న థియేటర్లలోకి వస్తాడా లేదంటే మరో తేదీ చూసుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది.'పెద్ది' తప్పుకొంటే అదే తేదీకి వచ్చేయాలని నిఖిల్ 'స్వయంభు' సినిమాతో సిద్ధంగా ఉన్నాడు. మరోవైపు అదే టైంలో తరుణ్ భాస్కర్ 'గాయపడ్డ సింహం', ధనుష్ 'కర'తో పాటు పలు చిత్రాలు లైనులో ఉన్నాయి. ఇప్పుడు ఇంకెన్ని అదే తేదీని టార్గెట్ చేసుకుంటాయో చూడాలి? ఈ వేసవిలో స్టార్ హీరోల సినిమాలేం లేవు. ఇప్పుడు 'పెద్ది' కూడా తప్పుకొంది. దీంతో ఈసారి కూడా స్టార్స్ లేకుండానే సమ్మర్ ఉండబోతుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
అప్పుడు శ్రీ రాముడు.. ఇప్పుడు హనుమాన్.. వైరల్ అవుతోన్న చెర్రీ లుక్స్
-
సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న బెస్ట్ ఫ్రెండ్స్
ఇప్పటి హీరోలు క్యారెక్టర్ కోసం ఎంత కష్టపడ్డానికైనా సిద్దంగా ఉంటారు. తమ మేకోవర్ కోసం ఎంత దూరమైనా వెళ్తారు. రీసెంట్గా వచ్చిన ఇద్దరు హీరోల లుక్స్ చూస్తే ఈ విషయాన్ని మరోసారి రుజువు చేస్తుంది. ఆ ఇద్దరు హీరోల్లో ఒకరు మెగా పవర్స్టార్ రామ్ చరణ్, మరొకరు అతడి బెస్ట్ ఫ్రెండ్ శర్వానంద్.వీరిద్దరూ తమ మేకోవర్స్తో టోటల్ ఇండస్ట్రీని ఆకర్షిస్తున్నారు. ముందుగా రామ్ చరణ్ విషయానికొస్తే, తాజాగా తన పుట్టినరోజు నాడు రిలీజైన 'పెద్ది' సినిమా రెండో గ్లింప్స్ లో అందర్నీ ఆకట్టుకున్న అంశం చరణ్ బాడీ. ఆ పహిల్వాన్ లుక్ కోసం చరణ్ ఎంత కష్టపడ్డాడో ఆ లుక్ చూస్తుంటే ఇట్టే అర్థమైపోతుంది.చరణ్ ఈ లుక్ కోసం కొన్ని నెలల పాటు మాంసాహారం మానేశాడని సమాచారం. ఓవైపు అయ్యప్ప దీక్షలో ఉంటూనే, మరోవైపు పహిల్వాన్ లుక్ కోసం కసరత్తులు చేశాడు. పహిల్వాన్ లుక్ కోసం నిజమైన పహిల్వాన్లు చేసే కసరత్తులనే చరణ్ చేశాడు. అలా దాదాపు 8 నెలల పాటు ఎంతో కష్టపడి మరీ ఈ కండలు తిరిగే దేహాన్ని చరణ్ సొంతం చేసుకున్నాడు.అయితే శర్వానంద్ బైకర్ రోల్ కోసం మరింత స్ఫూర్తిదాయకమైన ప్రయాణం చేశాడు. ఆ రోల్ కోసం ఇతడు పడిన కష్టం అంతా ఇంతా కాదనే చెప్పాలి. బైకర్ చిత్ర దర్శకుడు శర్వాను 6-8 కిలోలు తగ్గితే చాలన్నాడట. కానీ శర్వానంద్ మాత్రం అంతకుమించి కష్టపడ్డాడు. అక్షరాలా రోజుకు 32 కిలోమీటర్లు పరుగెత్తేవాడని సమాచారం.42 సంవత్సరాల శర్వానంద్ 18 ఏళ్ల బైక్ రేసర్గా కనిపించేందుకు తన శరీరంలోని ప్రతి అణువునూ కరిగించేలా కసరత్తు చేశాడట. ప్రస్తుతం తన ఒంట్లో ఏమాత్రం కొవ్వు లేనంత బక్కపల్చగా తయారయ్యాడు. ఇలా టీనేజర్ గా కనిపించడం కోసం శర్వానంద్ ఏకంగా రెండేళ్లు కష్టపడ్డాడు. ఇక బైకర్ ట్రయిలర్ ఎంత క్లిక్ అయిందో, అందులో శర్వా లుక్ అంతకంటే ఎక్కువగా అందరి ప్రశంసలు పొందింది. -
పెద్ది పహిల్వాన్ లుక్.. రామ్ చరణ్ అంతలా కష్టపడ్డారా?
రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ చిత్రం పెద్ది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. పెద్ది గ్లింప్స్ రిలీజ్ చేసి ఫ్యాన్స్కు మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చారు.ఈ గ్లింప్స్లో రామ్ చరణ్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. పహిల్వాన్గా చెర్రీ లుక్ అదిరిపోయింది. ఈ లుక్ చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయ్యారు. అయితే ఇలా రెజ్లర్గా కనిపించేందుకు గ్లోబల్ స్టార్ కఠినంగా డైట్ తీసుకున్నారు. పహిల్వాన్లా కనిపించేందుకు దాదాపు 8 నెలల పాటు కేవలం కఠోర నియమాలు పాటించారు. అయ్యప్ప దీక్షలో ఉన్న రామ్ చరణ్ ఈ లుక్ కోసం తీవ్రంగా శ్రమించారని ఇటీవల డైరెక్టర్ బుచ్చిబాబు రివీల్ చేశారు.కఠినమైన డైట్..పహిల్వాన్ ఫిజిక్ రావాలంటే ప్రత్యేక డైట్ పాటించాల్సి ఉంటుంది. కేవలం జిమ్లో వర్కౌట్స్ చేయడం మాత్రమే కాదు..కఠిన ఆహార నియమాలు కూడా ఫాలో కావాల్సిందే. ఈ ట్రైనింగ్ జరుగుతున్న సమయంలో రామ్ చరణ్ అయ్యప్ప దీక్షలో ఉంటూ కఠిన నియమాలు పాటించారు. ఎక్కడా కూడా తన ఫిట్నెస్ రూల్స్ బ్రేక్ చేయలేదని బుచ్చిబాబు సనా తెలిపారు. కాగా.. ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. -
వైరల్ అవుతోన్న రామ్ చరణ్ హోమం
-
రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్.. ఇంట్లోనే ప్రత్యేక హోమం
మెగా హీరో రామ్ చరణ్ బర్త్ డే వేడుకను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మెగా ఫ్యాన్స్ సంతోషంతో అభిమాన హీరో జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు తమ హీరోకు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు. తన కుమారుడి బర్త్ డేను పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. నిన్ను చూస్తుంటే ఒక తండ్రిగా గర్వంగా ఉందని ట్వీట్ చేశారు.చెర్రీ బర్త్ డేను మెగా కుటుంబం ఓ పండుగలా నిర్వహిస్తున్నారు. తాజాగా ఇవాళ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఇంట్లోనే ప్రత్యేకంగా హోమం నిర్వహించారు. అనంతరం తల్లిదండ్రులు కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు గ్లోబల్ స్టార్. శ్రీరామనవమి రోజే రామ్ చరణ్ బర్త్ డే రావడంతో మెగా కుటుంబంలో ఆనందం మరింత రెట్టింపైంది. రామ్ చరణ్ హోమం నిర్వహించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇక సినిమాల విషయానికొస్తే రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. ఇవాళ చెర్రీ బర్త్ డే సందర్భంగా పెద్ది గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీలో పహిల్వాన్గా రామ్ చరణ్ సరికొత్త లుక్లో కనిపించారు. ఈ రోజు రిలీజైన గ్లింప్స్ మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. On the auspicious occasion of #SriRamaNavami and Mega Powerstar #RamCharan’s birthday, Megastar #Chiranjeevi performed a special homam at his residence, seeking divine blessings. ✨ pic.twitter.com/6G0baHvhXo— Filmy Focus (@FilmyFocus) March 27, 2026 -
చిరంజీవి ఆధ్వర్యంలో రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
పెద్ది సినిమా గ్లింప్స్ రిలీజ్
-
పెద్ది పవర్ఫుల్ గ్లింప్స్ వచ్చేసింది
రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబినేషన్ సినిమా ‘పెద్ది’ నుంచి అదిరిపోయే అప్డేట్ను ఇచ్చారు. నేడు చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ను విడుదల చేశారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ అభిమానులను మెప్పించాయి. తాజాగా విడుదలైన గ్లింప్స్ మరింత పవర్ఫుల్గా ఉండటంతో మూవీపై భారీ అంచనాలు పెరిగాయి.పెద్ది షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో ఒక భారీ యాక్షన్ సీన్లో భాగంగా చరణ్ కంటికి గాయమైంది. కొన్ని రోజుల విశ్రాంతి అవసరం ఉన్నప్పటికీ చరణ్ మళ్లీ షూటింగ్లో పాల్గొనడం విశేషం. ఇందులో చర్కు జోడీగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తుంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్కుమార్, జగపతిబాబు, బోమన్ ఇరానీ వంటి స్టార్స్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ (AR Rahman) సంగీతం సమకూరుస్తున్నారు. ఏప్రిల్ 30న పాన్ ఇండియా భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
రామ్ చరణ్ బర్త్డే స్పెషల్ (ఫొటోలు)
-
చిరుత బర్త్డే.. స్పెషల్ ఫోటో షేర్ చేసిన మెగాస్టార్
మెగాస్టార్ కుమారుడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఆపై తాను దాచుకున్న మధురమైన ఫోటోలను షేర్ చేశారు. చరణ్ బాల్యంలో జరుపుకున్న పుట్టినరోజు నాటి ఫోటోను అభిమానులతో మెగాస్టార్ పంచుకున్నారు. ఈ సందర్భంగా చరణ్పై తనకున్న ప్రేమను సోషల్మీడియా ద్వారా తెలిపారు.చరణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. ప్రత్యేకంగా చిరు ఇలా అన్నారు. 'చిన్నప్పుడు నా చేయి పట్టుకోవడం నుండి ఈ రోజు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవడం వరకు నీ ఎదుగుదల చూస్తుంటే నాకు నిజంగా గర్వకారణంగా ఉంది. సినిమా, వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకునే విధానం, కుటుంబం పట్ల నీవు చూపించే బాధ్యత, దేవుని పట్ల నీకున్న విశ్వాసం, క్రమశిక్షణ, విలువలు... ఇవన్నీ నేను చూసిన ప్రతిసారీ నీపై నా ప్రేమ, అభిమానం మరింత బలపడుతూనే ఉన్నాయి. దేవుని ఆశీస్సులు, అభిమానుల ప్రేమ నిన్ను ఉన్నత శిఖరాలకు నడిపించాలని కోరుకుంటున్నాను. ప్రియమైన నా చరణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు.' అని చిరు షేర్ చేశారు.Charan Babu…❤️❤️❤️From holding my hand as a child to becoming an inspiration to many today… You make me truly proud.The way you balance cinema and personal life, your sense of responsibility towards family, your faith in God, discipline, and values… every time I see it, my… pic.twitter.com/MMg5fYYo3k— Chiranjeevi Konidela (@KChiruTweets) March 27, 2026 -
గాయంతో తిరిగి సెట్స్పైకి రామ్ చరణ్
టాలీవుడ్ స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ షూటింగ్ సమయంలో గాయపడిన విషయం తెలిసిందే. ఆయన ఎడమ కంటికి తగిలిన దెబ్బ కారణంగా చిన్నపాటి సర్జరీ చేయాల్సి వచ్చింది. యూనిట్ ఈ గాయం పెద్దది కాదని ప్రకటించినప్పటికీ, తన అభిమానులు మాత్రం కొంత ఆందోళన చెందారు. అయితే గాయమైన గంటల వ్యవధిలోనే చరణ్ తిరిగి సెట్స్పైకి వచ్చాడు. గురువారం 'పెద్ది' చిత్ర షూటింగ్లో పాల్గొన్నాడు. దాంతో వందల సంఖ్యలో మెగా అభిమానులు సెట్స్కు చేరుకుని ఆయనను కలుసుకున్నారు. చరణ్ వారందరితో మాట్లాడి, సెల్ఫీ వీడియో కూడా దిగాడు. ఆ వీడియోను యూనిట్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో చరణ్ స్వయంగా తన గాయంపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టాడు. చరణ్కు సుధాకర్ ప్రసాద్ అనే వైద్యుడు మైనర్ సర్జరీ చేసినట్లు చిరంజీవి స్వయంగా వెల్లడించారు. డాక్టర్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలిపారు. ఇక మార్చి 27 (శుక్రవారం) రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 9.45 గంటలకు పెద్ది నుంచి సర్ప్రైజ్ రాబోతోందని యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో ఏప్రిల్ 30న సినిమా రిలీజ్ అవుతుందని మరోసారి ధృవీకరించారు. -
పెద్ది బర్త్ డే స్పెషల్.. ఇప్పుడు చేతిలో ఉండేది బ్యాట్ కాదు....!
రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఒక్క రోజు ముందే రామ్ చరణ్ ఎడమ కన్నుకు చిన్న గాయం కావడంతో కాస్తా గ్యాప్ ఇచ్చారు. మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారుతాజాగా పెద్ది మూవీ టీమ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. రేపు ఉదయం 9 గంటల 45 నిమిషాలకు అప్డేట్ రానుందని ప్రకటించారు. ఇక ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది..ఇప్పటిదాకా బ్యాట్ పట్టుకుని అతన్ని చూశారు కదా.. ఇప్పుడు గదతో విరుచుకుపడబోతున్నాడు.. రేపు (మార్చి 27) ఉదయం 9:45 గంటలకు అతను రణరంగంలోకి అడుగుపెట్టబోతున్నాడు అంటూ గదతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. చెర్రీ పుట్టినరోజు కానుకగా పెద్ది టీజర్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ONE DAY TO GO 🔥You've seen him hold the bat, now unleashing him with a mace ❤🔥He enters the arena tomorrow (March 27th) at 9.45 AM 💥#PEDDI WORLDWIDE RELEASE ON 30th APRIL, 2026Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman… pic.twitter.com/EvpXHy0LX5— BuchiBabuSana (@BuchiBabuSana) March 26, 2026 -
పెద్ది వాయిదా తప్పదా.. అందుకే ఆ డేట్ మార్చారా?
రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఒక్క రోజు ముందే రామ్ చరణ్ ఎడమ కన్నుకు చిన్న గాయం కావడంతో కాస్తా గ్యాప్ ఇచ్చారు. ఈ రోజు నుంచి యథావిధిగా పెద్ది షూటింగ్ ప్రారంభమవుతుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.అయితే ఇప్పటికే ఓసారి వాయిదా పడిన పెద్ది మూవీపై మరోసారి రూమర్స్ వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ఈ చిత్రం పోస్ట్పోన్ కానుందని తెలుస్తోంది. ఎందుకంటే ఈనెల 27 నుంచి ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ చేస్తామని ముందుగానే ప్రకటించారు. కానీ ఈ డేట్ కూడా ఏప్రిల్ 8కి మార్చారు. దీంతో మరోసారి పెద్ది వాయిదా పడనుందనే టాక్ టాలీవుడ్లో వినిపిస్తోంది.తాజా అప్డేట్ ప్రకారం చూస్తే.. ఈ మూవీ షూటింగ్ ఇంకా జరుగుతూ ఉండడం.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల మరింత ఆలస్యం కావొచ్చని తెలుస్తోంది. ఏదేమైనా బుచ్చిబాబు ఏప్రిల్ 30న రిలీజ్ చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అనుకున్న సమయానికి అన్ని పనులు పూర్తయితే చెప్పిన డేట్ ప్రకారమే పెద్ది థియేటర్లలో సందడి చేయనుంది. లేదంటే మే 21వ తేదీకి మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో దీనిపై మరింత స్పష్టత రానుంది. మరోవైపు శుక్రవారం రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా టీజర్ కూడా రిలీజ్ చేస్తున్నారు. -
రామ్ చరణ్ కంటికి సర్జరీ.. చిరంజీవి ట్వీట్ వైరల్
‘పెద్ది’ సినిమా షూటింగ్లో రామ్ చరణ్ గాయపడిన సంగతి తెలిసిందే. ఓ హై ఇంటెన్సిటీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా జరిగిన ప్రమాదంలో రామ్ చరణ్ ఎడమ కంటికి స్వల్ప గాయం అయింది. దీంతో షూటింగ్కి బ్రేక్ ఇచ్చి ఆస్పత్రికి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా చరణ్కి కంటికి చిన్న సర్జరీ చేశారట. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ.. సర్జరీ చేసిన డాక్టర్కి కృతజ్ఞతలు తెలిపారు. ‘డాక్టర్ సుధాకర్ ప్రసాద్ గారు,చరణ్ కనురెప్పకు మీరు ఎంతో నైపుణ్యంతో సర్జరీ చేసినందుకు ధన్యవాదాలు. తొలుత మాకు కొంత ఆందోళన కలిగినప్పటికీ.. మీరు చెప్పిన మాటలు మా భయాన్ని పోగొట్టి, ధైర్యాన్ని ఇచ్చాయి. సకాలంలో స్పందించి, శస్త్రచికిత్స అందించినందుకు కృతజ్ఞతలు’ అని చిరంజీవి చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వార్త తెలుసుకున్న మెగా అభిమానులు.. రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు. పెద్ది విషయానికొస్తే.. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఈ నెల 27న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ‘పెద్ది’ గ్లింప్స్ని రిలీజ్ కానుంది. Dr. Sudhakar Prasad garu,Your timely and skilful surgery on Charan’s eyelid has truly been a blessing. What was a moment of concern for us was eased entirely by your precision, care, and expertise.Your craftsmanship made all the difference, and we are truly grateful.Thank… pic.twitter.com/j53rRIpOKB— Chiranjeevi Konidela (@KChiruTweets) March 26, 2026 -
చరణ్కు గాయం.. 'పెద్ది' నుంచి ప్రత్యేక గ్లింప్స్?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు ఇటీవల ప్రమాదవశాత్తూ గాయపడ్డారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా నుంచి రాబోయే అప్డేట్ ఆలస్యమవుతుందేమోనని అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. అయితే యూనిట్ తాజాగా ఇచ్చిన స్పష్టతతో ఆ అనుమానాలన్నీ తొలగిపోయాయి. చరణ్ ఎడమ కంటికి చిన్నపాటి గాయం మాత్రమే జరిగింది. దానికి వెంటనే ట్రీట్మెంట్ జరిగిందని 'పెద్ది' టీమ్ తెలిపింది. రేపట్నుంచే ఆయన తిరిగి సెట్స్లో పాల్గొనబోతున్నారని కూడా ప్రకటించింది. ఇక అభిమానులకు గుడ్ న్యూస్ ఏమిటంటే.. చరణ్ పుట్టినరోజు కానుకగా 'పెద్ది' నుంచి ప్రత్యేక గ్లింప్స్ రాబోతోంది. మార్చి 27 ఉదయం 11:07 గంటలకు దర్శకుడు బుచ్చిబాబు ఇప్పటికే రెడీ చేసిన టీజర్ విడుదల కానుంది. ఇప్పటికే చరణ్ చేసిన బ్యాట్ విన్యాసం సోషల్ మీడియాలో సూపర్ హిట్ అయింది. అదే తరహాలో ఈ బర్త్డే టీజర్ కూడా భారీ విజయాన్ని సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. అంటే రామ్ చరణ్ గాయంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదు. పెద్ది సినిమాకు సంబంధించిన అప్డేట్స్, సంబరాలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగనున్నాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ పెద్ది టీమ్ ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది. -
రామ్ చరణ్కు గాయం.. పెద్ది టీమ్ క్లారిటీ
మెగా హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గాయంపై పెద్ది టీమ్ స్పందించింది. ప్రస్తుతం అంతా బాగానే ఉందని.. ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది. షూటింగ్లో చరణ్ ఎడమకన్నుకు చిన్న గాయమైందని వెల్లడించింది. అనంతరం రామ్ చరణ్కు చికిత్స అందించామని ప్రకటించింది. రేపటి నుంచి యథావిధిగా షూటింగ్ ప్రారంభమవుతుందని పెద్ది టీమ్ నోట్ విడుదల చేసింది. దయచేసి ఎటువంటి ఊహాగానాలు నమ్మవద్దని అభిమానులకు సూచించింది. పెద్ది షూటింగ్కు ఎలాంటి ఆటంకం లేదని క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రకటనతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. బుచ్చిబాబు- రామ్ చరణ్ కాంబోలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ సైతం ఈ మూవీ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.An update regarding @AlwaysRamCharan Garu's injury on the sets of #Peddi.We promise everything is safe and on track ❤️Kindly do not speculate. Thank you. pic.twitter.com/5Abhs2QyHb— PEDDI (@PeddiMovieOffl) March 25, 2026 -
రామ్ చరణ్కు గాయం.. షూటింగ్కు బ్రేక్
రామ్ చరణ్ గాయపడ్డారని సోషల్మీడియాలో వార్తలు వస్తున్నాయి. బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ (Peddi) సినిమా సెట్స్లో చరణ్కు స్వల్ప గాయం అయినట్లు సమాచారం. ఆయన కంటి దగ్గర గాయమైనట్లు తెలుస్తోంది. కానీ, అది స్వల్పమైనదేనని చెబుతున్నారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సోషల్మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు. రామ్ చరణ్ రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకుని, తిరిగి సెట్స్లో చేరతారని అంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లోనే చరణ్తో ఉన్న కీలక సన్నివేశాలను మేకర్స్ చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే ఒక ప్రత్యేక గీతాన్ని షూట్ చేయనున్నారట. రామ్ చరణ్ పుట్టినరోజు (మార్చి 27) శుక్రవారం కావడంతో, ఆ రోజున ఒక టీజర్ను విడుదల చేస్తారని టాక్..గ్రామీణ నేపథ్యంలో జరిగే స్పోర్ట్స్ డ్రామా మూవీగా ‘పెద్ది’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్గా నటిస్తుండగా.. కన్నడ నటుడు శివ రాజ్కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మార్చి 27న బాక్సాఫీసు ముందుకు రావాల్సిన ఈ చిత్రం వాయిదా పడిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 30న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, ఈ తేదీలో కూడా పెద్ది విడుదల కావడం కష్టమేనని వార్తలు వస్తున్నాయి. -
పెద్ది స్పెషల్ సాంగ్ అప్డేట్ చరణ్ తో మృణాల్ స్టెప్స్
-
రంగస్థలం 2 కి రంగం సిద్ధం
-
'పెద్ది'కి ఐటమ్ బ్యూటీ దొరికేసింది!
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా 'పెద్ది'.. మరో నెల రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే షూటింగ్ నడుస్తుండటంతో వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని రూమర్స్ వస్తున్నాయి. మరోవైపు చరణ్ పుట్టినరోజున ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ అవుతాయని అధికారికంగా ప్రకటించడంతో వాయిదా లాంటిది లేదని పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్లయింది. అయితే ఈ మూవీలోని ఐటమ్ సాంగ్ ఎవరు చేస్తారా అనే ప్రశ్న కూడా ఇంకా అలానే మిగిలిపోయింది. ఫైనల్గా దానికి సమాధానం దొరికేసినట్లు కనిపిస్తోంది.(ఇదీ చదవండి: శ్రీలీల.. పవన్ కూడా కాపాడలేకపోయాడు!)గతంలో 'పెద్ది' ఐటమ్ కోసం పూజా హెగ్డే, ఆయేషా ఖాన్, మృణాల్ ఠాకుర్.. ఇలా చాలా పేర్లు వినిపించాయి. కానీ పాట షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండేసరికి ఎవరిని తీసుకున్నారనే విషయం బయటకు రాలేదు. చివరకు ఇప్పుడు ముందు అనుకున్న వాళ్లలో మృణాల్ ఠాకుర్ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ఈమె హీరోయిన్గా చేసిన 'డకాయిట్' రిలీజ్ కానుంది. దీని ప్రమోషన్స్లో పాల్గొనేందుకు ప్లస్ 'పెద్ది' సాంగ్ చేసేందుకుగానూ రాబోయే కొన్నిరోజులు ఈమె హైదరాబాద్లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది.ఈ ఐటమ్ పాటలో చరణ్-మృణాల్తో పాటు జాన్వీ కపూర్ కూడా కాసేపు కనిపిస్తుందని అంటున్నారు. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ విలేజ్ డ్రామాగా తెరకెక్కించారు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ కాగా రెండూ సూపర్ హిట్ అయ్యాయి. (ఇదీ చదవండి: క్రికెట్ రాజకీయాలకు బలైన 'ధురంధర్' దర్శకుడు) -
ఇప్పుడు ఫైట్... నెక్ట్స్ పాట
రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ రూరల్ యాక్షన్ మూవీ ‘పెద్ది’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శివ రాజ్కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లోని ఓ సెట్లో జరుగుతోందని సమాచారం. రామ్చరణ్ పాల్గొంటుండగా క్లైమాక్స్ సీక్వెన్స్ లోని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట.ఈ చిత్రీకరణలో భాగంగా ఓ ఫైట్ కూడా ఉందని భోగట్టా. ఈ క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తయితే ఈ సినిమా టాకీ పార్ట్ దాదాపు పూర్తవుతుందట. ఏప్రిల్ మొదటి వారంలో పాటల చిత్రీకరణను ప్లాన్ చేశారని తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది. -
'పెద్ది' వాయిదా రూమర్స్.. ఏం జరుగుతోంది?
రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ 'పెద్ది'. బుచ్చిబాబు దర్శకుడు కాగా జాన్వీ కపూర్ హీరోయిన్. లెక్క ప్రకారం ఈనెల 27న చరణ్ పుట్టినరోజు కానుకగా థియేటర్లలోకి తీసుకొస్తామని చాన్నాళ్ల క్రితం ప్రకటించారు. కానీ షూటింగ్ ఆలస్యమయ్యేసరికి నెలరోజులు వాయిదా వేశారు. ఏప్రిల్ 30న తీసుకొస్తామని అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇది చాలారోజులైపోయింది. ఇప్పుడు మళ్లీ 'పెద్ది' వాయిదా గురించి రూమర్స్ వస్తున్నాయి.(ఇదీ చదవండి: శ్రీలీల.. పవన్ కూడా కాపాడలేకపోయాడు!)'పెద్ది' ప్రస్తుత పరిస్థితి చూస్తే మరో 4 రోజుల టాకీతో పాటు రెండు పాటల చిత్రీకరణ ఇంకా చేయాల్సి ఉందట. రిలీజ్ డేట్ దగ్గరపడుతోంది. టీమ్ మాత్రం కచ్చితంగా చెప్పిన తేదీకే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అందుకు తగ్గట్లే షూటింగ్ చేస్తున్నారు. కానీ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్తోపాటు షూటింగ్ ఇన్ టైంలో పూర్తి చేస్తారా సందేహం కలుగుతోంది.మరోవైపు 'పెద్ది' వాయిదాపై పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. చరణ్ పుట్టినరోజున ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ అవుతాయని అధికారికంగా ప్రకటించారు. దీనిబట్టి చూస్తే దాదాపు ఏప్రిల్ 30నే పాన్ ఇండియా రిలీజ్ అని అనుకోవచ్చు. కానీ ఏమైనా ఆలస్యమైతే మాత్రం జూలైలో తేదీని పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు'తో హిట్ కొట్టారు. రీసెంట్గా పవన్ 'ఉస్తాద్ భగత్ సింగ్' వచ్చింది. దీనికి ఏమంత పాజిటివ్ టాక్ అయితే రాలేదు. దీంతో మెగా ఫ్యాన్స్ తమ అశలన్నీ 'పెద్ది'పైనే పెట్టుకున్నారు.(ఇదీ చదవండి: ఉస్తాద్ భగత్సింగ్ కలెక్షన్స్.. చెప్పుకోలేని పరిస్థితిలో మేకర్స్) -
పెద్ది విడుదల మళ్ళీ వాయిదా? వార్తల్లో నిజమెంత?
-
పెద్ది మళ్ళీ పోస్ట్ పోన్.. ఏప్రిల్ 30 రిలీజ్ లేనట్టే..!
-
దురంధర్-2 మూవీకి రామ్ చరణ్ రివ్యూ.. ఏమన్నారంటే?
రణ్వీర్ సింగ్ దురంధర్-2పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే మహేశ్ బాబు, అల్లు అర్జున్, రాం గోపాల్ వర్మ సీక్వెల్ అద్భుతంగా ఉందంటూ ట్వీట్స్ చేశారు. బాలీవుడ్ మేకర్స్ సైలెంట్గా ఉన్నా.. టాలీవుడ్ స్టార్స్ మాత్రం దురంధర్పై తమ ప్రేమను చాటుకుంటున్నారు. తాజాగా ఈ లిస్ట్లో మెగా హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా చేరిపోయాడు. దురంధర్-2 అద్భుతంగా ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రణ్వీర్ సింగ్ అద్భుతమైన నటనతో మెప్పించారని.. ఈ సినిమా ఆద్యంతం మిమ్మల్ని కట్టిపడేస్తుందని ట్విటర్లో రాసుకొచ్చారు.రామ్ చరణ్ తన ట్వీట్లో రాస్తూ..'దురంధర్ ది రివెంజ్ చాలా ఉత్కంఠభరితంగా ఉంది. ఈ మూవీలో భావోద్వేగాలను అద్భుతంగా చూపించారు. ఈ చిత్రానికి ఆయన చేసిన పనిని తప్పుకుండా ప్రశంసించాల్సిందే. ఇక రణ్వీర్ సింగ్ అద్భుతంగా ఫర్మామెన్స్తో అదరగొట్టాడు. సినిమా ఆద్యంతం మిమ్మల్ని కట్టిపడేస్తారు. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. సారాఅర్జున్ తన పాత్రలో మెప్పించింది. సుస్వత్ మ్యూజిక్ మరో రేంజ్కు తీసుకెళ్లింది. ఇంత ఆసక్తకరమైన మూవీని అందించిన నిర్మాతలకు, చిత్ర బృందానికి నా అభినందనలు.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. దురంధర్కు సీక్వెల్గా వచ్చిన ఈ మూవీ మార్చి 19న థియేటర్లలో రిలీజైంది. ఆదిత్య ధర్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది.#DhurandharTheRevenge is raw, gripping and impactful 🔥@AdityaDharFilms brings scale and emotion together seamlessly. What he has done with this film is truly remarkable.@RanveerOfficial delivers a phenomenal performance - full of intensity and holds your attention…— Ram Charan (@AlwaysRamCharan) March 20, 2026 -
తిలక్ వర్మకు పెద్ది బ్యాట్ గిఫ్ట్ V ఇచ్చిన రామ్ చరణ్
-
తిలక్ వర్మకు గిఫ్ట్ ఇచ్చిన రామ్ చరణ్.. అదేంటంటే?
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన చికిరి చికిరి, రైరై రారా అంటూ సాంగ్స్ ఆడియన్స్ను అలరిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది.తాజాగా పెద్ది మూవీ సెట్స్లో వరల్డ్ కప్ హీరో, టీమిండియా క్రికెటర్ తిలక్ వర్మ సందడి చేశారు. మూవీ షూటింగ్ సెట్స్కు వెళ్లిన తిలక్ వర్మ.. రామ్ చరణ్తో ముచ్చటించారు. ఈ సందర్భంగా తిలక్ వర్మకు రామ్ చరణ్ ఓ బ్యాట్ను గిఫ్ట్గా ఇచ్చారు. పెద్ది మూవీ షూట్లో వాడిన పాత బ్యాట్ను తిలక్ వర్మకు బహుమతిగా అందించారు. అంతేకాకుండా వరల్డ్ కప్లో తిలక్ వర్మ ప్రదర్శనపై ప్రశంసలు కురిపించారు. దీనికి సంబంధించిన వీడియోను పెద్ది మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా.. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. T20 World Cup champion @TilakV9 visited the sets of #Peddi ❤🔥He caught a glimpse of the film’s sports sequences and was thoroughly impressed.#PEDDI WORLDWIDE RELEASE ON 30th APRIL, 2026Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman… pic.twitter.com/Csyce4KCNH— Vriddhi Cinemas (@vriddhicinemas) March 18, 2026 -
పెద్ది స్పెషల్ సాంగ్ లో ఐదుగురు బ్యూటీలు..!
-
#RC17 సెట్స్ పైకి ఎప్పుడంటే..?
-
డాల్బీ సినిమాస్ ఫార్మాట్లో...
రామ్చరణ్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది. కాగా ఈ చిత్రాన్ని డాల్బీ సినిమాస్ ఫార్మాట్లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, రామ్చరణ్ కొత్త ఫొటోను విడుదల చేశారు.‘‘యాక్షన్ డ్రామాగా రూపొందిన చిత్రం ‘పెద్ది’. ఈ మూవీని అత్యాధునిక డాల్బీ సినిమాస్ ఫార్మాట్లో కూడా విడుదల చేస్తున్నాం. రామ్చరణ్ మాస్ రగ్డ్ అవతార్ను డాల్బీ సినిమాస్ ఫార్మాట్లో చూడడం ప్రేక్షకులకు ఓ గొప్ప అనుభూతి దక్కేలా చేస్తుంది. అలాగే ‘పెద్ది’ వంటి భారీ యాక్షన్, ఎమోషన్ కలిగిన ఈ చిత్రాన్ని డాల్బీ సినిమాస్లో చూడడం వల్ల ప్రేక్షకులు పూర్తిగా సినిమాలో లీనమయ్యే అవకాశం ఉంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
భాగ్యనగరంలో భలే జోరు
వేసవి మొదలైపోయింది. ఎండలు కూడా అప్పుడే మండుతున్నాయ్. అయినా ఏమాత్రం లెక్క చేయకుండా షూటింగ్లతో బిబీ బిజీగా ఉంటున్నారు నటీనటులు. కొన్ని సినిమాలు ఇండోర్లో (స్టూడియోల్లో) షూటింగ్స్ జరుపుకుంటుండగా... మరికొన్ని మూవీస్ షూటింగ్స్ కోసం హైదరాబాద్ సమీపంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేకమైన సెట్స్ వేసి చిత్రీకరణలు జరుపుతున్నారు మేకర్స్.ప్రస్తుతం భాగ్యనగరంతో (హైదరాబాద్) పాటు పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్లు భలే జోరుగా సాగుతున్నాయి. నాగార్జున, వెంకటేశ్, రవితేజ, ప్రభాస్, రామ్చరణ్, నాని, గోపీచంద్, శర్వానంద్, అఖిల్ వంటి పలువురు హీరోలు హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో తమ సినిమాల షూటింగ్లో హుషారుగా పాల్గొంటున్నారు. ఆ విశేషాలేంటో చూద్దాం...మూసరంబాగ్లో... నాగార్జున కెరీర్లో వందో చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఆయన ప్రయాణంలో ఓ మైలురాయిగా నిలవనున్న ఈ సినిమాని తమిళ దర్శకుడు కార్తీక్ తెరకెక్కిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్పై నాగార్జున భారీ బడ్జెట్తో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్, యాక్షన్ బ్యాక్డ్రాప్లో రూపొందుతోన్న ఈ సినిమాకు ‘కింగ్ 100, కింగ్ 100 నాటౌట్’ వంటి టైటిల్స్ను మేకర్స్ పరిశీలిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల కర్నాటకలోని మైసూర్ షెడ్యూల్ని పూర్తి చేసుకుని హైదరాబాద్ తిరిగొచ్చింది యూనిట్.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లోని మూసరాంబాగ్లో జరుగుతోంది. నాగార్జునపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు కార్తీక్. నాగార్జున కెరీర్లో ఓ మైలురాయిగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అన్ని వాణిజ్య అంశాలతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారట దర్శకుడు. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. కాగా ఈ మూవీలో సీనియర్ నటి టబు–నాగార్జున కలిసి నటిస్తున్నారు.ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో నాగార్జున తనయులు నాగచైతన్య, అఖిల్ అతిథి పాత్రల్లో మెరవనున్నారని టాక్. అక్కినేని నాగేశ్వర రావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ (గెస్ట్ అప్పీయరెన్స్) కలిసి ‘మనం’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. మరోసారి తండ్రీ కొడుకులు స్క్రీన్ షేర్ చేసుకోనున్నారనే వార్తలతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నాగార్జున నటిస్తున్న ఈ వందో చిత్రంపై ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో, అక్కినేని అభిమానుల్లో చాలా ఆసక్తి నెలకొంది. అన్నపూర్ణలో... ‘సంక్రాంతికి వస్తున్నాం’ (2025) వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత వెంకటేశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’. ఈ మూవీకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. వెంకటేశ్తో పాటు ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట.వెంకటేశ్ ఇమేజ్కి తగ్గట్టు అద్భుతమైన కుటుంబ కథాంశం నేపథ్యంలో ఈ మూవీని రూపొందిస్తున్నారని తెలిసింది. ‘కేజీఎఫ్’ మూవీ ఫేమ్ శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. అక్టోబరులో సినిమాని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఈ చిత్రానికి ‘యానిమల్’ మూవీ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత వెంకటేశ్ నటిస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. శంకర్పల్లిలో ఇరుముడి... వరుస సినిమాలతో బిజీగా దూసుకెళుతున్నారు రవితేజ. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకుడు. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, రవితేజ కుమార్తె పాత్రను బేబీ నక్షత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శంకర్పల్లిలో జరుపుకుంటోంది.ఆధ్యాత్మిక ప్రాముఖ్యత నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో అయ్యప్ప మాలధారిగా కనిపించనున్నారు రవితేజ. దర్శకుడు శివ నిర్వాణ పవర్ఫుల్ స్క్రిప్ట్ను రూపొందించారట. ‘‘రవితేజ మునుపెన్నడూ చేయని భిన్నమైన పాత్రని ‘ఇరుముడి’లో చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన పూర్తిగా మేకోవర్ అయ్యారు. ఇందులో తండ్రీకూతుళ్ల మధ్య వచ్చే బలమైన భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అని యూనిట్ పేర్కొంది. ఈ మూవీకి సంగీతం: జీవీ ప్రకాశ్కుమార్. ఆర్ఎఫ్సీలో... వరుస పాన్ ఇండియన్ సినిమాలతో దూసుకెళుతున్న ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఫౌజీ’. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్. జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భాను చందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి–సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ‘ఫౌజీ’ షూటింగ్ ప్రస్తుతం ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. ఈ తాజా షెడ్యూల్లో ప్రభాస్ పాల్గొంటున్నారట. ఆయనపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. ప్రభాస్ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పవర్ఫుల్ పాత్రలో చూపించనున్నారట హను రాఘవపూడి. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో దసరా పండగకి ‘ఫౌజీ’ని గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. శంకర్పల్లిలో కల్కి... ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్పై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా 2024 జూన్ 27న విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్గా ‘కల్కి 2898 ఏడీ 2’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంకర్పల్లిలో జరుగుతోంది.‘కల్కి 2898 ఏడీ’లో అశ్వద్ధామ పాత్రలో నటించిన అమితాబ్ బచ్చన్, సుప్రీమ్ యాస్కిన్ పాత్ర చేసిన కమల్హాసన్ ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. తొలి భాగంలో అమితాబ్, కమల్కి ఎలాంటి కాంబినేషన్ సీన్స్ లేవు. కానీ, ‘కల్కి 2898 ఏడీ 2’లో మాత్రం వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు చాలా కీలకం అట. ఈ నేపథ్యంలోనే శంకర్పల్లిలో వేసిన ప్రత్యేక సెట్లో ప్రస్తుతం అమితాబ్, కమల్ కలయికలో వచ్చే సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట. అజీజ్ నగర్లో... రామ్చరణ్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘పెద్ది’. బుచ్చిబాబు సానా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్చరణ్కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఈ మూవీలో జగపతిబాబు, శివ రాజ్కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ రెండు చోట్ల జరుగుతోంది.హైదరాబాద్లో సమీపంలోని అజీజ్ నగర్లో, అదే విధంగా గచ్చిబౌలి సమీపంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో రెండు యూనిట్లతో ఈ మూవీ షూటింగ్ జరుపుతున్నారు మేకర్స్. అజీజ్ నగర్లో రామ్చరణ్పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. అదే విధంగా అల్యూమినియం ఫ్యాక్టరీలో సినిమాలోని ముఖ్య తారాగణంపైనా పలు సీన్స్ తీస్తున్నారట. మార్చి 27న రామ్చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు యూనిట్ తొలుత ప్రకటించింది. అయితే ఆ తేదీకి వాయిదా పడి ఏప్రిల్ 30కి ఫిక్స్ అయింది. ఈ మూవీకి సంగీతం: ఏఆర్ రెహమాన్. ముచ్చింతల్లో... నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘దసరా’. ఈ మూవీని ఎస్ఎల్వీ సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. 2023 మార్చి 30న విడుదలైన ఈ మూవీ బ్లాక్బస్టర్ అందుకుంది. ‘దసరా’ వంటి హిట్ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మంచు మోహన్బాబు, రాఘవ్ జుయల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో జరుగుతోంది.ఈ షెడ్యూల్లో నానీతో పాటు చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొంటోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో జడల్ అనే మాస్ పాత్రలో నాని కనిపించనున్నారు. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు యూనిట్ తొలుత ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రిలీజ్ పోస్ట్పోన్ అయింది. ఫైనల్గా ఆగస్టు 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్. అజీజ్ నగర్లో... గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గోపీచంద్ 33’ (వర్కింగ్ టైటిల్). సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. హిస్టారికల్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని అజీజ్ నగర్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో గోపీచంద్, రీతూ వర్మ, ఇతర నటీనటులపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకస్తున్నారట. ‘‘హిస్టారికల్ నేపథ్యంలో భారీ స్థాయిలో రూపొందుతోన్న చిత్రం ‘గోపీచంద్ 33’.ఈ సినిమాలో గోపీచంద్ ఇప్పటివరకు చేయని సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఈ క్యారెక్టర్ కోసం ఆయన పూర్తిగా మేకోవర్ అయ్యారు. గోపీచంద్ కెరీర్లోనే అత్యంత భారీ చిత్రాల్లో ఒకటిగా ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాలో సత్యవతిగా రీతూ వర్మ అద్భుతంగా నటిస్తున్నారు. భారత చరిత్రలో వెలుగులోకి రాని ఒక శక్తివంతమైన అధ్యాయాన్ని ఈ మూవీ ద్వారా ఆవిష్కరించబోతున్నారు సంకల్ప్ రెడ్డి. ఈ చిత్రం విజువల్ వండర్గా ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరోవైపు పోస్ట్ ప్రోడక్షన్ పనులు కూడా కొనసాగుతున్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ మూవీకి అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు.అన్నపూర్ణలో లెనిన్... అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్ర దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పీ, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నాగార్జున, నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోని అన్నపూర్ణ 7ఎకర్స్ స్టూడియోలో చిత్రీకరణ జరుగుతోంది.అఖిల్, భాగ్యశ్రీ బోర్సేలతో పాటు చిత్రంలోని ప్రధాన తారగణంపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట మురళీ కిశోర్. రాయలసీమ నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం కోసం పొడవాటి జుట్టు, గెడ్డంతో ఫుల్ మాస్ లుక్లోకి మారిపోయారు అఖిల్. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్కి మంచి స్పందన వచ్చింది. అదే విధంగా ఎస్ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘వారెవా వారెవా...’ అంటూ సాగే లిరికల్ సాంగ్ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కింది. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ‘లెనిన్’ ఈ వేసవిలో విడుదల కానుంది. ముచ్చింతల్లో భోగి శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. ‘ఎ బ్లడ్ ఫెస్ట్’ అన్నది ట్యాగ్లైన్. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో డింపుల్ హయతి, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. హై ఓల్టేజ్ పీడియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ‘భోగి’ షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో శర్వానంద్పై ముఖ్యమైన సన్నివేశాలను రూపొందిస్తున్నారట సంపత్ నంది.ఫిబ్రవరి 6న శర్వానంద్ బర్త్డే సందర్భంగా ‘భోగి’ నుంచి విడుదల చేసిన ఆయన బర్త్ డే పోస్టర్కి మంచి స్పందన వచ్చింది. ‘‘భారీ పాన్–ఇండియన్ పీరియాడిక్ మూవీగా ‘భోగి’ని రూపొందిస్తున్నాం. 1960లో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర ప్రాంతం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రం శర్వానంద్ కెరీర్లో ప్రతిష్టాత్మకమైన వెంచర్లలో ఒకటిగా ఉంటుంది. ఈ చిత్రంలో శర్వానంద్ ఇప్పటివరకు కనిపించని రస్టిక్, ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. ఆగస్టు 28న రక్షా బంధన్ సందర్భంగా ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో. తుక్కుగూడలో... ‘విరూపాక్ష’, ‘బ్రో’ వంటి హిట్ సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్పై ‘హను–మాన్’ (2024) వంటి బ్లాక్బస్టర్ మూవీ తెరకెక్కించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని తుక్కుగూడలో జరుగుతోంది. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్లో సాయిదుర్గా తేజ్తో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సీన్స్ తీస్తున్నారు రోహిత్. ఈ సినిమా 2025 సెప్టెంబరు 25న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ వాయిదా పడింది. అయితే కొత్త రిలీజ్ డేట్ని మాత్రం మేకర్స్ ప్రకటించ లేదు. పైన పేర్కొన్నటువంటి సినిమాలే కాదు. మరికొన్ని సినిమాలు కూడా హైదరాబాద్లో, పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
నాన్న నాకిచ్చే అతిపెద్ద గిఫ్ట్ అదే: సుస్మిత కొణిదెల
మెగా డాటర్ సుస్మిక కొణిదెల నిర్మాతగా కూడా రాణిస్తోంది. ఈ ఏడాది మనశంకర వరప్రసాద్గారు మూవీతో బ్లాక్బస్టర్ను సొంతం చేసుకుంది. ఈ మూవీతో నాన్నకు సూపర్ హిట్ అందించిన కూతురిగా ఘనత సాధించింది. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అనే బ్యానర్లో పలు చిత్రాలు నిర్మిస్తున్నారు. ఇవాళ సుస్మిత బర్త్ డే కావడంతో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా ఫ్యాన్స్ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.ఈ ఆదివారం మహిళ దినోత్సవం సందర్భంగా ఈ ఇంటర్వ్యూకు హాజరైన సుస్మిత పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. మా ఇంట్లో మహిళలకు ప్రత్యేకమైన రోజు అవసరం లేదని.. ఎప్పుడూ గౌరవం, ప్రోత్సాహం ఎల్లప్పుడు లభిస్తూనే ఉంటాయని తెలిపింది. ప్రతి బర్త్ డేకు నాన్న చిరంజీవి, రామ్ చరణ్ తనకు గిఫ్ట్స్ ఇస్తారని వెల్లడించింది. కానీ ఆ బహుమతుల కంటే తనపై వారు పెట్టుకున్న నమ్మకమే అతిపెద్ద గిఫ్ట్ అని పేర్కొంది. తాను ఏ పని అయినా చేయగలననే విశ్వాసం వారికి ఉందని సుస్మిత సంతోషం వ్యక్తం చేసింది. తనకు కుటుంబం మద్దతు కలిగి ఉండడం నా జీవితంలో గొప్ప బహుమతి అన్నారు. -
టీమిండియా వరల్డ్ కప్ విన్.. పెద్ది సాంగ్ వీడియో వైరల్
టీమిండియా ముచ్చటగా మూడోసారి టీ20 వరల్డ్ కప్ను ముద్దాడింది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా.. న్యూజిలాండ్ను చిత్తు చేసి విశ్వవిజేతగా నిలిచింది. దీంతో ఇండియా క్రికెట్ అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ఈ విజయాన్ని ప్రతి ఒక్కరు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ గెలుపును తమకు నచ్చినట్లుగా పోస్టులు పెడుతూ ఎంజాయ్ చేస్తున్నారు.తాజాగా ఈ విజయాన్ని పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు సనా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇటీవల రిలీజైన పెద్ది సెకండ్ సింగిల్ రైరా రారా అంటూ సాగే పాటతో టీమిండియా వీడియోను షేర్ చేశారు. రైరా రారా అంటూ సాగే ఈ పాటకు టీమిండియా ఆటగాళ్లతో వీడియోను రూపొందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న పెద్ది మూవీ ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది.🔥🔥🔥🔥🔥 pic.twitter.com/xLVcvmd1yM— BuchiBabuSana (@BuchiBabuSana) March 8, 2026 -
'ఆ ప్రాధాన్యతే నాకు ప్రేరణ'.. ఉపాసన స్పెషల్ పోస్ట్
అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా మెగా కోడలు ఉపాసన ప్రత్యేక పోస్ట్ చేసింది. ఈ రోజు నా లైఫ్ భిన్నదశల్లో నన్ను నేను అంగీకరించడం కోసమేనని తెలిపింది. ఇలా ఉండడం ఎల్లప్పుడూ సులభం కాదు.. కానీ నా శ్రేయస్సు, నా కుటుంబం కోసం నా ఆరోగ్యాన్ని ప్రాధాన్యతగా చేసుకోవడంతోనే ప్రేరణ పొందానని ట్వీట్ చేసింది. ఇవాళ మహిళ దినోత్సవం పురస్కరించుకుని ప్రత్యేక ఫోటోలను షేర్ చేసింది ఉపాసన.కాగా.. ఈ ఏడాది ఉపాసన కొణిదెల కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఉపాసనకు ఇప్పటికే ఓ కూతురు ఉండగా.. ఇటీవల ఓ పాప, బాబుకు జన్మనిచ్చారు. ఈ ఏడాది మెగా ఫ్యామిలీకి డబుల్ ఆనందాన్ని తీసుకొచ్చారు. రామ్ చరణ్కు వారసుడు పుట్టడంతో మెగా ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. అపోలో ఆస్పత్రి వద్ద పెద్దఎత్తున సంబురాలు చేసుకున్నారు. This Women’s Day is about accepting and embracing myself — in all the many shapes & sizes in different phases of my life. It isn’t always easy, but I’m motivated to make my health a priority, for my own wellbeing & for my family. 💛 pic.twitter.com/9NBdRIiQsH— Upasana Konidela (@upasanakonidela) March 8, 2026 -
'నీ కొత్త ప్రయాణం చూస్తుంటే ఆనందంగా ఉంది'.. రామ్ చరణ్ స్పెషల్ పోస్ట్
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్- నయనిక జంటకు మెగా హీరో రామ్ చరణ్ విషెస్ చెప్పారు. పెళ్లి వేడుకలో పాల్గొన్న చెర్రీ నూతన దంపతులకు అభినందనలు తెలిపారు. అల్లు శిరీష్-నయనిక జంటను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. నయనికతో ఈ అద్భుతమైన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించినందుకు శిరీష్ను అభినందించారు. మీ వైవాహిక జీవితం ఇద్దరికీ అంతులేని ఆనందం, ప్రేమ, ఆశీర్వాదాలు ఎల్లప్పుడు ఉండాలని రామ్ చరణ్ ఆకాంక్షించారు.కాగా.. అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ వెడ్డింగ్ గ్రాండ్గా జరిగింది. హైదరాబాద్లోని కొల్లూరు ఐనా ఈవెంట్ స్పేస్లో ఈ పెళ్లి వేడుక నిర్వహించారు. ఈ వెడ్డింగ్కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెళ్లికి హాజరైన రామ్ చరణ్ నూతన జంటను ఆశీర్వదించారు.కాగా.. అల్లు శిరీష్- నయనిక కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. హీరో నితిన్ భార్య షాలినికి నయనిక బెస్ట్ ఫ్రెండ్ కావడం మరో విశేషం. వరుణ్తేజ్- లావణ్య తమ పెళ్లిలో నయనికతో శిరీష్కు పరిచయం ఏర్పడింది. అలా వీరిద్దరు డేటింగ్ కొనసాగించారు. తాజాగా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. కాగా.. అల్లు శిరీశ్ కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ, బడ్డీ, ఊర్వశివో రాక్షసివో లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. So happy to see @AlluSirish begin this wonderful new journey with #Nayanika Wishing the both of you endless happiness, love and a blessed married life ❤️Congratulations ✨ pic.twitter.com/2FYRvGcNXX— Ram Charan (@AlwaysRamCharan) March 6, 2026 -
జాన్వీ కపూర్ బర్త్ డే.. రామ్ చరణ్ స్పెషల్ విషెస్
పెద్ది బ్యూటీ జాన్వీ కపూర్కు మెగా హీరో రామ్ చరణ్ బర్త్ డే విషెస్ తెలిపారు. పెద్ది మూవీ సెట్లో జాన్వీ కపూర్తో ఉన్న స్పెషల్ వీడియోను షేర్ చేశారు. ఈ సినిమా సెట్స్ నుంచి కొన్ని ఆసక్తికరమైన సీన్స్ను చెర్రీ పంచుకున్నారు. ఈ వీడియోలో జాన్వీ తన పాత్ర 'అచ్చియమ్మ' గెటప్లో కనిపిస్తూ సందడి చేశారు. ఆమెకు తన వృత్తి పట్ల ఆమెకున్న మక్కువ, నిబద్ధత చూడటం చాలా సంతోషంగా ఉంది.. ఈ ఏడాది తనకి మరింత అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.కాగా.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీని శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన రెండు పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మొదటి సాంగ్ చికిరి చికిరి అభిమానులను ఓ ఊపు ఊపేయగా.. ఇటీవల రిలీజైన రైరై రారా అంటూ సాగే పాట కూడా అదే రేంజ్లో అలరిస్తోంది.కాగా.. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో శివ రాజ్కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
పెద్ది మళ్ళీ పోస్టుపోన్..! APR 30 కాదు.. ఎప్పుడంటే..?
-
టాప్ స్టార్ గా రామ్ చరణ్ రికార్డు... లిస్ట్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారంటే..?
-
ఇండస్ట్రీని షేక్ చేస్తోన్న పెద్ది రన్ టైం..!
-
రామ్ చరణ్ పెద్ది మూవీ.. 24 గంటల్లోనే రికార్డ్
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన చికిరి చికిరి సాంగ్ ఆడియన్స్ను ఓ ఊపు ఊపేసింది. వ్యూస్ పరంగా రికార్డ్ స్థాయిలో దూసుకెళ్లింది.తాజాగా రిలీజైన రైరై రారా అంటూ సాగే సాంగ్ సైతం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ పాట రిలీజైన కొన్ని గంటల్లోనే అత్యధిక వ్యూస్తో దూసుకెళ్తోంది. ఈ సాంగ్ విడుదలైన 24 గంటల్లోనే 31 మిలియన్ల వ్యూస్, 5లక్షల 30వేల లైక్స్ను సొంతం చేసుకుంది. కాగా.. ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా.. ఏఆర్ రెహమాన్ పాడారు. ఈ మోటివేషనల్ సాంగ్ను రెహమాన్ కంపోజ్ చేశారు. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. -
స్టెప్పులతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పెద్ది
-
రామ్ చరణ్ 'పెద్ది' రన్టైమ్.. 4 గంటలపైనే?
పెద్ద సినిమాలు భారీ నిడివితో రావడం ఇప్పుడు సాధారణమైపోయింది. ఇటీవల యానిమల్ సినిమా రన్టైమ్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఇకపై వస్తున్న ధురంధర్-2 కూడా అంతకుమించిన నిడివితో వస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో పెద్ది కూడా భారీ రన్టైమ్తో వస్తోందనే ప్రచారం మొదలైంది. సినిమా టోటల్ ఫుటేజ్ 4 గంటలపైనే ఉందని, ఫైనల్ రన్టైమ్ 3 గంటలకు పైగా ఉంటుందనే కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై పెద్ది యూనిట్ స్పందించింది. పెద్ది రన్టైమ్పై వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం కేవలం తొలి సగం మాత్రమే లాక్ అయింది. రెండో భాగానికి సంబంధించిన షూటింగ్ ఇంకా కొనసాగుతోందని స్పష్టం చేసింది. ప్రస్తుతం పెద్ది నుంచి విడుదలైన రెండో పాట 'రయ్ రయ్ రారా'పై చర్చ జోరుగా సాగుతోంది. చరణ్ డాన్స్ను చిరంజీవి ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. దాంతో అభిమానుల్లో పెద్ది చిత్రంపై ఆసక్తి మరింత పెరిగింది. దీనిపై దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ, ఆ డాన్స్ చేస్తున్న సమయంలో చరణ్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. షూట్ ఆపుదామని చెప్పినా వినకుండా జ్వరంతోనే డాన్స్ చేశారని గుర్తుచేసుకున్నారు.ప్రస్తుతం 'రయ్ రయ్ రారా' సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. దీంతో సినిమా మీద హైప్ మరింత పెరిగింది. పెద్ది సినిమా రన్టైమ్పై వస్తున్న ప్రచారాలు నిజం కావని యూనిట్ స్పష్టతనిచ్చింది. అభిమానులు మాత్రం సినిమా ఫైనల్ రన్టైమ్పై అధికారిక అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. -
ట్రెండింగ్ లో PEDDI డ్యాన్స్ తో కుమ్మేసిన రామ్ చరణ్
-
రైరై రారా అంటోన్న రామ్ చరణ్.. పెద్ది సాంగ్ రిలీజ్
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన చికిరి చికిరి సాంగ్ ఆడియన్స్ను ఓ ఊపు ఊపేసింది.తాజాగా ఈ సినిమా నుంచి రైరై రారా అంటూ సాగే మరో సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా.. ఏఆర్ రెహమాన్ పాడారు. ఈ మోటివేషనల్ సాంగ్ను రెహమాన్ కంపోజ్ చేశారు. ఈ సినిమా ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది.When grit finds its voice 🔥When grace finds its moves 🤩#Peddi Second Single #RaiRaiRaaRaa (Telugu) Out Now❤️🔥▶️https://t.co/yrdKeTtKJ9#PEDDI WORLDWIDE RELEASE ON 30th APRIL, 2026 pic.twitter.com/dHIWPRp8hR— PEDDI (@PeddiMovieOffl) March 2, 2026 -
అల్లు అర్జున్ ఇంటికి విజయ్, రష్మిక జోడీ (ఫోటోలు)
-
అల్లు శిరీష్ 'పెళ్లి కొడుకు' వేడుక.. ఫొటోలు, వీడియో వైరల్
రీసెంట్గానే టాలీవుడ్కి చెందిన విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మరో హీరో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. అల్లు అర్జున్ సోదరుడు శిరీష్ వివాహం.. ఈ శుక్రవారం హైదరాబాద్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరగనుంది. నయనిక అమ్మాయితో ఏడడుగులు వేయబోతున్నాడు. గత కొన్నిరోజులుగా బ్యాచిలర్ పార్టీ, కాక్టెయిల్ పార్టీలంటూ సెలబ్రేషన్స్ జరిగాయి. ఇప్పుడు శిరీష్ని పెళ్లి కొడుకుగా తయారు చేసిన వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.ఈ పెళ్లి వేడుకలో అల్లు ఫ్యామిలీ అంతా సందడి చేశారు. అలానే మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్, ఉపాసన, చిరంజీవి భార్య సురేఖ, నిహారిక తదితరులు పాల్గొన్నారు. కొత్తగా పెళ్లయిన విజయ్ దేవరకొండ-రష్మిక కూడా ఈ సెలబ్రేషన్స్లో భాగమయ్యారు. హీరో బాలకృష్ణ సతీమణి వసుంధర కూడా ఈ శుభకార్యంలో కనిపించారు. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) -
'పెద్ది' మొదలుపెట్టేశాడు.. బుచ్చిబాబుని ఆడుకున్న చరణ్
మెగాహీరో రామ్ చరణ్ లేటెస్ట్ సినిమా 'పెద్ది'. బుచ్చిబాబు దర్శకుడు. లెక్క ప్రకారం మార్చి 27న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అని ప్రకటించారు. కానీ షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండేసరికి వాయిదా వేశారు. ఏప్రిల్ 30న థియేటర్లలో తమ మూవీ విడుదల కానుందని కొన్నిరోజుల క్రితం పోస్టర్ వదిలారు. తాజాగా ఓ వైపు చివరి దశ చిత్రీకరణ జరుగుతోంది. మరోవైపు డబ్బింగ్ కూడా మొదలుపెట్టేశారు. తాజాగా ఆ వీడియోని చరణ్.. తన సోషల్ మీడియాలో పంచుకున్నారు.(ఇదీ చదవండి: అల్లు అర్జున్తో సినిమా.. 15 రోజులు తినడం మానేశా)'ఏమది' అనే డైలాగ్ చెబుతున్న వీడియోని పోస్ చేసిన చరణ్.. ఇందులో దర్శకుడు బుచ్చిబాబుని కూడా ఓ రేంజులో ఆటాడుకున్నట్లు కనిపించాడు. 'చికిరి చికిరి పాటలో మోహిత్ చౌహన్ వాయిస్కి నువ్వు ఎంత యాక్టింగ్ చేశావంటే ఆయనే పాడాడా అని డౌట్ వచ్చిందయ్యా. నా డబ్బింగ్లో అలా యాక్ట్ చేయకు' అని చరణ్ తెగ ఏడిపించేశాడు. ఈ వీడియో ఫన్నీగా అనిపిస్తూ అభిమానుల్ని ఎంటర్టైన్ చేస్తోంది.'పెద్ది' నుంచి వచ్చిన తొలి పాట 'చికిరి చికిరి' అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. సోమవారం(మార్చి 02) ఈ మూవీ నుంచి రెండో సాంగ్ రిలీజ్ కానుంది. ఇకపోతే స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్తో తీసిన ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్. కన్నడ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. జగపతిబాబు, దివ్యేందు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు.(ఇదీ చదవండి: శరత్ కుమార్ రెండో భార్యని తెగ పొగిడేసిన మొదటి భార్య) View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
నిర్మాతగా రామ్ చరణ్.. స్వయంగా ప్రకటించిన టాలీవుడ్ హీరో
నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ స్వయంభు. ఇటీవలే టీజర్ రిలీజ్ చేయగా అద్భుతమైన విజువల్స్తో అభిమానులను ఆకట్టుకుంది. ఈ మూవీ విజువల్స్ బాహుబలి రేంజ్లో ఉన్నాయంటూ ప్రశంసలొచ్చాయి. ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సమ్మర్ కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.తాజాగా ఓ ఈవెంట్కు హాజరైన హీరో తన కొత్త సినిమాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ ఏడాది తాను మూడు చిత్రాలు చేస్తున్నట్లు ప్రకటించారు. స్వయంభుతో పాటు మరో రెండు సినిమాలు కూడా ఉన్నాయని తెలిపారు. స్వయంభు తర్వాత ఇండియా హౌస్ అనే సినిమా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మూవీకి గ్లోబల్ స్టార్, మెగా హీరో రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నారని నిఖిల్ స్వయంగా ప్రకటించారు. ఆ తర్వా కార్తికేయ-3 కూడా వస్తుందని నిఖిల్ ఫ్యాన్స్కు గూస్ బంప్స్ తెప్పించేలా మాట్లాడారు. కాగా..స్వయంభు చిత్రంలో సంయుక్తమీనన్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్ సుబ్బరాజు, సత్య కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని భువన్, శ్రీకర్ నిర్మిస్తుండగాయ.. రవి బస్రూర్ సంగీతమందించారు. గ్లోబల్ స్టార్ మెగా పవర్ రామ్ చరణ్ - ఇండియా హౌస్ మూవీ ప్రొడ్యూసర్ #RamCharan #Nikhil #Swayambhu #Peddi pic.twitter.com/R9Q4rjvKkn— NAVEEN CHERRY 😎🤏 (@naveenpari2) February 28, 2026 -
రామ్ చరణ్ పెద్ది మూవీ.. సెకండ్ సింగిల్ అప్డేట్
రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీని ఉత్తరాంధ్ర బ్యాక్డ్రాప్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. మార్చి రెండో తేదీన ఈ మాస్ సాంగ్ను విడుదల చేస్తామని డైరెక్టర్ ట్వీట్ చేశారు. నీ అయ్య వడ్డీ... నీ బిడ్డ కడితే… నువ్వేమి పొడిచావనే.. రై రై రారా రై రై రారా అంటూ సాగే పాట ఆడియన్స్ను అలరించనుంది.కాగా.. ఇప్పటికే రిలీజైన చికిరి చికిరి సాంగ్ అభిమానులను ఓ రేంజ్లో ఊపేసింది. ఈ పాటకు సోషల్ మీడియాలో పెద్దఎత్తున ఆడియన్స్ స్టెప్పులతో అదరగొట్టారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. కాగా.. ఈ సినిమా ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. నీ అయ్య వడ్డీ...నీ బిడ్డ కడితే… నువ్వేమి పొడిచావనే!! రై రై రారా రై రై రారా… 🔥🔥🔥COMING SOON… Nee Ayya Vaddee… Nee Bidda Kadithe…Nuvvemi Podichaavanee… RAI RAI RAA RAA🔥🔥🔥This is the anthem of GRIT, GUTS & GLORY 🔥🔥🔥#Peddi second single #RaiRaiRaaRaa out… pic.twitter.com/Xzruw0SZPh— BuchiBabuSana (@BuchiBabuSana) February 26, 2026 -
హీరోయిన్ ఎవరు?
టాలీవుడ్లో ప్రజెంట్ కథనాయికల కోసం సెర్చ్ జరుగుతోంది. అనౌన్స్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ ఈ కథానాయకుల సరసన నటించే కథానాయికలు ఎవరు? అనే విషయాలపై స్పష్టత రావడం లేదు. కానీ ఫలానా హీరో సినిమాలో ఫలానా హీరోయిన్ ‘ఇన్’ అయ్యారనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఆ వివరాలపై ఓ లుక్ వేయండి.తండ్రీ కూతుళ్ల అనుబంధం అన్నదమ్ముల అనుబంధం కథాంశంగా చిరంజీవి హీరోగా నటించి, బాబీ దర్శకత్వం వహించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా 2023 సంక్రాంతికి విడుదలై, హిట్గా నిలిచింది. మళ్లీ చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్లో ఓ సినిమా రానుంది. కేవీఎన్ప్రోడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. మార్చి మొదటి వారంలో ఈ సినిమా ప్రారంభోత్సవం జరుగుతుందని, ఈ ఏడాది మేలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని ఫిల్మ్నగర్ సమాచారం. అలాగే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా షూట్ ప్లాన్ చేస్తున్నారట దర్శకుడు బాబీ. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే నటీనటుల ఎంపికపై కూడా దృష్టి పెట్టారట బాబీ. ఈ సినిమా కథాంశం ప్రధానంగా తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. కాగా ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు ప్రియమణిని ఎంపిక చేశారట మేకర్స్. అలాగే చిరంజీవి కుమార్తె పాత్ర కోసం సారా అర్జున్, కృతీశెట్టి, అనస్వరా రాజన్, ప్రీతీ ముకుందన్ వంటి యువ హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ప్రీతీ ముకుందన్ ముందు వరసలో ఉన్నారట. మరి... ఈ చిత్రంలో చిరంజీవి భార్యామణిగా ప్రియమణి, ఆయన కుమార్తెగా ప్రీతీ ముకుందన్ పేర్లు ఖరారు అవుతాయా? లెట్స్ వెయిట్ అండ్ సీ.నాలుగోసారి... ‘వీరసింహారెడ్డి’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేనిల కాంబినేషన్లో మరో సినిమా రానుంది. బాలకృష్ణ కెరీర్లోని 111వ సినిమా ఇది. తొలుత ఈ సినిమాకు ఓ భారీ హిస్టారికల్ బ్యాక్డ్రాప్ కథ అనుకున్నారు. ఇందులో నయనతారను హీరోయిన్గా అనుకున్నారు. అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ హిస్టారికల్ కథను కాస్త పక్కన పెట్టి, ఓ పక్కా మాస్ కమర్షియల్ సినిమా కథను ఫైనలైజ్ చేశారట. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు మాత్రం నయనతారనే ఫిక్స్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ విషయంపై త్వరలోనే ప్రకటన రానుందనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ‘సింహా, శ్రీరామరాజ్యం, జై సింహా’ వంటి చిత్రాల తర్వాత బాలకృష్ణ–నయనతార జోడీ నాలుగోసారి రిపీట్ అవుతుందా? వేచి చూడాలి.వెంకీ సరసన కీర్తి ?సంక్రాంతి పండక్కి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చి, బ్లాక్బస్టర్ హిట్స్ అందుకుంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవితో అనిల్ రావిపూడి చేసిన ‘మన శంకరవరప్రసాద్గారు’ సినిమా విడుదలై, బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ సక్సెస్ జోష్లో తన తర్వాతి సినిమా రిలీజ్ను సంక్రాంతికే ఫిక్స్ చేశారు అనిల్ రావిపూడి. వరుస హిట్స్ సాధిస్తుండటంతో అనిల్ రావిపూడి తర్వాతి సినిమాపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. ‘ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సినిమాల తర్వాత వెంకటేశ్తో అనిల్ రావిపూడి మరో సినిమా చేయనున్నారని, ఈ సినిమాయే 2027 సంక్రాంతికి రిలీజ్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాకు ‘బామ్మర్ది బాల్రెడ్డి’ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉందనే ప్రచారం జరుగుతోంది. వీటితో పాటు ఈ చిత్రంలో కీర్తీ సురేష్, పూజా హెగ్డే హీరోయిన్స్గా నటించనున్నారనే టాక్ వినిపించింది. మరి... వెంకటేశ్ సరసన కీర్తీ సురేష్ తొలిసారి హీరోయిన్గా కనిపిస్తారా? వేచి చూడాలి. దీపిక ప్లేస్లో సాయి పల్లవి? హీరో ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూ పోందుతున్న సైంటిఫిక్ అండ్ మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచరస్ సినిమా ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ ‘కల్కి సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా వచ్చిన తొలి భాగం ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, కమల్హాసన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. 2024 జూన్ 27న విడుదలైన ఈ సినిమా దాదాపు రూ.1200 కోట్లు కలెక్ట్ చేసి, బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ‘కల్కి సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా ‘కల్కి 2’ (కల్కి 2898 ఏడీ 2) సినిమా రానుంది.ఈ మూవీ చిత్రీకరణ మొదలైంది. అమితాబ్ బచ్చన్–కమల్ హాసన్ పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వచ్చే నెల ప్రభాస్ కూడా ఈ షూట్లో పాల్గొంటారు. అయితే దీపికా పదుకోన్ మాత్రం ఇక ఈ ‘కల్కి2898 ఏడీ’ సినిమా ఫ్రాంచైజీలో కనిపించరు. కొన్ని కారణాల వల్ల ఈ సినిమాలో దీపిక నటించడం లేదని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ‘కల్కి2898 ఏడీ’ సినిమాలో దీపిక పోషించిన సుమతి పాత్రను ఎవరు చేస్తారనే చర్చ టాలీవుడ్లో జరుగుతోంది. దీపిక ప్లేస్లో సాయిపల్లవి ఫైనలైజ్ అయ్యారని సమాచారం. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందని టాక్.రామ్చరణ్కు జోడీగా... ‘రంగస్థలం’ వంటి బ్లాక్బస్టర్ సినిమా తర్వాత హీరో రామ్చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో మరో సినిమా రానుంది. ఆల్రెడీ ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. సుకుమార్ అండ్ టీమ్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా కథ గురించి హీరో రామ్చరణ్, దర్శకుడు సుకుమార్ల మధ్య ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగాయి. ఈ మూవీ ప్రీప్రోడక్షన్ వర్క్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. కాగా, ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాదే ప్రారంభించాలని సుకుమార్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రలో నటించనున్నారంటూ సమంత, రష్మికా మందన్నా వంటి తారల పేర్లు తెరపైకి వచ్చాయి.తాజాగా హీరోయిన్ కృతీ సనన్ పేరు ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. మహేశ్ బాబు ‘వన్: నేనొక్కడినే’ తో తెలుగుకి పరిచయం అయిన కృతీ సనన్, ఆ తర్వాత నాగచైతన్య ‘దోచెయ్’, ప్రభాస్ ‘ఆదిపురుష్’ వంటి సినిమాల్లో నటించారు. మరి... రామ్చరణ్ సరసన కూడా ఈ బ్యూటీ కనిపిస్తారా? అన్న ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మరికొంత సమయం వేచి ఉండక తప్పదు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ పతాకాలపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు.రోమియో కోసం యానిమల్ బ్యూటీ నాని హీరోగా సుజిత్ డైరెక్షన్లో రానున్న లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ‘బ్లడీ రోమియో’. ‘శ్యామ్ సింగరాయ్’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత నానీతో వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న సినిమా ఇది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. కాగా ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రలో ఇంకా ఎవరూ అఫీషియల్గా కన్ఫార్మ్ కాలేదు. జాన్వీ కపూర్, శ్రద్ధా కపూర్ వంటి హీరోయిన్ల పేర్లు ఇటీవల వినిపించాయి. కానీ తాజాగా ‘యానిమల్’ మూవీ ఫేమ్ త్రిప్తి దిమ్రి పేరు తెరపైకి వచ్చింది. ‘బ్లడీ రోమియో’ టీమ్ త్రిప్తితో సంప్రదింపులు జరుపుతోందని, ఈ సినిమాలో ఆమె హీరోయిన్గా కన్ఫార్మ్ కావొచ్చని తెలిసింది. నాని–త్రిప్తి జోడీగా ఇప్పటివరకు కలిసి నటించలేదనే విషయం తెలిసిందే. మరోవైపు ప్రస్తుతం నాని ‘ది ΄్యారడైజ్’ సినిమా చేస్తున్నారు. బ్లాక్బస్టర్ మూవీ ‘దసరా’ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో ఈ సినిమా రూ పోందుతోంది. మోహన్బాబు, సంపూర్ణేష్బాబు, రాఘవ్ జూయల్ ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రలో కయాదు లోహర్ నటిస్తున్నారని తెలిసింది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 21న రిలీజ్ కానుంది.శర్వా సరసన.. ఇటీవలే ‘నారీ నారీ నడుమ మురారీ’తో సూపర్హిట్ అందుకున్నారు శర్వానంద్. ప్రస్తుతం ‘భోగి’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు శర్వా. అలాగే దర్శకుడు శ్రీను వైట్లతో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ చేయనున్నారు శర్వా. ‘నారీ నారీ నడుమ మురారీ’ సినిమా సక్సెస్ మీట్లో ఈ సినిమాను ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. కాగా, ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్రకు ఆషికా రంగనాథ్ను ఎంపిక చేశారట మేకర్స్. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.గ్రీన్ సిగ్నల్? హీరోగా కార్తీ తెలుగులో ఓ స్ట్రయిట్ ఫిల్మ్ చేయనున్నారని తెలిసింది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాగవంశీ నిర్మించనున్నారట. ‘మ్యాడ్, మ్యాడ్ 2’ చిత్రాల తర్వాత దర్శకుడు కల్యాణ్ శంకర్ ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్టోరీని రెడీ చేశారట. ఈ కథ కార్తీకి నచ్చిందని, దీంతో సినిమా చేసేందుకు ఒప్పుకున్నారని టాక్. అంతేకాదు... ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు మేకర్స్ మీనాక్షీ చౌదరిని సంప్రదించారని భోగట్టా. సితార సంస్థ నుంచి వచ్చిన ‘లక్కీ భాస్కర్, అనగనగ ఒకరాజు’ వంటి హిట్ సినిమాల్లో హీరోయిన్గా నటించారు మీనాక్షీ చౌదరి. ఇప్పుడు ఈ సంస్థ కార్తీతో నిర్మించాలనుకుంటున్న సినిమాలో మీనాక్షి భాగమవుతారా? వేచి చూడాల్సిందే. ఇలా ఫలానా హీరో సినిమాలో ఫలానా హీరోయిన్ నటించనున్నారంటూ వార్తల్లో ఉన్న కాంబినేషన్స్ మరికొన్ని ఉన్నాయి.ఫలనా సినిమాలో ఫలనా హీరోయిన్ చేయనున్నారనే వార్తలు కోలీవుడ్లోనూ గట్టిగానే వినిపిస్తున్నాయి. రజనీకాంత్ హీరోగా సిబి చక్రవర్తి దర్శకత్వంలో కమల్హాసన్ ఓ సినిమా నిర్మించనున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది ఏప్రిల్లో ప్రారంభం కానుంది. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్ర కోసం మేకర్స్ పూజా హెగ్డే, ప్రియాంకా అరుల్ మోహన్ వంటి తారల పేర్లను పరిశీలిస్తున్నారనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. ఇక ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ వంటి బ్లాక్బస్టర్ మూవీ అనంతరం హీరో అజిత్– దర్శకుడు రవి కె. చంద్రన్ కాంబినేషన్లో మరో సినిమా రానుంది. ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రీలీల పేరు వినిపిస్తోంది. శింబు కొత్త సినిమా ‘అరసన్’లో హీరోయిన్గా సమంత, కయాదు లోహర్ వంటి హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఇంకా దర్శక–నటుడు ప్రదీప్ రంగనాథన్ ఓ సైన్స్ ఫిక్షన్ కథను రెడీ చేశారు. ఈ సినిమాలో ఇద్దరు కథనాయికలకు చోటు ఉందట. శ్రీలీల, మీనాక్షీ చౌదరి ఈ సినిమాలో నటించనున్నారనే పుకార్లు కోలీవుడ్లో వినిపిస్తున్నాయి. అయితే ఈ వివరాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. – ముసిమి శివాంజనేయులు -
అయ్యప్ప మాలలో చరణ్.. పార్టీ వివాదంపై శిరీష్ క్లారిటీ
అల్లు కుటుంబంలో పెళ్లి సందడి మొదలైన విషయం తెలిసిందే. మార్చి 6న అల్లు శిరీష్-నయనికల వివాహం జరగనుంది. ఈ క్రమంలో తాజాగా అల్లు అర్జున్ తన నివాసంలో ఘనంగా పార్టీ ఏర్పాటు చేశారు. అందులో రామ్ చరణ్- ఉపాసన దంపతులతో పాటు పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. తర్వాత కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అయ్యప్పమాలలో ఉన్న రామ్ చరణ్ మద్యం పార్టీలో పాల్గొనడం ఏంటి అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో అల్లు శిరీష్ సమాధానం ఇచ్చారు.చరణ్ విషయంలో నెటిజన్లు చేస్తున్న కామెంట్లకు అల్లు శిరీష్ క్లారిటీ ఇచ్చారు. ఒక నెటిజన్ చేసిన కామెంట్కు సమాధానంగా ఆయన రిప్లై ఇచ్చారు. పార్టీ ప్రారంభం కాకముందే రామ్ చరణ్ అక్కడికి వచ్చి వెళ్లిపోయారని అల్లు శిరీష్ చెప్పారు. ఆ సమయానికి అక్కడ ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణ లేదన్నారు. చరణ్ కూడా కేవలం హాల్ వరకు మాత్రమే పరిమితం అయ్యారని చెప్పుకొచ్చారు. తమకు శుభాకాంక్షలు చెప్పిన వెంటనే అక్కడి నుంచి తిరిగెళ్లిపోయారని గుర్తుచేశారు. ఆ తర్వాతనే అక్కడ పార్టీ మొదలైందని తెలిపారు. అయ్యప్ప స్వామి మాల పట్ల రామ్ చరణ్కు ఎంతటి భక్తి, శ్రద్ధలున్నాయో అందరికీ తెలుసని గుర్తుచేశారు. మాలలో ఉన్నప్పుడు బయట కనీసం నీళ్లు కూడా చరణ్ తీసుకోరని శిరీష్ తెలిపారు.సుమారు 20ఏళ్లగా అయ్యప్ప స్వామి, ఆంజనేయ స్వామి మాలలో రామ్ చరణ్ కనిపిస్తూనే ఉంటారని అందరికీ తెలిసిందే. ఏడాదిలో కనీసం 100రోజులకు పైగానే ఆయన భక్తి మార్గంలోనే ఉంటారు. అలా ఉండటం వల్ల తనను తాను క్రమశిక్షణగా ఉండటం కోసం ఆపై భక్తి మార్గంలో ఉండటం వల్ల మంచి జరుగుతుందని ఆయన గతంలో చెప్పారు. చరణ్ గురించి పూర్తి విషయాలు తెలీకుండానే ఇలాంటి కామెంట్లు చేయడం ఏంటి అంటూ నెటిజన్లు కూడా అభ్యంతరం తెలుపుతున్నారు.#AlluArjun recently hosted a private celebration exclusively for his close friends and inner circle, creating a warm and intimate atmosphere away from the public eye. The gathering was said to be filled with laughter, bonding, and heartfelt conversations among longtime… pic.twitter.com/M6YtWxTFe2— Australian Telugu Films (@AuTelugu_Films) February 23, 2026 -
Ram Charan: మళ్లీ బుచ్చిబాబుతోనే..!
-
'రంగస్థలం' సినిమా.. కనీసం రాష్ట్ర అవార్డ్ కూడా ఇవ్వలేదు
రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'రంగస్థలం'. 2018లో రిలీజైంది. అప్పటివరకు చరణ్ యాక్టింగ్పై ట్రోల్స్ లాంటివి వచ్చేవి. ఈ మూవీ దెబ్బకు వాటన్నింటికి చెక్ పడిందనే చెప్పొచ్చు. అంతలా మెప్పించింది. ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్గా రామకృష్ణ.. తనకు ఎలాంటి అవార్డ్ రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం రాష్ట్ర అవార్డ్ కూడా రాకపోవడం బాధ కలిగించిందని చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇదంతా అన్నారు.(ఇదీ చదవండి: 'ఉస్తాద్ భగత్ సింగ్' రెండో పాట రిలీజ్)'రంగస్థలం' చిత్రంలో నటనకుగానూ రామ్ చరణ్కి నేషనల్ అవార్డ్ వస్తుందని అందరం అనుకున్నాం. ఆయనకనే కాదు ఈ సినిమాలో చాలామందికి అవార్డ్స్ రావాలి కానీ ఎవరికీ రాలేదు. సౌండ్ డిజైనర్కి మాత్రమే వచ్చింది. లక్కీగా ఆయనకు రావడంతో మేమంతా హ్యాపీగా ఫీలయ్యాం. కనీసం రాష్ట్రస్థాయి అవార్డులు కూడా ఇవ్వలేదు. అయితే నేను పనిచేస్తూ ఎంజాయ్ చేసింది 'రంగస్థలం', 'అంతరిక్షం' సినిమాలకే. 'రంగస్థలం' వెరీ రూరల్, రియలస్టిక్ స్టోరీ. ఇది సెట్ అని అవార్డ్స్ ఇచ్చేవాళ్లకు తెలీదు. ఊరిలో షూటింగ్ చేశామని అనుకున్నారు. రాష్ట్ర అవార్డ్ ఇవ్వలేదు. నేషనల్ అవార్డ్ కూడా రాలేదు. రామ్ చరణ్ కూడా జాతీయ అవార్డ్ గెలుచుకుంటారని నాతో అన్నారు. కానీ జరగలేదు' అని ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.ఈయన చెప్పింది కూడా నిజమేనేమో. ఎందుకంటే 2018కిగానూ తెలుగు ప్రేక్షకులు చాలామంది రామ్ చరణ్కి అవార్డ్ వస్తుందని భావించారు. కానీ అలాంటిదేం జరగలేదు. అప్పటికి ఇంకా ఈ పాన్ ఇండియా ట్రెండ్ కూడా పెద్దగా లేదు. ఒకవేళ ప్రస్తుత టైంలో 'రంగస్థలం' రిలీజయ్యుంటే కచ్చితంగా చరణ్కి అవార్డ్ వచ్చి ఉండేదేమో? అదే ఉద్దేశాన్ని ఈ చిత్రానికి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ ఇప్పుడు చెప్పుకొచ్చారు. అవార్డులు రాకపోతేనేం సుకుమార్, చరణ్.. ఎవరికి వాళ్లు ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలో తమిళ బోల్డ్ సినిమా.. 'హాట్స్పాట్ 2 మచ్' తెలుగు రివ్యూ)“I enjoyed working on #Rangasthallam and #Antariksham, both are complete sets, but we didn’t get awards for either.Even #Ramcharan sir said, ‘You will get a National Award for this movie.’”- Art Director #RamaKrishna | #Sukumar pic.twitter.com/VHdVmzscAd— Whynot Cinemas (@whynotcinemass_) February 22, 2026 -
గెట్... సెట్... గో గెటప్ ఛేంజ్
వెరైటీ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు నటీనటులు పర్ఫార్మెన్స్ పరంగానే కాదు... లుక్స్ పరంగా కూడా వెరైటీ చూపించడానికి రెడీ అయిపోతారు. ఒక్కోసారి గుర్తు పట్టడానికి వీలు లేనంతగా క్యారెక్టర్కి తగ్గట్టు మారిపోతారు. డార్క్ మేకప్,ప్రోస్థెటిక్ మేకప్... ఇలా మేకప్తో డిఫరెన్స్ చూపించడంతో పాటు ఫిజికల్గా కూడా క్యారెక్టర్కి తగ్గట్టు సన్నబడతారు... లావైపోతారు. హీరోలైతే క్లీన్ షేవ్ లుక్లోకి మారిపోతారు... క్యారెక్టర్ డిమాండ్ చేస్తే గెడ్డం పెంచుకుంటారు... జుట్టు కూడా పెంచుకుంటారు. ప్రస్తుతం రామ్చరణ్, ఎన్టీఆర్, రవితేజ, నాని, అఖిల్, సాయి దుర్గాతేజ్, విరాట్ కర్ణ, సంపూర్ణేష్ బాబు... ఇలా స్టార్ హీరోస్తో పాటు యంగ్ హీరోస్ తమ సినిమాల కోసం గెటప్ ఛేంజ్ చేశారు. గెట్... సెట్... గో అంటూ ఇలా గెటప్ ఛేంజ్ చేసిన ఆ హీరోలు, వారు చేస్తున్న సినిమాల గురించి ఓ లుక్ వేద్దాం.తొలిసారి ఫుల్ మాస్ లుక్లో... ‘గుంటూరు కారం’ (2024) వంటి హిట్ మూవీ తర్వాత మహేశ్బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వారణాసి’. ‘ఆర్ఆర్ఆర్’ (2022) వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ప్రియాంకా చో్రపా హీరోయిన్గా నటిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా నటిస్తున్నారు. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం మహేశ్బాబు తొలిసారి ఫుల్ మాస్ లుక్లోకి మారిపోయారు. గతంలో ఎన్నడూ కనిపించనంతగా పోడవాటి హెయిర్ స్టైల్, గెడ్డంతో ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారాయన.ఇప్పటికే విడుదలైన మహేశ్ గెటప్కి అద్భుతమైన స్పందన వచ్చింది. మహేశ్బాబు, రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ అడ్వెంచరస్ మూవీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘వారణాసి’ని గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 120 దేశాల్లో విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన వారణాసి సెట్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచనుందట. ‘వారణాసి’పై ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7 విడుదల కానుంది. సరికొత్తగా... ‘దేవర’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డ్రాగన్’ (పరిశీలనలో ఉన్న టైటిల్). ‘కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, సలార్’ వంటి హిట్ చిత్రాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ‘ఎన్టీఆర్ నీల్’ అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతోంది. రుక్మిణీ వసంత్ హీరోయిన్. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమా కోసం ఎన్టీఆర్ సరికొత్త లుక్లోకి మారిపోయారు. తన పాత్రకు తగ్గట్టు సన్నగా మారిపోయారాయన. ఇప్పటికే విడుదలైన ఆయన లుక్స్ ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ఈ మూవీలో ఎన్టీఆర్ రెండు గెటప్స్లో కనిపించనున్నారని టాక్. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ మూవీ కోసం మూడువేల మంది జూనియర్ ఆర్టిస్టులతో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్, అలాగే సుమారు 2000 మందితో తీసిన పాట హైలెట్గా మారనున్నాయి. జూన్ 25న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇరుముడి కోసం వరుస సినిమాలు చేస్తూ జెట్ స్పీడ్లో దూసుకెళుతుంటారు రవితేజ. క్లాస్, మాస్... ఇలా పాత్రకి తగ్గట్టు ఎప్పటికప్పుడు ఆయా లుక్లోకి మారిపోతుంటారాయన. రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఇరుముడి’. ఆయన కెరీర్లో 77వ సినిమాగా రూపొందుతోన్న ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియా భవాని శంకర్ కథానాయికగా నటిస్తుండగా, రవితేజ కుమార్తె పాత్రను బేబీ నక్షత్ర పోషిస్తున్నారు. సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఆధ్యాత్మికప్రాముఖ్యత నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో అయ్యప్ప మాలధారిగా కనిపించనున్నారు రవితేజ. ఇప్పటికే విడుదలైన ఆయన ఫస్ట్ లుక్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ పాత్ర కోసం రవితేజ మేకోవర్ అయ్యారు. ‘‘పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న చిత్రం ‘ఇరుముడి’.రవితేజ పుట్టినరోజు (జనవరి 26) సందర్భంగా విడుదల చేసిన టైటిల్, రవితేజ ఫస్ట్ లుక్ పోస్టర్కి అద్భుతమైన స్పందన వచ్చింది. సంప్రదాయ అయ్యప్ప మాల దుస్తులు ధరించిన శక్తివంతమైన ఆధ్యాత్మిక లుక్లో రవితేజ చక్కగా ఒదిగిపోయారనే ప్రశంసలు లభించాయి. దర్శకుడు శివ నిర్వాణ పవర్ఫుల్ స్క్రిప్ట్ను రూపొందించారు. ఇందులో తండ్రీకూతుళ్ల మధ్య బలమైన బంధం ఉంది. రవితేజ మునుపెన్నడూ చేయని ఒక విభిన్నమైన పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా కోసం కంప్లీట్గా మేకోవర్ అయ్యారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీకి టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. జీవీ ప్రకాశ్కుమార్ సంగీతం అందిస్తుండగా, విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ‘ఇరుముడి’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. మరోసారి మ మ మాస్ రామ్చరణ్ ఫుల్ మాస్ లుక్లో నటించిన తొలి చిత్రం ‘రంగస్థలం’ (2018). సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత కథానాయిక. ఈ సినిమాలో పోడవాటి జుట్టు, గెడ్డం, లుంగీ... ఇలా పక్కా మాస్ లుక్లో కనిపించిన రామ్చరణ్ ఆ తర్వాత లుక్స్ మార్చారు. తాజాగా ఆయన నటిస్తున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘పెద్ది’. ‘ఉప్పెన’తో (2021) బ్లాక్బస్టర్ అందుకున్న బుచ్చిబాబు సానా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో జగపతిబాబు, శివ రాజ్కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాలో పల్లెటూరి యువకుడి పాత్రలో కనిపించనున్నారు రామ్చరణ్. ఈ మూవీ కోసం మరింత మాస్ లుక్లోకి మారారాయన. ఇప్పటికే విడుదలైన లుక్స్, గ్లింప్స్, సాంగ్ చూస్తే ఆయన ఎంత మాస్గా కనిపించనున్నారో అర్థం అవుతోంది. ఈ సినిమా కోసం పోడవైన జుట్టు, గెడ్డం, లుంగీ... ఇలా రెండోసారి మ మ మాస్ లుక్లోకి మారిపోయారు.ఆట కూలీ అనే కొత్త కాన్సెప్ట్ను ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు దర్శకుడు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి విడుదలైన ‘చికిరి చికిరి...’ పాట 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, సినిమాపై మరింత బజ్ని పెంచింది. ఈ మూవీని రామ్చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న విడుదల చేయనున్నట్లు తొలుత ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఏప్రిల్ 30కి వాయిదా వేశారు. ప్యారడైస్ కోసం... హీరో నాని మరోసారి ఫుల్ మాస్ లుక్లో కనిపించనున్నారు. ఇప్పటికే ‘దసరా’, ‘హిట్ : ది థర్డ్కేస్’ వంటి సినిమాల్లో ఫుల్ మాస్గా కనిపించిన ఆయన తాజాగా ‘ది ప్యారడైజ్’ మూవీ కోసం పవర్ఫుల్ మాస్ లుక్లోకి మేకోవర్ అయ్యారు. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘దసరా’. కీర్తీ సురేష్ హీరోయిన్గా నటించిన ఈ మూవీని ఎస్ఎల్వీ సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. 2023 మార్చి 30న విడుదలైన ఈ మూవీ బ్లాక్బస్టర్ అందుకుంది. ‘దసరా’ వంటి హిట్ మూవీ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల, సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ మూవీలో మంచు మోహన్ బాబు, రాఘవ్ జుయల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాలో జడల్ అనే రా రస్టిక్ పాత్రలో నటిస్తున్నారు నాని. ఇప్పటికే విడుదల చేసిన స్టిల్లో నాని రెండు జడలు వేసుకుని పక్కా మాస్ లుక్లో కనిపించగా ఏ స్థాయిలో స్పందన వచ్చిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నాని లుక్, స్టోరీ, టేకింగ్... ఇలా ప్రతిదీ వైవిధ్యంగా ఉండేలా తెరకెక్కిస్తున్నారట శ్రీకాంత్ ఓదెల. ఈ సినిమాని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో మార్చి 26న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తొలుత ప్రకటించింది. అయితే ఆ తేదీకి పోస్ట్పోన్ అయ్యి ఆగస్టు 21న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. లెనిన్ కోసం... అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్ ’. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ మూవీ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవర్ఫుల్ మాస్ లుక్లో కనిపించనున్నారు అఖిల్. ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. పోడవాటి జుట్టు, గెడ్డంతో ఫుల్ మాస్ లుక్లోకి మారిపోయారు.రాయలసీమ నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ‘లెనిన్’ రూపొందుతోంది. ఈ మూవీలో తన పాత్ర కోసం తొలిసారి రాయలసీమ యాసలో డైలాగులు చెబుతున్నారు అఖిల్. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ టైటిల్ గ్లింప్స్కి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ‘‘గతాన్ని తరమడానికి పోతా... మా నాయన నాకో మాట సెప్పినాడు.. పుట్టేటప్పుడు ఊపిరి ఉంటాది రా.. పేరు ఉండదు, అట్నే పోయేటప్పుడు ఊపిరుండదు.. పేరు మాత్రమే ఉంటాది. ఆ పేరు ఎట్టా నిలబడాలంటే...’’ అంటూ రాయలసీమ యాసలో అఖిల్ చెప్పిన డైలాగ్స్కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ మూవీని వేసవి కానుకగా మే 1న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. సంబరాల కోసం... ‘విరూపాక్ష’, ‘బ్రో’ వంటి హిట్ సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్పై ‘హను–మాన్’ (2024) వంటి పాన్ ఇండియన్ హిట్ అందుకున్న కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో సాయిదుర్గా తేజ్ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ప్రత్యేకించి తన పాత్ర కోసం సాయిదుర్గా తేజ్ కండలు తిరిగిన దేహంతో, గుబురు గడ్డంతో ఫుల్గా మేకోవర్ అయ్యారు. అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో ఇప్పటివరకూ చూడని పాత్రలో సాయిదుర్గా తేజ్ ప్రేక్షకులను అలరిస్తారని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఇప్పటికే రెండుసార్లు విడుదల వాయిదాపడ్డ ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ని మాత్రం మేకర్స్ ప్రకటించలేదు. నాగబంధంలో... ‘పెదకాపు’ (2023) చిత్రం ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న ద్వితీయ సినిమా ‘నాగబంధం’. ‘ది సీక్రెట్ ట్రెజర్’ అన్నది ట్యాగ్లైన్ . నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిర్మాత అభిషేక్ నామా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. జగపతిబాబు, జయప్రకాశ్, మురళీ శర్మ, బీఎస్ అవినాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా కోసం సరికొత్తగా మేకోవర్ అయ్యారు విరాట్ కర్ణ. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్స్, గ్లింప్స్ ఈ విషయాన్ని స్పష్టం చేశాయి.‘‘అభిషేక్ నామా అత్యంత భారీగా రూపొందిస్తున్న చిత్రం ‘నాగబంధం’. మహాశివరాత్రి సందర్భంగా ఇటీవల విడుదలైన ఈ మిస్టికల్ ఎపిక్ టీజర్కు అద్భుతమైన స్పందన లభించింది. కేవలం 24 గంటల్లోనే 20 మిలియన్ కు పైగా వ్యూస్ సాధించి, దేశవ్యాప్తంగా ట్రెండింగ్ చార్ట్స్లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ మూవీ కోసం విరాట్ కర్ణ అద్భుతంగా ట్రాన్ ్సఫార్మ్ అయ్యారు. తన గత ఇమేజ్కు పూర్తి భిన్నంగా శివుని అవతారంలో కనిపించడం, హై ఎనర్జీతో ఆయన చేసిన నటన ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. మా సినిమాని వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.సరికొత్త బిర్యానీ... ‘ది ప్యారడైస్’ సినిమాలో నటుడు సంపూర్ణేష్ బాబు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జడల్ పాత్ర పోషిస్తున్న నాని స్నేహితుడు బిర్యానీ పాత్రలో సంపూర్ణేష్ కనిపించనున్నారు. బిర్యానీ పాత్ర లుక్ని ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాత్రలో సంపూర్ణేష్ గెటప్ ఆశ్చర్యపరచేలా ఉంది. పోడవాటి హెయిర్, గెడ్డం, రఫ్ లుక్, ఇంటెన్ ్స ఎక్స్ప్రెషన్ తో ఈ పాత్ర కోసం సరికొత్తగా మేకోవర్ అయ్యారాయన. ఈ మూవీ నుంచి విడుదలైన సంపూర్ణేష్ పోస్టర్లో రక్తంతో తడిసిన చేయి, భుజంపై గొడ్డలి చూస్తుంటే ఆయన పాత్ర కూడా పవర్ఫుల్గా ఉంటుందని తెలుస్తోంది. పైన పేర్కొన్న హీరోలే కాదు... మరికొంత మంది కూడా తమ పాత్రల కోసం సరికొత్తగా గెటప్ ఛేంజ్ చేస్తున్నారు.– డేరంగుల జగన్ మోహన్ -
గ్రాండ్ పార్టీ ఇచ్చిన అల్లు అర్జున్.. ఫుల్ జోష్లో హీరోయిన్స్ (ఫోటోలు)
-
అల్లు అర్జున్ పార్టీ.. ఉపాసన, రామ్ చరణ్తో పాటు సెలబ్రిటీలు
అల్లు కుటుంబంలో పెళ్లి వేడుక మొదలైంది. మార్చి 6న నయనికతో అల్లు శిరీష్ వివాహం కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవలే దుబాయ్లో తమ సన్నిహితులతో ఓ పార్టీ కూడా చేసుకుని వచ్చారు. తాజాగా అల్లు అర్జున్ తమకు బాగా కావాల్సిన వారితో పాటు కుటుంబ సభ్యులకు శుక్రవారం రాత్రి స్పెషల్గా పార్టీ ఇచ్చారు. తమ్ముడు అల్లు శిరీష్ పెళ్లి సందర్భంగా అన్న అల్లు అర్జున్ ఇలా గ్రాండ్గా పార్టీ ఇస్తుంటే ఫ్యాన్స్ కూడా వారి బంధం గురించి పోస్టులు పెడుతున్నారు.అయితే, తాజాగా జరిగిన పార్టీలో పాల్గొన్న వారి లిస్ట్ కూడా నెట్టింట వైరల్ అవుతుంది. గ్రాండ్గా జరిగిన పార్టీలో రామ్ చరణ్, ఉపాసన, సుస్మిత కొణిదెల, నిహారిక స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. ఆపై తేజా సజ్జా, వైష్ణవ్ తేజ్, సిద్ధు జొన్నలగడ్డ, సుశాంత్, కృతి శెట్టి, నేహా శెట్టి, రాశీ ఖన్నా, నభా నటేష్ పాల్గొన్నారని సమాచారం.అల్లు శిరీష్ - నయనికల పెళ్లి పిలుపుల్ని ఇప్పటికే వారు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే తమ ఇంటి ఆడబిడ్డ సురేఖకు తొలి శుభలేఖను ఇచ్చారు. ఆ సమయంలో తన మావయ్య చిరంజీవికి అందించిన శిరీష్ ఆశీర్వాదం తీసుకున్నారు. అల్లు అరవింద్ సతీసమేతంగా చిరు దంపతులకు నూతన వస్త్రాలు అందించి పెళ్లికి ఆహ్వానించిన విషయం తెలిసిందే.👉 : (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మెగా మేనేజర్ కుమారుడు.. హీరోగా ఎంట్రీ
‘మ్యాడ్’ (Mad) ప్రాంఛైజ్ నుంచి పార్ట్-3 మూవీ రానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలోకి హీరోగా రామ్ చరణ్ మేనేజర్ కుమారుడు ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్లు నటించిన మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు పార్ట్-3 రానుంది. అందులో కొత్త వాళ్లు ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా మొదలైంది. ఈ ప్రాజెక్ట్ను కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించగా.. సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.మ్యాడ్ క్యూబ్లోకి రామ్ చరణ్ మేనేజర్ ప్రవీణ్ కుమారుడు దృషిక్ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. చాలా కాలంపాటు చరణ్కు ఆయన మేనేజర్గా ఉన్నారు. రామ్ చరణ్ సినిమాల వ్యవహారాలతో పాటు ఆయనకు సంబంధించిన కార్యక్రమాలన్నీ ప్రవీణ్ నే చూసుకుంటారు. సినిమా బ్యాగ్రౌండ్లో ఉండటంతో ఆయన కుమారుడు కూడా ఇండస్ట్రీపై మక్కువ పెంచుకున్నాడు. సినిమా పరిశ్రమలోకి వచ్చేందుకు దృషిక్ కూడా ట్రైనింగ్ అయ్యాడు. యాక్టింగ్లో శిక్షణ తీసుకునేందుకు లండన్ వెళ్లి నేర్చుకున్నాడు. ఇప్పుడు హీరోగా అవకాశం దక్కించుకున్నాడు. సరైన టాలెంట్ ఉంటే తప్పకుండా ప్రేక్షకులు ఆధరిస్తారనే నమ్మకంతో ఈ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. -
రామ్ చరణ్ 'పెద్ది'కి భారీ డిజిటల్, ఆడియో డీల్
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న 'పెద్ది' సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన నాన్-థియేట్రికల్ బిజినెస్ ఇప్పటికే హాట్ టాపిక్గా మారింది. నిర్మాత సతీష్ కిలారు ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నారు. రామ్ చరణ్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం ఎఆర్ రెహమాన్ అందిస్తున్నారు. ఓటిటి మార్కెట్ డౌన్ కాకముందే డిజిటల్ హక్కుల డీల్ ఫినిష్ చేసుకోవడం నిర్మాతల అదృష్టమనే చెప్పాలి. ఆ రోజుల్లో దాదాపు రూ. 130 కోట్ల భారీ బడ్జెట్ పెట్టి పెద్ది(Peddi) చిత్రాన్ని కోనుగోలు చేసిందట ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్.ఆడియో హక్కులు మరో 18 కోట్ల మేరకు వచ్చాయి. శాటిలైట్ హక్కులు ఇంకా ఫైనల్ కాలేదు. కానీ మంచి మొత్తంలో వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాను నేరుగా హిందీలో కూడా విడుదల చేయనున్నారు. అందువల్ల హిందీ డబ్బింగ్ అవసరం లేదు. కానీ హిందీ శాటిలైట్ హక్కులు వేరుగా ఉంటాయి. నాన్-థియేట్రికల్ ఆదాయం మొత్తం కలిపి 150 కోట్లకు పైగా వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న 'పెద్ది' విడుదలకు ముందే మంచి బిజినెస్ చేస్తోందనే చెప్పాలి. -
'రామ్ చరణ్కు అది చాలా ఇష్టం.. వద్దన్నా వినేవాడు కాదు': సురేఖ
మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ బర్త్ డే కావడంతో చిరు స్పెషల్ విషెస్ తెలిపారు. ప్రతి మగాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు.. అలాగే తన విజయం వెనక కూడా భార్య సురేఖ ఉందన్నారు మెగాస్టార్. ఈ సందర్భంగా భార్యపై ప్రేమతో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. 1980 ఫిబ్రవరి 20న సురేఖతో నా పెళ్లి జరిగిందని.. అప్పటినుంచి తనే నాకు ప్రధాన బలంగా మారందని చిరంజీవి ట్విటర్ వేదికగా పంచుకున్నారు. సురేఖ బర్త్ డే విషయం తెలుసుకున్న అభిమానులు పెద్దఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అయితే గతంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన సురేఖ..తన కుమారుడు రామ్ చరణ్ గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. రామ్ చరణ్ చిన్నప్పుడు చాలా సైలెంట్గా ఉండేవాడని తెలిపింది. అస్సలు అల్లరి చేసేవాడు కాదని.. టీనేజ్ వచ్చాక కొంచెం అల్లరి చేసేవాడని వెల్లడించింది. చరణ్కు కిల్లీ అంటే చాలా ఇష్టమని తెలిపింది. కిల్లీ చిన్నపిల్లలు వేసుకోవద్దని చెబితే.. పక్కకు వెళ్లి సందులో నిలబడి సైలెంట్గా అక్కడే నిల్చుని తినేవాడని సురేఖ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది.ఇక సినిమాల విషయానికొస్తే రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. Wishing you a Very Happy Birthday Surekha Amma Garu ❤️❤️@AlwaysRamCharan https://t.co/e7nZ2cjUqf pic.twitter.com/cCdfuUUY73— Team Charanism (@TeamCharanism) February 18, 2026 -
పెద్దికి సీక్వెల్ రాబోతుందా?


