Ranji Trophy quarter-finals
-
Ranji Trophy QFs: ముంబై- హర్యానా మ్యాచ్ వేదికను మార్చిన బీసీసీఐ
ముంబై: డిఫెండింగ్ చాంపియన్ ముంబై(Mumbai), హరియాణా జట్ల మధ్య ఈనెల 8 నుంచి జరగాల్సిన రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్(Ranji Trophy Quarter Finals) వేదిక మారింది. హరియాణాలోని లాహ్లీలో జరగాల్సిన ఈ మ్యాచ్ను కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్కు మార్చారు. హరియాణాలో చలితీవ్రత అధికంగా ఉండటంతో పాటు... ఉదయం పూట పొగమంచు కప్పేస్తుండటంతో లాహ్లీలో నిర్వహించాల్సిన మ్యాచ్ను కోల్కతాకు మార్చినట్లు బీసీసీఐ నుంచి సమాచారం అందింది’ అని ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) అధ్యక్షుడు అజింక్య నాయక్ బుధవారం పేర్కొన్నారు.కాగా 42 సార్లు రంజీ ట్రోఫీ విజేతగా నిలిచిన ముంబై జట్టు ఈసారి కూడా ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే(Ajinkya Rahane) సారథ్యం వహిస్తున్న ముంబై జట్టులో భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పేస్ ఆల్రౌండర్లు శివమ్ దూబే, శార్దుల్ ఠాకూర్ వంటి పలువురు స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. మిగిలిన మూడు క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్లు షెడ్యూల్ ప్రకారమే నిర్వహించనున్నారు. రాజ్కోట్ వేదికగా సౌరాష్ట్ర, గుజరాత్ క్వార్టర్ ఫైనల్... నాగ్పూర్ వేదికగా విదర్భ, తమిళనాడు పోరు... పుణేలో జమ్ముకశ్మీర్, కేరళ మ్యాచ్లు జరగనున్నాయి. మరిన్ని క్రీడా వార్తలుభారత బ్యాడ్మింటన్ జట్టులో జ్ఞాన దత్తు, తన్వీ రెడ్డి న్యూఢిల్లీ: డచ్ ఓపెన్, జర్మనీ ఓపెన్ అండర్–17 జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లలో పాల్గొనే భారత జట్లను ప్రకటించారు. జాతీయ జూనియర్ చాంపియన్, హైదరాబాద్ కుర్రాడు జ్ఞాన దత్తుతోపాటు హైదరాబాద్కే చెందిన మరో ప్లేయర్ తన్వీ రెడ్డి భారత జట్టులోకి ఎంపికయ్యారు. డచ్ ఓపెన్ ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2 వరకు... జర్మన్ ఓపెన్ మార్చి 5 నుంచి 9 వరకు జరుగుతాయి.మనుష్–దియా జోడీ ఓటమి న్యూఢిల్లీ: సింగపూర్ స్మాష్ వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) టోర్నమెంట్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో మనుష్ షా–దియా చిటాలె (భారత్) ద్వయం పోరాటం ముగిసింది. బుధవారం సింగపూర్లో జరిగిన మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో మను‹Ù–దియా జోడీ 11–9, 4–11, 8–11, 8–11తో అల్వారో రాబెల్స్–మరియా జియో (స్పెయిన్) జంట చేతిలో ఓడిపోయింది. క్వార్టర్స్లో ఓడిన మనుష్–దియా జోడీకి 2000 డాలర్ల (రూ. 1 లక్ష 74 వేలు) ప్రైజ్మనీతోపాటు 350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. క్వార్టర్స్లో రియా–రష్మిక జోడీముంబై: ఎల్ అండ్ టి ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ–125 టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక–రియా భాటియా (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో రషి్మక–రియా ద్వయం 5–7, 6–2, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో మియా హొంటామా–క్యోకా ఒకమురా (జపాన్) జంటను ఓడించింది. 89 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో భారత జోడీ రెండు ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేసింది.తమ సర్వీస్ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. రుతుజా భోస్లే (భారత్)–అలీసియా బార్నెట్ (బ్రిటన్); ప్రార్థన తొంబారే (భారత్)–అరీన్ హర్తానో (నెదర్లాండ్స్) జోడీలు కూడా క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాయి. నేడు జరిగే సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్లో అలెగ్జాండ్రా క్రునిక్ (సెర్బియా)తో రష్మిక; రెబెకా మరీనో (కెనడా)తో అంకిత రైనా; జరీనా దియాస్ (కజకిస్తాన్)తో మాయ రాజేశ్వరి తలపడతారు. -
ఉత్తరాఖండ్తో క్వార్టర్ ఫైనల్.. చెలరేగి ఆడుతోన్న ముంబై..!
బెంగళూరు: దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ నాకౌట్ పోరులో 41 సార్లు చాంపియన్ ముంబై తొలి రోజు మెరుగైన స్థితిలో నిలిచింది. ఉత్తరాఖండ్తో సోమవారం ప్రారంభమైన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో ముంబై 86 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. ఈ మ్యాచ్తోనే ఫస్ట్క్లాస్లో అరంగేట్రం చేసిన సువేద్ పర్కర్ (218 బంతుల్లో 104 బ్యాటింగ్; 8 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయ సెంచరీ సాధించాడు. ఇతర క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల తొలి రోజు స్కోర్లు ∙కర్ణాటక తొలి ఇన్నింగ్స్: 213/7 (72 ఓవర్లలో) (సమర్థ్ 57, సౌరభ్ 4/67, శివమ్ మావి 3/40); ఉత్తరప్రదేశ్తో మ్యాచ్. ∙పంజాబ్ తొలి ఇన్నింగ్స్: 219 ఆలౌట్ (71.3 ఓవర్లలో) (అభిషేక్ శర్మ 47, అనుభవ్ 3/36, పునీత్ 3/48); మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్: 5/0. ∙బెంగాల్ తొలి ఇన్నింగ్స్: 310/1 (89 ఓవర్లలో) (సుదీప్ 106 బ్యాటింగ్); జార్ఖండ్తో మ్యాచ్. చదవండి: UAE T-20 League: యూఏఈ టి20 లీగ్లో ఐదు జట్లు మనవే -
శివ కుమార్ ‘సిక్సర్’
ఆరు వికెట్లతో చెలరేగిన ఆంధ్ర బౌలర్ - తొలి ఇన్నింగ్స్లో మహారాష్ట్ర 91 పరుగులకే ఆలౌట్ - రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్ రోహ్తక్: మహారాష్ట్రతో సోమవారం మొదలైన రంజీ ట్రోఫీ క్వార్టర్ఫైనల్ మ్యాచ్లో ఆంధ్ర బౌలర్ శివ కుమార్ (6/41) నిప్పులు చెరిగాడు. పదునైన బంతులతో ప్రత్యర్ధి బ్యాట్స్మెన్ను హడలెత్తించాడు. దీంతో బన్సీలాల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో తొలి రోజు మహారాష్ట్ర 41.5 ఓవర్లలో 91 పరుగులకే కుప్పకూలింది. రోహిత్ మోత్వాని (23) టాప్ స్కోరర్. తర్వాత బ్యాటింగ్కు దిగిన ఆంధ్ర ఆట ముగిసే సమయానికి 41 ఓవర్లలో 3 వికెట్లకు 87 పరుగులు చేసింది. ప్రశాంత్ (26 బ్యాటింగ్), ప్రదీప్ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. శ్రీరామ్ (31) ఫర్వాలేదనిపిం చినా... భరత్ (11), కైఫ్ (0)లు నిరాశపర్చారు. ప్రస్తుతం ఆంధ్ర తొలి ఇన్నింగ్స్లో 4 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన మహారాష్ట్రని ఆంధ్ర బౌలర్లు వణికించారు. 10 పరుగులకే ఓపెనర్లు గుగాలే (0), ఖడివాలే (6)లు వెనుదిరిగారు. అయితే మోత్వాని నిలబడినా.. రెండో ఎండ్లో జాదవ్ (6), బావ్నే (2)లు కూడా పెవిలియన్కు చేరడంతో మహారాష్ట్ర 25 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. మోత్వాని అవుటైన తర్వాత సంక్లేచా ఇన్నింగ్స్ను నిలబెట్టే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. ఓవరాల్గా ఆరుగురు సిం గిల్ డిజిట్ స్కోరుకే పరిమితం కావడంతో మహా రాష్ర్ట స్వల్ప స్కోరుకు పరిమితమైంది. విజయ్ కుమార్, స్టీఫెన్ చెరో రెండు వికెట్లు తీశారు. -
ఆంధ్ర X మహారాష్ట్ర
16 నుంచి రంజీ క్వార్టర్స్ న్యూఢిల్లీ: రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్లకు రంగం సిద్ధమైంది. ఈనెల 16 నుంచి ఈ మ్యాచ్లు జరుగనున్నాయి. మంగళవారం విడుదలైన ‘డ్రా’ ప్రకారం ఆంధ్ర జట్టు మహారాష్ట్రను ఎదుర్కోనుంది. ఈ సీజన్లో అద్భుతంగా రాణిస్తున్న కైఫ్ సేన క్వార్టర్స్లో అదే జోరును చూపాలని తహతహలాడుతోంది. మరోవైపు ఈనెల 25 నుంచి సెమీఫైనల్స్ జరుగుతాయి. తొలి రెండు క్వార్టర్స్ విజేతల మధ్య సెమీస్ బెంగళూరులో.. మూడు, నాలుగు మ్యాచ్ల మధ్య విజేతలు సెమీస్ కోల్కతాలో జరుగుతాయి. మార్చి 8 నుంచి ముంబైలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. క్వార్టర్ ఫైనల్స్ ‘డ్రా’ కర్ణాటక x అస్సాం (ఇండోర్లో); ఢిల్లీ x ముంబై (కటక్లో); విదర్భ x తమిళనాడు (జైపూర్లో); ఆంధ్ర x మహారాష్ట్ర (లాహిలో).