Rasheed Masood
-
లాలూ, జగదీశ్ శర్మలపై అనర్హత వేటు
-
లాలూ, జగదీశ్ శర్మలపై అనర్హత వేటు
న్యూఢిల్లీ : తాజాగా మరో ఇద్దరు లోక్సభ సభ్యులపై అనర్హత వేటు పడింది. ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్,జేడీయూ ఎంపీ జగదీశ్ శర్మపై వేటు పడింది. దాణా స్కాం కేసులో జైలు శిక్షకు గురైన లాలూప్రసాద్ యాదవ్తోపాటు ఎంపీ జగదీష్ శర్మ కూడా లోక్సభ సభ్యత్వాలను కోల్పోయారు. ఈ కేసులో లాలూకు ఆరేళ్లు, జగదీశ్ శర్మకు నాలుగేళ్లు జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. క్రిమినల్ కేసుల్లో రెండేళ్లకు పైగా శిక్ష పడిన ప్రజాప్రతినిధులను తక్షణం అనర్హులను చేస్తూ జూలై 10న సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన విషయం విదితమే. కాగా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పదవిని కోల్పోయిన తొలి పార్లమెంటు సభ్యుడు రషీద్ మసూదే. దీంతో వీరిని అనర్హులుగా ప్రకటిస్తూ లోక్ సభ స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే వారు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ స్థానాలు తక్షణమే ఖాళీలుగా ప్రకటించనున్నట్లు సమాచారం. -
రషీద్కు నాలుగేళ్ల జైలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు రషీద్మసూద్కు మెడిసిన్ సీట్ల భర్తీ అవినీతి కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. దీంతో ఇటీవలి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. ఆయన తన పదవిని కోల్పోనున్నారు. ప్రజాప్రతినిధులు ఎవరైనా ఏదైనా కేసులో దోషిగా నిర్ధారితులైన వెంటనే.. అనర్హత వర్తిస్తుందంటూ సుప్రీంకోర్టు జూలై 10న సంచలన తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. కింది కోర్టు దోషిగా నిర్ధారించి, శిక్ష విధించనప్పటికీ పై కోర్టులో అప్పీలు పెండింగ్లో ఉన్నంతవరకూ అనర్హత వర్తించదంటూ ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఉన్న నిబంధనను సుప్రీం ఆ తీర్పుతో కొట్టివేసింది. ఈ ఆదేశాలు వచ్చిన తర్వాత మొట్టమొదట దోషిగా నిర్ధారితుడై, శిక్షకు గురై పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయిన నేతగా రషీద్మసూద్ (67) రికార్డులకెక్కనున్నారు. రషీద్ 1990లో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నపుడు.. దేశవ్యాప్తంగా వివిధ వైద్య కళాశాలల్లోని సెంట్రల్ పూల్ నుంచి త్రిపుర రాష్ట్రానికి కేటాయించిన ఎంబీబీఎస్ సీట్లకు అనర్హులైన అభ్యర్థులను నామినేట్ చేశారన్న నేరంలో ఆయనను సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించింది. రషీద్కు నాలుగేళ్ల శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పిన ప్రత్యేక న్యాయమూర్తి జె.పి.ఎస్.మాలిక్.. ఆయనను తక్షణమే కోర్టు కస్టడీలోకి తీసుకున్నారు. మసూద్కు రూ.60వేల జరిమానా కూడా విధించింది. జైలు నుంచి విడుదలైన ఆరేళ్ల వరకూ ఎన్నికల్లో పోటీ చేయటానికి కూడా అనర్హులన్న నిబంధనల మేరకు ఆయన పదేళ్ల వరకూ ఎన్నికల్లో పోటీ చేసే హక్కు కూడా కోల్పోనున్నారు. రషీద్ మసూద్తో పాటు.. మాజీ ఐపీఎస్ అధికారి గుర్దయాళ్సింగ్, అప్పటి త్రిపుర సీఎం రంజన్మజుందార్కు కార్యదర్శిగా పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారి అమల్ కుమార్రాయ్లకు కూడా కోర్టు నాలుగేళ్ల శిక్ష విధించింది. -
కాంగ్రెస్ ఎంపీ రషీద్ మసూద్కు నాలుగేళ్లు జైలు
-
కాంగ్రెస్ ఎంపీ రషీద్ మసూద్కు నాలుగేళ్లు జైలు
న్యూఢిల్లీ : అవినీతి అక్రమాల కేసులో కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రషీద్ మసూద్కు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు తీస్హజారీ కోర్టు మంగళవారం శిక్ష ఖరారు చేసింది. నాలుగేళ్ల జైలుతో రషీద్ మసూద్ ఎంపీ పదవి కోల్పోనున్నారు. అలాగే ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని ఆయన కోల్పోయారు. ప్రస్తుతం సీడబ్ల్యూసీ సభ్యుడిగా ఉన్నారు. దేశ వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో త్రిపుర రాష్ట్రానికి కేటాయించిన ఎంబిబిఎస్ సీట్లను అనర్హులైన అభ్యర్థులకు కట్టబెట్టిన వ్యవహారంలో రషీద్ మసూద్ను సిబిఐ ప్రత్యేక కోర్టు గురువారం దోషిగా నిర్ధారించిన విషయం తెలిసిందే. తీర్పు వచ్చాక.. తొలిసారి కేంద్ర మాజీ మంత్రి రషీద్ దోషిగా తేలారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడైన ఆయనను అవినీతి, ఇతర నేరాల కేసుల్లో ఇక్కడి సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించింది. దీంతో ఆయనపై తొలిసారిగా అనర్హత వేటు పడింది. దోషులుగా తేలిన ఎమ్మెల్యేలు, ఎంపీల అప్పీళ్లు పై కోర్టుల్లో ఉన్నంతవరకు పదవుల్లో కొనసాగేందుకు వీలు కల్పించిన ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8, సబ్ సెక్షన్ 4ను కొట్టేస్తూ సుప్రీం కోర్టు ఈ ఏడాది జూలై 10న తీర్పివ్వడం తెలిసిందే. 1990-91 మధ్య వీపీ సింగ్ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన మసూద్.. త్రిపురకు కేంద్రం కోటా కింద బీహార్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో కేటాయించిన ఎంబీబీఎస్ సీట్లను అక్రమంగా అనర్హులకు కట్టబెట్టారని సీబీఐ అభియోగాలు మోపింది. మసూద్ 1989-91 మధ్య అప్పటి త్రిపుర రెసిడెంట్ కమిషనర్ గురుదయాళ్ సింగ్తో కుట్రపన్ని తన సమీప బంధువైన విద్యార్థితోపాటు ఇద్దరికి మెడికల్ కాలేజీల్లో సీట్లు ఇప్పించారని ఆరోపించింది. సీట్ల కేటాయింపుపై మొత్తం 11 కేసులు నమోదు చేసింది. వీటిలో మూడు కేసుల్లో మసూద్ను సీబీఐ కోర్టు జడ్జి జేపీఎస్ మాలిక్ అవినీతి నిరోధక చట్టం, ఐపీసీలోని 120బీ(నేరపూరిత కుట్ర), 420(మోసం), 468(ఫోర్జరీ) కింద దోషిగా తేల్చారు. మరో ఫోర్జరీ కేసులో నిర్దోషిగా ప్రకటించారు. కాగా, మిగతా కేసుల్లో గురుదయాళ్ను, అప్పటి త్రిపుర సీఎం సుధీర్ రంజన్ మజుందార్ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అమల్కుమార్ రాయ్లను, అక్రమంగా సీట్లు పొందిన 9 మంది విద్యార్థులను కూడా కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ విద్యార్థుల్లో మసూద్ బంధువు కూడా ఉన్నాడు. కోర్టు మసూద్కు వచ్చే నెల 1న శిక్ష ఖరారు చేయనుంది. ఆయనకు గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. మసూద్ 90 రోజుల్లోగా తీర్పుపై అప్పీలు చేసుకోవచ్చు. కాగా, ఈ కేసుల్లో నిందితులైన సుధీర్ మజుందార్, నాటి త్రిపుర మంత్రి కాశీరామ్ రీంగ్ కేసు విచారణ కాలంలో చనిపోయారు.