భూమా తనయుడి హల్చల్
సాక్షి, నంద్యాల: పట్టణంలోని మిట్నాలలో భూమా నాగిరెడ్డి తనయుడు విఖ్యాత్ రెడ్డి హల్చల్ చేశారు. పోలింగ్ జరగుతుండగా కేంద్రాల్లోకి వెళ్లిన విఖ్యాత్ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారు. ఈ ఘటనపై స్పందించిన శిల్పా మోహన్ రెడ్డి తనయుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి.. అధికార పార్టీ బెదిరింపులకు ఎవరూ భయపడొద్దని అన్నారు.
అందరూ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలని కోరారు. మహిళలు భారీ ఎత్తున ఓటింగ్లో పాల్గొనడం సంతోషదాయకమని అన్నారు.