breaking news
Real Game
-
స్టార్టప్లకు ‘గేమింగ్’ నిషేధం సెగ..
ముంబై: దేశీయంగా రియల్ మనీ గేమ్స్ (ఆర్ఎంజీ)పై నిషేధం విధించడంతో పలు అంకురాల వాల్యుయేషన్పై ప్రభావం చూపింది. నాలుగు బడా సంస్థలు .. యూనికార్న్ (1 బిలియన్ డాలర్ల విలువ చేసే అంకురాలు) జాబితా నుంచి చోటు కోల్పోయాయి. డ్రీమ్11 (26 కోట్ల యూజర్లు) , గేమ్స్ 24 x 7 (12 కోట్ల యూజర్లు), గేమ్స్క్రాఫ్ట్ (3 కోట్ల యూజర్లు), మొబైల్ ప్రీమియర్ లీగ్ (9 కోట్ల యూజర్లు) వీటిలో ఉన్నాయి. ఇక యూనికార్న్లు కాకపోయినప్పటికీ ‘జూపీ’, ‘విన్జో గేమ్స్’లాంటి సంస్థల వాల్యుయేషన్లు కూడా పడిపోయాయి. ‘2025 ఆస్క్ ప్రైవేట్ వెల్త్ హురున్ ఇండియా యూనికార్న్, ఫ్యూచర్ యూనికార్న్’ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఆన్లైన్ మనీ గేమ్స్ను నిషేధించే బిల్లును పార్లమెంటు గత నెల ఆమోదించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఆన్లైన్ మనీ గేమ్స్ సంబంధిత ప్రకటనలపై కూడా నిషేధం వర్తిస్తుంది. అలాంటి గేమ్స్ ఆడేందుకు నగదును బదిలీ చేసే సరీ్వసులను సైతం బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అందించకూడదు. ‘‘ఇలాంటి మార్పులన్నింటి వల్ల భారత్లో పేరొందిన పలు ఆర్ఎంజీ కంపెనీలపై ప్రభావం పడింది. దీనితో వాటి వృద్ధి నెమ్మదించే అవకాశం ఉంది’’ అని నివేదిక పేర్కొంది. అలాగే ఈ చట్టం వల్ల పరిశ్రమపై ఇన్వెస్టర్ల నమ్మకం కూడా సడలిందని వివరించింది. మరోవైపు, అంకురాలు క్రమంగా లాభదాయకత, పెట్టుబడులను సమర్ధంగా వినియోగించుకోవడం, దీర్ఘకాలంలో నిలకడగా ఉండే వ్యాపార విధానాల వైపు మొగ్గు చూపుతున్నాయని ఆస్క్ ప్రైవేట్ వెల్త్ ఎండీ రాజేశ్ సలూజా తెలిపారు. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు.. → 8.2 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్తో అత్యంత విలువైన భారతీయ స్టార్టప్గా డిస్కౌంట్ బ్రోకరేజీ సంస్థ జిరోధా అగ్రస్థానంలో ఉంది. చెరి 7.5 బిలియన్ డాలర్లతో ఫిన్టెక్ సంస్థ రేజర్పే, లెన్స్కార్ట్ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. → అత్యధికంగా 26 అంకురాలతో బెంగళూరు యూనికార్న్ హబ్గా నిల్చింది. వీటి మొత్తం వాల్యుయేషన్ 70 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక 36.3 బిలియన్ డాలర్ల విలువ చేసే 12 స్టార్టప్లతో ఢిల్లీ–ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్) రెండో స్థానంలో, 22.8 బిలియన్ డాలర్ల విలువ చేసే 11 సంస్థలతో ముంబై మూడో స్థానంలో నిల్చాయి. → దేశీయంగా అత్యంత పిన్న వయసు్కలైన యూనికార్న్ వ్యవస్థాపకులుగా జెప్టో ఫౌండర్లు కైవల్య ఓహ్రా, ఆదిత్ పలిచా (ఇద్దరికీ 22 ఏళ్లు) నిల్చారు. → వెంచర్ క్యాపిటల్ సంస్థ పీక్ ఫిఫ్టీన్ పార్ట్నర్స్ భారతీయ స్టార్టప్స్లో అత్యధికంగా ఇన్వెస్ట్ చేసింది. టరి్టల్మింట్, వాట్ఫిక్స్, గ్రో, ప్రిజమ్ (ఓయో) సహా 68 అంకురాల్లో 200 మిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులు పెట్టింది. అత్యంత విలువైన స్టార్టప్లు ఏకంగా 3.74 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. యూనికార్న్లలో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య 2.06 లక్షలుగా ఉంది. 11 కొత్త యూనికార్న్లు .. కొన్ని ఆర్ఎంజీ కంపెనీలు లిస్టు నుంచి నిష్క్రమించినప్పటికీ ఈ ఏడాది యూనికార్న్ల జాబితాలోని స్టార్టప్ల సంఖ్య మొత్తం మీద పెరిగి, 73కి చేరింది. ఈ ఏడాది 11 అంకురాలు యూనికార్న్ హోదా దక్కించుకున్నాయి. ఏఐడాట్టెక్, నవీ టెక్నాలజీస్, వివృతి క్యాపిటల్, వెరిటాస్ ఫైనాన్స్, ర్యాపిడో, నెట్రాడైన్, జంబోటెయిల్, డార్విన్బాక్స్, మనీవ్యూ, జస్పే, డ్రూల్స్ వీటిలో ఉన్నాయి. -
‘చింతా’ హౌసింగ్ గేమ్!
ఓట్ల కోసం రాజీవ్ ఆవాస్ యోజన మూడు నెలల్లో పదివేల ఇళ్లు నిర్మిస్తారట! ఆరేళ్లుగా మొండిగోడలకే పరిమితమైన దామినేడు హౌసింగ్ స్కీం పట్టించుకోని ఎంపీ చింతామోహన్ సాక్షి, తిరుపతి: ఓట్ల కోసం పేదలతో చింతా మోహన్ ‘హౌసింగ్ గేమ్’ మొదలు పెట్టారు. ఆ గేమ్ పేరు ‘రాజీవ్ ఆవాస్ యోజన’ (ఆర్ఏవై). సీమాంధ్ర ప్రాంతం సమైక్య ఉద్యమంతో అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. చింతామోహన్ మాత్రం ఈ ఉద్యమానికి దూరంగా ఉన్నారు. అయితే ప్రజల ఆకాంక్షను చింతా ఆలస్యంగా గుర్తించారు. మౌనంగా ఉంటే త్వరలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి ఖాయమనుకున్నారు. ఢిల్లీ స్థాయిలో పావులు కదిపి ‘రాజీవ్ ఆవాస్ యోజన’ పేరుతో ఓట్ల రాజకీయం మొదలు పెట్టారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం తన లోక్సభ పరిధిలోనిది కావటంతో అందులోని వికృతమాల పంచాయతీ వద్ద ఎయిర్పోర్టు పక్కన పది వేల ఇళ్లు నిర్మిస్తామని, తిరుపతిలోని పేదలందరికీ అక్కడ గృహాలు కేటాయిస్తామని మహిళాగ్రూప్ల వద్ద, తన అనుచరుల ద్వారా దరఖాస్తులు సేకరించటం ప్రారంభించారు. హడావుడిగా వికృతమాల వద్ద ఆర్ఏవై కింద నిర్మాణాలు చేపట్టేందుకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. దామినేడు ఇళ్లు కనిపించలేదా? తిరుపతిలోని పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే చిత్తశుద్ధి చింతామోహన్కు లేదు. ఎందుకంటే ఆరేళ్లుగా దామినేడు వద్ద 4,087 ఇళ్లు మొండిగోడలతోనే ఉన్నాయి. తిరుపతి లోని పేదలందరికీ ఇళ్లు కట్టించేందుకు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సంక ల్పించారు. ఈ క్రమంలో 2008లో ఇంటిగ్రేటెడ్ హౌసింగ్ ఫర్ స్లమ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఐహెచ్ఎస్డీపీ)లో భాగంగా దామినేడు, పాడిపేట, తనపల్లె, అవిలాల వద్ద అపార్ట్మెంట్ల నిర్మాణం ప్రారంభించారు. ఇవి పూర్తయితే తిరుపతికి చెందిన 4087 కుటుంబాలకు సొంతింటి కల సాకారమవుతుంది. మహానేత మరణం తర్వాత ఈ నిర్మాణాలు పూర్తి చేసేందుకు నిధులు కేటాయించలేదు. నేటికీ మొండిగోడలు, పిల్లర్లకే పరిమితమయ్యాయి. ఈ వేలాది ఇళ్లన్నీ చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. నిర్వహణ తిరుపతి కార్పొరేషన్ పరిధిలోనే ఉన్నా, అక్కడి ఇళ్లలో చేరితే ఓటర్లంతా చంద్రగిరి అసెంబ్లీ, చిత్తూరు ఎంపీ పరిధిలోకి వెళతారు. దీంతో అక్కడ నిర్మాణం ఆపి, తిరుపతి లోక్సభ పరిధిలోకి వచ్చే శ్రీకాళహస్తి పరిసరాల్లో ఇళ్ల నిర్మాణం జరిగేలా చూడాలని ఆర్డీవో, తహశీల్దార్ల పైన ఎంపీ ఒత్తిడి తెచ్చారని తెలిసింది. ఈ నేపథ్యంలో ఐహెచ్ఎస్డీపీతో పాటు జేఎన్ఎన్యుఆర్ఎం కింద చేపట్టిన మొత్తం పదివేల ఇళ్ల నిర్మాణం ప్రశ్నార్థకంగా ఉంది. ఈ ఇళ్లను పూర్తి చేయించాల్సిన చింతామోహన్ గాలికి వదిలేశారు. తాజాగా రాజీవ్ ఆవాస్ యోజన తెరపైకి తెచ్చారు. మూడు నెలల్లో ఎలా సాధ్యం? దామినేడు చుట్టుపక్కల ఆరేళ్ల క్రితం చేపట్టిన 4087 ఇళ్లు ఇంకా పూర్తి కాలేదు. మరి మూడు నెలల్లో వికృతమాలవద్ద 10 వేల ఇళ్లను చింతామోహన్ ఎలా పూర్తి చేయగలరు? ఇంత పెద్ద ఎత్తున నిర్మించే గృహనిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వెంటనే ఎలా వస్తాయి? ఆర్ఏవై కింద చేపడుతున్న ఇళ్లను రానున్న మూడు నెలల్లో పూర్తి చేసి కేటాయించటం సాధ్యమా ? ఇవీ సగటు జీవి ప్రశ్నలు. సొంతింటి కల సాకారం చేసుకోవాలనే పేదల ఆకాంక్షతో చింతామోహన్ ఆడుతున్న ‘హౌసింగ్ గేమ్’గా పలువురు అభిప్రాయపడుతున్నారు.