Red Line
-
సీమాంతర ఉగ్రవాదానికి కొత్త రెడ్లైన్
పుణే: వెయ్యిసార్లు గాయపర్చడం ద్వారా భారత్ను రక్తసిక్తం చేయాలన్న విధానాన్ని పాకిస్తాన్ అమలు చేస్తోందని ఇండియా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ చెప్పారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా సీమాంతర ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కొత్త రెడ్లైన్ గీశామని చెప్పారు. మంగళవారం మహారాష్ట్రలోని సావిత్రిబాయి ఫూలే పుణే యూనివర్సిటీలో ‘భవిష్యత్తు యుద్ధాలు, యుద్ధ రీతులు’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. యుద్ధంలో జరిగిన చిన్నచిన్న తప్పిదాల కంటే అంతిమంగా ఏం సాధించామన్నదే చాలా ముఖ్యమని తేల్చిచెప్పారు.తాత్కాలిక నష్టాల కారణంగా సైన్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో కొన్ని యుద్ధ విమానాలు కోల్పోయామంటూ తాను చేసిన ప్రకటనను కొందరు తప్పుపట్టడాన్ని జనరల్ అనిల్ చౌహాన్ ఖండించారు. మనవైపు జరిగిన నష్టం గురించి మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు స్పందించానని చెప్పారు. ఇలాంటి చిన్నపాటి నష్టాలకు ఏమాత్రం ప్రాధాన్యం లేదని, ఫలితాన్నే పరిగణనలోకి తీసుకోవాలని అప్పుడే స్పష్టంచేశానని ఉద్ఘాటించారు. శత్రువు పట్ల మన ప్రతిస్పందన ఎలా ఉందన్నదే కీలకమని వ్యాఖ్యానించారు. జరిగిన నష్టం గురించి, అంకెల గురించి మాట్లాడుకోవడం సరైంది కాదన్నారు.యుద్ధంలో ఎలాంటి నష్టం జరిగినా సైన్యం నైతిక స్థైర్యం కాపాడుకోవాలన్నారు. యుద్ధం, హింస ఉన్నచోట రాజకీయ జోక్యం కూడా ఉంటుందని తెలియజేశారు. ఆపరేషన్ సిందూర్లోనూ అదే జరిగిందని చెప్పారు. పహల్గాం ఉగ్రవాద దాడి కంటే కొన్ని వారాల ముందు పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ అసీం మునీర్ భారత్కు, హిందువులకు వ్యతిరేకంగా విషం కక్కారని అనిల్ చౌహాన్ గుర్తు చేశారు. భారత్ పట్ల దశాబ్దాలుగా కొనసా గుతున్న పాకిస్తాన్ విద్వేషాన్ని ఆయన మాటలు ప్రతిబింబించాయని తెలిపారు. భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ఎగదోస్తే ఇకపై తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆపరేషన్ సిందూర్ పాకిస్తాన్కు తెలి యజెప్పామని పేర్కొన్నారు. ఉగ్రవాద దాడులకు, అణు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు.పాక్పై నిర్ణయాత్మక విజయం 48 గంటలపాటు నిర్విరామంగా దాడులు చేసి ఇండియాను ఓడించాలని ప్రణాళిక సిద్ధం చేసిన పాకిస్తాన్ కేవలం 8 గంటల్లోనే చేతులెత్తేసిందని అనిల్ చౌహాన్ అన్నారు. ఆపరేషన్ సిందూర్లో భారత్ దాడులను తట్టుకోలేక పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చిందని పేర్కొన్నారు. ఆ ఆపరేషన్ ఇంకా కొనసాగితే చావుదెబ్బ తప్పదన్న సంగతికి పాక్కు తెలిసిపోయిందని వెల్లడించారు. కాల్పుల విరమణ, చర్చల ప్రతిపాదన తొలుత పాకిస్తాన్ నుంచే వచ్చిందని స్పష్టంచేశారు. ఆపరేషన్ సిందూర్లో పాకిస్తాన్పై నిర్ణయాత్మక విజయం సాధించామని మరోసారి తేల్చిచెప్పారు. పాకిస్తాన్కు ‘ఇన్నింగ్స్ డిఫీట్’ మిగిలిందని అన్నారు. ఈ ఆపరేషన్ ఇంకా ముగిసిపోలేదని, పాకిస్తాన్తో ఘర్షణ తాత్కాలికంగా ఆగిపోయిందని తెలిపారు. -
మోదీ రెడ్లైన్ దాటారు: పాకిస్తాన్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్లో చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రపంచం దృష్టికి తీసుకెళ్తామని, అక్కడి ప్రజలకు మద్దతిస్తామన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటనలపై పాక్ నాయకత్వం మండిపడుతోంది. తమ దేశానికి సంబంధించిన బలూచిస్తాన్పై మాట్లాడి నరేంద్రమోదీ 'రెడ్లైన్' దాటారని పాకిస్తాన్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి నఫీజ్ జకారియా గురువారం మండిపడ్డారు. బలూచిస్తాన్ గురించి మాట్లాడటం ద్వారా ఐక్యరాజ్యసమితి(యూఎన్) నియమావళిని మోదీ ఉల్లంఘించారన్నారు. ఈ నేపథ్యంలో రానున్న యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో కశ్మీర్ అంశాన్ని మరింత బలంగా వినిపిస్తామని జకారియా స్పష్టం చేశారు. అంతర్జాతీయ సమాజం, మానవహక్కుల సంస్థలు కశ్మీర్ విషయంలో స్పందించి, భారత బలగాలను ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మోదీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో సైతం పీఓకే, బలూచ్ ప్రజలకు మద్దతిస్తామని ప్రకటించి పాక్ విషయంలో దూకుడు పెంచిన విషయం తెలిసిందే. -
నేడు, రేపు మెట్రో రెడ్లైన్కు అంతరాయం
- మెయింటెనెన్స్, మరమ్మతు పనుల కారణంగానే - 9, 10 తేదీల్లో 18 నిమిషాలకొక రైలు సాక్షి, న్యూఢిల్లీ: వారాంతం రోజుల్లో చేపట్టనున్న మెయింటెనెన్స్, మరమ్మతు పనుల కారణంగా తీస్హజారీ - ఇందర్లోక్ స్టేషన్ల మధ్య మెట్రో రైలు రాకపోకలకు అంతరాయం కలగనుంది. ఈ శని, ఆది వారాల్లో రెడ్ లైన్ (లైన్ 1)పై ఉన్న ఈ రెండు స్ట్టేషన్ల మధ్య రైళ్లు సింగిల్ లైన్పై నడుస్తాయి. దీంతో మధ్యలో ఉన్న మూడు స్టేషన్లు -పుల్బంగష్, ప్రతాప్నగర్, శాస్త్రీ నగర్ స్టేషన్లలో కూడా రైళ్లు ఆలస్యంగా నడుస్తాయి. మరమ్మతు పనుల కారణంగా 9వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి ఏడున్నర వరకు, పదో తేదీ ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు దాదాపు 18 నిమిషాలకొక రైలు నడుస్తుందని మెట్రో ప్రతినిధి తెలిపారు. పుల్బంగష్, ప్రతాప్నగర్ మెట్రో స్టేషన్ల మధ్య కొనసాగుతున్న మెయిం టెనెన్స్ పనుల కారణంగా వారాంతం రైలు సేవలు ప్రభావితం కానున్నట్లు ఆయన చెప్పారు. ‘సాధారణంగా మెయింటెనెన్స్, మరమ్మతు పనులను తాము రాత్రి పూట చేపడుతుంటాం. దాని వల్ల ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా ఉంటుంది. అయితే కొన్ని సార్లు రైళ్లు నడిచే వేళల్లో కూడా మెయింటెనెన్స్ పనులు చేపట్టాల్సి వస్తుంది. అప్పుడు తాము ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉండే వేళల్లో పనులు చేపడతాం’ అని మెట్రో ప్రతినిధి తెలిపారు.