Red scandal dumps
-
రైల్వే కోడూరులో 20 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
వైఎస్సార్(రైల్వేకోడూరు): రైల్వేకోడూరు మండలంలోని కందమడుగు అటవీ ప్రాంతంలో 20 ఎర్రచందనం దుంగలను ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎనిమిది ఎర్రచందనం దొంగలను శనివారమే అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు దుంగలను పొదల్లో దాచిపెట్టినట్లు తెలపడంతో పోలీసులు వెళ్లి వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. -
22 ఎర్రచందనం దుంగలు స్వాధీనం,10 మంది అరెస్టు
వీరబల్లె : వైఎస్ఆర్ కడప జిల్లాలోని వీరబల్లె మండలం నాయునివారిపాలెం వద్ద సోమవారం అక్రమంగా తరలిస్తున్న 22 ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని అంచనా. ఈ ఘటనకు సంబంధించి 10 మందిని అరెస్ట్ చేశారు. ఒక వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తుండగా ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. కేసు నమోదు చేసుకుని నిందితులను స్టేషన్కు తరలించారు. -
70 ఎర్రచందనం దుంగలు స్వాధీనం, ముగ్గురి అరెస్ట్
కడప: ఎర్రచందనం స్మగ్లింగ్ యథేచ్చగా కొనసాగుతోంది. స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణాకు పాల్పడుతూనే ఉన్నారు. వీరి ఆగడాలను అరికట్టేందుకు అటవీశాఖ అధికారులు, పోలీసులు ఎప్పుటికప్పుడూ చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. తాజాగా కడప జిల్లాలోని ఒంటిమిట్టలో అక్రమంగా తరలిస్తున్న 70 ఎర్రచందనం దుంగలను గురువారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక కోదండ రామాలయం వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీలను గమనించి ఓ టెంపో వాహనం ఆగకుండా వెళ్లడంతో పోలీసులు వాహనాన్ని వెంబడించి పట్టుకున్నారు. వాహనం సహా, 70 దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనాన్ని తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులు మండలంలోని నరవకాటిపల్లె చెందిన వారిగా గుర్తించారు. (ఒంటిమిట్ట)