వైఎస్సార్(రైల్వేకోడూరు): రైల్వేకోడూరు మండలంలోని కందమడుగు అటవీ ప్రాంతంలో 20 ఎర్రచందనం దుంగలను ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎనిమిది ఎర్రచందనం దొంగలను శనివారమే అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో వారు దుంగలను పొదల్లో దాచిపెట్టినట్లు తెలపడంతో పోలీసులు వెళ్లి వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.
రైల్వే కోడూరులో 20 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
Published Sun, Aug 16 2015 5:44 PM | Last Updated on Tue, Aug 21 2018 7:34 PM
Advertisement
Advertisement