railway koduru
-
సామాజిక సాధికార యాత్రకు పోటెత్తిన జనం
-
నాన్న వచ్చాడు.. లేచి చూడు కన్నా..
సాక్షి, రైల్వేకోడూరు(కడప) : సరదాగా స్నేహితులతో తిరిగేవాడివి... మారం చేయకుండా బడికి వెళ్లే వాడివి... ఏ పని చెప్పినా చేసేవాడివి.. అందిరితో కిలివిడిగా ఉండే నీకు అప్పుడే నూరేళ్లు నిండాయా బిడ్డా అంటూ శివరామకృష్ణ తల్లి లావణ్య బోరున విలపిస్తోంది. నిన్నే ప్రాణంగా భావించి.. నీ అభివృద్ధి కోసం కువైట్కు వెళ్లిన మీ నాన్న నిన్ను చూడడానికి వచ్చాడు..ఒక్క సారి లేచి చూడరా నానా అంటూ ఆ తల్లి పెట్టిన ఆక్రందన అందరి గుండెలను పిండేసింది. గుంజన ఏటిలో మంగళవారం ఈతకు వెళ్లి గల్లంతైన శివరామకృష్ణ మృతదేహం గురువారం తెల్లవారు జామున లభ్యమైంది. జాలర్లు వల సహాయం మృతదేహాన్ని గట్టుకు చేర్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. కువైట్లో ఉన్న మృతుని తండ్రి సుబ్రమణ్యం కూడా ఇంటికి చేరుకోవడంతో కటుంబసభ్యులు, బంధువులు స్నేహితులు, గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికి అంత్యక్రియలు నిర్వహించారు. అంతా బంధువులే కావడంతో గుండాలపల్లె గ్రామస్తులు శోకసంద్రంలోనే ఉన్నారు. శివరామకృష్ణకు నివాళి ఏటిలో గల్లంతై మృతి చెందిన శివరామకృష్ణకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు నివాళులరి్పంచారు. గురువారం ఉదయం గుండాలపల్లెకు వెళ్లి మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ నాయకులు, అధికారులు ఉన్నారు. ఫలించిన కొరముట్ల కృషి శివరామ కృష్ణ ఏటిలో గల్లంతయ్యాడని తెలుసుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు చేసిన కృషి ఫలించింది. స్థానిక రెస్క్యూ టీం, గజ ఈతగాళ్లు గాలింపు చేసినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో జిల్లా ఎస్పీతో చర్చించారు. బోటు, జాలర్లను పిలిపించారు. గురువారం రాత్రంతా ఏటిలో జల్లెడ పట్టించారు. గుంజన ఏరు నీటి ఉధృతిని తగ్గించడానికి నాలుగు జేసీబీలతో నీటిని తగ్గించారు. విప్ కొరమట్లు దగ్గరుండి వారిని ప్రోత్సహించారు. చివరికి గురువారం తెల్లవారు జామున 4:30 గంటల సమయంలో మృతదేహాన్ని వెలికి తీశారు. కొరముట్ల కృషికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు అన్ని శాఖల అధికారులు, జాలర్ల పనితీరును ప్రశంశించారు. శివరామకృష్ణ మృతదేహాన్ని వెలికి తీస్తున్న జాలర్లు మృతుని తల్లిదండ్రులను ఓదారుసున్న విప్ కొరముట్ల -
ప్రజల తమవంతుగా ఇళ్లకే పరిమితం కావాలి
-
రైల్వే కోడూరులో తప్పిన ప్రమాదం
-
ప్రియుడి మోజులో పడి.. దారుణానికి ఒడిగట్టి..
సాక్షి, రైల్వేకోడూరు(కడప) : రైల్వేకోడూరు పట్టణం రంగనాయకులపేటకు చెందిన అబ్దుల్ ఖాదర్ బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. అతనికి ఈనెల 23న తన అత్త కూతురితో వివాహం జరగాల్సి ఉండింది. ఇంతలో ఈనెల 5న రంజాన్ పండుగ సందర్భంగా సొంత ఊరికి వచ్చి బస్సు దిగి ఇంటికి వెళ్తుండగా దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్యను పలు కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు మిస్టరీని ఛేదించారు. పెళ్లి కూతురిగా పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి తన ప్రియుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు గుర్తించారు. ఈమేరకు సీఐ బాలయ్య విలేకరులకు వివరాలు వెల్లడించారు. అబ్దుల్ ఖాదర్కు తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా గుమ్మడిపూడిలో ఉంటున్న తన సొంత మేనత్త కూతురు శబ్నతో ఈ నెల 23న వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారు. అయితే అప్పటికే శబ్న అదే గ్రామానికి చెందిన ప్రిన్స్ అనే యువకుడిని ప్రేమించింది. ఆమె తన ప్రియుడితోనే సంబంధం కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో తనకు కాబోయే భర్తను చంపమంటావా లేకుంటే నీవు చంపుతావా అని తన ప్రియుడిని ప్రశ్నించింది. దీంతో ప్రియుడు ప్రిన్స్ తన స్నేహితులైన దీనదయాల్కు రూ.1.50 లక్షలు, సెల్వంకు రూ.2లక్షలు, లక్ష్మణ్కు రూ.3 లక్షలు, బ్రిస్టన్కు రూ.50వేలు డబ్బులు ఇచ్చి ఎలాగైనా తన ప్రియురాలికి కాబోయే భర్త అబ్దుల్ ఖాదర్ను హతమార్చాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ నెల 5వ తేదీన రంజాన్ పండుగ రోజున ఉదయం 5.30 గంటలకు అబ్దుల్ఖాదర్ రైల్వేకోడూరులోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బస్సు దిగాడు. అక్కడే పాలప్యాకెట్ తీసుకుని ఇంటికి వెళ్తుండగా సమీపంలోనే మాటు వేసి ఉన్న దుండగులు కృష్ణా హాల్ పక్క వీధిలో కిరాతకంగా నరికి చంపారు. ఈ ఘాతుకానికి పాల్పడిన శబ్న ప్రియుడు ప్రిన్స్ను, అతని స్నేహితులు సెల్వం, దీనదయాల్ను అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. అలాగే వారి వద్ద నుంచి మారుతి వాహనం, రూ. లక్షా 50 వేలు నగదు, వేట కొడవళ్లు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐ వెంకటేశ్వర్లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
రైల్వేకోడూరులో గాలివాన బీభత్సం
-
రైల్వేకోడూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శ్రీనివాసులు ప్రచారం
-
చంద్రబాబు పాలనలో ప్రజలు విసిగిపోయారు: కోరుముట్ల
-
రైల్వేకోడూరులో రాజన్న క్యాంటీన్ ప్రారంభించిన కోరముట్ల
-
రైల్వే కోడూరులో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
అరటి రైతు విలవిల
రైల్వేకోడూరు: అత్యధికంగా పండ్లతోటలు ఉండే ఏకైక ప్రాంతంగా రైల్వేకోడూరు నియోజకవర్గం జిల్లాలోనే ప్రసిద్ధిగాంచింది. అయితే అరటి, మామిడి పంటలు చేతికొచ్చే సమయంలో ప్రకృతి ప్రకోపం కారణంగా పంట చేతికి వచ్చి కాయలు కోసే దశలో నేలపాలు కావడంతో రైతులు కుదేలవుతున్నారు. అయిపోతున్నాడు. బాగా దిగుబడి వచ్చింది, అప్పుల ఊబి నుంచి బయటపడతామని అనుకుంటుండగానే గత నెల 15వ తేదీ పెద్ద ఎత్తున వీచిన గాలి వానకు పుల్లంపేట, రైల్వేకోడూరు మండలాల్లో వందల ఎకరాల్లో అరటి నేల మట్టంకాగా, మామిడి కాయలు అన్ని మండలాల్లో నేల రాలిపోయాయి. అలాగే గత నెల చివరలో వచ్చిన ఈదురు గాలులకు ఒక్క పుల్లంపేట మండలంలోనే దాదాపు 120 ఎకరాల్లో అరటి నేలకొరిగింది. ఈ నేపథ్యంలో ఈ నెల 22న ఆదివారం సాయంత్రం గాలి వానతో పాటు వడగండ్ల వాన రావడంతో మరోసారి వందల ఎకరాల్లో అరటి నేలకొరిగింది. దీంతో రైతులు దిక్కు తోచని స్థితిలో దిగాలు పడిపోయారు. పంట నష్టం గురించి రైతులు సమాచారం ఇచ్చినా అటు వైపు ఏ అధికారి కన్నెత్తి చూడటంలేదు. రెవెన్యూ, ఉద్యానవన అధికారులు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ కనీసం సర్వే చేసేందుకు కూడా ముందుకు రాకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. ఎట్టకేలకు తాము ప్రాధేయపడితే ఉద్యానవన అధికారులు వచ్చి తూతూ మంత్రంగా సర్వే చేసి వెళ్లారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు గట్టిగా ప్రశ్నిస్తే మీ తోటలో మీరు నిలబడి ఫొటోలు, ఆధార్కార్డు, పాసుపుస్తకాల జిరాక్సు కాపీలు తెమ్మని ఆదేశిస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టం వాటిల్లితే తక్షణమే స్పందించి సర్వే చేయించి రైతులను ఆదుకొనేవారని రైతులు గుర్తు చేస్తున్నారు. గత ప్రభుత్వం కూడా రైతులకు అంతో ఇంతో సహాయం అందించిందని.. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం గత నాలుగేళ్ల కాలంలో ప్రకృతి వైపరీత్యంతో నష్టపోయిన రైతులను ఆదుకున్న పాపాన పోలేదని రైతులు దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రకృతితో నష్టపోయిన రైతు తిరిగి అదే భూమిలో మరో పంట పండించుకునేందుకు అయ్యే నామమాత్రపు ఖర్చును సైతం అందజేయని ఈ ప్రభుత్వం రైతుకు మేలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం దుర్మార్గపు చర్యగా రైతులు అభివర్ణిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోకుంటే లక్షల్లో నష్టపోయిన రైతులు కోలుకోవడం కష్టమేననే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అరటి పంట నేలకొరిగిన పొలాలను జిల్లా కలెక్టర్ పరిశీలించి, రైతులకు నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలని కోరుతున్నారు. ఉద్యానవన అధికారులకునియంత్రణ లేదా.. ప్రతి మండలంలో రైతులకు అండగా ఉండేందుకు ప్రభుత్వం ఉద్యానవన అధికారులను నియమించింది. కానీ ఈ శాఖకు చెందిన మండల స్థాయి అధికారులు రైతులకు చుక్కలు చూపిస్తున్నారనే విమర్శలున్నాయి. ఉన్నతాధికారులు వీరి చర్యలపై దృష్టి సారించి వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి నేను సాగు చేసిన ఐదు ఎకరాలలోని అరటి చెట్లు గాలి దెబ్బకు పడిపోయాయి. మళ్లీ పైరు పెట్టాలంటే కష్టంగా ఉంది. ప్రభుత్వం ఆదుకుని నష్టపరిహారం చెల్లించాలి. –భీము రామచంద్రారెడ్డి, అరటిరైతు, మల్లెంవారిపల్లి, పుల్లంపేట మండలం. -
రోడ్డు ప్రమాదంలో తిరుమల యాత్రికుల మృతి
-
రోడ్డు ప్రమాదంలో తిరుమల యాత్రీకుల మృతి
- కారును ఢీకొన్న కంటైనర్.. ముగ్గురి మృతి రైల్వే కోడూరు: పుణ్య క్షేత్రానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. వైఎస్సార్ కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలోని అనంతరాజుపేట వద్ద మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న కారును అనంతరాజుపేట వద్ద ఓ కంటైనర్ ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరిని తిరుపతి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్రమైన గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.అయితే మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. -
బిరబిరా కృష్ణవేణమ్మ
సాధికారత కృష్ణమ్మ మహారాష్ట్రలో పుట్టి ఏపీకి వచ్చింది. కృష్ణవేణి... ఏపీలో పుట్టి మహారాష్ట్రకు వెళ్లింది. ఏమిటి పోలిక... కృష్ణమ్మకు, కృష్ణవేణికి! చిన్న పాయగా మొదలైంది కృష్ణానది. మూమూలు గృహిణిగా మొదలైంది కృష్ణవేణి. పరవళ్లతో ప్రవహిస్తోంది కృష్ణమ్మ. ఉరకలపై ప్రజాసేవ చేస్తోంది కృష్ణవేణమ్మ. బిరబిరా కృష్ణమ్మ అంటాం కదా... అలాగే... బిరబిరా కృష్ణవేణమ్మ అనాలి!! తెలుగువారికి అందని ద్రాక్షగా మిగిలిన బృహన్ ముంబై మహానగర్ పాలిక (మున్సిపల్ కార్పొరేషన్) లో ఈ ఏడాది ప్రాతినిధ్యం లభించింది! గత ఎన్నికల్లో వరంగల్ జిల్లాకి చెందిన అనూష వల్పదాసి శివసేన టిక్కెట్పై విజయం సాధించి అతిపిన్న వయసు కార్పొరేటర్గా రికార్డు సృష్టించినప్పటికీ, అనంతరం సాంకేతిక కారణాల వల్ల ఆమె పదవి రద్దు అయింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో కండిగ కృష్ణవేణి రెడ్డి (48) కార్పొరేటర్గా విజయం సాధించడంతో.. ఐదు దశాబ్దాల తెలుగు ప్రజల నిరీక్షణ ఫలించినట్లయ్యింది. ముంబైలోని ‘సాక్షి’ దినపత్రిక కార్యాలయంలో ఇటీవలి వరకు ఆపరేటర్గా విధులు నిర్వహించిన కండిగ కృష్ణవేణి ఇప్పుడు ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్ అయ్యారు. కడప నుంచి ముంబైకి కృష్ణవేణి స్వస్థలం కడప జిల్లా రైల్వేకోడూరు మండలం అనంతరాజుపేట గ్రామం. నాన్న పూత్తూరు శివరామిరెడ్డి, అమ్మ వెంకటలక్ష్మి. కృష్ణవేణి విద్యాభ్యాసం అనంతరాజుపేటతో పాటు రైల్వేకోడూరులో జరిగింది. వివాహం చిత్తూరు జిల్లాకు చెందిన కండిగ వినోద్ రెడ్డితో జరిగింది. వినోద్ ఉద్యోగ రీత్యా ఈ దంపతులు ముంబైలో స్థిరపడ్డారు. సుమారు ఇరవై ఏళ్లకుపైగా ఆమె ఒక సాధారణ గృహిణిగా కుటుంబ బాధ్యతలకే పరిమితం అయ్యారు. కృష్ణవేణికి సమాజానికి ఏదైనా చేయాలన్న తపన ఉండడంతో తమ ప్రాంతంలో తన వంతుగా సమాజసేవా కార్యక్రమాలలో పాల్గొనేవారు. ఇంటి నుంచి ఉద్యోగానికి తండ్రి దివంగత శివరామిరెడ్డి రాజకీయాల్లో ఉన్నప్పటికీ కృష్ణవేణికి అంతగా రాజకీయ అనుభవంలేదు. అయితే 2014లో ఆపరేటర్గా ఉద్యోగంలో చేరడంతో ఆమె ఆలోచనా పరిధి విస్తృతం అయింది. ‘‘సాక్షిలో నేను విధులు నిర్వహించింది 15 నెలలే అయినప్పటికీ, అనేక విషయాలను తెలుసుకోగలిగాను. ముఖ్యంగా సాక్షి ఉద్యోగిగా మా ఏరియాతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నాకు గౌరవం లభించే ది. దీంతో మరిన్ని సమాజసేవా కార్యక్రమాలు నిర్వహించడానికి వీలు కలిగింది. ఆ క్రమంలోనే స్థానిక నాయకుల ప్రోత్సహంతో బీజేపీలో చేరాను’’ అని చెప్పారు కృష్ణవేణి. 2015లో కృష్ణవేణి దక్షిణ మధ్య ముంబై బీజేపీ మహిళ మోర్చా ప్రధాన కార్యదర్శి అయ్యారు. అయితే మొదట ఆమె పూర్తిస్థాయిలో పార్టీకి సేవలు అందించలేకపోయారు. ఆ ఏడాదే ఆమె తల్లి మరణించారు. అనంతరం అదే ఏడాది ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి సమయం రాజకీయాలకు కేటాయించారు. రాజకీయాల్లోకి రాక ముందు నుంచే ‘పసుపు కుంకుమ’ తదితర కార్యక్రమాల ద్వారా తమ ప్రాంతంలోని మహిళలతో కృష్ణవేణి మమేకమై ఉండేవారు. రాజకీయాల్లోకి వచ్చిన అనంతరం ఆ అనుబంధాన్ని బరింత దృఢంగా కొనసాగించారు. ఉద్యోగం నుంచి పాలిటిక్స్కి గత ఏడాది ఫిబ్రవరిలో సైన్ కోలీవాడాలోని ఇంద్రనగర్ గార్డెన్లో కృష్ణవేణి ఆధ్వర్యంలో జరిగిన పార్టీ కార్యక్రమానికి ఊహించిన దానికంటే రెట్టింపు సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. ఆ కార్యక్రమం ఆమెకు ఒక గుర్తింపు సంపాదించి పెట్టింది. పార్టీలో ఆమె ప్రాధాన్యాన్ని మరింత పెంచేలా చేసింది. బీజేపీ దక్షిణ మధ్య ముంబై అధ్యక్షులు అనీల్ ఠాకూర్, స్థానిక బీజేపీ ఎమ్మెల్యే కెప్టెన్ తమిళ సెల్వన్లు బీజేపీ దక్షిణ ముంబై మహిళ విభాగానికి అధ్యక్షురాలిగా ఆమెకు బాధ్యతలు అప్పగించారు. దాంతో ఆమె క్రియాశీలత, నిర్వహణ సామర్థ్యాలు దక్షిణ మధ్య ముంబై జిల్లాలోని బీజేపీ నాయకులతోపాటు దాదాపు ఇతర ప్రముఖులందరి దృష్టికీ వెళ్లాయి. సొంత టీమ్తో ఇంటింటికీ 2016 డిసెంబరులో కృష్ణవేణి తన కంటూ ఒక టీమ్ను నియమించుకున్నారు. ఈ టీమ్తో కలిసి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలకు ప్రచారకర్త అయ్యారు.‘ఘర్ ఘర్ కి అభియాన్’ ద్వారా... ముఖ్యంగా మహిళలకు సంబంధించిన పథకాలపై స్థానికుల్ని చైతన్యవంతుల్ని చేశారు. ఫలితమే కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమెకు బీజేపీ టిక్కెట్. ‘‘కార్పొరేటర్గా బరిలోకి దిగిన అనంతరం మహిళలే నాకు బలంగా నిలిచారు. వారిలో తెలుగువారు కూడా ఉన్నారు’’ అని కృష్ణవేణి తెలిపారు. ప్రచారానికి తక్కువగా సమయమే లభించినప్పటికీ బహిరంగ సభలు కాకుండా ఇంటింటి ప్రచారానికి ఆమె ప్రాధాన్యం ఇచ్చారు. తన వార్డులో కేవలం ఒకే ఒక్క బహిరంగ సభ జరిగింది. ఆమె వెంట ప్రచారంలో సుమారు 75 నుంచి 80 శాతం మహిళలుంటే 20 నుంచి 25 శాతం మాత్రమే పురుషులుండేవారు. ప్రచారంలో భాగంగా ఉదయం నుంచి రాత్రి వరకు బయటే ఉండడంతో చాలాసార్లు కేవలం పాలు తాగి పడుకోవాల్సి వచ్చేదని కృష్ణవేణి తెలిపారు. ఒత్తిళ్ల నుంచి విజయానికి రాజకీయాల్లోకి రావడానికి ముందు, తర్వాత కూడా తన కుటుంబ సభ్యులు ఇచ్చిన, ఇస్తున్న సహకారం మరువలేనిదని కృష్ణవేణి అన్నారు. ‘‘నా భర్తతో పాటు నా ఇద్దరు పిల్లలు కుషాల్, వినీత్ల సహకారం అన్ని విధాలా నా ఒత్తిడిని తగ్గించింది. ముఖ్యంగా మా చిన్నబ్బాయి వినీత్తోపాటు వినీత్ కాలేజీ ఫ్రెండ్స్ నా ప్రచారానికి, పనులకు కష్టపడి సహకరించారు’’ అని కృష్ణవేణి చెప్పారు. కుషాల్ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ చేసి ఎంబిఎ చేస్తూ ఉద్యోగం చేస్తుంటే, వినీత్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి తండ్రికి వ్యాపారంలో సహాయంగా ఉన్నాడు. కృష్ణవేణి భర్త ముంబైలోని ‘కేర్ ఇట్’ ఫార్మా యునిట్ను నడుపుతున్నారు. పెద్దబ్బాయికి తన తల్లి రాజకీయాల్లోకి తిరగడం ఇష్టం లేకపోవడంతో ఆమె తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ఆసక్తి కనబరచలేదు. నిరంతరం ఆమె పార్టీ పనుల్లో తీరిక లేకుండా ఉండడాన్ని చూసి ‘ఎందుకమ్మా ఇదంతా’ అని బాధపడేవాడు. పదవి నుంచి ప్రజాసేవకు కృష్ణవేణి పోటీ చేసిన వార్డు 1740 (యాంటాప్ హిల్స్ – విజయ్నగర్)లో అత్యధికంగా మురికివాడలే ఉన్నాయి. తాగునీరు, మురుగునీటి వ్యవస్థతోపాటు ఆ వార్డులో అనేక సమస్యలున్నాయి. వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని కృష్ణవేణి తెలిపారు. ‘‘రాజకీయాల్లో నాకంటూ ఓ ప్రత్యేక ముద్ర కోసం ప్రయత్నిస్తా. అందరిని కలుపుకుని పెద్దల సలహాలు తీసుకుంటూ ముందుకు సాగుతా. ముఖ్యంగా బీజేపీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే కెప్టెన్ తమిళ సెల్వన్తోపాటు నా వార్డులోని బీజేపీ నాయకుల మార్గదర్శకత్వంలో కార్యకర్తలను కలుపుకుని పని చేస్తా’’ అని చెప్పారు. ‘‘మహిళలతోపాటు యువత రాజకీయాల్లో కొస్తే కొత్త ఆలోచనలతోపాటు, సాంకేతిక పరిఙ్ఙానాన్ని ఉపయోగించుకుని సమస్యలను త్వరగా పరిష్కరించే అవకాశం ఉంది. ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. అందుకే ప్రజలు నాకు అవకాశం కల్పించారు. పార్టీతోపాటు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజల సమస్యలు పరిష్కరిస్తా’’ అని కృష్ణవేణి అన్నారు. ‘రాజకీయ అనుభవం లేని మీరు రాజకీయ బురదలోకి ఎందుకుకొస్తున్నారు.. వచ్చినా.. ఎలా నెగ్గుకొస్తారు?’ అని కృష్ణవేణిని చాలామందే ప్రశ్నించారు. వారందరికీ చిరునవ్వుతో ఆమె చెప్పిన సమాధానం ఒక్కటే. ‘‘రాజకీయం బురద కాదు. బురదను శుభ్రం చేసే అవకాశం?’’అని! శ్రమను గుర్తించాడు కుషాల్! ‘నేను గెలిచినట్టు ప్రకటన రాగానే వాడిని ‘నాకు కంగ్రాట్స్ చెప్పవా?’ అని అడిగితే మా పెద్దబ్బాయి ఏమన్నాడో తెలుసా... సింపుల్గా ‘నీ కష్టానికి ఫలితం దక్కింది’ అన్నాడు. ఆ మాట నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. అభినందనలు చెప్పినా అంత ఆనందం కలిగేది కాదేమో! నా శ్రమను గుర్తించాడు మా పెద్దబ్బాయి’ అని కృష్ణవేణి చెప్పారు. అన్నట్టు... ప్రత్యర్థులు కూడా ఆమెను ‘లోకం తెలియని’ ఇల్లాలిగానే ప్రచారం చేశారు. ఆ ప్రచారాన్ని తన గెలుపుతో తిప్పికొట్టారు కృష్ణవేణి. • ‘రాజకీయాలొద్దు... బురద’ అన్నారు పెద్దవాళ్లు. •‘ఎందుకమ్మా ఇదంతా’ అన్నాడు పెద్ద కొడుకు. •‘లోకం తెలియని ఇల్లాలివి’ అన్నారు ప్రత్యర్థులు. • అయినా ఆమె నిలిచారు. నిలిచి గెలిచారు. – గుండారపు శ్రీనివాస్, సాక్షి, ముంబై -
9 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
రైల్వే కోడూరు: వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు మండలం బలపల్లె వద్ద టాస్క్ఫోర్సు తనిఖీలు జరిపింది. ఈ సందర్భంగా టాస్క్ఫోర్సు అధికారులను చూసి పదిమంది ఎర్రచందనం కూలీలు పరారయ్యారు. ఆ స్థలంలో 9 ఎర్రచందనం దుంగలను టాస్క్ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
నోట్లు మార్పిడి ముఠా అరెస్టు
నందలూరు: పాత పెద్ద నోట్లను తీసుకుని కమీషన్ పట్టుకుని కొత్త నోట్లను ఇచ్చేందుకు ప్రయత్నించిన తొమ్మిది మంది సభ్యులు గల ముఠాను అరెస్టు చేసినట్లు నందలూరు ఎస్ఐ శ్రీనివాసులరెడి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఓబులవారిపల్లె, మంగంపేట, రైల్వేకోడూరుకు చెందిన మోడి శ్రీనివాసులు, యస్.రాజగోపాల్, మొగలి నవీన్కుమార్, రాచపోయిన చెంగల్రాయుడు, మద్దిల నాగరాజు, కోడూరు రాంబాబు, నాటూరు నరసింహారెడ్డి, కొండా వెంకటేష్, కొండా రమేష్బాబులు నందలూరు చెయ్యేరు బ్రిడ్జి కింద నీలిపల్లి ప్రాంతంలో ఉండగా అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి రూ.10 వేలు నగదు, ఒక ఇండికా కారు, మూడు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరు కమీషన్కు కక్కుర్తి పడి పాత నోట్లుతీసుకు ని కొత్త నోట్లు ఇచ్చేందుకు ప్రయత్నించారన్నారు. తమకు అందిన పక్కా సమాచారంతో వీరిని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచగా జడ్జి రిమాండ్కు ఆదేశించారన్నారు. కాగా 9 మంది వద్ద కేవలం రూ.10 వేలు మాత్రమే ఉన్నాయనడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఆటోను ఢీకొన్న లారీ : ఒకరి మృతి
రైల్వేకోడూరు: వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు రూరల్ మండలం ఎస్ ఉప్పరపల్లి హరిజనవాడ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ... ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను 108 వాహనంలో రైల్వేకోడూరులోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మృతుడి వివరాలు మాత్రం తెలియరాలేదని పోలీసులు తెలిపారు. -
రైలు కింద పడి వ్యక్తి మృతి!
రైల్వేకోడూరు : రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు స్టేషన్ సమీపంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. పాతగేటు సమీపంలో ముక్కలు ముక్కలుగా పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచరం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
చికిత్స పొందుతూ యువకుడు మృతి
వైఎస్సార్ జిల్లా: రైల్వేకోడూరు మండలం మాధవరంపోడుకు చెందిన మల్లు మల్లికార్జునరెడ్డి(23) ఈ నెల 10వ తేదీన మదనపల్లె సమీపంలో ఆర్టీసు బస్సు బైక్ను ఢీకొన్న ఘటనలో గాయపడ్డాడు. బెంగుళూరుకు తరలించగా అక్కడ ఓ ప్రైవేటు వైద్యశాలలో వైద్యం పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు అతని బంధువులు తెలిపారు. మృతుడు మదనపల్లెలోని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో చదువు పూర్తి చేశారని, సర్టిఫికెట్లు తీసుకుని వచ్చేటప్పుడు ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈయనపై చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో 10 ఎర్రచందనం కేసులు ఉన్నట్లు సమాచారం. -
రూ. 3 కోట్ల ఎర్రచందనం స్వాధీనం
రైల్వే కోడూరు: వైఎస్సార్ కడప జిల్లా రైల్వేకోడూరు మండలం నాగేటికోట అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న అటవీ అధికారులు భారీ ఎర్రచందనం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాత్రి నుంచి కొనసాగుతున్న ఈ కూంబింగ్లో ఇప్పటి వరకు 182 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని అక్రమంగా అంతర్జాతీయ మార్కెట్లో అమ్మడానికి యత్నిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల విలువ సుమారు రూ. 3 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. -
టీడీపీ నేత ఇంటిపై ఐటీ దాడులు
రైల్వేకోడూరు: వైఎస్సార్ జిల్లాలో ఓ టీడీపీ నేత ఇంటిపై సోమవారం ఆదాయపుపన్ను శాఖాధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. రైల్వే కోడూరు టీడీపీ ఇంఛార్జ్ విశ్వనాథ్నాయుడు ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో అధికారులు మెరుపు దాడులు చేపట్టారు. రైల్వేకోడూరు, తిరుపతిలోని ఇళ్లు, ఆయన కార్యాలయాలతో పాటు టీడీపీ కార్యాలయాల్లో దాడులు కొనసాగుతున్నాయి. భారీ ఎత్తున ఆస్తులు గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐటీ అధికారుల దాడులు జరుగుతున్నాయి. -
ఆటో, బస్సు ఢీకొని ఒకరు మృత్యువాత
వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు సమీపంలో గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పట్టణ సమీపంలోని వై.కోట బైపాస్ వద్ద ఓబులవారిపల్లె మండలం మంగళంపల్లె వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఒకరు అక్కడికక్కడే చనిపోగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను రైల్వేకోడూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
రైల్వే కోడూరు (వైఎస్సార్ జిల్లా): అక్రమంగా తరలించేందుకు మామిడి తోటలో దాచి ఉంచిన 51 ఎర్రచందనం దుంగలను పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు మండలం జ్యోతికాలనీకి ఎదురుగా ఉన్న మామిడి తోటలో ఎర్రచందనం దుంగలు దాచి ఉంచారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు రూ. 25 లక్షల విలువైన ఎర్రదుంగలను స్వాధీనం చేసుకున్నారు. -
గొంతు కోసి యువకుడి హత్య
రైల్వేకోడూరు: వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు మండలం బజ్జువారిపల్లె పంచాయతీ బంగ్లామిట్ట సమీపంలో ఒక యువకుడిని గొంతు కోసి హతమార్చారు. ఈ సంఘటన సోమవారం ఉదయం జరిగింది. రామయ్యపాళెం ఎస్టీ కాలనీకి చెందిన పెంచలసుబ్రమణ్యం(22) ఆదివారం సాయంత్రం బంగ్లామిట్టలో జరిగిన జాతరకు వచ్చాడు. జాతర అనంతరం బైక్పై వెళుతున్నసుబ్రమణ్యంను కత్తులతో గొంతుకోసి బైక్పైనే శవాన్ని వదిలేసి వెళ్లారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
31మంది తమిళ కూలీలు అరెస్ట్
రైల్వే కోడూరు (వైఎస్సార్ జిల్లా) : అక్రమంగా ఎర్ర చందనం దుంగలను తరలించడానికి ప్రయత్నిస్తున్న 31 మంది తమిళ కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా రైల్వేకోడూరు మండలం కుప్పలదొడ్డి సమీపంలో శనివారం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి సీఐ రసూల్ సాబ్ బృందం అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా.. రైల్వే ట్రాక్ సమీపంలో ఎర్రచందనం దుంగలను తరలించడానికి ప్రయత్నిస్తున్న కూలీలు తారసపడ్డారు. దీంతో పోలీసులు 31 మంది తమిళ కూలీలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 34 ఎర్ర చందనం దుంగలతో పాటు, ఓ కారు, ఓ లారీ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సీఐ శనివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. -
ఆటో-లారీ ఢీ: ఇద్దరు మృతి
రైల్వేకోడూరు: వైఎస్సార్జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.... ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రైల్వే కోడూరులోని టోల్గేట్ వద్ద ఎదురెదురుగా వస్తున్న ఆటో, లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న లారీ ఆటోని ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న శెట్టిగుంట గ్రామానికి చెందిన గొండ వెంకటయ్య(45) అరుణమ్మ(35) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
రైల్వేకోడూరుకు చేరిన కేంద్ర వరద అంచనా బృందం
రైల్వేకోడూరు (వైఎస్సార్ జిల్లా) : ఇటీవల కురిసిన భారీవర్షాలకు ముంపుకు గురైన ప్రాంతాలను, పంటలను పరిశీలించడానికి కేంద్రం నుంచి వచ్చిన వరద అంచనా బృందం గురువారం రైల్వేకోడూరుకు చేరుకుంది. ఎండీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించింది. ఈ బృందంలో నలుగురు సభ్యులున్నారు. రైతులను, స్థానిక అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ కూడా పాల్గొన్నారు. -
రూ.15 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
రైల్వేకోడూరు: వైఎస్ఆర్ కడప రైల్వే కోడూరు మండలం సూరపురాజు పల్లి క్రాస్ రోడ్డు వద్ద 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అబ్బిరాజుగారిపల్లె గ్రామానికి చెందిన అనిల్ కుమార్ ఇన్నోవా కారులో ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా ముందస్తు సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ. 15 లక్షలు ఉంటుందని అటవీ అధికారులు తెలిపారు. ఇన్నోవాను సీజ్ చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైల్వే కోడూరులో కుష్ఠు రోగుల ఆందోళన
రైల్వే కోడూరు: ఏళ్ల తరబడి వస్తున్న పింఛన్లను సాంకేతిక కారణాలతో తీసేస్తున్నారంటూ వైఎస్ఆర్ జిల్లా రైల్వేకోడూరు లో కుష్టురోగులు మంగళవారం ఎంపీడీవో ఆఫీసు ముందు ధర్నాకు దిగారు. రైల్వే కోడూరు జ్యోతి కాలనీలో కుష్టు రోగులు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. వారు దాదాపు నలభై ఏళ్ల నుంచి పింఛన్లు తీసుకుంటున్నారు. ఐరీష్లో వేలి ముద్రలు పడటం లేదని వారి పింఛన్లు అధికారులు తొలగించారు. దీంతో ఆగ్రహం చెందిన వారు మంగళవారం ఉదయం ఎంపీడీవో ఆఫీసు ఎదటు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుష్టు రోగులైన మాకు వేలిముద్రలు పడటం లేదని పింఛన్లు తొలగించడం అన్యాయమని వారు వాపోయారు. -
భార్యను కొట్టి చంపిన భర్త
రైల్వేకోడూరు (వైఎస్సార్ జిల్లా) : ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో భర్త కొట్టడంతో భార్య మృతిచెందింది. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా రైల్వేకోడూరు పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న నజీర్(32) హోటల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో భార్య మొబీనా(28)తో తరచూ గొడవలు జరుగుతున్న క్రమంలో మంగళవారం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆవేశంలో భార్య తలపై కర్రతో బలంగా కొట్టడంతో.. ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నజీర్ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
'రెడ్డికాలువ పనులను త్వరగా పూర్తి చేయాలి'
వైఎస్సార్జిల్లా: వైఎస్సార్సీపీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు గురువారం ఓబులవారిపల్లి మండలంలో పర్యటించారు. అకాల వర్షాలకు రెడ్డికాలువకు గండి పడింది. దీంతో భారీగా నీరు వృథాగా పోతుంది. రెడ్డి కాలువను సందర్శించిన అనంతరం గండి పనులను త్వరతగతిన పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే శ్రీనివాసులు ఆదేశించారు. ఎమ్మెల్యేతో పాటు వైఎస్సార్సీపీ నియోజకవర్గ కన్వీనర్ బ్రహ్మనందరెడ్డి, ఇరిగేషన్ డీఈ మురళీ పర్యటించారు. -
రూ. లక్ష విలువైన ఎర్రచందనం స్వాధీనం
రైల్వేకోడూరు: వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వేకోడూరు మండలం బాలుపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.లక్ష విలువ చేసే 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎర్రచందనం తరలిస్తున్న వాహనాలను సీజ్ చేశారు. స్మగ్లర్లపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. -
‘ఎర్రచందనం అక్రమ రవాణాను అరికడతాం’
రైల్వేకోడూరు: ఎర్ర చందనం అక్రమ రవాణాను అడ్డుకుంటామని ఐజీ గోపాలకృష్ణ తెలిపారు. దీనిపై మరింత పకడ్బందీగా వ్యవహరిస్తామని ఆయన పేర్కొన్నారు. గురువారం ఉదయం ఆయన వైఎస్ఆర్ జిల్లా రైల్వేకోడూరు మండలంలో ఎర్రచందనం అక్రమ రవాణాపై ఫారెస్ట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతకుముందు ఆయన బాలపల్లె గ్రామం శేషాచలం అడవుల్లో ట్రెంచ్ తవ్వకం పనులను పరిశీలించారు. ఆయనతోపాటు డీఐజీ ఠాకూర్, టాస్క్ఫోర్స్ డీఐజీ కాంతారావు, అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ నవీన్ గులాటి ఉన్నారు. -
10 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
రైల్వేకోడూరు అర్బన్ : కారుతో సహా పది ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేసినట్లు సీఐ రసూల్ సాహెబ్ తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీసుస్టేషన్లో ఆయన మాట్లాడుతూ.. గురువారం సాయంత్రం మండల పరిధిలోని బాలుపల్లె సెక్షన్ దేశెట్టిపల్లె బీట్లోని కె.బుడుగుంటపల్లె గ్రామ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఏపీ 16పీ0727నెంబర్ గల కారులో పది దుంగలను గుర్తించామని, కారులో ఉన్న కడప పట్టణం రామాంజినేయపురంకు చెందిన యాదగిరి శివప్రసాద్, అదే గ్రామానికి చెందిన చిన్నవీరయ్య, ఓబులవారిపల్లె మండలం బాలురెడ్డిపల్లె గ్రామానికి చెందిన సుబ్బారెడ్డిని అరెస్టు చేశామన్నారు. వీరి వెనుక బడా స్మగ్లర్లు ఉన్నారని, త్వరలో వారిని కూడా పట్టుకుంటామన్నారు. సుబ్బారెడ్డి అడవుల్లోకి మనుషులను పంపించి దుంగలు తెప్పించి బడా స్మగ్లర్లకు సరఫరా చేసేవారన్నారు. కేసు నమోదు చేసి బడా స్మగ్లర్లను త్వరలో పట్టుకుంటామన్నారు. పట్టుబడ్డ దుంగలు 74కేజీలు, దుంగల విలువ రూ.లక్షా74వేలు, కారు రూ.2లక్షలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రమేష్బాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
రూ. 25 లక్షల ఎర్రచందనం స్వాధీనం
రైల్వే కోడూరు: అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు రైల్వేకోడూరులోని బాలుపల్లి చెక్పోస్టు వద్ద పట్టుకున్నారు. షేక్ దర్బార్ బాషా, మన్నూరు హుస్సేన్ అనే ఇద్దరు ఎర్రచందనం దొంగలను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన ఇద్దరూ అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ హసన్ భాయ్ అనుచరులుగా గుర్తించారు. వీరి నుంచి 28 ఎర్రచందనం దుంగలు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
32 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం
రైల్వే కోడూరు (వైఎస్సార్ జిల్లా) : అక్రమంగా నిల్వ ఉంచిన 32 ఎర్ర చందనం దుంగలను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరులో శనివారం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు మండలంలోని పేశెట్టిపల్లె బీట్, చందుగొండ గ్రామాల్లోని పొదల్లో దాచిన ఎర్ర చందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అటవీ, టాస్క్ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఈ దాడిలో పాల్గొన్నారు. దుంగల విలువ రూ.30 లక్షలు ఉంటుందని సమాచారం. -
కారులో రూ.10 లక్షలు స్వాధీనం
రైల్వేకోడూరు: కారులో అక్రమంగా తరలిస్తున్న రూ. 10 లక్షలను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు మండలం బాలుపల్లి చెక్పోస్ట్ వద్ద జరిగింది. వివరాలు.. కర్ణాటక రాష్ట్రం పేరుతో రిజిస్ట్రేషన్ ఉన్న కారులో అక్రమంగా రూ. 10 లక్షలను తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులను డబ్బు గురించి వివరాలు అడగ్గా.. పొంతనలేని సమాధానాలు చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా, నిందితులను ఉత్తరప్రదేశ్, చిత్తూరు, కర్ణాటకలోని పోలార్కు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. డబ్బు స్వాధీనం చేసుకొని, కారును సీజ్ చేశారు. కేసు నమోదు చేసి నిందితులను విచారిస్తున్నారు. -
స్వగ్రామానికి చేరిన కడప వాసి మృతదేహం
రైల్వే కోడూరు రూరల్ (వైఎస్సార్జిల్లా) : పొట్టకూటి కోసం కువైట్కు వెళ్లి.. అక్కడి అవమానాలను తట్టుకోలేక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న వైఎస్సార్జిల్లా వాసి మృతదేహం గురువారం స్వగ్రామానికి చేరింది. జిల్లాలోని రైల్వేకోడూరు మండలం గంగరాజుపురం గ్రామానికి చెందిన దక్షిరాజు సుబ్రహ్మణ్య రాజు అలియాస్ ముణిరాజు(38) అనే వ్యక్తి పొట్టకూటి కోసం కువైట్ వెళ్లాడు. అక్కడ షేక్ ఇంట్లో పనికి కుదిరాడు. అయితే ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇంటికి తిరిగి రావాలనుకున్నాడు. కానీ దీనికి షేక్ అనుమతించకపోవడంతో మనస్తాపం చెంది ఈ నెల 21వ తేదీన ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికంగా ఉంటున్న వాళ్ల బంధువుల సహకారంతో వారం రోజుల తర్వాత గురువారం సాయంత్రం ఆయన మృతదేహం స్వగ్రామానికి చేరింది. మృతునికి భార్య లీలావతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
పదిమంది పేకాట రాయుళ్లు అరెస్టు
రైల్వే కోడూరు(వైఎస్సార్ జిల్లా): పది మంది పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన రైల్వే కోడూరు మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. మండలంలోని మలంపాలెం గిరిజన కాలనీ సమీపంలో పేకాట ఆడుతున్నరాన్న సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి పదిమందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 30,780 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ శివప్రసాద్ తెలిపారు. -
రైల్వే కోడూరులో 20 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
వైఎస్సార్(రైల్వేకోడూరు): రైల్వేకోడూరు మండలంలోని కందమడుగు అటవీ ప్రాంతంలో 20 ఎర్రచందనం దుంగలను ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎనిమిది ఎర్రచందనం దొంగలను శనివారమే అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు దుంగలను పొదల్లో దాచిపెట్టినట్లు తెలపడంతో పోలీసులు వెళ్లి వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. -
పాస్బుక్ ఇవ్వలేదని టవరెక్కాడు
రైల్వేకోడూరు: తన భూమికి సంబంధించిన పాస్ బుక్ ఇప్పించాలని రెవెన్యూ అధికారులను ఎన్నిసార్లు సంప్రదించిన అధికారులు పట్టించుకోలేదని మనస్తాపం చెందిన వ్యక్తి సెల్టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు మండలం ఓబులపల్లి గ్రామానికి చెందిన రైతు కత్తిరత్తయ్య(48) పూర్వికులకు చెందిన భూమి నుంచి గ్రామ అవసరాల కోసం బాటను కేటాయించారు. మిగతా భూమికి సంబంధించిన పాస్ బుక్ ఇప్పించాల్సిందిగా కోరుతూ.. రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగాడు. అయినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో మనస్తాపం చెంది గురువారంగ్రామంలోని సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేస్తున్నాడు. ప్రస్తుతం అతనితో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది చర్చలు జరుపుతున్నారు. -
పట్టపగలు వ్యక్తి దారుణ హత్య
రైల్వేకోడూరు (వైఎస్సార్జిల్లా) : పాత కక్షలతో ఒక వ్యక్తిని అతి దారుణంగా బండరాళ్లతో మోది హత్య చేశారు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు మండలం లక్ష్మిగిరిపల్లె వద్ద శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని అబ్బినాయుడుపల్లెకు చెందిన కె. శంకరయ్య(38) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా ఆయనకు కొందరు వ్యక్తులతో పాతగొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శంకరయ్య కడప నుంచి తిరుపతికి వెళ్తుండగా.. రహదారిలోని లక్ష్మిగిరిపల్లె సమీపంలో కాపు కాసిన ఇద్దరు వ్యక్తులు అతనిపై దాడి చేశారు. బండరాళ్లతో తలపై బలంగా మోదడంతో శంకరయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. హంతకులు అదే గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం, సుబ్బారాయుడులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
కర్నూలు: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన కర్నూలు జిల్లా రైల్వేకోడూరు మండలం రాఘావరాజపురం గ్రామ శివారులో జరిగింది. వివరాలు.. రైల్వేకోడూరు పంచాయతి కార్యాలయంలో స్వీపర్గా పనిచేస్తున్న ప్రసాద్ (30) అనంతరాజుపేట గ్రామంలోని తన స్నేహితుని ఇంటి నుంచి బైక్పై వస్తుండగ రాఘావరాజపురం గ్రామ సబ్స్టేషన్ ఎదురుగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
5 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
రైల్వేకోడూరు: అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మంగళవారం వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు మండలం దేశెట్టిపల్లి ఫారెస్ట్బీట్లో పట్టుకున్నారు. అటవీ అధికారులు సాధారణ తనిఖీలు చేస్తుండగా ఇన్నోవా వాహనంలో ఐదు ఎర్రచందనం దుంగలను గుర్తించారు. ఇన్నోవా వాహనాన్ని స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం. -
ఆగస్టులో 150వ సినిమా
సినీనటుడు, ఎంపీ చిరంజీవి వెల్లడి రైల్వేకోడూరు: ఆగస్టులో తన 150వ సినిమా ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నట్లు సినీనటుడు, ఎంపీ చిరంజీవి చెప్పారు. వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరులో శనివారం ఆయన శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన అభిమానులు 150వ సినిమా ఎప్పుడొస్తుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఇక ఆలస్యం చేయనని, ఆగస్టు నెలలో సినిమా ప్రక్రియ మొదలుపెడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండలి విపక్షనేత రామచంద్రయ్య, మాజీ ఎంపీలు గునిపాటి రామయ్య, సాయిప్రతాప్, ఎమ్మెల్సీ బత్యాల చంగల్రాయుడు, ఎమ్మెల్యేలు సత్యప్రభ, సుగుణమ్మ, టీడీడీ బోర్డు సభ్యుడు హరిప్రసాద్, మాజీ మంత్రి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
10 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
రైల్వేకోడూరు: వైఎస్ఆర్ కడప జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని రైల్వే కోడూరు మండలం వాగేటికోన చెరువు సమీపంలో ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను మంగళవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారయ్యాడు. వారి నుంచి 10 ఎర్రచందనం దుంగలు, ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం అక్రమరవాణాపై సమాచారం అందటంతో తనిఖీలు నిర్వహించినట్టు అటవీ అధికారులు తెలిపారు. కాగా పట్టుబడ్డ ఎర్రచందనం నిందితులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఏడుగురు డిగ్రీ విద్యార్థులను బైండోవర్ చేశారు. -
ఇద్దరు ఎర్ర చందనం కూలీల అరెస్టు
రైల్వే కోడూరు : అక్రమంగా ఎర్ర చందనం తరలిస్తున్నతమిళనాడుకు చెందిన ఇద్దరు కూలీలను అటవీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో సోమవారం చోటు చేసుకుంది. తమిళనాడుకు చెందిన మత్తు స్వామి, వేలు అనే ఇద్దరు వ్యక్తులు ఎర్ర చందనం దుంగలు తరలిస్తుండగా అరెస్ట్ చేశామని భానుపల్లి రేంజ్ అటవీ అధికారులు తెలిపారు. నిందితుల నుంచి మూడు దుంగలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. -
అయ్యో.. బిడ్డా
స్కూల్ వ్యాన్ కింద పడి చిన్నారి దుర్మరణం ‘తల్లి’డిల్లిన హృదయం ‘అయ్యో..బిడ్డా. ఏమైందిరా. ఎందుకిలా జరిగిందిరా. లే కన్నా.. ఒక్కసారి మాట్లాడురా’ అంటూ విగతజీవిగా మారిన తన కుమారుడిపై పడి ఓ తల్లి రోదించిన తీరు అందరి హృదయాలను కరిగించింది. రైల్వేకోడూరు రూరల్: రెల్వేకోడూరులోని ఆదర్శ పాఠశాల వ్యాన్ కింద పడి నాని(3) అనే చిన్నారి దుర్మరణం చెందాడు. మైసూరివారిపల్లె పంచాయతీ శాంతినగర్కు చెందిన జంగిటి నరసింహులు, సుభద్ర దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. కుటుంబ పోషణ నిమిత్తం నరసింహులు కువైట్కు వెళ్లాడు. సుభద్ర ఇక్కడే ఉండి పిల్లలను చదివించుకుంటోంది. గురువారం సాయంత్రం సుభద్ర రైల్వేకోడూరులోని తమ పుట్టింటికి వచ్చింది. సుభద్ర తమ్ముడి కుమారుడైన నందు ఆదర్శ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. సాయంత్రం పాఠశాల ముగిసిన వెంటనే నందు వ్యాన్లో ఇంటికి బయలుదేరాడు. అయితే అదే బస్సు కింద పడి సుభద్ర కుమారుడు నాని మరణించాడు. ఇంట్లోనే ఉన్నాడనుకున్న నాని వ్యాన్ కింద ఎలా పడి చనిపోయాడో ఎవరికీ అర్థం కావడం లేదు. తన కుమారుడు వ్యాన్ కింద పడి నలిగిపోయినట్లు తెలుసుకున్న సుభద్ర చిన్నారి గుండెలపై పడి రోదించిన తీరు అందరి హృదయాలను బరువెక్కించింది. బంధువులు, ఇరుగుపొరుగు వారితో సంఘటనా స్థలం నిండిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ గోపీ వ్యాన్ను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి లొంగిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు. -
నేడు రైల్వేకోడూరుకు సీఎం చంద్రబాబు
-
ఎర్రచందనం స్మగ్లింగ్ లో కోత్త దారులు.
-
'రాష్ట్ర చరిత్రను మార్చే అయిదు సంతకాలు'
రైల్వే కోడూరు : ప్రజలకు వెన్నుపోటు పొడవటం చంద్రబాబు నాయుడుకు కొత్తేమీ కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన రైల్వేకోడూరులో వైఎస్ఆర్ జనభేరిలో మాట్లాడుతూ అన్ని ఫ్రీగా ఇస్తానని, రుణాలు మాఫీ చేస్తానంటూ నిస్సిగ్గుగా బాబు అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబూ... రాష్ట్రంలో ఎన్ని ఇళ్లు ఉన్నాయో మీకు తెలుసా .... అని జగన్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. అధికారం కోసం చంద్రబాబు దొంగ్ హామీలు ఇస్తున్నారని, ఆయనలా నిజాయితీ లేని రాజకీయాలు తాను చేయలేనని వైఎస్ జగన్ అన్నారు. బాబులా అబద్ధాలు చెప్పలేను అని...వైఎస్ఆర్ నుంచి వారసత్వంగా వచ్చింది విశ్వసనీయతేనని ఆయన పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్ర చరిత్రను మార్చే అయిదు సంతకాలు చేస్తానని చెప్పారు. అక్కాచెల్లెమ్మలకు భరోసా ఇస్తున్నానని, మీ పిల్లవాడ్ని బడికి పంపించండని సూచించారు. అక్కా చెల్లెమ్మల జీవితాల్లో వెలుగు తెచ్చేలా 'అమ్మ ఒడి' పథకం అమలుపై తొలి సంతకం చేస్తానని వైఎస్ జగన్ తెలిపారు. రాజకీయమంటే పేదవాడి గుండె చప్పుడు వినడం అని ఆయన అన్నారు. తాను సీఎం అయ్యాక అయిదు సంతకాలు చేస్తానని జగన్ చెప్పారు. ఆ సంతకాలు రాష్ట్ర చరిత్రను మారుస్తాయన్నారు. అక్కా చెల్లెళ్ళ కోసం మొదటి సంతకం అమ్మఒడి పథకంపై పెడతానన్నారు. ఈ పథకంతో పిల్లల భవిష్యత్తుకు బంగారుబాట వేస్తానన్నారు. ప్రతి పాఠశాలలో ఇంగ్లీషు మీడియం పెట్టిస్తానన్నారు. రెండవ సంతకం అవ్వా, తాతలకు. రూ.200 పింఛన్ను రూ.700కు పెంచుతూ చేస్తానన్నారు. మూడవ సంతకంగా రైతులకు రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తానని హామీ ఇచ్చారు. సీఎం అయ్యాక ఏడాదికి 10లక్షల ఇళ్లు నిర్మిస్తానని, అయిదేళ్లలో అందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తానని చెప్పారు. -
'రాష్ట్ర చరిత్రను మార్చే అయిదు సంతకాలు'
-
స్వల్ప సంఘటనలు మినహా తొలిపోరు ప్రశాంతం
స్థానిక పోరులో తొలి అంకం పరిసమాప్తమైంది. 5 నియోజకవర్గాల పరిధిలోని 29 మండలాల్లోని 29 జెడ్పీటీసీ, 326 ఎంపీటీసీ స్థానాలకు ఆదివారం పోలింగ్ ముగిసింది. టీడీపీ నేతలు ఆర్థిక, అంగ బలంతో వైఎస్సార్సీపీ శ్రేణులపై పలు చోట్ల తెగబడ్డారు. కొన్నిచోట్ల భౌతిక దాడికి పాల్పడి వైఎస్సార్సీపీ కార్యకర్తలను గాయపరిచారు. ఎమ్మెల్సీ బత్యాల తన సొంత పంచాయతీలో రిగ్గింగ్కు తెగించారు. సుండుపల్లి మండలం వీఎన్ పల్లిలో ఓటేసేందుకు వచ్చిన వృద్ధురాలు ఎండదెబ్బకు మృత్యువాతపడ్డారు. ఇలాంటి సంఘటనలు మినహా తక్కిన అన్నిచోట్ల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల్లో వైఎస్సార్సీపీకే ఓటర్లు పట్టం కట్టినట్లు ఓటింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. సాక్షి, కడప: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తొలిపోరులో మైదుకూరు, బద్వేలు, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లోని 29 మండలాల్లో 29 జెడ్పీటీసీ, 326 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఉదయం 7గంటల నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. జిల్లా వ్యాప్తంగా 80.40 శాతం పోలింగ్ నమోదైంది. బ్యాలెట్ పేపర్ల ద్వారా పోలింగ్ నిర్వహించారు. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్ 9 గంటల తర్వాత ఊపందుకుంది. 9 గంటల వరకు 12 శాతం పోలింగ్ నమోదైంది. 11 గంటలకు 38.2 శాతం, ఒంటిగంటకు 60 శాతం, 3 గంటలకు 70.8 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటలకు 80.40 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం వరకూ ఓటర్లరద్దీ కొనసాగింది. ఆపై తగ్గింది. సాయంత్రం 5గంటలకు పోలింగ్ ముగిసింది. ‘టీడీపీ’ తెగబడింది ఇక్కడే: రాయచోటి మండలం దిగువాబోరం గ్రామంలో ఏజెంట్ల నియామకంలో తలెత్తిన వివాదంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు కట్టెలతో దాడికి తెగబడ్డారు. దాడిలో వైఎస్సార్సీపీ కార్యకర్తల చలపతి నాయుడు చెవి తెగిపోయింది. వెంకటరమణ తలకు గాయమైంది. పుల్లంపేట మండలం దొండ్లపల్లిలో వైఎస్సార్సీపీ ఏజెంట్ సుబ్రహ్మణంపై టీడీపీ ఏజెంట్లు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సుబ్రహ్మణ్యాన్ని ఆస్పత్రికి తరలించారు.చిన్నమండెం మండలం మల్లూరులో ఓ టీడీపీ కార్యకర్త పోలీసుతో గొడవకు దిగారు. పోలీస్ టీపీని విసిరేసిన టీడీపీ కార్యకర్తను పోలీసులు అరెస్టు చేశారు. ఎంపీటీసీ స్థానాలు 332... ఓటింగ్ జరిగింది 326:తొలివిడత ఎన్నికలు జరగాల్సిన ఎంపీటీసీ స్థానాలు 332 ఉన్నాయి. అయితే ఇందులో ఆరుస్థానాలు(చాపాడు-2, కోడూరు-1, ఓబుళవారిపల్లి-1, రామాపురం-1, సుండుపల్లి-1) ఏకగ్రీవమయ్యాయి. ఇవి మినహా తక్కిన అన్ని స్థానాలకు పోలింగ్ జరిగింది. పోలింగ్ ప్రశాంతం: జిల్లా యంత్రాంగం పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించడంలో విజయం సాధించారు. రెండు, మూడు చోట్ల చెదుమదురు సంఘటనలు జరిగినా తక్కిన అన్ని చోట్ల ప్రశాంతంగా ఎన్నికలు సాగడంలో జిల్లా కలెక్టర్ శశిధర్, ఎస్పీ అశోక్కుమార్ కీలకపాత్ర పోషించారు. -
‘కాంగ్రెస్, టీడీపీలే సీమాంధ్ర ద్రోహులు’
రైల్వేకోడూరురూరల్, న్యూస్లైన్: కాంగ్రెస్, టీడీపీలే సీమాంధ్ర ద్రోహులని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. రైల్వేకోడూరులోని రంగ నాయకుల పేటలో గురువారం కోడూరు-6 ఎంపీటీసీకి వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేస్తున్న వెంకటగిరి సుభాషిణి చేస్తున్న ప్రచారంలో ఆ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ కొల్లం బ్రహ్మానందరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పంజం సుకుమార్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై తెలుగు ప్రజలను రెండుగా చీల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికలలో ఆ రెండు పార్టీలను ప్రజలు మట్టి కరిపిస్తారన్నారు. అనంతరం కొల్లం బ్రహ్మానందరెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ క్షత్రియ నాయకులు సిద్దేశ్వరరాజు, కోడూరు నియోజకవర్గ మైనార్టీ ఇన్చార్జ్ ఎస్ఏ సలాం, సేవాదళ్ మండలాధ్యక్షుడు వై.రత్నయ్య, అమర్నాథ్, సుభాన్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
రైల్వేకోడూరు అర్బన్, న్యూస్లైన్: డంప్చేసి ఉన్న 90 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు కోడూరు రేంజ్ అధికారి వి.నరసింహులు తెలిపారు. స్థానిక అటవీకార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాజంపేట డీఎఫ్ఓ నాగార్జునరెడ్డి సమాచారం మేరకు తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో ఉర్లగడ్డపోడు రైల్వేబ్రిడ్జి పక్కన డంప్ చేసి ఉన్న దుంగలను పట్టుకున్నామన్నారు.పట్టుబడ్డ దుంగల విలువ రూ.2లక్షలు చేస్తాయన్నారు. ఈ దాడుల్లో డీఆర్ఓ జీడీ మద్దిలేటి, చిట్వేలి అటవీ శాఖ అధికారి శ్రీరాములు, వారి సిబ్బంది పాల్గొన్నారన్నారు. -
రైల్వేకోడూరులో శ్రీనివాసులు ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం
-
రైల్వే కోడూరులో భారీగా ఎర్రచందనం స్వాధీనం
వైఎస్ఆర్ కడప జిల్లాలోని రైల్వే కోడూరులో పెట్రోల్ బంక్ సమీపంలో అరిటికాయల మినీ లారీలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని పోలీసులు మంగళవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుత్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. అలాగే మినీ లారీని కూడా స్టేషన్కు తరలించి సీజ్ చేసినట్లు వివరించారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ బహిరంగ మార్కెట్లో రూ.50 లక్షల వరకు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. -
జిల్లా అంతటా సంబరాలు
సాక్షి, కడప: జననేత జగన్ తమ మధ్యకు వస్తున్నాడని తెలియగానే జిల్లా వాసుల్లో ఆనందం తారాజువ్వై నింగికెగిసింది. కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, రాయచోటి, పులివెందుల, రాజంపేట, రైల్వేకోడూరు, బద్వేలు, పోరుమామిళ్ల, మైదుకూరుతో పాటు ప్రతి పల్లెలో సంబరాలు అంబరాన్నంటాయి. పార్టీ కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజలు, రైతులు, వ్యాపారులు, విద్యార్థులు ముఖ్యంగా మహిళలు పండుగ చేసుకున్నారు. రంగులు చల్లుకుంటూ, డ్యాన్స్లు చేస్తూ జగన్నామస్మరణలో మునిగిపోయారు. పులివెందులలో ప్రముఖ వైద్యుడు ఈసీ గంగిరెడ్డి, జిల్లా మునిసిపల్ ఎన్నికల పరిశీలకుడు దేవిరెడ్డి శివశంకర్రెడ్డి ఆధ్వర్యంలో నింగినంటేలా సంబరాలు జరిగాయి. జగన్ ఆఫీసు, పూల అంగళ్ల సర్కిల్ మీదుగా ఎవరికి వారు ర్యాలీలు చేస్తూ ఆర్టీసీ బస్టాండ్ వద్ద అందరూ గుమికూడారు. రంగులు చల్లుకున్నారు. గంగిరెడ్డి, శంకర్రెడ్డిని చేతులపై ఎత్తుకుని ఊరేగించారు. రైతులు పట్టణంలోకి ఎద్దుల బండ్లను తీసుకొచ్చి ‘ఆనందర్యాలీ’ చేశారు. యువకులు బైక్లకు సెలైన్సర్లు తీసి పట్టణంలోని వీధుల్లో చక్కర్లు కొట్టారు. మహిళలు డ్యాన్స్లు చేస్తూ ఆనందసాగరంలో మునిగిపోయారు. వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఎర్రగుంట్లలో జగన్ అభిమానులు వైఎస్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. భారీ ర్యాలీ నిర్వహించి బాణసంచాతో హోరెత్తించారు. డేవిడ్ అనే అభిమాని వైఎస్ పటం ముందు తలనీలాలు సమర్పించారు. వై. వీరభద్రారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్చేశారు. కడప అప్సర సర్కిల్లో జిల్లా కన్వీనర్ సురేష్బాబు బాణసంచా పేల్చి సంబరాలు చేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో వైఎస్సార్సీపీ నేతలు అప్జల్ఖాన్, హఫీజుల్లా, నిత్యానందరెడ్డి, భరత్రెడ్డి, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ పత్తి రాజేశ్వరి, బోలా పద్మావతి ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి మిఠాయిలు పంచారు. అక్కడి నుండి ర్యాలీగా కోటిరెడ్డి సర్కిల్కు చేరుకున్నారు. కోటిరెడ్డి సర్కిల్లో బాణసంచా పేల్చి ‘జై జగన్’ అంటూ నినాదాలు చేశారు. ఏడు రోడ్ల వరకూ ర్యాలీ చేశారు. మాసీమ సర్కిల్లో మాసీమబాబు సంబరాలు చేశారు. వైఎస్ విగ్రహానికి పూలమాల వేశారు. అందరూ కలెక్టరేట్వ వద్ద ఉన్న వైఎస్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. వైఎస్ విగ్రహానికి సురేష్బాబు పూలమాల వేశారు. చింతకొమ్మదిన్నె మండల కన్వీనర్ బాలమల్లారెడ్డి సీకే దిన్నె సర్కిల్లోని వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ప్రొద్దుటూరులో పార్టీ సమన్వయకర్త రాచమల్లు ప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈవీ సుధాకర్రెడ్డి, గరిశపాటి లక్ష్మిదేవితో పాటు పలువురు నేతలు సంబరాలు చేసుకున్నారు. పోరుమామిళ్లలో మాజీ ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో జగన్కు బెయిల్ రావాలని సోమవారం ఉదయం వెంకటేశ్వరస్వామి దేవాలయంలో 108 కొబ్బరికాయలు కొట్టారు. బెయిల్ వచ్చిన తర్వాత ర్యాలీ నిర్వహించారు. వైఎస్ విగ్రహానికి పూలమాల వేశారు. బద్వేలు నాలుగురోడ్ల కూడలిలో మాజీ మునిసిపల్ చైర్మన్ మునెయ్య,గురుప్రసాద్ ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి మిఠాయిలు పంచారు. యువజన విభాగం నాయకుడు ఓబుళ్రెడ్డి ఆధ్వర్యంలో కిలోమీటరు మేర బాణసంచా కాల్చారు. జమ్మలమడుగులో పార్టీ సమన్వయకర్త సూర్యనారాయణరెడ్డి, శివనాథరెడ్డి, ఎమ్మెల్సీనారాయణరెడ్డి తనయుడు భూపేశ్రెడ్డి, హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ చిత్రపటానికి 101 టెంకాయలు కొట్టారు. మైదుకూరులో పార్టీ నేతలు మదీనా దస్తగిరి, షౌకత్ అలీ నేతృత్వంలో భారీ ఎత్తున బాణసంచా పేల్చారు. -
కొనసాగుతున్న రైల్వేకోడూరు ఎమ్మెల్యే అమరణ దీక్ష
-
ఆంటోని కమిటీ వల్ల ఎలాంటి ప్రయోజం ఉండదు
ఎ.కే.ఆంటోని కమిటీ వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజం ఉండదని రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు శనివారం స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనకు సహకరించిన పార్టీలు అన్ని భూస్థాపితం కాక తప్పదని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రైల్వేకోడూరులో ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శనివారం మూడో రోజుకు చేరుకుంది. అయితే వైఎస్ఆర్ కడప జిల్లాలో సమైక్యవాదులు చేపట్టిన నిరసనల హోరు ఉధృతంగా సాగుతోంది. కడప నగరంలో ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి, మాజీ మేయర్ రవీంద్రరెడ్డిలతోపాటు అదే జిల్లాలోని రాజంపేటలో స్థానిక ఎమ్మెల్యే ఆమర్నాథ్ రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షతో ఆరో రోజుకు చేరుకుంది. అలాగే కలెక్టరేట్ ఎదుట వికలాంగుల ఆమరణదీక్షతోపాటు న్యాయవాదులు, ఉపాధ్యాయులు చేపట్టిన రిలే దీక్షలు కూడా కొనసాగుతున్నాయి. -
రైల్వేకోడూరులో ఎమ్మెల్సీ బత్యాల అనుచరుల హల్చల్