వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వేకోడూరు మండలం బాలుపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
రైల్వేకోడూరు: వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వేకోడూరు మండలం బాలుపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.లక్ష విలువ చేసే 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎర్రచందనం తరలిస్తున్న వాహనాలను సీజ్ చేశారు. స్మగ్లర్లపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు.