breaking news
Roaming agreement
-
జాబిల్లి పెరట్లో రోవర్ ఆటలు.. చంద్రయాన్ 3 న్యూ వీడియో..
బెంగళూరు: చంద్రయాన్ 3 ప్రాజెక్టులో భాగంగా రోవర్ ప్రజ్ఞాన్ తన పనిలో బిజిబిజీగా గడుపుతోంది. జాబిల్లిపై ఉండే రాళ్లు, లోయలను పసిగడుతూ తన మార్గాన్ని జాగ్రత్తగా నిర్దేశించుకుంటోంది. 14 రోజుల గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు నిర్దేశించిన అన్వేషణను కొనసాగిస్తోంది. దీనికి సంబంధించిన కొత్త వీడియోను ఇస్రో షేర్ చేసింది. రోవర్ ప్రజ్ఞాన్ సరైన దారిని వెతుక్కునే క్రమంలో అక్కడక్కడే తిరుగాడుతున్న దృశ్యాలను ల్యాండర్ ఇమేజర్ కెమెరా వీడియో తీసింది. ఈ వీడియోను ఇస్రో తన అధికారిక ఖాతాలో పంచుకుంది. అమ్మ ఆప్యాయంగా చూస్తుండగా.. పెరట్లో ఆడుకుంటున్న చంటిబిడ్డలా రోవర్ భలే ఉంది కదా..? అంటూ క్యాప్షన్ను కూడా జోడించింది. Chandrayaan-3 Mission: The rover was rotated in search of a safe route. The rotation was captured by a Lander Imager Camera. It feels as though a child is playfully frolicking in the yards of Chandamama, while the mother watches affectionately. Isn't it?🙂 pic.twitter.com/w5FwFZzDMp — ISRO (@isro) August 31, 2023 చంద్రయాన్ 3 ప్రాజెక్టులో భాగంగా విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగ్విజయంగా దిగిన విషయం అందరికీ తెలిసిందే. విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన రోవర్ ప్రజ్ఞాన్.. పరిశోధనలను కొనసాగిస్తోంది. చంద్రునిపై నీటిజాడ, వాయువులు, మట్టి, అక్కడ దొరుకుతున్న రసాయనిక పదార్థాల గురించి ఆరా తీస్తోంది. చంద్రుని దక్షిణ ధ్రువంపై సల్ఫర్ మూలకం పుష్కలంగా ఉందని ప్రజ్ఞాన్ రోవర్ ఇప్పటికే గుర్తించింది. అల్యూమినియం, కాల్షియం, ఇనుము, క్రోమియం, టైటానియం, మాంగనీసు, సిలికాన్, ఆక్సిజన్ కూడా అక్కడ ఉన్నట్లు కనుగొంది. చంద్రునిపై ఉష్ణ్రోగ్రత 70 డిగ్రీల వరకు ఉంటోందని ఇస్రో తెలిపింది. Chandrayaan-3 Mission: In-situ scientific experiments continue ..... Laser-Induced Breakdown Spectroscope (LIBS) instrument onboard the Rover unambiguously confirms the presence of Sulphur (S) in the lunar surface near the south pole, through first-ever in-situ measurements.… pic.twitter.com/vDQmByWcSL — ISRO (@isro) August 29, 2023 ఇదీ చదవండి: Chandrayaan-3: విజయవంతంగా చంద్రయాన్.. వాట్ నెక్ట్స్.? -
వొడాఫోన్, బీఎస్ఎన్ఎల్ ‘రోమింగ్’ బంధం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్, ప్రైవేటు రంగ వొడాఫోన్ మధ్య దేశవ్యాప్త 2జీ ఇంట్రా సర్కిల్ (ఒకే సర్కిల్ పరిధిలో) రోమింగ్ ఒప్పందం కుదిరింది. దీంతో కాల్స్ డ్రాప్స్ తగ్గి కస్టమర్లకు మెరుగైన సేవలు అందుతాయని ఇరు కంపెనీలు భావిస్తున్నాయి. ఈ ఒప్పందం వల్ల పట్టణ ప్రాంతాల్లో వొడాఫోన్ టవర్లు అందుబాటులోకి రావడం ద్వారా బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కవరేజీ మెరుగుపడనుంది. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో బలంగా ఉన్న బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్తో వొడాఫోన్ 2జీ కవరేజీ పెంచుకోనుంది. అదనంగా టవర్ల అందుబాటుతో కాల్ డ్రాప్స్ సమస్య తగ్గుతుందని ఇరు కంపెనీలు ఆశిస్తున్నాయి. వొడాఫోన్ ఇండియాకు 1.37 లక్షల మొబైల్ టవర్లు ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్తో ఒప్పందం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో తమకు కవరేజీ పెరుగుతుందని వొడాఫోన్ ఇం డియా ఎండీ, సీఈవో సునీల్ సూద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వొడాఫోన్తో భాగస్వామ్యం వల్ల బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కవరేజీ, ముఖ్యంగా పట్టణాల్లో మెరుగుపడుతుందని బీఎస్ఎన్ఎల్ సీఎండీ శ్రీవాస్తవ తెలిపారు.