బైక్ పై వెళ్తున్న వ్యక్తి దృష్టి మరల్చి.. భారీ దోపిడీ
హైదరాబాద్:నగరంలో మంగళవారం రాత్రి భారీ దోపిడీ జరిగింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్- 45లో బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తిని అడ్డగించిన కొందరు దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. తొలుత సదరు వ్యక్తిని దృష్టి మరల్చిన దుండగులు అతని వద్దనున్న రూ. 25 లక్షల నగదు బ్యాగ్ ను అపహరించుకుపోయారు. దోపిడీకి గురైన బాధితుడు ఓ ప్రైవేట్ సంస్థ యజమానిగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.