RTC bus - lorry colloid
-
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ
పటాన్చెరుటౌన్(హైదరాబాద్): ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని ఆదివారం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. పటాన్చెరు నుంచి ఆదివారం తెల్లవారుజామున సికింద్రాబాద్కు బయల్దేరిన బస్సు బస్టాండ్ నుంచి బయటకు వచ్చి యూటర్న్ తీసుకుంటున్న సమయంలో హైదరాబాద్లో చెరకు అన్లోడ్ చేసి కంకోల్ వైపు వెళ్తున్న లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ వెంకటరమణ, కండక్టర్ పద్మావతితో సహా ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. లారీలో చెరకు అన్లోడ్ చేసేందుకు వచ్చిన మరో ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడ్నుంచి పరారయ్యాడు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న భెల్ డిపో మేనేజర్ సత్యనారాయణ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సందర్శించి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. -
ఆర్టీసీ బస్సు - లారీ ఢీ..ఇద్దరు మృతి
చంద్రగిరి : లారీ, ఓ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో 20 మంది గాయపడ్డారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాద వద్ద శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. తిరుపతి వైపు వెళ్తోన్న లారీ డ్రైవర్ వర్మ తప్పిదం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. నిద్రమత్తులో లారీ నడిపిన కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనలో లారీ డ్రైవర్ వర్మతో సహా క్లీనర్ మృతిచెందాడు. బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.