Sachindi Ra Gorre
-
సచ్చింది..’లో కామెడీ చేస్తా
బుల్లితెర యాంకర్గా పాపులర్ అయిన అనసూయ వెండితెరపైనా రాణిస్తున్నారు. తాజాగా ఆమె ‘సచ్చింది రా గొర్రె’ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి, టిల్లు వేణు, ‘జబర్దస్త్’ రాకేష్, శివారెడ్డి, ‘చిత్రం’ శ్రీను ప్రధాన పాత్రల్లో శ్రీధర్రెడ్డి యార్వ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. దీపక్ ముకుత్, యన్.యమ్.పాషాలు అపర్ణ కిటేతో కలిసి సోహామ్ రాక్స్టార్ ఎంటర్ టైన్మెంట్– ఎంటర్టైన్మెంట్ స్టూడియో బ్యానర్లపై రూపొందుతోన్న చిత్రం ఇది. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతోంది. శ్రీధర్రెడ్డి యార్వ మాట్లాడుతూ– ‘‘ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. ప్రతి సన్నివేశం నవ్వులు పండిస్తుంది. దర్శకుడిగా ఇదే నా తొలి సినిమా అయినప్పటికీ డిఫరెంట్ జోనర్లో డార్క్ కామెడీతో తెరకెక్కిస్తున్నా. అనసూయ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘హీరో–హీరోయిన్ అని కాకుండా కేవలం కథే హీరోగా నడిచే చిత్రమిది. ఇందులోని తెలంగాణ సాంస్కృతిక గీతం ఒగ్గు కథ నన్ను ఆకట్టుకుంది. సినిమాటిక్గా ఉంటూనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇందులో నేను ఫస్ట్ టైమ్ కామెడీ రోల్ ట్రై చేస్తున్నా. ఈసారి అందర్నీ నవ్విస్తా’’ అన్నారు అనసూయ. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్కుమార్. -
సచ్చింది రా గొర్రె అంటున్న అనసూయ
సాక్షి, సినిమా: చాలా గ్యాప్తో సెలక్టివ్ సినిమాలు చేసుకుంటూ పోతున్న యాంకర్ కమ్ నటి అనసూయ మరో కొత్త చిత్రానికి ఓకే చెప్పింది. సచ్చింది రా గొర్రె పేరుతో తెలుగులో తెరకెక్కతున్న ఓ చిత్రంలో లీడ్ రోల్ కోసం అంగీకరించింది. ఈ విషయాన్ని స్వయంగా అనసూయే ప్రకటించింది. ‘ఎన్ని పాత్రలు చేసినా గొప్ప కథలో భాగస్వామిగా మారటమే నాకు ఇష్టం. తెలంగాణకు చెందిన నేను ఒగ్గు కథ స్టైల్ నేరేషన్తో తెరకెక్కుతున్న చిత్రంలో నటించటం ఆనందంగా ఉంది. పూర్తిగా కామెడీతో కూడిన పాత్రను చేయబోతున్నా’ అంటూ అనసూయ వివరించింది. శ్రీనివాసరెడ్డి, రవిబాబు, టిల్లూ వేణు, రాకేష్, శివారెడ్డి, సత్యవతి, కోట శంకర్రావు ముఖ్యతారాగణంగా రూపొందుతోంది. సోహం రాక్స్టార్, ఎంటర్టైన్మెంట్ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తుండగా.. గతంలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హెడ్గా వ్యవహ రించిన శ్రీధర్ రెడ్డి యార్వా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. క్రైమ్ కామెడీ జోనర్ లో రాబోతున్న సచ్చింది రా గొర్రె డిసెంబర్లో చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.