sai daram tej
-
మెగా హీరోస్ కొత్త ప్రాజెక్ట్స్ తో బిజీ..!
-
'BRO' Movie Success Celebrations: ‘బ్రో’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
యాంకర్ ప్రశ్నకు మాట్లాడలేక ఎమోషనల్ అయిన సాయిధరమ్ తేజ్..
-
బాక్స్ ఆఫీస్ ని పీస్ పీస్ చేస్తున్నవిరూపాక్ష కలెక్షన్స్..
-
ఇది పాన్ ఇండియా స్థాయి సినిమా..
-
ముగ్గురు మావయ్యల పేర్లు చెప్పగానే దద్దరిల్లిన ఆడిటోరియం..
-
సుకుమార్ మాస్టర్ ప్లాన్ అక్కడి వరకే..
-
100 కోట్లు కాకపోతే 1000 కోట్లు తెస్తుంది..
-
సస్పెన్స్,ట్విస్టులతో పిచ్చెక్కిపోతారు..
-
తేజ్ పైనే ఆశలు...
-
ఊహించని లాభాలలో విరుపాక్ష మూవీ ప్రాఫిట్ ఎన్ని కొట్లో తెలిస్తే బిత్రరాపోతారు..
-
సాయి ధరమ్ తేజ్ సమస్యపై నరేష్ & శ్రీకాంత్ మధ్య మాటల యుద్ధం
-
నా కెరీర్లో నిలిచిపోయే సినిమా ఇది
తూర్పుగోదావరి, ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘‘ఆరు సినిమాలు వరుసగా ప్లాప్ కాగానే నా కెరీర్ అయిపోయిందని అందరూ అనుకున్నారు. అయినా మెగా ఫ్యాన్స్ మద్దతుతో ఇప్పుడు ‘ప్రతిరోజూ పండగే’ తన కెరీర్లో నిలిచిపోయే సినిమా అయ్యింది’’ అని ఆ చిత్ర హీరో సాయిధరమ్తేజ్ అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక ఆనం కళాకేంద్రంలో సాయి ధరమ్తేజ్, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మించిన ‘ప్రతిరోజూ పండగే’ చిత్రం విజయోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ చిత్రం విజయోత్సవాన్ని ప్రేక్షకులు, మెగా ఫ్యాన్స్తో పంచుకోవడానికి వచ్చానన్నారు. ఈ సినిమా ద్వారా దర్శకుడు మారుతి తనకు మంచి విజయాన్ని అందించారన్నారు. చిత్ర దర్శకుడు మారుతి మాట్లాడుతూ తాను కృష్ణా జిల్లాలో పుట్టినా గోదావరి జిల్లాలతో తెలియని అనుబంధం ఉందన్నారు. కథ రాసేటప్పుడు రాజమండ్రిలో చిత్ర షూటింగ్ చేయాలని అనుకున్నామన్నారు. ప్రస్తుత బిజీ షెడ్యూల్లో చాలా మంది తమ తల్లిదండ్రులను మిస్సవుతున్నారన్న కాన్సెప్ట్తో చిత్రాన్ని తీశామన్నారు. థియేటర్లో నవ్వించడంతో పాటు హృదయాన్ని హత్తుకునేలా మంచి మేసేజ్ ఇచ్చారని ప్రేక్షకులు అంటున్నారన్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ దర్శకుడు మారుతి, హీరో సాయిధరమ్తేజ్లు ‘ప్రతిరోజూ పండగే’ సినిమా ద్వారా మంచి విజయాన్ని అందించారన్నారు. తాత పాత్రలో సత్యరాజ్, తండ్రి పాత్రలో రావు రమేష్ అద్భుతంగా నటించారన్నారు. చిత్ర నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ చిత్రాన్ని 60 శాతం రాజమహేంద్రవరంలో షూట్ చేశామన్నారు. సినిమా అయిపోయిన తరువాత థియేటర్ల నుంచి బయటకు వచ్చే సమయంలో కొడుకులు వారి తల్లిదండ్రుల చేతులు పట్టుకుని బయటకు రావడం కనిపించిందన్నారు. నటుడు రావు రమేష్ మాట్లాడుతూ సినిమాలో తనకు మంచి క్యారెక్టర్ ఇచ్చిన దర్శకుడు మారుతికి తన తల్లి ఉంటే గుడి కట్టేదని అన్నారు. సినిమాలోని తన డైలాగులను చెప్పి కొద్ది సేపు నవ్వించారు. కమెడీయన్ భద్రం మాట్లాడుతూ రాజమహేంద్రవరం వాసినైన తనకు మంచి గుర్తింపు పాత్రలను ఇచ్చి దర్శకుడు మారుతి ప్రోత్సహించారన్నారు. థియేటర్లకు వెళితే నవ్వించడం కష్టమైపోతున్న రోజుల్లో దర్శకుడు మారుతి మంచి పాయింట్, కాన్సెప్ట్తో నవ్వులతో పాటు ఎమోషన్స్ను పండించారన్నారు. నటులు అజయ్, సత్యం రాజేష్, సుహాస్, శ్రీకాంత్ మాట్లాడారు. అల్లు అరవింద్ నిర్మాత కావడం అదృష్టం: జక్కంపూడి రాజా చిత్రసీమలో అల్లు అరవింద్ నిర్మాతగా ఉండడం తెలుగు రాష్ట్రాల ప్రజలు అదృష్టంగా భావిస్తున్నామని రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. ప్రతిరోజూ పండగే విజయోత్సవ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ అల్లు అరవింద్ సక్సెస్ఫుల్ నిర్మాత అని కొనియాడారు. హీరో సాయిధరమ్తేజ్ అంతే తనకు ఎంతో అభిమానమని, వీవీ వినాయక్ దర్శకత్వంలో సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ రాజమండ్రిలోనే జరిగిందని, ఇప్పుడు ప్రతిరోజూ పండగే విజయోత్సవం ఇక్కడ జరుగుతుందన్నారు. తన తండ్రి దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన రావు ముగ్గురు వ్యక్తులను ఆదర్శంగా తీసుకునేవారని, వారిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్, వంగవీటి మోహన్రంగాలైతే మూడో వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి అని అన్నారు. చిరంజీవి సినిమా రిలీజైతే చాలు మంత్రిగా ఉన్న సమయంలో బెనిఫిట్ షో చూసేవారన్నారు. కడియంలో వేదికపై దివంగత పద్మశ్రీ అల్లురామలింగయ్యను సత్కరించామని, త్వరలోనే రాజమహేంద్రవరంలో అల్లు అరవింద్ను సత్కరించే అవకాశం ఇవ్వాలని జక్కంపూడి రాజా కోరారు. రాజమహేంద్రవరానికి చెందిన నటుడు భద్రంను చిత్రసీమ అంతా భద్రంగా చూసుకోవాలని కోరారు. శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరించగా, సత్య డాన్స్ ట్రూప్ సాయిధరమ్తేజ్ చిత్రాల్లోని పాటలకు స్టెప్పులు వేసి అలరించారు. -
ప్రేమ పండగ
-
అదే మా బ్యానర్ విజయ రహస్యం
‘‘శైలజా రెడ్డి అల్లుడు’ తర్వాత కొన్ని నెలలు ఓ కథ మీద వర్క్ చేశాడు మారుతి. ఆ తర్వాత మరో ఆలోచనను పంచుకున్నాడు. అది నచ్చింది. కానీ ఎక్కడో చిన్న సందేహం. అయితే మా అమ్మగారి వల్ల ఈ సినిమా చేయాలనుకున్నాను’’ అన్నారు నిర్మాత ‘బన్నీ’’ వాస్. సాయితేజ్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘ప్రతి రోజూ పండగే’. అల్లు అరవింద్ సమర్పణలో జిఏ2 పిక్చర్స్పై ‘బన్నీ’ వాస్ నిరి్మంచారు. సత్యరాజ్, రావు రమేశ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 20న ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా ‘బన్నీ’ వాస్ చెప్పిన విశేషాలు. ►దర్శకుడు మారుతి, నేను, యూవీ క్రియేషన్స్ వంశీ, యస్కేయన్ (ఈ చిత్ర సహనిర్మాత) మంచి ఫ్రెండ్స్. ఏ ఐడియా వచి్చనా నలుగురం పంచుకుంటాం. డైరెక్టర్, ప్రొడ్యూసర్లా ఎప్పుడూ ఉండం. మారుతి క్రియేటర్ కాబట్టి అతని ఆలోచనల్ని నేను గౌరవిస్తాను. ►‘ప్రతి రోజూ పండగే’ కథ బాగానే అనిపించింది కానీ అమ్మానాన్నలను అశ్రద్ధ చేసేవాళ్లు ఎవరుంటారు? కనెక్ట్ అవుతారా? అనే డౌట్ని కొందరు వ్యక్తం చేశారు. ఇది జరిగిన కొన్ని రోజులకే మా అమ్మగారు నాకు ఫోన్ చేశారు. ‘ఐదు రోజులుగా నీతో మాట్లాడటానికి ప్రయతి్నస్తున్నాను రా’ అన్నారు. నాకు వెంటనే తల్లిదండ్రులను అశ్రద్ధ చేసేవాళ్లలో నేను కూడా ఉన్నానా? అని భయం వేసింది. మేం పట్టించుకోనప్పుడు మీకెలా ఉంటుంది అమ్మా? అని అడిగాను. ‘పెద్దయిపోయారు. మీకు బాధ్యతలు ఉంటాయని సర్ది చెప్పుకుంటాం రా’ అని చెప్పింది. అందరం ఏదో ఒకసారి మన పేరెంట్స్ను అశ్రద్ధ చేస్తున్నవాళ్లమే. అలాంటి కథ కాబట్టి మారుతిని గోఎహెడ్ అన్నాను. ►ఈ చిత్రంలో తేజ్ ఫిట్బాడీతో కనిపిస్తాడు. ‘బాడీ మీద క్రమశిక్షణ తప్పింది. వర్కౌట్ చేస్తాను’ అని ఈ సినిమా కోసం బాడీని రెడీ చేశాడు. యాక్టర్గా తనను తాను చాలా మెరుగుపరుచుకుంటున్నాడు. ►చావు అనివార్యం. పెళ్లి, పుట్టినరోజుని ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటామో చావుని కూడా అలానే సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ విషయాన్ని సీరియస్గా, ఫన్నీగా చెప్పాం. ►అల్లు అరవింద్గారి సలహాలు బావుంటాయి. మనం చెప్పినదాంట్లో పాయింట్ ఉందంటే తీసుకుంటారు. మూడు జనరేషన్స్ (అరవింద్గారు , నేను, నూతన దర్శకులు) కలసి పని చేయడమే మా బేనర్ విజయ రహస్యం. ►ప్రస్తుతం ‘జెర్సీ’ హిందీ రీమేక్, అఖిల్– ‘బొమ్మరిల్లు’ భాస్కర్ చిత్రం, కార్తికేయ ‘చావు కబురు చల్లగా’, నిఖిల్– సూర్యప్రతాప్ సినిమాలు చేస్తున్నాం. ►సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగించను. కానీ ఎప్పుడైనా బాధ కలిగినా, నా అభిప్రాయాలను పంచుకోవాలన్నా ఫేస్బుక్లో స్పందిస్తా. ►మేం అడ్వాన్స్ ఇచ్చినా ఆ దర్శకుడికి వేరే ఆఫర్ ఉంటే చేసుకోమంటాం. దర్శకులను మా దగ్గరే ఉండాలని నిబంధన పెట్టం. ప్రాజెక్ట్ ఓకే అయ్యాక మాత్రం వదలం (నవ్వుతూ). -
పండగలా వచ్చారు
-
చిరంజీవి పోలికలు రావడం అదృష్టం..
పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణ) : శ్రేయ మీడియా ఆధ్వర్యంలో నగరంలోని ఓ హోటల్లో సినీ నటుడు సాయిధరమ్తేజ్ కథానాయకుడిగా నటించిన ‘తేజ్ ఐ లవ్యూ’ చిత్రం ఆడియో విజయోత్సవ సభను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కథానాయకుడు సాయిధరమ్తేజ, కధానాయకి అనుపమ పరమేశ్వరన్, నిర్మాత కె.ఎస్.రామారావు, దర్శకుడు ఎ.కరుణాకరన్ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. తేజ్ ఐ లవ్యూ ఓ కలర్ఫుల్ లవ్ స్టోరీ అని దర్శకుడు కరుణాకరన్ చెప్పారు. సాయిధరమ్ తేజ్..: కలర్ఫుల్ లవ్ స్టోరీ మేనమామ చిరంజీవి పోలికలు రావడం అదృష్టం. ఆయనలా నటిస్తున్నానని అభిమానులు చెబుతున్నపుడు ఆనందంగా ఉంటుంది. ఆయన్ని అనుకరించకుండా నటిస్తున్నాను. చిత్రం సక్సెస్ను దేని ఆధారంగా నిర్ణయిస్తున్నారు.. యూ ట్యూబ్, ట్విట్టర్లోని సందేశాలు, సినిమాలోని పాటలను రింగ్ టోన్స్గా డౌన్లోడ్ చేసుకోవడం, వివిధ సెంటర్లలోని కలñక్షన్ వంటి పలు అంశాల ఆధారంగా చిత్ర విజయాన్ని నిర్ణయించడం జరుగుతుంది. చిత్రంలో మీ పాత్ర.. పార్ట్టైం ఉద్యోగం చేస్తూ కళాశాల విద్యార్థిగా చదువుకునే పాత్ర. సకుటుంబ సమేతంగా సినిమా చూసి ఆనందించేలా దర్శకుడు చిత్రాన్ని నిర్మించాడు. దర్శకుడు, నిర్మాత నాకు మంచి చిత్రంలో నటించే అవకాశం కల్పించారు. ఇష్టమైన హీరోలు, హీరోయిన్లు.. ప్రభాస్, వెంకటేష్లు నా అభిమాన హీరోలు. సమంత నా ఫేవరేట్ హీరోయిన్. సమంతకు వివాహం అయిపోయినా అభిమానానికి వివాహానికి సంబంధం లేనందువల్ల ఆమెను నా ఫేవరేట్ కథానాయికనే చెబుతాను. తరువాత చిత్రం.. మైత్రి మూవీ బ్యానర్ మీద త్వరలోనే కొత్త చిత్రం రాబోతుంది. విశాఖతో మంచి అనుబంధం : అనుపమ పరమేశ్వరన్.. విశాఖపట్నంతో మంచి అనుబంధం ఉంది. ఇక్కడి సముద్రతీర అందాలంటే చాలా ఇష్టం. విశాఖ వచ్చినపుడల్లా చాలాబాగా ఎంజాయ్ చేస్తాను. ఆడియో విజయోత్సవ సభ సందర్భంగా విశాఖ రావడం ఆనందంగా ఉంది. తేజ్ ఐలవ్యూ చిత్రం అనుభవం తేజ్ ఐ లవ్యూ చిత్రం మంచి అనుభవాన్ని ఇచ్చింది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. కథానాయకుడు సాయిధరమ్తేజతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. సినిమా చూస్తున్నంత సేపు మంచి సినిమాను చూస్తున్నామన్న ఫీలింగ్ ఉంటుంది. కథానాయకుడు రామ్తో కలిసి నటిస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం కాకినాడ పరిసరాల్లో జరుగుతోంది. ఆగస్టులో విడుదలవుతుంది. తొలిప్రేమ సమయంలో విశాఖ వచ్చా... : దర్శకుడు.. ఎ.కరుణాకరణ్ మెగా కుటుంబం తోటలో నేనొక చెట్టును మాత్రమే. నాకు ఆ కుటుంబంతో సాన్నిహిత్యం చాలా ఉంది. తొలిసారిగా పవన్ కల్యాణ్లో తొలిప్రేమ చిత్రానికి దర్శకత్వం వహించాను. ఇప్పుడు సాయిధరమ్తేజ నటించిన చిత్రానికి దర్శకత్వం వహించాను. ఇది నాకు పదో సినిమా.తొలి ప్రేమ చిత్రం షూటింగ్ సమయంలో లొకేషన్స్ చూసేందుకు విశాఖపట్నం తొలిసారిగా వచ్చాను. స్టీల్ప్లాంట్, రుషికొండ, భీమిలి వంటి ప్రాంతాలన్నీ తిరిగాను. చివరకు సినిమా హైదరాబాద్లో షూటింగ్ జరుపుకొంది. తేజ్ ఐ లవ్యూ కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రం తేజ్ ఐ లవ్యూ సినిమా సకుటుంబంగా చూడగలిగే మంచి కమర్షియల్ ఎంటర్టైనర్. కలర్ఫుల్ లవ్ స్టోరీ. తొలిప్రేమ చిత్రంలో కథానాయికతో ఎలా హైలైట్ సీన్స్ను క్రియేట్ చేశామో అదే విధంగా ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు అనుభూతినిస్తాయి. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తప్పక ఆదరిస్తారని నమ్ముతున్నాను. ప్రేమ కథల స్పెషలిస్ట్ కరుణాకరన్ బీచ్రోడ్డు (విశాఖ తూర్పు) : కరుణాకరన్ ఈ పేరు చెబితే ప్రేమికుల్లో వైబ్రేషన్స్ మొదలవుతాయని..ప్రేమ కథా చిత్రాల స్పెషలిస్ట్ కరుణాకరన్ అని సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ అన్నారు. సిరిపురంలోని గురజాడ కళాక్షేత్రంలో ఆదివారం సాయి ధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ నటించిన తేజ్ ఐ లవ్ యూ చిత్రం ఆడియో విజయోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తేజ్ మాట్లాడుతూ వైజాగ్తో తెలియని అనుబంధం ఏర్పడిందన్నారు. నటనకు ఓనమాలు దిద్దుకున్నది ఇక్కడే. కె.ఎస్. రామారావు నిర్మాణ సారధ్యంలో నటించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గోపిచంద్ర చాలా మంచి పాటలు అందించారన్నారు. మంత్రి గంటా శ్రీనివాస రావు మాట్లాడుతూ వైజాగ్కు సినిమా పరిశ్రమకు ఒక సెంటిమెంట్గా మారిందన్నారు. జాగ్లో షూటింగ్ల అనుమతులకు త్వరలోనే సింగిల్ విండో పద్ధతిని ప్రవేశపెట్టనున్నామన్నారు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ ఉన్నది ఒక్కటే జిందగీ చిత్రంతో వైజాగ్తో లవ్ పడ్డానని అన్నారు. డైరెక్టర్ కరుణకర్ మాట్లాడ్లుతూ మా సినిమా పాటలను ఆదరించిన ప్రేక్షకులకు «కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తేజ్కు విలువైన వాచ్ను నిర్మాత కేఎస్ రామారావు బహుమతిగా అందజేశారు. సింగర్ సింహా తన పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ గోపి చంద్ర తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘ఇంటిలిజెంట్’ సాంగ్ రిలీజ్ చేసిన ప్రభాస్
-
ప్రేక్షకుల ఆదరాభిమానాలే నంది అవార్డులు:సాయి ధరమ్
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: మెగా ఫ్యామిలీకి ప్రేక్షుకుల ఆధరాభిమానాలే నంది అవార్డులని ప్రముఖ సినీ హీరో సాయిధరమ్ తేజ్ అన్నారు. ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయాన్ని సోమవారం ’జవాన్’ చిత్ర యూనిట్ సందర్శించింది. హీరో సాయి ధరమ్ తేజ్తో పాటు హీరోయిన్ మెహ్రిన్, దర్శకుడు బీఎస్వీ.రవి, నిర్మాత కృష్ణలు శ్రీవారు, అమ్మవార్లను దర్శించుకున్నారు. అర్చకుల నుంచి వేద ఆశీర్వచనాన్ని పొందారు. ఏఈ వో ఎం.దుర్గారావు హీరోకు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం స్థానిక వీఐపీ లాంజ్లో సాయి ధరమ్ తేజ్ విలేకరులతో మాట్లాడారు. నంది అవార్డులపై మాట్లాడే స్థాయి తనకు లేదంటూనే.. మెగా ఫ్యామిలీకి ప్రేక్షకుల ఆదరణ మెండుగా ఉందని, అవే తమకు అవార్డులన్నారు. జనసేన పార్టీకి ప్రచారం చేస్తారా.. అన్న ప్రశ్నకు బదులిస్తూ, రాజకీయాలతో తనకు సంబంధం లేదన్నారు. జవాన్ చిత్రం తన వ్యక్తిగత జీవితానికి దగ్గరగా ఉందని, ఒక సామాన్యుడు ఇంటికోసం, దేశం కోసం ఏ విధంగా పోరాడాడన్నది చిత్ర కథాంశమన్నారు. డిసెంబర్ 1న విడుదల కానుందని, ప్రేక్షకులు విజయవంతం చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. తన తరువాత చిత్రం వీవీ వినాయక్ దర్శకత్వంలో చేయనున్నట్టు తెలిపారు. కిల్ పైరసీ అన్నారు. పెద్ద తిరుపతి, చిన తిరుపతి వెంకన్నలంటే తమకు సెంటిమెంట్ అని, అందుకే సినిమా రిలీజ్కు ముందు ఇక్కడికి వచ్చినట్టు నిర్మాత కృష్ణ తెలిపారు. ప్రతి ఇంటిలోను జవాన్ ఉండాలన్నారు. మా కుటుంబానికి ఇష్టదైవం ఆంజనేయస్వామి జంగారెడ్డిగూడెం రూరల్: అలాగే జవాన్ చిత్ర యూనిట్ మద్ది గుర్వాయిగూడెం ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. హీరో సాయిధరమ్ తేజ్ విలేకరులతో మాట్లాడుతూ తమ కుటుంబానికి ఇష్టదైవం ఆంజనేయస్వామి అని, మద్ది ఆంజనేయస్వామిని దర్శించుకోవడం తనకు ఇది రెండోసారని చెప్పారు. అనంతరం చిత్ర యూనిట్తో కలసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పెదపాడు : స్థానిక రామచంద్ర ఇంజినీరింగ్ కళాశాలలో జవాన్ చిత్రం యూనిట్ మంగళవారం సందడి చేసింది. కళాశాల యాజమాన్యం ఘంటా శ్రీరామచంద్రరావు, ప్రిన్సిపల్ డోలా సంజయ్ చిత్ర యూనిట్కు ఘన స్వాగతం పలికారు. సినిమా ప్రమోషన్ కోసం వచ్చిన హీరో సాయిధరమ్ తేజ్, హీరోయిన్ మెహ్రీన్, చిత్ర యూనిట్ సభ్యులు కళాశాల విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. చిత్రం యూనిట్ సభ్యులతో విద్యార్థులు సెల్ఫీలు దిగారు. ద్వారకా తిరుమలలో విలేకరులతో మాట్లాడుతున్న జవాన్ చిత్ర హీరో సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ మెహ్రిన్ తదితరులు -
సాయి ధరమ్తేజ్ నూతన చిత్రం ప్రారంభోత్సవం
-
పిల్లా.. నువ్వు లేని జీవితం టీమ్తో ముచ్చట్లు!