Sasivadane Movie
-
గోదావరి నేపథ్యంలో...
‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి హీరోగా, కోమలీ ప్రసాద్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘శశివదనే’. సాయి మోహన్ ఉబ్బర దర్శకుడు. గౌరీ నాయుడు సమర్పణలో అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 19న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘మా సినిమాని ఏప్రిల్ 5న రిలీజ్ చేద్దామనుకున్నాం. కానీ డిస్ట్రిబ్యూటర్స్ అడిగిన మేరకు 19న రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కిన చిత్రం ‘శశివదనే’’ అన్నారు సాయి మోహన్ ఉబ్బర. ‘‘నా ‘పలాస 1978’ కంటే ‘శశివదనే’ పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు రక్షిత్ అట్లూరి. కోమలీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ప్రోడ్యూసర్ శ్రీపాల్, సినిమాటోగ్రాఫర్ శ్రీసాయి కుమార్ దారా మాట్లాడారు. -
సక్సెస్ కోసం అమ్మ పేరు మార్చుకోలేం కదా?: కోమలీ ప్రసాద్
ఒకప్పుడు టాలీవుడ్లో చాలా మంది తెలుగమ్మాయిలు హీరోయిన్లుగా మారి తమదైన నటనతో ఆకట్టుకునేవారు. కానీ ఆ సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది. ఇండస్ట్రీలో ఇప్పుడు కొద్దిమంది తెలుగమ్మాయిలు మాత్రమే హీరోయిన్లుగా రాణిస్తున్నారు. అలాంటి వారిలో కోమలీ ప్రసాద్ ఒకరు. ‘నేను సీతాదేవి’(2016) అనే చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’, ‘నెపోలియన్’, ‘సెబాస్టియన్ పిసి524’, ‘రౌడీ బాయ్స్’ సినిమాల్లోనూ చేసింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు.‘హిట్– 2’ చిత్రం కోమలి ఖాతాలో హిట్ పడింది. ఆర్వాత వరుస అవకాశాలలో దూసుకెళ్తోంది. తాజాగా ఆమె నటించిన చిత్రం ‘శశివదనే’. పలాస 1978' ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్ డేట్ని అనౌన్స్ చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా కోమలీ ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. టాలీవుడ్లో తెలుగమ్మాయిలకు అవకాశం ఇవ్వడం లేదనే వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. మన దర్శకనిర్మాతలు టాలెంట్ ఉన్న తెలుగమ్మాయిల కోసం వెతుకున్నారని.. అవకాశం ఉన్న ప్రతి సినిమాలోనూ ఇక్కడి అమ్మాయిలనే హీరోయిన్లుగా నటింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఇంకా కోమలి మాట్లాడుతూ.. ‘ నేను ఓ తమిళ సినిమా కోసం 20 రోజుల పాటు వర్క్ షాప్ చేశాను. ప్రతి రోజు ఉదయం 7 గంటలకే లేచి..వ్యాయామం చేసుకొని..10 గంటలకల్లా ఆఫీస్కి వెళ్లేదాన్ని. అక్కడ యాక్టింగ్ ట్రైనర్ చెప్పినట్లుగా నటించేదాన్ని. 20 రోజుల్లో తమిళం కూడా నేర్చుకున్నాను. కానీ అక్కడి వారి నుంచి ఎలాంటి ప్రశంసలు రాలేదు. చివరి రోజు మాత్రం ‘తెలుగు వాళ్ల డెడికేషన్ ఇలా ఉంటుంది’ అని యాక్టింగ్ ట్రైనర్ అన్నారు. మన వాళ్లపై తమిళ్లో అలాంటి నమ్మకం ఉంది. నేను టాలీవుడ్కి వచ్చిన తొలినాళ్లలో ..‘నువ్వు ముంబై నుంచి వచ్చావు కదా? నువ్వు తెలుగమ్మాయి అని ఎక్కడా చెప్పకండి. అవకాశాలు రావు. ముంబై అమ్మాయినే అని చెప్పండి’ అని చాలా మంది సలహా ఇచ్చారు. కానీ నేను తొలి నుంచి తెలుగమ్మాయిని అనే చెప్పుకున్నాను. నాకు వచ్చిన ప్రతి అవకాశం కూడా తెలుగమ్మాయిని అనే వచ్చింది. ఏదో సక్సెస్ అవ్వాలని అమ్మ పేరు మార్చుకోలేం కదా? నేను కూడా తెలుగమ్మాయిని..అలానే చెపుకుంటాను. ఇకపై కూడా అలానే ఉంటాను. తెలుగమ్మాయిలకు టాలీవుడ్లో చాన్స్లు ఇవ్వరనేది పచ్చి అబద్దం. అది బయట జరుగుతున్న ప్రచారం మాత్రమే.. ఇండస్ట్రీలో అలా లేదు. ప్రతి డైరెక్టర్, నిర్మాత.. తెలుగమ్మాయి అయితే బాగుంటందని ఆలోచిస్తారు. అలాంటి పుకార్లు ఇకనుంచైనా ఆగిపోతే బాగుంటుంది’ అని కోమలి అన్నారు. ఇక తన లవ్స్టోరీ గురించి చెబుతూ.. ‘అందరిలాగానే నేను కూడా ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డాను. కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయింది. ప్రస్తుతం సింగిల్గానే ఉన్నాను. డేటింగ్ అంటే నాకు నచ్చదు. పద్దతిగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. రోజుకు రెండు జోకులు..ఒక పూట బిర్యానీ తినిపించేవాడు దొరికితే చాలు పెళ్లి చేసుకుంటా (నవ్వుతూ) చెప్పింది ఈ తెలుగు బ్యూటీ. -
గ్రామీణ ప్రేమకథ
గ్రామీణ ప్రేమకథగా రూపొం దిన చిత్రం ‘శశివదనే’. రక్షిత్ అట్లూరి, కోమలి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బన దర్శకుడు. గౌరీ నాయుడు సమర్పణలో అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోదాల నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించి, పోస్టర్ను విడుదల చేశారు. ‘మనసులో పుట్టే ప్రేమ మచ్చలేనిదైతే ఆ ప్రేమకు మరణం కూడా మనతోనే’ అనే డైలాగ్ విడుదలైన పోస్టర్పై ఉంది. -
లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా ‘శశివదనే’
రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజాగా చిత్రం ‘శశివదనే’. మోహన్ ఉబ్బన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గౌరీ నాయుడు సమర్పణలో ఎస్విఎస్ కన్స్ట్రక్షన్స్ ప్రై.లి. మరియు ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మూడు రోజుల ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ.. శశివదనే' చిత్రాన్ని కోనసీమ, అమలాపురంలోని సుందరమైన లొకేషన్లలో 50 రోజుల పాటు చిత్రీకరించాం. సినిమాలో ప్రేమ సన్నివేశాలు రిఫ్రెష్గా ఉండబోతున్నాయి. గోదావరి ల్యాండ్స్కేప్ నేపథ్యంలో గ్రాండియర్ మరియు హై స్టాండర్డ్స్తో సన్నివేశాలు వస్తాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకోస్తాం’అన్నారు. ఈ చిత్రంలో సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె , ప్రవీణ్ యండమూరి, కన్నడ నటుడు దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా 'శశివదనే'
యంగ్ హీరో రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం‘శశివదనే’.గౌరీ నాయుడు సమర్పణలో ఎస్వీఎస్ కన్స్ట్రక్షన్స్ ప్రై.లి. భాగస్వామ్యంతో ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహిస్తున్నారు. .ఈ రోజు చిత్ర హీరో రక్షిత్ అట్లూరి బర్త్ డే ను పురస్కరించుకొని చిత్ర యూనిట్ హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ..గోదావరి నేపథ్యంలో తీస్తున్న లవ్ అండ్ యాక్షన్ డ్రామా ఈ ‘శశివదనే’ చిత్రంలో లవ్ సీన్స్ చాలా కొత్తగా ఉంటాయి. దర్శకుడు సాయి మోహన్ ఉబ్బన ఈ సినిమాను చాలా గ్రాండియర్గా, హై స్టాండర్డ్స్లో తెరకెక్కిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి మ్యూజిక్, విజువల్స్ హైలైట్ గా నిలుస్తాయి. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాం’ అన్నారు రఘు కుంచె, వ్రీమాన్, కోమలి ప్రసాద్, రంగస్థలం మహేశ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి శరవణ వాసుదేవన్ సంగీతం అందిస్తున్నారు.