savings rates
-
భారతీయులు ‘ఖర్చు’ పెట్టేస్తున్నారు!
సాక్షి, అమరావతి: భారతీయులు పొదుపు తగ్గించుకొని ఖర్చులు చేయడానికే మొగ్గు చూపుతున్నారు. కొంతకాలంగా దేశీయ పొదుపు రేటు తగ్గుతూ వస్తోంది. అంతర్జాతీయంగా పొదుపు రేటులో 2,3 స్థానాల్లో నిలుస్తూ వచి్చన భారత్ ఇప్పుడు నాలుగో స్థానానికి దిగజారిపోయింది. 2023–24 సంవత్సరానికి దేశ జీడీపీలో పొదుపు రేటు 30.2 శాతానికి పడిపోయింది. 2023–24కి సంబంధించి దేశ జీడీపీ రూ.173.82 లక్షల కోట్లుగా ఉంటే అందులో పొదుపు మొత్తం రూ.52.49 లక్షల కోట్లుగా ఉంది. అంతకుముందు ఏడాది 31.2%గా ఉన్న పొదుపు రేటు ఈ ఏడాది 1% పడిపోయింది. 2011–12లో దేశ పొదుపు రేటు అత్యధికంగా 34%గా నమోదైంది. అప్పటినుంచి పొదుపు రేటు క్రమేపి తగ్గుతూ ఇప్పుడు 30%కి చేరింది. రానున్న కాలంలో ఈ పొదుపు రేటు మరింత తగ్గే అవకాశం ఉందని ఆర్థిక వేత్తల అంచనా. కానీ అంతర్జాతీయ సగటు పొదుపు రేటు 28.2%తో పోలిస్తే ఇండియా పొదుపు రేటు అధికంగానే ఉందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. చైనా ఆ దేశ జీడీపీ రేటులో 46.6% పొదుపుతో ప్రపంచంలోనే తొలిస్థానంలో నిలిచింది. అమెరికాలో మాత్రం పొదుపు రేటు18.1%గా ఉంది.7 దేశాలు మాత్రమే 20% కంటే అధిక పొదుపు రేటును కలిగి ఉన్నాయి.పొదుపు ఖాతాలు పెరుగుతున్నాయి.. పొదుపు రేటు తగ్గుతున్నా పొదుపు ఖాతాలు పెరుగుతున్నాయి. 18 ఏళ్లు నిండిన వారిలో 80% మందికి ఏదో ఒక ఆర్థిక ఖాతాను కలిగి ఉన్నట్లు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. 2011లో ఈ సంఖ్య 50%గా ఉంటే అది ఇప్పుడు 80%కు పెరిగినట్లు పేర్కొంది. ప్రస్తుత మన దేశ జనాభాలో 18 ఏళ్లు నిండిన వారు 96.88 కోట్లుగా ఉన్నట్లు అంచనా. దీని ప్రకారం చూస్తే 77.5 కోట్ల మంది పొదుపునకు సంబంధించి ఏదో ఒక ఖాతాను కలిగి ఉన్నారు. మూడేళ్లుగా బ్యాంక్ డిపాజిట్లలో ఇన్వెస్ట్మెంట్స్ను తగ్గిస్తూ మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్, పీపీఎఫ్ వంటి ఇతర పథకాల్లో ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. 2021లో 47.6 శాతంగా ఉన్న బ్యాంకు డిపాజిట్ల పొదుపు 2023 నాటికి 45.2%కు పడిపోయింది. ఇదే సమయంలో మ్యూచువల్ ఫండ్స్లో పొదుపు శాతం 7.6% నుంచి 8.4%కు పెరిగినట్లు ఎస్బీఐ పేర్కొంది. -
పడుతున్న పొదుపులు.. పెరుగుతున్న అప్పులు
ముంబై: భారత్లో వ్యక్తులుసహా చిన్న స్థాయి కుటుంబ సంస్థల (హౌస్హోల్డ్ సెక్టార్) ఆర్థిక పరిస్థితులపై ఎస్బీఐ రీసెర్చ్ కీలక అంశాలను ఆవిష్కరించింది. దీని ప్రకారం కరోనా తర్వాత వీటి పొదుపురేట్లు ఒకవైపు పడిపోతుండగా మరోవైపు అప్పులు పెరిగిపోతున్నాయి. వీటి నికర ఆర్థిక (ఫైనాన్షియల్) పొదుపు రేటు 2022 ఏప్రిల్– 2023 మార్చి ఆర్థిక సంవత్సరంలో దాదాపు 55 శాతం క్షీణించి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 5.15 శాతానికి పడిపోయింది. గడచిన 50 సంవత్సరాల్లో ఇంత తక్కువ స్థాయి ఆర్థిక పొదుపురేటు నమోదు ఇదే తొలిసారి. 2020–21లో ఈ రేటు 11.5 శాతంగా ఉంది. మహమ్మారికి ముందు ఆర్థిక సంవత్సరంలో (2019–20) ఈ రేటు 7.6 శాతం. అటు ప్రభుత్వం, ఇటు నాన్ ఫైనాన్షియల్ సంస్థలకు (ఈపీఎఫ్ఓ వంటివి) పొదుపు నిధులే ప్రధాన ఆర్థిక వనరు కావడం గమనార్హం. ఇక 2022–23 ఆర్థిక సంవత్సరంలో హౌస్హోల్డ్ సెక్టార్ రుణభారం రూ. 8.2 లక్షల కోట్లు పెరిగి రూ.15.6 లక్షల కోట్లకు చేరుకుంది. ప్రాథమికంగా బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నట్లు తాజా అధికారిక విశ్లేషణ వెల్లడించింది. అయితే ఇందుకు సంబంధించి కొన్ని వర్గాల నుంచి వ్యక్తమైన ఆందోళనలను కేంద్ర ఆర్థికశాఖ తోసిపుచ్చడం గమనార్హం. ఫైనాన్షియల్ రంగంలో పొదుపు రేటు తగ్గడంపై ఆందోళన పడాల్సింది ఏమీ లేదని, వివిధ ఇతర భౌతిక పొదుపు ప్రొడక్టుల్లో ప్రజలు పెట్టుబడులు పెడుతున్నారని వివరణ ఇచ్చింది. ఎస్బీఐ రీసెర్చ్ చెబుతున్న అంశాలు క్లుప్తంగా... ► 2022–23లో పెరిగిన హౌస్హోల్డ్ సెక్టార్ రుణం రూ.8.2 లక్షల కోట్లలో బ్యాంక్ రుణాలు రూ.7.1 లక్షల కోట్లు. ఇందులో దాదాపు 55 శాతం భాగం గృహాలు, విద్య, వాహనాల కొనుగోళ్లకు వెళ్లింది. ► ఈ కాలంలో బీమా, ప్రావిడెంట్ ఫండ్లు, పెన్షన్ ఫండ్ పథకాల్లో రూ. 4.1 లక్షల కోట్ల పెరుగుదల ఉంది. ► హౌస్హోల్డ్ రంగం రుణం జీడీపీ నిష్పత్తిలో చూస్తే, 2020 మార్చిలో 40.7 శాతం. 2023 జూన్లో ఇది 36.5 శాతానికి పడింది. ► ఫైనాన్షియల్ పొదుపు నుండి తగ్గిన మొత్తంలో ప్రధాన భాగం భౌతిక (పొదుపు) ఆస్తులవైపు మళ్లింది. తక్కువ వడ్డీరేట్ల వ్యవస్థ దీనికి కారణం. ► సంవత్సరాలుగా హౌస్హోల్డ్ సెక్టార్లో 80–90 శాతం భౌతిక పొదుపులు (ఫైనాన్షియల్ రంగంలో కాకుండా) నివాసాలు, ఇతర భవనాలు, నిర్మాణాలు, యంత్ర పరికరాల విభాగంలో ఉన్నాయి. ► వాస్తవానికి, 2011–2012లో హౌస్హోల్డ్ పొదుపులో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ భౌతిక ఆస్తుల వాటా ఉంది. అయితే ఇది 2020–21లో 48 శాతానికి తగ్గింది. 2022–23లో ఈ తరహా పొదుపులు మళ్లీ దాదాపు 70 శాతానికి చేరే అవకాశం కనబడుతోంది. రియల్టీ రంగం పురోగతికి ఇది సంకేతం. నివేదిక పరిధి ఇదీ... పొదుపులు, అప్పులకు సంబంధించి ఈ నివేదికలో ఎస్బీఐ రీసెర్చ్ ‘హౌస్హోల్డ్ సెక్టార్’ అని పేర్కొంది. అంటే జాతీయ ఖాతా (నేషనల్ అకౌంట్స్)కు సంబంధించి వ్యక్తులతోపాటు, వ్యవసాయ, వ్యవసాయేతర వ్యాపారాలు, ప్రభుత్వేతర, కార్పొరేటేతర చిన్న వ్యాపార సంస్థలు, ఏకైక (ప్రొప్రైటరీ) యాజమాన్యాలు, భాగస్వామ్యాలు, లాభాపేక్షలేని సంస్థలు వంటి అన్ఇన్కార్పొరేటెడ్ సంస్థలు ఈ పరిధిలో ఉంటాయి. -
పడిపోతున్న పొదుపు రేటు
ముంబై: పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానం అమలు తదితర అంశాలతో దేశీయంగా పొదుపు రేటు గణనీయంగా తగ్గింది. ఇదే ధోరణి కొనసాగితే మొత్తం ఎకానమీ వృద్ధికి, స్థూల ఆర్థిక స్థిరత్వానికి పెను సవాలుగా మారనుంది. రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. 2012–2017 మధ్య కాలంలో పొదుపు రేటు 23.6% నుంచి 16.3 శాతానికి పడిపోయింది. 2017 ఆర్థిక సంవత్సరంలో కుటుంబాల పొదుపు రేటు 153 బేసిస్ పాయింట్లు, ప్రైవేట్ కార్పొరేషన్లది 12 బేసిస్ పాయింట్ల మేర క్షీణించింది. పొదుపులో సింహభాగం వాటా కుటుంబాలదే ఉంటున్నట్లు ఇండియా రేటింగ్స్ పేర్కొంది. లాభాపేక్ష లేని సంస్థలు, క్వాసీ–కార్పొరేట్ సంస్థల పొదుపు కూడా కుటుంబాల పొదుపులో భాగంగా పరిగణిస్తారు. -
ఇబ్బందిలేని మదుపును కోరుకుంటున్నారా..
• సేవింగ్స్ అకౌంట్స్ నుంచి ఎన్పీఎస్ వరకూ ఎన్నో మార్గాలు • అవసరార్థం డబ్బుకు ఢోకాలేదు • ఆందోళన అక్కర్లేదు భారతీయులు గొప్ప మదుపరులు. 2014లో ప్రపంచబ్యాంక్ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం– మన స్థూల దేశీయ పొదుపు రేటు 31.1 శాతం. ఇది ప్రపంచంలోనే అత్యధికం. భారత్ ప్రజలు మదుపునకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. మెజారిటీ ప్రజలు తమ డబ్బు భద్రతకు తొలి ప్రాముఖ్యత ఇస్తారు. ఎప్పుడు అవసరపడితే అప్పుడు డబ్బు చేతికి అందాలనీ కోరుకుంటారు. ఇది స్టాక్స్, కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ వంటి సాధనాల్లో సా ధ్యపడదు. మ్యూచువల్ ఫండ్స్ ఉన్నా... ఇక్కడా మార్కెట్ ఒడిదుడుకులు పొంచి ఉంటాయి. ఎలాంటి ఒడిదుడుకు లూ లేకుండా... పొదుపు చేసిన డబ్బుకు పూర్తి భరోసాను ఇస్తూ... ప్రణాళికలకు అనుగుణంగా డబ్బు చేతికి అందాలనుకునే చిన్న మదుపుదారులకు పలు ‘ఆర్థిక సాధనాల’ గురించి తెలియజేయడమే ఈ కథనం ముఖ్య ఉద్దేశం. ముందుగా చేయాల్సింది...! ‘ఇబ్బంది లేని మదుపు’ దిశలో చిన్న మదుపుదారుగా మీరు తొలుత ప్రధానంగా మూడు సూత్రాలపై దృష్టి పెట్టాలి. వీటి ఆధారంగానే మీ ‘ఆర్థిక మదుపు ఇన్స్ట్రమెంట్’ను ఎంచుకోవాల్సి ఉంటుంది. మీ వాటిని ఒక్కొక్కటిగా చూస్తే... ఆర్థిక లక్ష్యాలు... అసలు పొదుపునకు సంబంధించి మీ లక్ష్యాలు ఏమిటన్న అంశంపై తొలుత దృష్టి పెట్టాలి. రిటైర్మెంట్ ప్లానింగ్ లేదా ఇళ్లు కొనడం ఇదేమీ కాకుండా పిల్లల చదువులు. ఇంకా చెప్పాలంటే కారు కొనడం... సెలవులకు ఏదైనా పర్యటన చేయడం... ఇలా మీ స్వల్పకాల, దీర్ఘకాల లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. దీనిపైన ఒక స్పష్టతకు రావాలి. సమయ నిర్ణయం... ఆయా లక్ష్యాలకు అనుగుణంగా ఎంత సమయానికి మీ డబ్బు తిరిగి మీ చేతికి అందాలన్న అంశంపై అవగాహన ముఖ్యం. పన్ను అంశాల పరిశీలన ఇక మీ మదుపునకు సంబంధించి పన్ను అంశాలపైనా అవగాహన అవసరం. పన్ను భారాలు లేని ‘ఆర్థిక ఇన్స్ట్రమెంట్’ మీద దృష్టి ముఖ్యం. మీకు వచ్చే సంపదపై అధిక పన్ను పడే పరిస్థితుల్లో సంపద సృష్టి కష్టం. పన్నులు, ఈ అంశానికి సంబంధించి ప్రభావం దీర్ఘకాలం రిటర్న్స్పై ఎంతో ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆర్థిక సాధనాలు ఇవీ... సేవింగ్స్ అకౌంట్: ఎప్పుడు కావాలంటే అప్పుడు నగదు అందుబాటులో ఉండడం... కచ్చితంగా 4 నుంచి 6 శాతం వరకూ వడ్డీరేటు ఇక్కడ లభిస్తున్న ప్రధాన అవకాశం. వడ్డీ 10,000 లోపు అయితే పన్ను మినహాయింపూ ఉంటుంది. స్వల్ప కాలానికి అంటే 1 నుంచి 6 నెలలకు ఈ బ్యాంకింగ్ ప్రొడక్ట్ అత్యుత్తమ సాధనం. స్థిర డిపాజిట్లు: మధ్య కాలానికి మంచిది. 9 నెలలు ఆపైన మదుపునకు ఇది మంచి సాధనం. 7 రోజుల నుంచి 7 సంవత్సరాలు (కొన్ని బ్యాంకులు ఆ పైన కూడా) నిర్దిష్ట వడ్డీరేట్లతో స్థిర డిపాజిట్లు మీ డబ్బుకు భరోసాను ఇస్తాయి. అయితే దీర్ఘకాలంలో చూస్తే ద్రవ్యోల్బణానికి విరుగుడు కాకపోవడం, పన్ను అంశాలు ఇక్కడ అవరోధాలు. ఎఫ్ఎంపీలు: ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్. క్లోజ్డ్ ఎండెడ్ డెట్ మ్యూచువల్ ఫండ్ పథకాలు. డెట్, మనీ మార్కెట్ ఇన్స్ట్రమెంట్లలోకి మీ నిధులు వెళతాయి. స్థిర డిపాజిట్ల పరిమాణంలోనే రిటర్న్స్ ఉంటాయి. మూడేళ్ల కాల వ్యవధికి పెట్టుబడులు పెట్టేందుకు వీలుంటుంది. పన్ను భారాలు ఉండవు. అయితే ఏఏఏ రేటెడ్ ఎఫ్ఎంపీలను ఎంచుకోవాలి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్: పదిహేళ్లను ప్రత్యేకించి రిటైర్మెంట్ ప్రణాళికలకు సంబంధించి ఈ ప్రొడక్ట్ ఎంతో ప్రయోజనకరం. రిటర్న్స్పై అసలు పన్ను భారం ఉండదు. ఈ పథకానికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహమూ ఉంది. ప్రభుత్వ నిర్ణయానుసారం త్రైమాసికానికి రిటర్న్స్ రేటు మారే వీలుంది. ఏడాదికి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకూ పెట్టుబడి పరిమితి ఉంది. నేషనల్ పెన్షన్ స్కీమ్: ఇది కూడా ఒక చక్కటి రిటైర్మెంట్ ప్రణాళికే. భారత్ ప్రభుత్వం ప్రమోట్ చేస్తోంది. పొదుపును ప్రోత్సహిస్తూ... రిటైర్మెంట్పై యాన్యుటీ ప్రణాళికగా ఏకమొత్తం డబ్బు పొందడానికి ఈ పథకం వీలు కల్పిస్తోంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ తరహాలో నేషనల్ పెన్షన్ స్కీమ్కు పెట్టుబడులు పెట్టడానికి సంబంధించి ఎటువంటి పరిమితీ లేదు. సిప్: మ్యూచువల్ ఫండ్స్లో క్రమానుగత పెట్టుబడుల ప్రణాళిక. ఈక్విటీల్లో క్రమానుగత పెట్టుబడులు ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఇక్కడ రాబడి బాగుంటుందని ఫలితాలు చెబుతున్నాయి. పిల్లల ఉన్నత విద్య, రిటైర్మెంట్ ప్రణాళికలకు ఈ ప్రొడక్ట్ ఎంతో దోహదపడుతుంది. ఈక్విటీలపై అవగాహన లేని వారు సిప్ ద్వారా ఆ ప్రయోజనం పొందవచ్చు.