seriously
-
చెక్ బౌన్స్ కేసులను తీవ్రంగా పరిగణించాలి
న్యూఢిల్లీ: చెక్ బౌన్స్ కేసుల వల్ల కోర్టుల్లో రోజువారీగా పరిశీలించాల్సిన వ్యాజ్యాలకు ఆటంకం ఏర్పడుతోందని, ఫలితంగా చాలా వ్యాజ్యాలు అపరిష్కృతంగా మిగిలి పోతున్నాయని, అందువల్ల చెక్ బౌన్స్ కేసులను తీవ్రంగా పరిగణించాల్సి ఉందని ఢిల్లీ కోర్టు అభిప్రాయపడింది. ఢిల్లీకి చెందిన లలిత్ కుమార్ అనే వ్యక్తి ఓ ఆర్మీ జవాన్ భార్యకు లక్ష రూపాయల చెక్కు జారీ చేశాడు. అయితే, అది బౌన్స్ అయింది. దీంతో ఆమె కోర్టును ఆశ్రయిం చింది. ఈ మేరకు ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అశోక్ కుమార్ సోమవారం కేసు విచారణ చేపట్టారు. ఈ కేసులో ఆర్మీ జవాన్ భార్యకు 1.5 లక్షల జరిమానా చెల్లించాలని తీర్పు చెప్పారు. చెక్కుల జారీలో నిజాయితీ లోపించడం వల్ల వాటి విశ్వసనీయత దెబ్బతింటోందని పేర్కొన్నారు. చెక్కు జారీలో నిజాయితీ లోపించడం, కోర్టుల విలు వైన సమయాన్ని వృథా చేయడమే కాకుండా ఫిర్యాదు దారు రాలి డబ్బును తన వద్ద ఉంచుకొని ఆమెను వేధింపులకు గురి చేశారని మేజిస్ట్రేట్ పేర్కొన్నారు. -
బెంగాల్ లో రోడ్డు ప్రమాదం.. 17 మంది విద్యార్థులకు తీవ్రగాయాలు
కోల్ కతాః పశ్చిమబెంగాల్ అలిపుర్దౌర్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్థులతో ప్రయాణిస్తున్నఓ స్కూల్ బస్సును వేగంగా వచ్చిన వ్యాన్ ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో 17 మంది పాఠశాల విద్యార్థులు తీవ్రంగా గాయపడగా.. వారిలో 10 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. పశ్చిమబెంగాల్ లో చోటు చేసుకొన్న స్కూల్ బస్ ప్రమాదంలో 17 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. అలిపుర్దౌర్ జిల్లా మదరిహత్ ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో స్థానిక ప్రైవేట్ ప్రాధమికోన్నత పాఠశాలకు చెందిన స్కూల్ బస్ ను.. వేగంగా వచ్చిన వ్యాన్ ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం పాఠశాలకు వెళ్ళేందుకు బస్ లో బయల్దేరిన విద్యార్థుల్లో 17 మంది తీవ్రంగా గాయపడగా, వారిలో 10 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు స్థానిక పోలీసు అధికారులు వెల్లడించారు. గాయాలైనవారిని అలిపుర్దౌర్ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే వ్యాన్ డ్రైవర్ అక్కడినుంచీ తప్పించుకొని పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. -
పేలిన సిలిండర్.. తప్పిన ప్రమాదం
-
చైన్ స్నాచర్ల దాడిలో మహిళకు తీవ్ర గాయాలు