Shahdara
-
ఆ గురుద్వారా అలాగే ఉండనివ్వండి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని షాదారా ప్రాంతంలో ఉన్న గురుద్వారా స్థలం తమదేనని, దాన్ని తమకు అప్పగించాలని కోరుతూ ఢిల్లీ వక్ఫ్ బోర్డు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అక్కడ చాలా ఏళ్లుగా గురుద్వారా ఉంది కాబట్టి దాన్ని అలాగే ఉండనివ్వండి అని తేల్చిచెప్పింది. ఒకవేళ ఆ స్థలం మీదేనని మీరు భావిస్తే ఆ అభిప్రాయం మానుకోండి అని సూచించింది. షాదారా గురుద్వారా స్థలం ‘మసీదు తకియా బబ్బర్ షా’కు చెందుతుందని పేర్కొంటూ ఢిల్లీ వక్ఫ్ బోర్డు తొలుత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను తిరస్కరిస్తూ ఢిల్లీ హైకోర్టు 2010 సెపె్టంబర్లో ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ ఢిల్లీ వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సతీశ్చంద్ర శర్మతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఆ స్థలంలో గురుద్వారా చాలా ఏళ్లుగా ఉందని మీరే చెబుతున్నారు కాబట్టి దాన్ని అలాగే కొనసాగనివ్వాలని పిటిషనర్కు స్పష్టంచేసింది. పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు తెలియజేసింది. ఆ స్థలంలో 1947 నుంచి గురుద్వారా ఉన్నట్లు ఢిల్లీ హైకోర్టులో విచారణ సందర్భంగా ఓ సాక్షి చెప్పిన విషయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. -
దొంగలకు ఊహించని అనుభవం.. పైసలు దొరక్క.. తిరిగి రూ. 100 చేతిలో పెట్టి
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో దొంగతనాలు, దోపిడీలు పెరిగిపోతున్నాయి. పట్టపగలే నడిరోడ్డుపై కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. రద్దీ ప్రాంతాల్లోనూ దర్జాగా నేరాలకు పాల్పడుతున్నారు. ప్రజలను మభ్యపెట్టి, ఏమార్చి అందినకాడికి దోచుకుంటున్నారు.ప్రగతి మైదాన్ టన్నెల్లో కారును అడ్డగించి రూ.2 లక్షలను ఎత్తుకుపోయిన ఉదంతం మరవకముందే మరో విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. తాజాగా ఓ భారీ దొంగతనానికి స్కెచ్ వేసిన దొంగలకు షాకింగ్ అనుభవం ఎదురైంది. తూర్పు ఢిల్లీలోని షాహదారాలోని ఫార్ష్ బజార్లో ఓ జంటను అడ్డగించిన దోపిడి దొంగలు వారి నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. అయితే ఊహించని విధంగా వారి వద్ద కేవలం రూ. 20 నోటు తప్ప మరేం లభించకపోవడంతో.. బదులుగా వారికే రూ. 100 రూపాయలు చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వింత ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.హెల్మెట్ ధరించి బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వస్తున్న ఓ జంటను అడ్డగించారు. వెంటనే డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. ఇంతలో చోరికి వచ్చిన వారిలో ఓ వ్యక్తి ఎదుటి వారిని తనిఖీ చేయడం ప్రారంభించాడు. అయితే అతని వద్ద ఏం లభించలేదు. దీంతో తిరిగి దొంగలే సానుభూతితో దంపతుల చేతులో డబ్బులు పెట్టిన్నట్లు వీడియోలో కనిపిస్తుంది. అనంతరం దొంగలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. చదవండి: పెళ్లి మండపంలో ఇదేంది.. వధువు చేసిన పనికి నవ్వుకుంటున్న నెటిజన్లు! దీంతో ఆ జంట సరాసరీ పోలీస్ స్టేషన్కు వెళ్లి జరిగినదంతా చెప్పారు. తమ వద్ద ఏం దొరక్కపోవడంతో దొంగతానికి వచ్చిన వారే రూ. 100 నోటు చేతిలో పెట్టినట్లు తెలిపారు. దీంతో పోలీసులు దాదాపు 200 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 30 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరినీ దేవ్ వర్మ, హర్ష్ రాజ్పుత్గా గుర్తించారు. వర్మ ఒక ప్రైవేట్ జీఎస్టీ సంస్థలో అకౌంటెంట్, రాజ్పుత్ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. యూట్యూబ్లో గ్యాంగ్స్టర్ నీరజ్ బవానా వీడియోల ద్వారా ఇద్దరు ప్రభావితమయ్యారని, అతని గ్యాంగ్లో చేరాలనుకుంటున్నామని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. #WATCH | In a bizarre turn of events, two drunk men who were trying to rob a Delhi couple at gunpoint, handed Rs 100 to them instead. They did so when they realised that the couple only had Rs 20 with them. pic.twitter.com/9BpIp0JEFs — Daily Excelsior (@DailyExcelsior1) June 26, 2023 -
పాత ఢిల్లీలో నీటి కటకట
సాక్షి, న్యూఢిల్లీ:ఎన్నికల్లో మెజార్టీ సాధించి పార్టీలు నువ్వంటే..నువ్వంటూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఓవైపు తాత్సారం చేస్తున్నాయి. మరోవైపు ఢిల్లీలో పాలన స్తంభించిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాత ఢిల్లీలో తాగునీటి కటకటతో అల్లాడుతున్నారు. పదిరోజులుగా కొన్ని ప్రాంతాల్లో నీరు రావడం లేదు. సమస్య ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి నెలకొంది. అధికారులను అడిగితే జల్బోర్డుకి చెందిన మంచినీటి ట్యాంకులను శుభ్రం చేస్తున్నందునే మంచినీరు అందడం లేదని సమాధానం చెబుతున్నారు. పాత ఢిల్లీలోని పట్పర్గంజ్, లక్ష్మినగర్ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లలిత్పార్క్, శీశ్గార్డెన్ ప్రాంతాలవారు చెబుతున్న ప్రకారం రెండు రోజుల నుంచి నీళ్లు రావడం లేదు. మరో రెండు రోజుల వరకు మంచినీటి ట్యాంకులను శుభ్రంచేసే పనులు కొనసాగనున్నందున నీటి ఇబ్బందులు తప్పవని అధికారులు పేర్కొంటున్నారు. అప్పటివరకు పట్పర్గంజ్, పాత పశ్చిమ వినోద్నగర్,గాజీపూర్ గ్రామంలోని వివిధ ప్రాంతాలపై ఈ ప్రభావం ఉంటుందన్నారు. షహదరాలో పది రోజులుగా సమస్య: షహదరాలోని బోలానాథ్నగర్లో కొన్ని రోజులుగా మంచినీటి కటకట నెలకొంది. ఈ ప్రాంతంలో ఇంటర్నెట్ కేబుల్ వేసేందుకు గోతులు తీస్తుండడంతో తాగునీటి పైప్లైన్లు పగిలిపోయాయి. వీటిని మరమ్మతు చేయడంలో జల్బోర్డు అధికారుల జాప్యంతో తాగునీటి సరఫరా పది రోజులుగా పూర్తిగా నిలిచిపోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరమ్మతుల కారణంగానే ఇబ్బందులు: ఎస్కే చౌహాన్, జల్బోర్డు అధికారి పాత ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఫ్లో మీటర్లు బిగిస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో మంచినీటి ట్యాంకులను శుభ్రం చేస్తున్నారు. దీనిపై స్థానికులకు ముందే సమాచారం అందించాం. చలికాలం కావడంతో ఇప్పుడు ఈ పనులు ప్రారంభించాం. అత్యవసరం ఉన్న ప్రాంతాలకు ఫోన్లో సమచారం ఇస్తే ట్యాంక ర్లను పంపుతున్నాం.