Shocking Comments
-
పరిటాల సునీత వ్యాఖ్యలను ఖండించిన మద్దెలచెర్వు సూరీ సతీమణి
-
Pawan Kalyan: నాకు సత్తా లేదు..
-
డేవిడ్ వార్నర్ ని బూతులు తిట్టినా రాజేంద్ర ప్రసాద్..
-
నాగార్జునకు ఏం మాట్లాడాలో తెలీదు
-
బీసీ రిజర్వేషన్ వార్
-
బాబుకే షాకిచ్చిన స్టూడెంటు
-
లావణ్య నిజస్వరూపం మరోసారి బయటపెట్టిన శేఖర్ బాషా..
-
హామీలు ఎగ్గొడతానని చంద్రబాబు క్లారిటీగా ఉన్నాడు..
-
బాబుకు మార్గాని భరత్ కౌంటర్
-
నా చావు కళ్ళ ముందే కనిపించింది.. ఆ దేవుడే కాపాడాడు
-
CMR కాలేజీలో హైటెన్షన్..
-
అల్లు అర్జున్ అరెస్ట్ ను సమర్ధించిన పవన్ కల్యాణ్
-
అల్లు అర్జున్ పై అమితాబ్ ఆసక్తికర కామెంట్స్..
-
మద్యం షాపులపై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్
-
తెలంగాణ తల్లి కొత్త విగ్రహంపై ఎమ్మెల్సీ కవిత రియాక్షన్
-
తెలుగు జాతిపై తమిళ నటి కస్తూరి కాంట్రవర్సీ కామెంట్స్
-
ఇంగితజ్ఞానం లేదా పవన్ కళ్యాణ్... టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
-
చంద్రబాబును నమ్మి మోసపోయామని వరద బాధితులు గగ్గోలు పెడుతున్నారు
-
పవన్ కి CPI రామకృష్ణ స్ట్రాంగ్ కౌంటర్
-
చంద్రబాబును గద్దె దింపడమే మా ధ్యేయం
-
భక్తులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. పవన్ కు తిలక్ అదిరిపోయే కౌంటర్..
-
ఒకే రోజు పవన్ కళ్యాణ్, లోకేష్ హైదరాబాద్ ఎందుకు వెళ్లారు
-
అల్లు అర్జున్ పై జనసేన నేత చలమల శెట్టి రమేష్ ఆగ్రహం
-
అల్లు అర్జున్ పై నోరు పారేసుకున్న జనసేన MLA బొలిశెట్టి
-
అతను పెద్ద నటుడు.. గురువును మించిన శిష్యుడు
-
నారా లోకేష్, శ్రీ భారత్ పై కేఏ పాల్ వ్యాఖ్యలు
-
చంద్రబాబు అన్న క్యాంటీన్ పై మల్లాది విష్ణు షాకింగ్ కామెంట్స్
-
తల్లికి వందనం.. షాకిచ్చిన లోకేష్
-
మీ చరిత్ర బయట పెడతా..
-
1995 నుంచి ఇదే చంద్రబాబు బ్లూ ప్రింట్
-
తల్లికి వందనం గోవిందా
-
వంగలపూడి అనితకి కేఏ పాల్ కౌంటర్
-
మీకు చేతులెత్తి మొక్కుతాం..టీడీపీ అరాచకాలపై సామాన్యులు
-
ఓటమిపై సీదిరి అప్పలరాజు షాకింగ్ కామెంట్స్
-
చందు వైఫ్ షాకింగ్ కామెంట్స్
-
చంద్రబాబు పై అమర్ షాకింగ్ కామెంట్స్
-
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొలికపూడి శ్రీనివాస్
-
కుర్చీని కాదు వాడిని మడత పెట్టాలి..కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్
-
జనసేనకు ఐదోతనం లేదని తేల్చేశారు..
-
టాలీవుడ్ అగ్ర హీరోపై నటి విచిత్ర సంచలన ఆరోపణలు
-
చంద్రబాబు బెయిల్ పై పొన్నవోలు కామెంట్స్
-
కేసీఆర్ పంచ్ లు
-
ప్రతిపక్షాలకు మంత్రి రోజా స్ట్రాంగ్ వార్నింగ్
-
ఈ కేసు సీబీఐకి అప్పగిస్తే బెయిల్ తర్వాత... చంద్రబాబుకి అసలైన సినిమా..
-
కాంగ్రెస్, బీజేపీ బీసీ నినాదం ఎత్తుకోవడం హాస్యాస్పదం
-
బీఆర్ఎస్ 23 సీట్లు మాత్రమే బీసీలకు ఇచ్చింది: సంజయ్
-
నన్ను చంపడానికి 50 లక్షలు ఆఫర్ ఇచ్చారు
-
పవన్ కళ్యాణ్ గురించి ఎవరికీ తెలియని విషయాలు బయటకు వచ్చాయి
-
బాబుపై మంత్రి రజిని ఫైర్
-
జనసేన బీజేపీ పొత్తుపై.. బీజేపీ నేత షాకింగ్ కామెంట్స్
-
బీఆర్ఎస్, బీజేపీ నేతలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్
-
నాగబాబు, నాదెండ్ల మనోహర్ పరిస్థితి ఎలా ఉందంటే..
-
పవన్ ఇంత సన్యాసి అని నేను అనుకోలేదు..
-
సాగర్ అభ్యర్థిని మార్చాలి.. లేదంటే!.. బీఆర్ఎస్ నేతల డిమాండ్
సాక్షి, నల్గొండ: ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటనతో అధికార బీఆర్ఎస్ అమ్మతి జ్వాలలు తీవ్ర స్థాయికి చేరాయి. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో సిట్టింగ్లకు టికెట్టు ఇవ్వడంతో స్థానిక నేతలు అంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాగర్ ఎమ్మెల్యే అభ్యర్థి నియమాకాన్ని వెనక్కి తీసుకోవాలిని వాదిస్తున్నారు. ఎమ్మెల్యే నోముల భగత్పై అసంతృప్తి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. నాగార్జున సాగర్ సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చాలని స్థానిక బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల్లో, నాయకుల్లో ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతోంది. ఈ మేరకు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే టికెట్ ఆశావాహి మన్నెం రంజిత్ యాదవ్ మాట్లాడుతూ.. అందరం కలిసి కట్టుగా పనిచేసి నోముల భగత్ను ఉప ఎన్నికల్లో గెలిపించుకున్నామని తెలిపారు. అయితే ఇప్పటి వరకు పార్టీ సమావేశానికి స్థానిక నేతలను ఆహ్వానించడం లేదని మండిపడ్డారు. తండ్రి పేరుతో ఎమ్మెల్యేగా గెలిచారని, ఆయనకు కార్యకర్తలతో ఎలా మాట్లాడాలనేది కూడా తెలియదని విమర్శించారు. నియోజకవర్గంలోని గ్రామ గ్రామల్లో కొట్లాటలు జరుగుతున్నాయని, సమస్యలను పరిష్కరించడంలో నోముల భగత్ విఫలమయ్యారని అన్నారు. ఆయన వర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని దుయ్యబట్టారు. భగత్ను కాకుండా స్థానిక వ్యక్తికి అవకాశం ఇవ్వాలని తెలిపారు. భగత్ను మార్చకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థిని నిలబెడతామని ముక్తకంఠంతో తెలిపారు. -
కళ తప్పిన తెలంగాణ గవర్నర్ ఎట్ హోం కార్యక్రమం
-
మార్గదర్శి అక్రమాలపై చర్యలు ఉండకూడదా ?
-
ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కుటుంబం కన్నుపడింది
-
రాయలసీమలో చంద్రబాబు అరాచక రాజకీయం
-
ఎలక్షన్స్ చూస్తుంటే నవ్వాలో ఏడ్వాలో తెలియడం లేదు: తమ్మారెడ్డి
-
శుభమన్ గిల్, రవీంద్ర జడేజా వద్దు ఇంగ్లాండ్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..!
-
అంబటి రాయుడికి ట్విస్ట్ ఇచ్చిన బీసీసీఐ అనిల్ కుంబ్లే షాకింగ్ రియాక్షన్..!
-
పూర్ణతో నాకు లవ్ ఎఫైర్ ఉంది.. రవిబాబు షాకింగ్ కామెంట్స్
-
బెల్లంకొండను కాల్చినోడు సైకో కాదా ?
-
పట్టపగలే అడ్డంగా దొరికిన దొంగ బండి సంజయ్..!
-
హీరోగా కొడుకు ఎంట్రీపై రవితేజ షాకింగ్ కామెంట్స్
-
అలీ రేజాతో రొమాంటిక్ సీన్పై ప్రశ్న.. నటి సనా షాకింగ్ రియాక్షన్
సినీ నటి సనా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లే. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దాదాపు ఆరు వందల సినిమాలు చేసిన ఆమె పూర్తి పేరు సనా బేగమ్. పాత్రలు, హీరోయిన్ ఫ్రెండ్గా, తల్లిగా డిసెంట్ రోల్స్ చేసి ఆడియన్స్ మెప్పించింది. ఇటీవలే రిలీజైన రంగమార్తాండ చిత్రంలోనూ విభిన్న పాత్ర పోషించింది. ఇక ఈ పాత్రల గురించి పక్కన పెడితే ఇంతకాలం సంప్రదాయ పాత్రలు చేసిన ఆమె రీసెంట్గా నటించిన మెట్రోల కథలు వెబ్ సిరీస్లో బోల్డ్ రోల్లో కనిపించి షాకిచ్చింది. ఈ సిరీస్లో అప్పటికే పెళ్లై భర్త ఉన్న ఆమె మరో వ్యక్తితో బెడ్ షేర్ చేసుకుంటుంది. చదవండి: తొలిసారి బేబీ బంప్తో ఉపాసన.. ఫొటోలు వైరల్ అయితే తాజాగా తన బోల్డ్ రోల్పై సనా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమెకు దీనిపై ప్రశ్న ఎదురైంది. ఆమె మాట్లాడుతూ.. ‘‘డైరెక్టర్ కరుణ కుమార్, రైటర్ ఖాదీర్ బాబు చెప్పడంతో నేను ఆ రోల్ చేశాను. తాగుబోతు భర్త వల్ల ఓ మిడిల్ క్లాస్ మహిళ పడే ఇబ్బందులు, కష్టాలను ఈ ‘మెట్రో కథలు’ సిరీస్లో చూపించారు. నా పాత్రతో చాలా మంది స్ఫూర్తి పొందుతారు. ముఖ్యంగా ఆ వయసు మహిళలకు నా పాత్ర బాగా చేరుతుంది. ఎందుకంటే భార్యని పట్టించుకోని తాగుబోతూ భర్త వల్ల కోరికలను చంపుకుని బతుకుతారు కొందరు మహిళలు. కానీ ఆలాంటి మహిళల గురించి బయట సమాజం ఎలా మాట్లాడుకుంటుంది, భర్త చేసిన తప్పుకు ఆమెను ఎలా ట్రీట్ చేస్తుందో చూపించారు. ప్రస్తుతం బయటకు జరుగుతున్నదే సిరీస్లో చూపించారు. ఆ పాత్రని చాలా నీట్ గా ప్రెజెంట్ చేశారు. మంచి మెసేజ్ ఉన్న సిరీస్, అలాగే మంచి ప్రొడక్షన్ హౌస్ కూడా. అందుకే నేను కూడా ఈ పాత్రకు ఒప్పుకున్నా. నా రోల్ చూసి ఆ వయసులో ఉన్న చాలామంది మహిళలు కనెక్ట్ అవుతారు. తను కావాలని తప్పు చేయదు. చదవండి: చరణ్ బర్త్డే పార్టీలో కనిపించని తారక్.. ఎందుకు రాలేదు? అనుకోకుండా ఓ వీక్ మూమెంట్లో ఆ తప్పు జరిగిపోతుంది. ఆ తప్పు తనకు నచ్చింది కాబట్టి ఒప్పుకుంది. నన్ను చూసి ఇన్స్పైర్ అవుతారని ఆ రోల్ చేశాను. భవిష్యత్తులో ఇలాంటి స్టఫ్ ఉన్న రోల్స్ వస్తే తప్పకుండా చేస్తాను’’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. కాగా ఇందులోని ఓ ఎపిసోడ్లో భర్తవల్ల చాలా ఇబ్బందిపడే గృహిణి పాత్రలో సనా నటించింది. తన తాగుబోతూ భర్తకు యాక్సెండ్ చేసిన వ్యక్తితో ఓ వీక్ మూమెంట్లో దగ్గరవుతుంది. ఆ వ్యక్తి పాత్రలో బిగ్బాస్ ఫేం అలీ రేజా నటించాడు. ఆలీ రేజాతో ఇంటిమేట్ సీన్ చేసిన సనా వార్తల్లో నిలిచింది. -
నరేష్తో పెళ్లి.. పవిత్ర లోకేష్పై మాజీ భర్త సుచేంద్ర సంచలన ఆరోపణలు!
సినీ నటుడు నరేష్-పవిత్రా లోకేష్లు పెళ్లిబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. కొంతకాలంగా సీక్రెట్ రిలేషన్లో ఉన్న వీరిద్దరు మార్చి 10న వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టినట్లు నరేష్ ప్రకటించాడు. మీ ఆశీర్వదాలు కావాలంటూ పెళ్లి వీడియో షేర్ చేశాడు. ఇక అప్పటి నుంచి వీరి పెళ్లి వ్వవహరం వార్తల్లో నిలుస్తూనే ఉంది. నిజంగా పెళ్లి చేసుకున్నారా? లేక మూవీ ప్రమోషన్లో భాగంగా ఈ వీడియో షేర్ చేశారా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. కాగా నరేశ్కు ఇది నాలుగవ పెళ్లి కాగా.. పవిత్రకు మూడో పెళ్లి అనే విషయం తెలిసిందే. చదవండి: హీరోగా కొడుకు లుక్ షేర్ చేస్తూ మురిసిపోయిన యాంకర్ సుమ అయితే వీరి పెళ్లి వీడియో బయటకు వచ్చిన అనంతరం పవిత్ర మొదటి భర్త, కన్నడ నటుడు సుచేంద్ర ప్రసాద్ ఆమెపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. రీసెంట్గా ఆయన కన్నడ మీడియాతో ముచ్చటించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పవిత్ర-నరేష్ పెళ్లిపై సుచేంద్రకు ప్రశ్న ఎదురవగా మాజీ భార్యపై ఆయన తీవ్ర ఆరోపణలు చేసినట్లు కన్నడ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ తాజా బజ్ ప్రకారం సుచేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ప్లాన్ ప్రకారమే పవిత్ర నరేష్కు దగ్గరైందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడట. అంతేకాదు ‘పవిత్ర లగ్జరీ లైఫ్ కోసం ఆమె ఏమైనా చేస్తుంది. ఆస్తి కోసమే నరేష్తో లవ్ ట్రాక్ నడిపింది. డబ్బు కోసం ఆమె ఎంతకైన దిగజారుతుంది. చదవండి: నా పిచ్చిని భరించే ఏకైక వ్యక్తివి నువ్వు: లాస్య ఎమోషనల్ పోస్ట్ కేవలం డబ్బు పిచ్చితోనే గతంలో ఇద్దరికి విడాకులు ఇచ్చింది. పవిత్ర పచ్చి అవకాశవాది. ఆ విషయం నరేష్ ఇంకా అర్థం కావట్లేదు. నరేష్కు దగ్గరై విజయ నిర్మల గారు సంపాదించిన రూ. 1500 కోట్ల ఆస్తిని కొట్టేయాలనేదే ఆమె ప్లాన్. ఈ విషయం నరేష్కు కూడా త్వరలోనే అర్థం అవుతుంది’ అంటూ పవిత్రపై సుచేంద్ర ప్రసాద్ తీవ్ర ఆరోపణలు చేశాడు. దీంతో ఆయన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్టాపిక్గా నిలిచాయి. ఆయన వ్యాఖ్యలతో మరోసారి నరేష్-పవిత్ర ప్రేమ, పెళ్లి వార్తల్లోకెక్కింది. కాగా గతంలో కూడా సుచేంద్ర ప్రసాద్ పవిత్రపై ఇలాంటి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పవిత్ర లోకేష్ మంచిది కాదని, ఆమెకు కాపురాలు కూల్చే బుద్ధి ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. -
అదితిపై మాజీ భర్త సంచలన వ్యాఖ్యలు! రెండో పెళ్లిపై ఏమన్నాడంటే..
హీరోయిన్ అదితి రావ్ హైదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో నటించి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుందామె. ప్రస్తుతం ఆమె అవకాశాలు లేకపోవడంతో వెండితెరపై ఆమె సందడి కరువైంది. అయినప్పటికీ ఆమె హీరో సిద్ధార్థ్తో డేటింగ్ రూమర్స్తో తరచూ వార్తల్లో నిలుస్తోంది. అంతేకాదు ఇటీవల యంగ్ హీరో శర్వానంద్ నిశ్చితార్థంతో సిద్ధార్థ్-అదితిలు జంటగా కనిపించారు. దీంతో వీరిద్దరు రిలేషన్లో ఉన్నారని అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే అప్పటికే అదితికి పెళ్లై విడాకులు అయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు సత్యదీప్ మిశ్రాను గతంలో ఆమె వివాహం చేసుకుంది. అయితే ఆ బంధం మున్నాళ్ల ముచ్చటే అయ్యింది. 2009లో వీరి వివాహం జరగ్గా.. 2013లో వీరిద్దరూ విడిపోయారు. అయితే ఇటీవల ఆమె మాజీ భర్త సత్యదీప్ మిశ్రా బాలీవుడ్ నటి, ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తాను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చాడు సత్యదీప్ మిశ్రా. ఈ సందర్భంగా తన మాజీ భార్య అదితిని ఉద్దేశిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. చదవండి: నటుడిగా బ్రహ్మానందం ఎన్ని వందల కోట్లు సంపాదించాడో తెలుసా? ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘అదితితో నా రిలేషన్ కారణంగా ప్రేమపై నాకు విరక్తి కలిగింది. మరోసారి ప్రేమ, పెళ్లి అంటేనే భయం వేసింది. బ్రేకప్ అనుభవం ఎదురైన వాళ్లు మళ్లీ రిలేషన్, ప్రేమ అంటే భయపడతారు. కానీ ధైర్యంగా ముందడుగు వేస్తేనే మనం కోల్పోయినవి పొందగలం’ అని మిశ్రా చెప్పుకొచ్చాడు. ఇక అనంతరం మసాబాతో ప్రేమ, రెండో పెళ్లిపై స్పందిస్తూ.. ‘మా పెళ్లి చాలా సింపుల్గా జరగాలని అనుకున్నాం. అందుకే కొద్ది మంది సన్నిహితులు, బంధువుల మధ్య రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. తర్వాత ఇండస్ట్రీ వాళ్ల కోసం చిన్న పార్టీ ఏర్పాటు చేశాం. ఎందుకంటే మా బంధాన్ని మేం రహస్యంగా ఉంచాలనుకోలేదు. ఎందుకంటే సీక్రెట్స్ అనేవి రిలేషన్స్ని ప్రభావితం చేస్తాయని నేను నమ్ముతాను. బంధాన్ని సొంతం చేసుకోవాలి.. ఒపెన్గా ఉండాలి’ అని పేర్కొంది. ఇక ఆయన సమాధానం విన్న కొందరు నెటిజన్లు ఇది పరోక్షంగా అదితిగా కౌంటర్ ఇచ్చాడా? అని అభిప్రాయ పడుతున్నారు. కాగా ప్రస్తుతం అదితి సిద్ధార్థ్తో సీక్రెట్ డేటింగ్లో ఉంది. ఇప్పటి వరకు తమ రిలేషన్ని అదితి కానీ, సిద్ధార్థ్ కానీ బయట పెట్టలేదు. ఇదిలా ఉంటే మసాబాకు కూడా ఇది రెండో వివాహమనే విషయం తెలిసిందే. చదవండి: యువత పాశ్చాత్య పోకడలపై కళాతపస్వీ విశ్వనాథ్ ఏమన్నారంటే.. View this post on Instagram A post shared by Masaba (@masabagupta) View this post on Instagram A post shared by Masaba (@masabagupta) View this post on Instagram A post shared by Siddharth (@worldofsiddharth) -
పవన్ కల్యాణ్తో నటించే అవకాశం వచ్చినా చేయను!: హీరోయిన్
హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అనంతపురానికి చెందిన ప్రియాంక మన తెలుగుమ్మాయి కావడం విశేషం. ‘టాక్సీవాలా’ చిత్రంతో హీరోయిన్గా పరిచయమైన ఆమె. ఆ వెంటనే ‘తిమ్మరసు’,‘ఎస్.ఆర్.కల్యాణమండపం’ వంటి చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలు మంచి విజయం సాధించినప్పటికీ ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఫలితంగా ఆమెకు సినిమా ఆఫర్లు కరువయ్యాయి. ప్రస్తుతం అడపదడపా చిత్రాలు చేస్తూ కెరీర్ను నెట్టుకొస్తుంది. చదవండి: టీమిండియాతో జూనియర్ ఎన్టీఆర్.. ఫొటో వైరల్! ఈ నేపథ్యంలో తాజాగా ఓ యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో ప్రియాంక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హీరో పవన్ కల్యాన్కు అభిమానిని అని చెప్పుకునే ప్రియాంక ఆయనతో మాత్రం నటించనంటూ షాకింగ్ కామెంట్స్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘పవన్ కల్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలన్ని చూస్తాను. ‘తమ్ముడు’ సినిమాని దాదాపు 20 సార్లు పైగా చూశాను. ఇక ఖుషి సినిమా అయితే చెప్పనక్కర్లేదు. ఆ మూవీలోని ప్రతి డైలాగ్ నేను అలవోకగా చెప్పేస్తాను. అంత స్టార్డమ్ ఉన్నా ఆయన మాత్రం ఆర్డినరీ మ్యాన్లా, చాలా సింపుల్గా ఎలా ఉంటారో నాకు అసలు అర్ధం కాదు’ అంటూ అభిమానం చాటుకుంది. చదవండి: కాకినాడలో వాల్తేరు వీరయ్య టీం సందడి! ఆ తర్వాత యాంకర్ ఆయనతో నటించే అవకాశం వస్తే చేస్తారా? అని అడగ్గా.. ప్రియాంక ఆసక్తికరంగా స్పందించింది. ‘ఓ అభిమానిగా ఆయనను దూరం నుంచి చూస్తు మురిసిపోతాను. అంతకు మించి ఏం కోరుకోవడం లేదు. ఆయనతో కలిసి నటించాలనే కోరిక నాకు లేదు. ఒకవేళ పవన్ కల్యాణ్తో కలిసి నటించే అవకాశం వచ్చిన చేయను. చేయలేను కూడా’ అంటూ షాకింగ్ రిప్లై ఇచ్చింది. దీంతో ఆమె సమాధానం విని అంతా సర్ప్రైజ్ అవుతున్నారు. ఇకపోతే తాజాగా ఆమె బాలకృష్ణ సినిమాలో ఆఫర్లు కొట్టేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోయే ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రియాంకను హీరోయిన్గా పరిశీలిస్తున్నట్లు సమాచారం -
తమిళనాడు రాజకీయ విభేదాలపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
తమిళ సినిమా: ప్రస్తుతం తమిళనాడులో ప్రభుత్వానికి గవర్నర్కు మధ్య విభేదాలు, రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు, బీజేపీ తమిళ భాషాభివృద్ధి అధ్యక్షుడు పేరరసు విళిత్తెళు చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం వేదికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదవన్ సినీ క్రియేషన్స్ పతాకంపై శివగంగ నగర్ మండ్రం అధ్యక్షుడు, నటుడు సీఎం దొరై ఆనంద్ నిర్మిస్తున్న చిత్రం ఇది. మురుగా అశోక్, గాయత్రి జంటగా నటిస్తున్నారు. ఏ.తమిళ్ సెల్వన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర ఆడియో ఫంక్షన్ గురువారం చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్లో జరిగింది. దర్శకుడు పేరరసు, గిల్డ్ అధ్యక్షుడు జాగ్వర్ తంగం, పారిశ్రామికవేత్త దామ్ కన్నన్ ముఖ్య అతిథులుగా పాల్గొని ఆడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు పేరరసు మాట్లాడుతూ.. ఇక్కడ ఉన్న వారిని చూస్తుంటే తమిళ భాషాభిమానులని తెలుస్తోందన్నారు. ఇప్పుడు తమిళ భాషపై అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఎందుకంటే తమిళంపై రాజకీయాలు చేస్తున్న పరిస్థితి నెలకొందన్నారు. తమిళం అన్నా, తమిళనాడు అన్నా ఒకటి కాదా అంటూ ప్రశ్నించారు? తమిళనాడు వర్ధిల్లాలి.. తమిళం వర్ధిల్లాలి అన్నవి రెండు ఒకటే అన్నారు. రాజకీయ పార్టీల్లో పలు విభాగాలు ఉండవచ్చని, అయితే తమిళుడు తమిళుడుగానే ఉండాలని పేర్కొన్నారు. గవర్నర్ అనే వ్యక్తి రెండేళ్లలో వెళ్లిపోతారని తమిళులు ఇక్కడే ఉంటారని అన్నారు. ఈ చిత్రంలోని పాటలు తమిళుడు మోసపోతూనే ఉన్నాడు అనే పదం ఉందన్నారు. అది నిజమేనన్నారు. కాబట్టి తమిళ రాజకీయాల్లో తమిళుడు చిక్కుకోరాదని ఈ సందర్భంగా పేరరసు అన్నారు. -
కేజీయఫ్ ఓ చెత్త సినిమా: ‘కాంతార’ నటుడు సంచలన కామెంట్స్
కేజీయఫ్ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన కేజీయఫ్ చాప్టర్ 1 ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు చేసి రికార్డు సృష్టించింది. దీనికి సీక్వెల్గా గతేడాది విడుదలైన కేజీయఫ్ చాప్టర్ 2 కలెక్షన్ల సునామీ సృష్టించింది. చెప్పాలంటే కన్నడ చిత్ర పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా ఇది. వరల్డ్ వైడ్ దాదాపు రూ. 12 50 కోట్లు పైగా వసూళు చేసింది. ఈ చిత్రంతో హోంబాలే ఫిలింస్ నిర్మాణ సంస్థ మంచి గుర్తింపు వచ్చింది. చదవండి: రూ. 100 కోట్ల క్లబ్లోకి ధమాకా.. రవితేజ కెరీర్లోనే తొలి రికార్డు! ఇక ఇదే బ్యానర్లో వచ్చి మరో సంచలనం సృష్టించిన సినిమా కాంతార. ఓ ప్రాంతీయ చిత్రంగా వచ్చి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చిచుకుంది. కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈచిత్రం వరల్డ్ వైడ్గా రూ. 400 కోట్లు సాధించింది. తాజాగా ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన నటుడు కిశోర్ కుమార్ కేజీయఫ్ మూవీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కేజీయఫ్ ఓ చెత్త సినిమా అని పేర్కొన్నాడు. రీసెంట్గా ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో అతడు మాట్లాడుతూ.. కేజీయఫ్ చిత్రంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. చదవండి: అందుకే నా ట్విటర్ అకౌంట్ను నిలిపివేశారు: నటుడు కాంతారతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు కేజీయఫ్ మూవీపై ప్రశ్న ఎందురైంది. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘కేజీయఫ్ మూవీ నేను ఇంతవరకు చూడలేదు. ఇది సరైన పోలికో కాదో తెలియదు. అది నా టైప్ సినిమా కాదు. ఇది నా వ్యక్తిగత విషయం. ఇలాంటి ఓ చెత్త సినిమా కంటే పెద్దగా సక్సెస్ కానీ సీరియస్ అంశాన్ని డీల్ చేసే ఓ చిన్న సినిమా చూస్తాను ’ అంటూ తన అభిప్రాయం చెప్పుకొచ్చాడు. కాగా తెలుగులో ‘హ్యాపీ’, నాని ‘భీమిలి కబడ్డీ జట్టు’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కిశోర్ కుమార్ రీసెంట్గా పొన్నియన్ సెల్వన్, కాంతార, షీ వెబ్ సిరీస్ సీజన్ 2లో నటించాడు. ప్రస్తుతం ‘రెడ్ కాలర్’ అనే హిందీ సినిమా చేస్తున్నాడు. -
మరో వివాదంలో రష్మిక, ఈసారి దక్షిణాదిపై సంచలన వ్యాఖ్యలు
దక్షిణాది స్టార్ హీరోయిన్గా ఎంతో క్రేజ్ను సంపాదించుకుంది రష్మిక మందన్నా. ఇక పుష్ప మూవీతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. అదే క్రేజ్తో బాలీవుడ్ వరుస ఆఫర్లు అందుకుంటోంది. సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్డమ్ను ఆస్వాదిస్తున్న రష్మికకు నెట్టింట మాత్రం తరచూ చేదు అనుభవం ఎదురవుతోంది. తన తీరు ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ ఎదుర్కొంటు ఉంటుంది. ఇటీవల రష్మీక కాంతార చిత్రం, ఆ మూవీ డైరెక్టర్, హీరో రిషబ్ శెట్టిపై చేసిన కామెంంట్స్ కన్నడీగులకు ఆగ్రహం తెప్పించింది. దాంతో ఆమెపై కన్నడీగులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటికీ ఆ వివాదం చర్చనీయాంశంగానే ఉంది. ఈ క్రమంతో తాజాగా సౌత్ ఇండస్ట్రీపై మరోసారి షాకింగ్ కామెంట్స్ ట్రోలింగ్ బారిన పడింది రష్మిక. బాలీవుడ్ ఆమె నటించిన తొలి చిత్రం మిషన్ మజ్ను నేరుగా ఓటీటీలో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్లో పాల్గొన్న రష్మిక మాట్లాడుతూ.. బాలీవుడ్పై ప్రశంసలు కురిపించింది. అదే క్రమంలో దక్షిణాది పరిశ్రమపై సంచలన కామెంట్స్ చేసింది. ‘సౌత్ సాంగ్స్ కంటే నార్త్ సాంగ్స్ బాగుంటాయి. చిన్నప్పటి నుంచి నేను బాలీవుడ్ సాంగ్స్ వింటూ, చూస్తూ పెరిగాను. దక్షిణాది సినిమాల్లో అన్నీ మసాలా పాటలే ఉంటాయి. సౌత్ సినిమాల్లో ఐటెం నంబర్స్, డ్యాన్స్ నంబర్సే ఎక్కువ’ అంటూ దక్షిణాది పాటలపై ఎద్దేవా చేసింది. ఇందుకు సంబంధించిన ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీంతో రష్మిక తన లేటెస్ట్ కామెంట్స్తో మరో కొత్త వివాదంలో చిక్కుకుంది. ఆమె తీరుపై దక్షిణాది సినీ అభిమానులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘నీకు ఆఫర్లు ఇచ్చి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చి పెట్టిన దక్షిణాది పరిశ్రమను, సినిమాలను అవమానిస్తావా?’, ‘రష్మికను కన్నడలో మాత్రమే కాదు.. సౌత్ ఇండస్ట్రీలోనే పూర్తిగా బ్యాన్ చేయాలి’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) చదవండి: క్రేజీ ఆఫర్ కొట్టేసిన కల్యాణి ప్రియదర్శన్..! ప్రభాస్తో బాలయ్య ముచ్చట్లు.. ప్రోమో మామూలుగా లేదుగా..! -
ఆ నిర్మాతను కలిసిన నటి.. వార్నింగ్ ఇచ్చిన సింగర్ చిన్మయి
సింగర్ చిన్మయి.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. గాయనీగా, నటిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా చిన్మయి ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఆమె సింగర్గా కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా మీ టూ ఉద్యమం నేపథ్యంలో చిన్మయి బాగా పాపులర్ అయ్యింది. అప్పట్లో నిర్మాత వైరముత్తుపై ఆమె చేసిన లైంగిక ఆరోపణలు ఇండస్ట్రీలో హాట్టాపిక్గా నిలిచాయి. ఇక చిన్మయి సోషల్ మీడియా వేదికగా కూడా పలు సామాజీక అంశాలపై స్పందిస్తూ ఉంటుంది. చదవండి: ఆనందంలో ఐశ్వర్యను హగ్ చేసుకున్న అభిషేక్, ఆకట్టుకుంటున్న వీడియో అంతేకాదు యువతకు, మహిళలు సూచనలు ఇస్తూ వారిలో ధైర్యం నింపుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా చిన్మయి సోషల్ మీడియా వేదికగా ఓ నటిని హెచ్చరించింది. ప్రముఖ తమిళ నిర్మాతను కలిసి ఆమెకు చిన్మయి వార్నింగ్ ఇస్తూ సూచనలు ఇచ్చింది. వివరాలు.. తమిళ నటి, వీజే అర్చనా అర్చన ఓ సినిమా షూటింగ్లో పాల్గొంది. ఆ షూటింగ్ సెట్కు వచ్చిన నిర్మాత వైరముత్తును ఆమె కలుసుకుంది. ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఫొటోలను ఆమె తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. దీంతో తన ఫొటోలపై చిన్మయి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘అది ఇలాగే మొదలవుతుంది. అతనితో చాలా జాగ్రత్తగా ఉండు. వీలైతే అతడికి తగినంత దూరం పాటించు. ముఖ్యంగా ఇలా ఒంటరిగా అసలు కలవకు. నీతో తోడుగా ఎవరైనా ఉండేలా చూసుకో.. జాగ్రత్త’ అంటూ అర్చన పోస్ట్కు కామెంట్ చేసింది. దీంతో ఆమె కామెంట్ తమిళ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. కాగా నటి చిన్మయి శ్రీపాద ప్రముఖ తమిళ పాటల రచయిత వైరముత్తు మధ్య గత కొన్నేళ్లుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. వైరముత్తు తనను లైంగికంగా వేధించాడంటూ చిన్మయి సంచలన ఆరోపణలు చేశారు. చదవండి: రామ్ చరణ్పై ‘కింగ్ ఖాన్’ షారుక్ ఆసక్తికర వ్యాఖ్యలు View this post on Instagram A post shared by Archana R (@vj_archana_) -
హీరోయిన్ల రెమ్యునరేషన్పై మృణాల్ షాకింగ్ కామెంట్స్
మృణాల్ ఠాకుర్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. హిందీ టీవీ సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీకి వచ్చిన మృణాల్ పలు సినిమాల్లో హీరోయిన్గానూ నటించింది. అయితే సీతారామం సినిమాతో ఒక్కసారిగా ఆమె ఎంతో క్రేజ్ను సంపాదించుకుంది. ఈ మూవీతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ మరాఠి బ్యూటీకి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తాజాగా ఆమె పిప్పా అనే సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఓ బాలీవుడ్ మీడియాతో ముచ్చటించిన మృణాల్ హీరోయిన్ల రెమ్యునరేషన్పై షాకింగ్ కామెంట్స్ చేసింది. చదవండి: సితార అన్ప్లాన్డ్ బేబీ: నమ్రత షాకింగ్ కామెంట్స్ హీరోయిన్లు పారితోషికం చెప్పడానికి సందేహించకూడదని.. డిమాండ్ చేయాలని తెలిపింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ప్రేక్షకుల్లో నటీనటులకు ఉన్న గుర్తింపు, పాపులారిటిని బట్టి ఎంత పారితోషికం ఇవ్వాలన్నది నిర్ణయిస్తారు. అయితే చాలా మంది హీరోయిన్స్ తాము కోరుకున్న రెమ్యునరేషన్ని డిమాండ్ చేసే విషయంలో తెలియని అయమోమయంలో ఉంటారు. అది మంచిది కాదు. రెమ్యునరే,న్ ఎంత కావాలో ముందే స్పష్టంగా చెప్పగలగాలి. అప్పుడే మనం వృత్తి విషయంలో ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నామో అర్థమవుతుంది’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం మృణాల్ కామెంట్స్ సినీ ఇండస్ట్రీలో హాట్టాపిక్గా నిలిచాయి. చదవండి: సావిత్రి గురించి షాకింగ్ విషయం చెప్పిన సీనియర్ నటి ఝాన్సీ -
కాంతారపై సంచలన వ్యాఖ్యలు, కేసు నమోదు.. నటుడికి షాకిచ్చిన కోర్టు
‘కాంతార’ మూవీతో సంచలన వ్యాఖ్యలు చేసిన కన్నడ నటుడు చేతన్ కుమార్పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో చేతన్ కుమార్కు బెంగళూరు హైకోర్టు షాకిచ్చింది. ఈ కేసు దర్యాప్తు దశలో ఉండగా దానిని ఆపలేమని హైకోర్టు స్పష్టం చేసింది. వివరాలు.. కాంతార సినిమాలో భూతకోల సంస్కృతిని డైరెక్టర్, హీరో రిషబ్ శెట్టి అద్భుతంగా చూపించాడు. ఈ సంస్కృతికి దేశవ్యాప్తంగా ప్రేక్షకులంత ఫిదా అయ్యారు. అయితే ఈ సంస్కృతి హిందూ మతంలో భాగం కాదంటూ కన్నడ నటుడు చేతన్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. చేతన్ కుమార్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ శివ కుమార్ అనే వ్యక్తి శేషాద్రినగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. చేతన్ కుమార్ వ్యాఖ్యలు మత విద్వేషాలను రెచ్చగొట్టెల ఉన్నాయని, హిందూ మనోభవాలను దెబ్బతీసేశాల అతడు వ్యవహరించాడంటూ శివకుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు చేతన్ కుమార్ను కోర్టులో హాజరుపరిచారు. నిన్న ఈ కేసుపై విచారణ చేపట్టగా తాను కేవలం తన అభిప్రాయం మాత్రమే వ్యక్తం చేశానని, హిందూ మతాన్ని కించపరిచే విధంగా తన వ్యాఖ్యలు లేవంటూ కోర్టులో వాధించాడు. అదే విధంగా.. తాను ఏ మతాల మద్య విద్వేషాన్ని రెచ్చగొట్టలేదని వివరణ ఇచ్చాడు. అయితే కోర్టు ఈ కేసు విచారణ వాయిదా వేసింది. ఒక మత సంస్కృతిని కించ పరిచే విధంగా మాట్లాడటం.. మతాల మద్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారన్న ఆరోపణల విషయంలో చేతన్పై నమోదు చేసిన ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉండగా అడ్డుకోలేమని హైకోర్టు పేర్కొంది. చదవండి: హీరోయిన్గా పరిచయం కాబోతున్న అజిత్ రీల్ కూతురు బేబీ అనిఖా మహేశ్ బాబు భార్య నమ్రత కొత్త రెస్టారెంట్, మెను, రేట్స్ ఎలా ఉన్నాయంటే..! -
హీరోయిన్స్ కంటే అందంగా కనిపిస్తున్నానని పక్కన పెడుతున్నారు: ‘యశోద’ నటి
నటి కల్పికా గణేష్ పేరు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. 2009లో వచ్చిన ప్రయాణం సినిమాతో నటిగా పరిచయమైన ఆమె ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, జులాయి, పడిపడి లేచే మనసు వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి గుర్తింపు పొందింది. రీసెంట్గా ఆమె సమంత యశోద సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఇంతకాలం సైలెంట్గా సినిమాలు చేసుకుంటూ వచ్చిన కల్పిక ఈ మధ్య వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలో రీసెంట్గా ఓ యూట్యూబ్ చానల్తో ముచ్చటించిన ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు నేను ఓ 30 సినిమాలు చేశాను. వాటిలో 15 చిత్రాలు మాత్రమే విడుదలయ్యాయి. కొన్ని సినిమాలు చేసిన తరువాత నన్ను పక్కన పెట్టడం చేశారు. ఎందుకంటే హీరోయిన్స్ కంటే అందంగా కనిపిస్తున్నానని, బాగా చేస్తున్నానంటున్నారు. దాంతో సినిమాలో హీరోయిన్ డామినేట్ చేస్తున్నాననే కారణాలుగా కనిపించాయి. నేను చంద్రశేఖర్ యేలేటి గారి స్కూల్ నుంచి వచ్చాను. కానీ అలాంటి వాతావరణం బయట ఎక్కడా కనిపించలేదు. డైలాగ్ ఉందా అని అడిగితే ‘నీకు కాస్త యాటిట్యూడ్ ఎక్కువ’ అనేవారు. క్యారెక్టర్ ఆర్టిస్టులు వరుస సినిమాలు చేస్తూ వెళుతుంటారు. కానీ నేను అలా కదు. నాకు పాత్ర, కథ నచ్చితేనే చేస్తాను. బహుషా నేను తక్కువ సినిమాలు చేయడానికి ఇదే కారణం అనుకుంటున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది. చదవండి: ఘనంగా అలీ కూతురు హల్దీ ఫంక్షన్, ఫొటోలు వైరల్ బిజినెస్ విమెన్తో పెళ్లి.. నాగశౌర్యకు కట్నం ఎంత ఇచ్చారో తెలుసా? -
బాలీవుడ్ హీరోలపై సునీల్ శెట్టి సంచలన వ్యాఖ్యలు
ఇప్పటి హీరోలు అభద్రతా భావం ఉంటున్నారంటూ బాలీవుడు నటుడు సునీల్ శెట్టి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన నటించి లేటెస్ట్ వెబ్సిరీస్ ధరవి బ్యాంక్ వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో వెబ్ సిరీస్ ప్రమోషన్స్ల్లో భాగంగా ఇటీవల ఆయన బాలీవుడ్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలు పెద్దగా ఆదరణ పొందకపోవడానికి కారణమేంటనే ప్రశ్న ఎదురైంది. చదవండి: అవన్ని పుకార్లే.. మీరే చూడండి అలా ఉన్నానా?: హీరోయిన్ దీనికి ఆయన స్పందిస్తూ ప్రస్తుత హీరోల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటి హీరోలకు అభద్రత భావం ఎక్కువైంది. ప్రస్తుతం కెరీర్ ఎంత కాలం ఉంటుందనేది గ్యారంటీ లేదు. అందుకే ఎంత సంపాదించాలా? అని చూస్తున్నారే తప్ప చేసే సినిమా మీద దృష్టి పెట్టడం లేదు. వాళ్లకు డబ్బు తప్ప మరో ధ్యాస లేదు’ అని విమర్శించాడు. అదే విధంగా ‘తరచూ ప్రేక్షకులను కలుస్తుంటేనే మన లోపాలేంటనేవి తెలుస్తుంటాయి. చదవండి: వైష్ణవిని పెట్టినప్పటి నుంచి బయటినుంచి ఫుల్ నెగిటివిటీ: దర్శకుడు వారు మన నుంచి ఏం ఆశిస్తున్నారు, ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారనేది అవగాహన వస్తుంది. ఇప్పటి హీరోలు ప్రీ-రిలీజ్ ఫంక్షన్స్ అయితే తప్ప బయటకు రావడం లేదు. తమ అభిమన హీరో తరుచూ ఏ రెస్టారెంట్కు వెళ్లాడు, ఏ కారు కొన్నాడు అనే విషయాల్ని ప్రేక్షకులు పట్టించుకునే రోజులు పోయాయి. రీల్ హీరోగా కాకుండా రియల్ హీరో అనిపించే వారినే ఇప్పుడు వారు అభిమానిస్తున్నారు’ అని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇక ఒకప్పుడు బాలీవుడ్లో మల్టీస్టారర్స్ చాలా ఎక్కువగా వచ్చేవని, కానీ ఇప్పుడు ఇద్దరు హీరోలు కలిసి నటించడానికి కూడా ఇబ్బంది పడిపోతున్నారని సునీల్ శెట్టి వ్యాఖ్యానించాడు. -
విజయ్పై బాలీవుడ్ నటి సంచలన కామెంట్స్, హిందీని అవహేళన చేశాడంటూ..
‘రౌడీ’ హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ నటి మలోబిక బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్టాపిక్గా నిలిచాయి. గతంతో విజయ్ హిందీ భాషను అవమానించేలా మాట్లాడాడంటూ బెంగాలీ నటి, సింగర్ అయిన మలోబిక బెనర్జీ తెలిపింది. రీసెంట్గా ఓ చానల్తో ముచ్చటించిన ఆమె ఈ సందర్భంగా లైగర్ మూవీ గురించి ప్రస్తావించింది. ఒకప్పుడు హిందీ భాషపై అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించిన విజయ్, ఇప్పుడు అదే భాషలో సినిమా తీశాడంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘‘విజయ్తో నేను కలిసి ‘నీ వెనకాలే నడిచి’ మ్యూజిక్ వీడియోలో నటించాం. చదవండి: Samantha Shocking Look: సామ్ సర్జరీ చేసుకుందా? ఇలా మారిపోయిందేంటి! అప్పటికే విజయ్ నటించిన అర్జున్ రెడ్డి మూవీ హిట్ కావడంతో అతడు పాపులర్ అయ్యాడు. ఆ మ్యూజిక్ వీడియో షూటింగ్ సమయంలోనే విజయ్తో నాకు పరిచయం ఏర్పడింది. నాకు మంచి స్నేహితుడయ్యాడు. సెట్లో మేం సరదాగా మాట్లాడుకునేవాళ్లం. అప్పటికి విజయ్కి హిందీ పూర్తిగా రాదు. అందుకే తనేప్పుడు తెలుగులోనే మాట్లాడేవాడు. కానీ నేను మాత్రం ఎక్కువగా హిందీలోనే మాట్లాడేదాన్ని. ఇక నేను హిందీలో మాట్లాడుతుంటే విజయ్ నవ్వుకునేవాడు. తనకు హిందీ పెద్దగా అర్థం కాదని, అది హెబ్రూ భాషలా అనిపిస్తుందంటూ అవహేళన చేశాడు. అలాంటి విజయ్ హిందీలో సినిమా తీశాడని తెలిసి షాకయ్యా. ఎందుకంటే ఒకప్పుడు హిందీని అవమానించేలా మాట్లాడిన వ్యక్తి.. అదే భాషలో సినిమా తీశాడు. చదవండి: పెళ్లిలో నటి పూర్ణ వేసుకున్న బంగారం ఎంతో తెలుసా? కొన్నేళ్లకు లైగర్ టీజర్లో విజయ్ని చూసి నవ్వుకున్నా’’ అని చెప్పుకొచ్చింది. అయితే ఈ విషయాన్ని లైగర్ ప్రమోషన్స్ సమయంలోనే చెబుదాం అనుకున్నానని, అయితే విజయ్ తనకు మంచి స్నేహితుడు కావడంతో ఆ పని చేయలేకపోయానంది. అంతేకాదు విజయ్ టీజర్ను సోషల్ మీడియా షేర్ చేసి ‘వెల్కమ్ టూ బాలీవుడ్’ అనే మెసేజ్ కూడా పెట్టానంది. ఆ తర్వాత తెలిసిందేంటంటే హిందీలో విజయ్కి ఎక్కువ డైలాగ్స్ లేవని తెలిసిందని పేర్కొంది. అయితే ఏది ఏమైనప్పటికి విజయ్ చాలా మంచి మనిషి అని, చాలా ప్రొఫెషనల్గా ఉంటాడంటూ చివరిలో ఆమె వ్యాఖ్యానించింది. కాగా ఎన్నో అంచనాల మధ్య ఆగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన లైగర్ చిత్రం బాక్సాఫిసు ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే. -
చంద్రబాబు ఇప్పటికీ తన తప్పును కప్పిపుచ్చే దశలోనే ఉన్నారు: ఎమ్మెల్యే వల్లభనేని
-
టాలీవుడ్పై అమలా పాల్ షాకింగ్ కామెంట్స్..
‘బెజవాడ’తో చిత్రంతో తెలుగు తెరకు పరచమైన మలయాళ బ్యూటీ అమలా పాల్. ఆ తర్వాత లవ్ ఫెయిల్యూర్, నాయక్, ఇద్దరు అమ్మాయిలతో వంటి చిత్రాలతో ఇక్కడ హీరోయిన్గా మంచి గుర్తింపు పొందింది. చేసింది తక్కువ సినిమాలే అయిన టాలీవుడ్ అగ్ర హీరోల సరసన నటించింది. అనంతరం ఈ భామకు ఇక్కడ అవకాశాలు కరువయ్యాయి. దీంతో తమిళ్ ఇండస్ట్రీకి మాకాం మార్చిన ఆమె తరచూ వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తోంది. చదవండి: కృష్ణంరాజు ముగ్గురు కూతుళ్లు ఏం చేస్తుంటారో తెలుసా? అంతేకాదు బోల్డ్ కంటెంట్ ఉన్న చిత్రాల్లో సైతం నటించేందుకు ఆమె వెనుకాడటం లేదు. ఆ మధ్య నటించిన ఆమె సినిమా వివాదంలో నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సౌత్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్లు చేస్తూ బిజీగా ఉన్న ఆమె తాజాగా ఓ చానల్తో ముచ్చటించింది. ఈ సందర్భంగా అమలా పాల్ టాలీవుడ్ కల్చర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తెలుగు హీరోయిన్లను కేవలం లవ్ సీన్స్, సాంగ్స్ కోసమే ఎంచుకుంటారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. టాలీవుడ్లో తన జర్నీ గురించి ఆమె మాట్లాడుతూ.. ‘తెలుగు సినిమాల్లో ఎక్కువగా ఫ్యామిలీ కాన్సెప్ట్ ఉంటుందనే విషయం నాకు మొదటి రోజే అర్ధమైంది. చదవండి: ఓటీటీ రిలీజ్కు రెడీ అవుతున్న కార్తికేయ 2! ఎప్పుడు, ఎక్కడంటే.. అలాంటి సినిమాలనే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇలాంటి భిన్నమైన సంప్రదాయం కారణంగానే తెలుగు పరిశ్రమకు నేను పెద్దగా కనెక్ట్ కాలేకపోయాను. అందుకే తెలుగులో తక్కువ సినిమాలు చేశాను. ఇక తమిళంలో నేను నటించిన మొదటి చిత్రం ‘మైనా’ నాకు మంచి గుర్తింపు ఇచ్చింది. ఈ సినిమా బ్లాక్బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్గా మారిపోయాను’ అంటూ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే పెళ్లి , విడాకుల తరువాత అమలా పూర్తిగా బోల్డ్ కంటెంట్, లేడీ ఓరియంటేడ్ చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. -
'ఇండియాను షేక్ చేస్తా అన్నాడు.. ఫ్లాప్ చేశాడు'.. తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్
విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా 'లైగర్'. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అనుకోని రీతిలో డిజాస్టర్గా మిగిలిపోయింది. రిలీజ్ అయిన తొలిరోజు నుంచి నెగిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద చతికిలపడిందీ సినిమా. దీంతో నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలను మిగిల్చింది. ఈ క్రమంలో పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండపై కొందరు సినీ ప్రముఖులు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ లైగర్ రిజల్ట్పై షాకింగ్ కామెంట్స్ చేశారు. 'మన యాక్షన్ని బట్టే ప్రేక్షకుల రియాక్షన్ఉంటుంది. ఎగిరెగిరిపడితే ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయి. సినిమాను చూడండి అని ప్రమోట్ చేసుకోవాలి. నువ్వు చిటికెలు వేస్తే రియాక్షన్ ఇలాగే ఉంటుంది. హీరోలు ఊరికే ఎగిరెగిరి పడటం మంచిది కాదు. అలాగే ఇష్టం వచ్చినట్లు ''ఊపేస్తాం.. తగలెడతాం.. అని స్టేట్మెంట్లు ఇస్తే ఇలాగే ప్రేక్షకులు మనల్ని తగలెడతారు' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ సినిమా డిజాస్టర్కు కారణాలు ఏమై ఉంటాయి అని ప్రశ్నించగా.. ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడను. నేను పూరి జగన్నాథ్ అభిమానినే. కానీ లైగర్ ట్రైలర్ చూసినప్పుడే మూవీ చూడలనిపించలేదు. భవిష్యత్తులో కుదిరితే చూస్తా అని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. -
పెళ్లిపై ఆసక్తి లేదు.. కానీ బాయ్ఫ్రెండ్ కావాలి: సురేఖ వాణి షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి సురేఖ వాణి. ఈ మధ్యకాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉన్న సురేఖవాణి సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్గా ఉంటోంది. ఇక కూతురు సుప్రీతాతో కలిసి నెట్టింట ఆమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు. మోడ్రన్ డ్రస్సుల్లో కూతురితో పోటీపడుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటారు ఆమె. ఈ క్రమంలో సురేఖ తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. చదవండి: లైగర్ మూవీ ఫ్లాప్ అయితే? విలేకరి ప్రశ్నకు విజయ్ షాకింగ్ రియాక్షన్ ఇదిలా ఉంటే భర్త చనిపోవడంతో కూతురితో కలిసి ఒంటరిగా జీవిస్తోన్న సురేఖ రెండో వివాహంపై తరచూ ఆమెకు ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. అయితే తనకు మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ఎప్పడూ చెప్పే సురేఖ ఈసారి మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ యూట్యూబ్ చానల్తో ముచ్చటించిన ఆమె రెండో పెళ్లిపై స్పందించింది. ‘నాకు రెండో పెళ్లిపై పెద్దగా ఆసక్తిలేదు. కానీ నా కూతురు సుప్రీతా నన్ను మళ్లీ చేసుకోమంటుంది. ఇప్పుడైతే చేసుకునే ఆలోచన లేదు కానీ, భవిష్యత్తులో చేసుకుంటానేమో చూడాలి’ అని చెప్పిది. చదవండి: నగరానికి దూరంగా చిరు బర్త్డే వేడుకలు, ఫొటోలు వైరల్ అలాగే మీకు నచ్చిన వ్యక్తి దొరికాడా? అని అడగ్గా.. ప్రస్తుతానికి ఎవరు లేరని సమాధానం ఇచ్చింది. కానీ తనకు బాయ్ఫ్రెండ్ కావాలనిపిస్తోందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే అతను తనని బాగా అర్థం చేసుకునేవాడు కవాలని చెప్పింది. ‘మంచి హైట్, పర్సనాలిటి ఉన్న వ్యక్తి నాకు బాయ్ఫ్రెండ్గా కావాలి. లైట్గా గడ్డం ఉండాలి. అతనికి బాగా డబ్బులు ఉండాలి. ముఖ్యంగా నన్ను బాగా అర్థం చేసుకోవాలి. అలాంటి వాడు దొరికి నాకు నచ్చితే అతడినే పెళ్లి చేసుకుంటా’ అని తెలిపింది. ఇకపోతే సురేఖకు రెండో వివాహం చేయాలనుకుంటున్నానని ఆమె కూతురు సుప్రీతా ఇప్పటికే పలు ఇంటర్య్వూలో చెప్పిన విషయం తెలిసిందే. -
ఇండస్ట్రీలో మహిళలంటే చులకన, ఇక్కడ గిల్లితే గిల్లించుకోవాలి: అనసూయ
బుల్లితెరపై స్టార్ యాంకర్స్లో అనసూయ భరద్వాజ్ ఒకరు. తన అందచందాలతో ఫ్యాన్స్ మనసులను దోచేసిన ఈ బ్యూటీకి స్టార్ హీరోయిన్కు ఉన్నంత క్రేజ్ ఉంది. అయితే అనసూయ కేవలం బుల్లితెరకు మాత్రమే పరిమితం కాకుండా.. వెండితెరపై కూడా దూసుకెళ్తుంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే అనసూయ లైమ్లైట్లోకి వచ్చింది మాత్రం జబర్దస్త్ అనే కామెడీ షోతో అనే విషయం తెలిసిందే. ఇటివలె ఆమె ఈ షోకు గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి అనసూయ వార్తల్లో నిలుస్తోంది. చదవండి: ఎట్టకేలకు కియారాతో డేటింగ్పై నోరు విప్పిన సిద్ధార్థ్, ఏమన్నాడంటే.. ఈ క్రమంలో రిసెంట్గా ఆమె ఓ యూట్యూబ్ చానల్తో ముచ్చటించింది. తనపై వేసే పంచులు, బాడీ షేమింగ్ వల్లే తాను ఈ కామెడీ షోను వీడినట్లు చెప్పింది. అనంతరం ఇండస్ట్రీలో మహిళలను ఎలా చూస్తారో వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో ఆడవాళ్లంటే ముఖ్యంగా హీరోయిన్స్కి ఇచ్చే ప్రాధాన్యత చాలా తక్కువ. హీరోయిన్ అంటే కెమరా ముందు కాపాడండి.. లేదంటే సిగ్గుపడుతూ నవ్వాలి. అదే మా పని. అసలు మాట్లాడకూడదు. పోకిరి సినిమాలో గిల్లితే గిల్లించుకోవాలి అనే డైలాగ్ ఉంది కదా.. సేమ్ ఇక్కడ పరిస్థితి అలానే ఉంటుంది. చదవండి: చేతకానితనంగా చూస్తున్నారా.. బాయ్కాట్ ట్రెండ్పై హీరో రియాక్షన్ మా హక్కుల కోసం మాట్లాడితే మమ్మల్ని తొక్కేస్తారు. హీరోయిన్ అంటే దేవదాసిలా పని చేయాలి అన్నట్లు చూస్తారు. కానీ అది చాలా తప్పు’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ ఎంటర్టైన్మెంట్ ఫిల్డ్ అంటేనే అందరిక ఆసక్తి. కానీ ఇక్కడ అందరిలాగే మేం పనిచేస్తాం. కానీ ఈ రంగుల ప్రపంచ వేరు. బయటకు కనిపించినంత హుందాగా ఉండదు. అసలు అంత దీనిలోని లోతును ఎందుకు తెలుసుకోవాలనుకుంటారు. సినీ సెలబ్రెటీల గురించి లోలుతుగా తెలుసుకోవడం వల్ల సినిమా చూడాలనే ఆసక్తేపోతుంది. అసలు మా సినిమాలు చూసే అర్హత మీకుందా అని మేం ఆలోచించడం మొదలు పెడితే.. ఎవరోస్తారు థియేటర్కి’ అంటూ ఘాటూ వ్యాఖ్యలు చేసింది అనసూయ. -
ముందే స్క్రిప్ట్ ఇస్తే నటులు ఇంకా బాగా చేస్తారు: చిరంజీవి
-
టాలీవుడ్ డైరెక్టర్లకు చిరంజీవి చురకలు..
Chiranjeevi Shocking Comments On Tollywood Directors: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ జోడిగా నటించిన చిత్రం 'లాల్సింగ్ చద్దా'. హాలీవుడ్ మూవీ 'ఫారెస్ట్ గంప్'కు రీమేక్గా వస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ గుడ్ బాయ్ నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. అలాగే ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ లాంచ్ ఆదివారం (జులై 24) గ్రాండ్గా జరిగింది. ఈ ఈవెంట్లో ట్రైలర్ లాంచ్ చేసిన చిరంజీవి టాలీవుడ్ దర్శకులను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో అమీర్ ఖాన్ నటన గురించి ఎంతో గొప్పగా చెప్పారు. అమీర్లా తమకు చేయాలని ఉన్నా పలు పరిధుల వల్ల తాము చేయలేకపోతున్నామని చిరు చెప్పిన విషయం తెలిసిందే. అలాంటి పరిధుల గురించి ఈ కార్యక్రమంలో చిరంజీవి తెలిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పలువురు టాలీవుడ్ డైరెక్టర్లకు చురకలు అంటించారు. ''కొందరు డైరెక్టర్లు షూటింగ్ స్పాట్లో అప్పటికప్పుడు డైలాగ్లు ఇస్తున్నారు. ఇది నటులను చాలా ఇబ్బంది పెడుతోంది. నాకు కూడా చాలా సార్లు ఇలాంటి అనుభవం ఎదురైంది. స్క్రిప్ట్ విషయంలో డైరెక్టర్లు మరింత శ్రమించాలి. స్క్రిప్ట్ గురించి మిగతా టెక్నిషియన్స్కు ముందుగానే తెలిస్తే వారు పనిచేసే విధానం వేరు. దానికి వచ్చే ఫలితం వేరేలా ఉంటుంది. ఆ ఫలితం సినిమాపై చూపిస్తుంది. చదవండి: చిరంజీవికి పానీపూరి తినిపించిన అమీర్ ఖాన్.. అప్పుడెందుకు గుర్తుకు రాలేదు.. చిరుపై అమీర్ ఖాన్ వ్యాఖ్యలు ఏమైపోయిందంటే.. సినిమాలో ప్రధాన హీరోకు సీన్స్ తెలుసేమో గానీ, అప్పుడే వచ్చిన కమెడియన్స్కు గానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్లకు మాత్రం తెలియదు. అప్పటికప్పుడు ఆ డైలాగ్లు చెప్పి చేయించడంతో ఇన్వాల్వ్మెంట్ అంతంతమాత్రంగానే ఉంటుంది. అందుకే వర్క్షాప్లు నిర్వహించాలి. ముందుగా డైలాగ్లు ఇవి అని చెప్పాలి. ఆ డైలాగ్లు ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయాలి. గదిలో రౌండ్టేబుల్పై కూర్చొని ఆ సీన్లు అనుకుని వాళ్లు గనుక చేయగలిగితే తర్వాత సెట్స్కు వెళ్లాక నా డైలాగ్ ఏంటని.. అది ఎలా గుర్తుంచుకోవాలని.. డైలాగ్ గుర్తుపెట్టుకోవండపై మనసు పెట్టక్కర్లేదు. అప్పుడు కేవలం నటనపైనే మనసు పెడితే చాలు. అది రావాలి. ఇదే వారు చేసేది (అమీర్ ఖాన్ గురించి)'' అని చిరంజీవి పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: తన సినిమానే చూస్తూ నిద్రపోయిన స్టార్ హీరోయిన్.. అతని ప్రేయసి గురించి చెప్పేసిన చిరంజీవి.. -
బాలీవుడ్ హీరోలు ఆ విషయంలో భయపడుతున్నారు: అక్షయ్ కుమార్
Akshay Kumar Says Bollywood Actors Scared To Do Multi Starrer Movies: అత్యధిక పాపులారిటీ సంపాదించుకున్న షోలలో 'కాఫీ విత్ కరణ్' టాక్షో ఒకటి. ప్రముఖ బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ షో ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకుని ఏడో సీజన్ను ప్రారంభించింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో జులై 7 నుంచి స్ట్రీమింగ్ అవుతోన్న ఈ షోలో సినీ సెలబ్రిటీలు సందడి చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఏడో సీజన్లో అలియా భట్-రణ్వీర్ సింగ్, బీ టౌన్ బెస్ట్ ఫ్రెండ్స్ జాన్వీ కపూర్-సారా అలీ ఖాన్ పాల్గొని అలరించారు. తాజాగా మూడో ఎపిసోడ్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ షోలో మల్టీస్టారర్ గురించి అక్షయ్ కుమార్ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. హిందీ హీరోలు మల్టీ స్టారర్ చిత్రాల్లో నటించడం గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఓర్మాక్స్ పాపులారిటీ సర్వేలో సమంత, అక్షయ్ కుమార్ మొదటి స్థానంలో ఉన్నారు. మీరిద్దరూ టాప్ లిస్ట్లో ఎలా ఉన్నారని కరణ్ ప్రశ్నించగా.. 'నటీనటులందరూ కష్టపడి పనిచేయడమే ఇందుకు కారణం. సాధారణంగా బాలీవుడ్ యాక్టర్స్ మల్టీ స్టారర్ చిత్రాలు చేయడానికి భయపడతారు. సింగిల్ హీరో సినిమాలకే ఎక్కవగా ప్రాధాన్యత ఇస్తారు. మరో హీరోతో కలిసి పనిచేయడంలో అభద్రతా భావం ఉంది. మీకు నచ్చిన పాత్ర తీసుకోమ్మని చెప్పినా కూడా నో చెప్పిన సందర్భాలున్నాయి. దినిని విడిచిపెట్టాలి. నేను, కరణ్ నిర్మిస్తున్న సినిమాలో సెకండ్ హీరో కావాలనుకున్నాం. కానీ ఇప్పటివరకు కూడా ఏ హీరో ఒప్పుకోలేదు' అని అక్షయ్ షాకింగ్ విషయాలు తెలిపాడు. చదవండి: మాజీ భార్యతో స్టార్ హీరో స్పెషల్ డిన్నర్.. ఫొటోలు వైరల్ కరీనా కపూర్ మళ్లీ ప్రెగ్నెంట్ !.. అతను ఇప్పటికే చాలా చేశాడని పోస్ట్ కాగా ప్రస్తుతం అక్షయ్ కుమార్ రామ సేతు, ఓ మై గాడ్ 2, సెల్ఫీ, రాట్ససన్ రీమేక్, క్యూప్సూల్ గిల్, గూర్ఖా, బడే మియాన్ చోటే మియాన్, సూరరై పోట్రు రీమేక్ చిత్రాల్లో నటిస్తున్నాడు. -
వాళ్లను విశ్లేషించడం మూర్ఖత్వం!
‘‘నాకు తెలిసిన ఓ రిటైర్డ్ పోలీసాఫీసర్ కొండా మురళిగారి గురించి చెప్పారు. ఆ తర్వాత మాజీ నక్సలైట్లతో మాట్లాడాను. కథ ఒక కొలిక్కి వచ్చాక కొండా ఫ్యామిలీని కలిసి, సినిమా గురించి చెబితే వారు ఒప్పుకున్నారు’’ అని దర్శకుడు రామ్గోపాల్ వర్మ అన్నారు. కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘కొండా’. త్రిగుణ్, ఇర్రా మోర్ జంటగా నటించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ సమర్పణలో ఆపిల్ ట్రీ, ఆర్జీవీ ప్రొడక్షన్పై కొండా సుష్మితా పటేల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు రామ్గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘కొండా మురళి, సురేఖల కాలేజీ జీవితం నుంచి రాజకీయ రంగ ప్రవేశం వరకు (1990 నుంచి 2000) ఈ సినిమా ఉంటుంది. కొండా దంపతుల కుమార్తె సుష్మిత ఈ చిత్రనిర్మాత కాబట్టి వాళ్లకు పాజిటివ్గా తీయలేదు.. తను నిర్మాత కాకున్నా నేను అనుకున్నది తీసేవాణ్ణి. ప్రస్తుతం ‘లడకీ’ అనే ఓ హిందీ చిత్రం తీశాను. అమితాబ్ బచ్చన్గారితో ఓ హారర్ సినిమా ప్లాన్ చేస్తున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండవు. మనం చేసేది మనం చేస్తాం.. పరిస్థితులు ఇంకోటి చేస్తాయి. నాలుగు నెలల క్రితం ‘సినిమా టికెట్ రేట్లు తగ్గించి సినిమాలను చంపేస్తున్నారు’ అన్నారు. ఆ తర్వాత రేట్లు పెంచారు. ఇప్పుడు మళ్లీ తగ్గించారు. పరిస్థితులను బట్టి మారాల్సి వస్తుంది. ప్రేక్షకుడిని, ఎన్నికల్లో ఓటు వేసేవాళ్లను విశ్లేషించడమంత మూర్ఖపు పని ఇంకొకటి ఉండదు’’ అన్నారు రామ్గోపాల్ వర్మ. -
ముసలిదానివైపోతున్నావ్.. అంటూ అనసూయపై కామెంట్లు
Netizens Comments On Anasuya Latest Photos: బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అటు యాంకరింగ్తోపాటు అప్పుడప్పుడు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో అలరిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎప్పుడూ అలరిస్తూనే ఉంటుంది. ఇటీవల ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం 'పుష్ప: ది రైజ్'లో దాక్షాయణిగా మరింత పేరు తెచ్చుకుంది అనసూయ. రవితేజ ఖిలాడీ మూవీలో రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ బ్యూటీఫుల్ యాంకర్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. దర్జా, వాంటెడ్ పండుగాడ్, గాడ్ ఫాదర్ తదితర చిత్రాల్లో నటిస్తూ ఫుల్ జోష్లో ఉంది. సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు పెడుతూ ఎంటర్టైన్ చేస్తుంది అనసూయ. అయితే అప్పుడుప్పుడు వాటితో పలు విమర్శలు కూడా ఎదుర్కొంటుంది. ఆ విమర్శలకు తిరిగి దిమ్మతిరిగే కౌంటర్లు కూడా ఇస్తుంటుంది ఈ బ్యూటిఫుల్ యాంకర్. తాజాగా మరోసారి తను పెట్టిన ఫొటోలపై విమర్శలు గుప్పించారు నెటిజన్స్. 'ముసలి దానిలా కనిపిస్తున్నావ్', 'ముఖంలో గ్లో తగ్గింది', 'మేకప్ సరిగ్గా వేసుకోలేదా ?', 'అసలైన వయసు బయటపడింది', 'మేకప్, డ్రెస్సింగ్ బాలేదు', 'ముడతలు కనిపిస్తున్నాయ్', 'కొంచెం ఏజ్డ్గా ఉన్నారు' అంటూ నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. వీటితోపాటు పలువురు అభిమానులు 'చాలా అందంగా ఉన్నారు', 'లుకింగ్ నైస్', 'వావ్', 'బ్యూటిఫుల్' అంటూ పొగుడుతున్నారు. మరీ ఈ కామెంట్స్పై అనసూయ ఏమైనా స్పందిస్తుందో చూడాలి. చదవండి: తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకునేలా ఉన్నావని నాన్న అన్నారు: సాయి పల్లవి చికిత్స కోసం అమెరికా వెళ్లిన నటుడు.. ఎయిర్పోర్టులో ఎమోషనల్ View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
నాకు మూడు ఫ్యామిలీలు ఉన్నాయి: అనిల్ రావిపూడి
Anil Ravipudi Says I Have 3 Families Comments Viral In F3 Success Meet: విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ తమన్నా, బ్యూటిఫుల్ హీరోయిన్స్ మెహరీన్, సోనాల్ చౌహన్ కలిసి నటించిన ఫన్ అండ్ ఫ్రస్టేషన్ మూవీ 'ఎఫ్ 3' (F3). ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. మే 27న విడుదలైన ఈ మూవీ విజయవంతంగా దూసుకుపోతోంది. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు ఆడియెన్స్. ఇప్పటివరకు ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 27.55 కోట్లు కలెక్ట్ చేసిందని సమాచారం. సినిమా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న సందర్భంగా సోమవారం (మే 30) సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్లో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'థంబ్నేయిల్స్ పెట్టుకోండి. నాకు మూడు ఫ్యామీలులు ఉన్నాయి. ఒక ఫ్యామిలీ ఇంటి దగ్గర ఉంటే మరో ఫ్యామిలీ ఇక్కడున్న నా చిత్రబృందం. అలాగే నా మూడో కుటుంబం ప్రేక్షకులు.' అని అనిల్ రావిపూడి తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ‘‘కరోనా తర్వాత ‘అఖండ’, ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’, ‘భీమ్లానాయక్’, ‘సర్కారు వారి పాట’ చిత్రాలు ప్రేక్షకులను థియేటర్స్కు తీసుకుని వచ్చాయి. ఇప్పుడు ‘ఎఫ్ 3’ తీసుకొచ్చింది. విడుదలైన రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురుస్తోంది. నైజాంలోనే తొమ్మిది లక్షల యాభైవేలమంది ప్రేక్షకులు చూశారు. తెలుగు సినిమాకు పూర్వవైభవం తీసుకువచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. చదవండి: అలా ప్రచారం చేయడం సరి కాదు: కమెడియన్ అలీ భార్యతో కలిసి నటించిన యశ్ సినిమా.. -
దోచుకోవడం దాచుకోవడం స్కీం తో గత ప్రభుత్వం పనిచేసింది: ఆర్కే రోజా
-
అక్షయ్, అజయ్పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్..
Kangana Ranaut Shocking Comments On Akshay Kumar Ajay Devgn: బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ తాజాగా నటించిన చిత్రం 'ధాకడ్'. స్పై యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీ మే 20న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్లపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాగే బాలీవుడ్పై తనకున్న అసంతృప్తిని వ్యక్తం చేసింది. బాలీవుడ్ తనకు సపోర్ట్ చేయదని ఎప్పటినుంచో చెప్పుకొస్తుంది కాంట్రవర్సీ బ్యూటీ కంగనా రనౌత్. తాజాగా 'అజయ్ దేవగణ్ నా సినిమాను ఎప్పటికీ ప్రమోట్ చేయడు. కానీ ఇతర చిత్రాలను ప్రమోట్ చేస్తాడు. ఇక అక్షయ్ కుమార్ నాకు కాల్ చేసి తలైవి సినిమా బాగుందని చెబుతాడు. కానీ ఆ మూవీ ట్రైలర్ను షేర్ చేయడం, ట్వీట్ చేయడం మాత్రం చేయడు. కాబట్టి వారి గురించి నేను ఏం మాట్లాడలేను. అలాగే అమితాబ్ బచ్చన్ నా సాంగ్ టీజరన్ను ట్వీట్ చేసి వెంటనే దాన్ని తొలగించారు. ఆ విషయం గురించి కూడా నేను మాట్లాడను. అజయ్ దేవగణ్ ఇతరులు చేసిన మహిళా ప్రాధాన్యత చిత్రాల్లో నటిస్తారు. కానీ చిత్రాల్లో నటించరు. ఎందుకంటే నా సినిమాల్లో నాకే ఎక్కువ పేరు వస్తుందని. ఇప్పుడు నా సినిమాకు సపోర్ట్ చేసిన అర్జున్ రాంపాల్పై ఎలా కృతజ్ఞతతో ఉంటానో, నా సినిమాలో అజయ్ దేవగణ్ నటించిన అలాగే గొప్పగా ఫీల్ అవుతా.' అని తెలిపింది కంగనా రనౌత్. ఇతరుల సినిమాలను ప్రమోట్ చేయడంపై కంగనా రనౌత్ మాట్లాడుతూ 'నేను ఇతరుల సినిమాలను సపోర్ట్ చేసినట్లుగానే నా సినిమాలు ఇతరులు సపోర్ట్ చేయాలని కోరుకుంటాను. ది కశ్మీర్ ఫైల్స్, షేర్షా వంటి చిత్రాలను అభినందించడానికి, ప్రమోట్ చేసేందుకు నేను ఎప్పుడు ముందుంటాను. నేను సిద్ధార్థ మల్హోత్రా గురించి, కరణ్ జోహార్ చిత్రాలను కూడా మెచ్చుకున్నాను. నేను ప్రశంసించాలనుకుంటే బహిరంగానే చేస్తాను. ఎవరికీ తెలియకుండా కాల్ చేసి చెప్పను. ఈ పరిస్థితి మారి నాలాగే వారు కూడా భవిష్యత్తులో నా సినిమాలపై స్పందిస్తారని అనుకుంటున్నా.' అని తెలిపింది. -
బాలీవుడ్పై మరోసారి ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్..
Ram Gopal Varma Says Bollywood Should Make Films Only For OTT: సంచనాల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రూటే సెపరేటు. నిత్యం సెలబ్రిటీలను, ఇండస్ట్రీపై సెటైరికల్గా కామెంట్స్ చేస్తూ కవ్విస్తూ ఉంటాడు. అందరికంటే భిన్నంగా వ్యాఖ్యలు చేస్తూ తరచు వార్తల్లో నిలుస్తారు. సెన్సేషన్ కామెంట్స్ చేయండలో కేరాఫ్ అడ్రస్గా మారారు వర్మ. ఇటీవల సౌత్ ఇండియా నుంచి ఆర్ఆర్ఆర్, పుష్ప కేజీఎఫ్ 2 సినిమాలు విడదలై సూపర్ సక్సెస్ సాధించగా, ఆర్జీవీ బాలీవుడ్పై వరుస కామెంట్లు చేసిన విషయం తేలిసిందే. తాజాగా 'బాలీవుడ్ నన్ను భరించలేదు' అని సూపర్ స్టార్ మహేశ్ బాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతోంది. ఈ క్రమంలో మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు ఆర్జీవీ. థియేటర్లలో సౌత్ ఇండియా చిత్రాలు సక్సెస్ సాధించడం, నార్త్ మూవీస్ పరాజయం పొందడం చూస్తుంటే త్వరలోనే బాలీవుడ్ కేవలం ఓటీటీల కోసమే సినిమాలు తెరకెక్కించే పరిస్థితి కనిపిస్తోంది. అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. మరీ ఇప్పుడు ఈ వాఖ్యలు కొత్త చర్చకు దారితీస్తాయేమో చూడాలి. ఇదిలా ఉంటే ఇటీవల కన్నడ స్టార్ హీరో సుదీప్, బాలీవుడ్ పాపులర్ హీరో అజయ్ దేవగణ్ మధ్య జరిగిన ట్వీట్స్ వార్ తెలిసందే. చదవండి: హీరోల మధ్య ట్వీట్ల వార్, బాలీవుడ్ స్టార్స్పై వర్మ సంచలన కామెంట్స్ The way SOUTH films seem to be going in theatres and NORTH films don’t seem to be going, it looks like BOLLYWOOD should be soon making films only for OTT 😳 — Ram Gopal Varma (@RGVzoomin) May 13, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
విశ్వక్ సేన్-టీవీ యాంకర్ వీడియోపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్..
Ram Gopal Varma Reacts To Vishwak Sen TV Anchor Video: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా రుక్సార్ దిల్లాన్ హీరోయిన్గా నటించిన చిత్రం అశోకవనంలో అర్జున కల్యాణం. విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ స్పీడ్ చేసిన చిత్ర బృందం ఓ ప్రాంక్ వీడియోతో విమర్శల పాలైంది. ఈ క్రమంలోనే విశ్వక్ సేన్, చిత్ర పరిశ్రమకు చెందిన త్రిపురనేని చిట్టితో డిబెట్ నిర్వహించింది ప్రముఖ టీవీ ఛానెల్. అయితే ఈ డిబెట్లో యాంకర్కు విశ్వక్ సేన్ మధ్య మాటల యుద్ధం జరిగింది. విశ్వక్ సేన్ను స్టూడియో నుంచి 'గెట్ అవుట్' అంటూ యాంకర్ గట్టిగా అరిచిన వీడియో ప్రస్తుతం నెట్టింట షేక్ చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియోపై తాజాగా సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ ట్విటర్ వేదికగా స్పందించారు. 'ఒక పురుషుడి కన్నా పవర్ఫుల్గా ఒక మహిళ కనిపించడం నేను ఇంతవరకు చూల్లేదు. ఆమె సర్కార్ కన్నా తక్కువేం కాదు' అంటూ ఆ యాంకర్ను ట్యాగ్ చేశాడు ఆర్జీవీ. కాగా ప్రాంక్ వీడియో కారణంగా ఇప్పటికే హీరో విశ్వక్ సేన్పై అరుణ్ కుమార్ అనే లాయర్ హ్యుమన్ రైట్స్ కౌన్సిల్లో (హెచ్ఆర్సీ) ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. చదవండి: ‘గెట్ అవుట్’ అంటూ విశ్వక్ సేన్పై టీవీ యాంకర్ ఫైర్ హీరో విశ్వక్ సేన్పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు I never saw a woman looking so much more powerful than a man 💪😍💪 @Devi_Nagavalli is no less than SARKAR 🙏🙏🙏 pic.twitter.com/QbJIMTbR0K — Ram Gopal Varma (@RGVzoomin) May 2, 2022 -
దర్శకుడు మోసం చేశాడు, ఆ ఫొటోలు నా జీవితానికి మచ్చ తెచ్చాయి: నటి
‘విక్రమార్కుడు’ మూవీ ఫేం, ప్రముఖ నటి జయవాణి ఓ దర్శకుడిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె పలు ఆసక్తికర సంఘటనలతో పాటు తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. ‘కెరీర్ ప్రారంభంలో.. నేను నల్లగా ఉన్నానని, నటిగా పనికి రాను అంటూ తీవ్రంగా అవమానించారు. చదవండి: బాబోయ్ ఇలియాన సాహసం, అలాంటి ఫొటో షేర్ చేసిందేంటి! అదే సమయంలో ఓ డైరెక్టర్ సినిమాలో చాన్స్ ఉంది చేస్తావా? అని అడిగారు. వెంటనే నేరు ఒకే చెప్పాను. ఆ తర్వాత నన్ను ఫొటోషూట్కు రమ్మని చెప్పాడు. ఫొటోషూట్ తర్వాత ఆయన నుంచి నాకు ఎలాంటి పిలుపు రాలేదు. కనీసం ఫోన్కాల్ కూడా లేదు. అలా ఆ దర్శకుడు నన్ను మోసం చేశాడు’ అంటూ తనకు ఎదురైన చేదు అనభవాన్ని గుర్తు చేసింది. అయితే అప్పుడు తను ఇచ్చిన ఫొటోషూట్ ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో లీక్ చేశారని, అవి చూసి అందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. వాటి వల్ల బంధువులు, సన్నిహితులు నాతో మాట్లాడటం మానేశారని తెలిపింది. చదవండి: అల్లు అర్జున్పై ట్రోల్స్, నెటిజన్ల మండిపాటు అలా ఆ ఫొటోలు తన కెరీర్కే ఓ మచ్చగా నిలిచిపోయాయంటూ జయవాణి వాపోయింది. అయితే వాటిని వెబ్సైట్లో ఎవరూ పెట్టారనేది ఇప్పటికి తనకు తెలియదని పేర్కొంది. కాగా విజయవాడలో జన్మించిన జయవాణి బి.ఏ. వరకు చదివింది. చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి ఉండడంతో ఈ రంగంలోకి అడుపెట్టింది. మొదట ‘రండి లక్షాధికారి కండి’ అనే టీవీ సీరియల్తో పరిచమైంది. ఆ తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ అర్టిస్ట్గా గుర్తింపు చెచ్చుకుంది. అయితే ఇన్ని సినిమాల్లో నటించిన అనుకున్నంత ఫేం రాకపోవడానికి కారణం సరైన ప్లానింగ్ లేకపోవడమేనని జయవాణి చెప్పింది. -
ధనుష్-ఐశ్వర్య డివోర్స్.. ఫ్యాన్స్ షాకింగ్ రియాక్షన్స్
Dhanush Aishwarya Divorce Fans Shocking Reactions: తమిళ స్టార్ హీరో ధనుష్కు ఎనలేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కోలీవుడ్లోనే కాకుండా వివిధ చిత్ర పరిశ్రమలో అభిమానులు ఉన్నారు. టాలీవుడ్, బాలీవుడ్ అంటూ తేడా లేకుండా ధనుష్కు ప్రత్యేకమైన స్థానం ఉంది. సూపర్ స్టార్ రజనీ కాంత్ అల్లుడిగా కాకుండా తనకంటూ సొంత బ్రాండ్ ఇమేజ్ ఏర్పర్చుకున్నాడు ధనుష్. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో రాంజన సినిమాతో హిందీలో తెరంగ్రేటం చేశాడు. తర్వాత పలు హిందీ చిత్రాల్లో నటించడమే కాకుండా, ధనుష్ చిత్రాలు కొన్ని వివిధ భాషల్లో విడుదలయ్యాయి. ఇలా ధనుష్ వివిధ వర్గాల ప్రేక్షకులను అలరించాడు. ఇదీ చదవండి: ధనుష్-ఐశ్వర్య విడాకులపై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్లు.. ధనుష్ హీరోగానే కాకుండా గాయకుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన పాడిన 'కొలవెరి ఢీ' సాంగ్ ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే తాజాగా తన భార్య ఐశ్వర్యతో విడాకులు తీసుకుంటున్నట్లు సోమవారం ప్రకటించాడు ధనుష్. టాలీవుడ్ క్యూట్ కపుల్ సమంత, నాగచైతన్య విడాకుల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రేక్షకజనానికి ధనుష్ ప్రకటన షాక్కు గురి చేసింది. ధనుష్ అభిమానులు బాధ అయితే వర్ణనాతీతం. ఏం చేయాలో తెలియక సోషల్ మీడియాలో తమ బాధను వెల్లబోసుకుంటున్నారు ధనుష్ అభిమానులు. ఇదీ చదవండి: విడాకుల ప్రకటనకు ముందు రజనీకి ధనుష్ ఫోన్ కాల్.. కారణం ఇదేనా? That's unexpected and shocking! The reasons behind the break-up are none of our business. Media and fans should give them the space they need. We just wish #Dhanush and @ash_r_dhanush sis all the best for the future! Be strong Thalaivaa @rajinikanth ❤️😢 pic.twitter.com/v4cRtclPXn — 𝗩 𝗠 𝗧 ツ | 𝗔 𝗞 (@VMT_0fficial) January 17, 2022 This icons picture becomes meaningless now😢...#dhanush whyyyyy???????? @rajinikanth love you thalaivaaa pic.twitter.com/wc6jpsTIBM — elsa (@elsa_Amna) January 17, 2022 🥺😢 Please Be Strong Thalaiva @rajinikanth❤ #Dhanush #AishwaryaDhanush pic.twitter.com/iovD0lD5Lp — Rajan (@Subash1899) January 17, 2022 Kind request to all not to make fun of #Dhanush & #AishwaryaD separation You don't know how it affects when we are in a situation to leave our loved one 💔 It's heartbreaking one but still we respect you both @dhanushkraja & @ash_r_dhanush ❤️ Stay strong @rajinikanth sir 🥺 pic.twitter.com/FanxThypae — RaGuVaRaN (@MemesSingle) January 17, 2022 Shocking 🥺🥺 💔💔 Dhanush & Aiswarya divorce #Dhanush #aishwarya #Rajinikanth #divorce #tamilcinema pic.twitter.com/3Tb8dp082B — Salam Mass (@SALAMMASS1) January 17, 2022 This one is not even an year old ra 💔#Dhanush pic.twitter.com/9k3I2zc4Q7 — Troll Cinema ( TC ) (@Troll_Cinema) January 17, 2022 Despite of the Issue inside his family, this Man greeted his fans(Pongal) at his door step with Smile on his face to give the due respect to his fans gathered ❤️🙏 Anta Manasu Tan Sir Kadavul😍 Stay Strong Thalaivaa!🙏#Rajinikanth #Thalaivar @rajinikanth#Dhanush pic.twitter.com/QQk1ihmtJ8 — ONLINE RAJINI FANS🤘 (@OnlineRajiniFC) January 17, 2022 -
సిరికి కనెక్ట్ అవ్వడం వల్లే ఓడిపోయాను : షణ్నూ
Shannu Shocking Comments On Relationship With Siri: యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్.. అదే క్రేజ్తో బిగ్బాస్ సీజన్-5లో ఎంట్రీ ఇచ్చి టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగాడు. మొదట్లో బాగానే ఉన్నా తర్వాత సిరితో రిలేషన్, పదేపదే హగ్గులతో విపరీతమైన నెగిటివిటీ మూటగట్టుకున్నాడు. హగ్గులు నచ్చడం లేదని స్వయంగా సిరి తల్లి వచ్చి చెప్పినా ఇద్దరూ తీరు మార్చుకోలేదు. పదేపదే ఫ్రెండిష్ హగ్గంటూ శృతిమించి ప్రవర్తించారు. దీంతో సోషల్మీడియాలో వీరిద్దరూ విపరీతంగా ట్రోల్స్ బారిన పడ్డారు. షణ్నూతో ఫ్రెండిష్ సిరికి ఓటింగ్ విషయంలో కాస్త కలిసి వచ్చినా షణ్నూకి మాత్రం బాగా దెబ్బతీసింది. సిరితో రిలేషన్ వల్లే విన్నర్ అవ్వాల్సిన షణ్నూ..రన్నరప్ అయ్యాడనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. తాజాగా ఇదే విషయాన్ని బిగ్బాస్ బజ్ ఇంటర్వ్యూలో అరియానా ప్రశ్నించగా ఫణ్నై సైతం అంగీకరించడం విశేషం. సిరితో కనెక్ట్ కావడం వల్లే రన్నరప్గా బయటకు వచ్చాను అని అనుకుంటున్నారా అని అరియానా ప్రశ్నించగా.. అదే జరిగింది అంటూ తన మనసులో మాటను బయటపెట్టేశాడు. సిరితో రిలేషన్ వల్ల టైటిల్ కోల్పోతానని తనకి ముందే తెలిసినా తన ఎమోషన్స్ని ఫేక్ చేయలేనని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుంది. చదవండి: షణ్నూ చాలా స్పెషల్, బయట కూడా అలాగే ఉంటాం: సిరి సిరికి చుక్కలు చూపించిన అరియానా.. ప్రతి ప్రశ్నలో కౌంటర్ అటాక్ -
'బిగ్బాస్ హౌస్ లవర్స్ అడ్డాగా మారింది.. వీడియోలు ఉన్నాయి'
Actress Madhavi Latha Shocking Comments on Bigg Boss Telugu 5 Show: బుల్లితెరపై బిగ్బాస్ షోకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టెలివిజన్ తెరపై టాప్ టీఆర్పీ రేటింగులతో దూసుకుపోతుంది ఈ షో. ఇక మిగతా భాషల్లో మాదిరిగానే తెలుగు బిగ్బాస్ షోలో సైతం లవ్ ట్రాక్లు కామనే. రీసెంట్గా షణ్నూ-సిరిల వ్యవహారశైలిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ బయట వేరేవాళ్లతో రిలేషన్ షిప్లో ఉన్నప్పటికీ హౌస్లో మాత్రం బాగా కనెక్ట్ అయిపోయారు. జెస్సీ వెళ్లిపోయాక వీరిద్దరి బంధం మరింత బలపడింది. ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయిపోతున్నాం అంటూనే దూరంగా ఉండలేకపోతున్నారు. తాజాగా బిగ్బాస్ షోలో జరుగుతున్న పరిణామాలపై నటి మాధవీలత సోషల్ మీడియాలో వరుస కామెంట్లు చేస్తుంది. బిగ్బాస్ హౌస్ లవర్స్ అడ్డాగా మారిందని ఫైర్ అయ్యింది. 'బిగ్ బాస్లో రగులుతోంది మొగలిపొద సీన్స్ జరిగాయి..ఆ వీడియోలు, ఫోటోలు నా దగ్గరకు వచ్చాయి. కానీ వాటిని పబ్లిష్ చేయడం కల్చర్ కాదు' అంటూ మరో సంచలనానికి తెరదీసింది. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్లో మాధవీలత చేసిన ఈ కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. టెలికాస్ట్ కాని కంటెంట్ ఉందంటే..హౌస్లో ఇంకెన్ని దారుణాలు జరుగుతున్నాయో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
స్టార్ హీరోలపై తాప్సీ సంచలన వ్యాఖ్యలు
‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో వెండితెరకు హీరోయిన్గా పరిచయమయ్యారు తాప్సీ పన్ను. మంచి సినిమాలు ఎంపిక చేసుకుంటూ తక్కువ కాలంలో టాప్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత టాలీవుడ్ ఇచ్చిన గుర్తింపుతో సడన్గా బాలీవుడ్కు మకాం మార్చారు. అక్కడ వైవిధ్యమైన చిత్రాలను చేస్తూ తానేంటో నిరూపించుకుంటున్నారు. అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయారు. చదవండి: షారూఖ్ ఖాన్కు ఎందుకు విషెష్ చెప్పలేదు? అటు వెండితెరపైనే కాకుండా.. డిజిటల్ రంగంలోనూ సత్తా చాటుతున్నారు. మరోవైపు.. హీరోయిన్గా చేస్తూనే.. ప్రొడ్యూసర్గానూ మారి తన చిత్రాలను నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా ఆమె నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘రష్మీ రాకేట్’ చిత్రం అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో తాప్సీ పలు ఛానల్లకు ఇంటర్వ్యూలో ఇస్తూ బీజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టార్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హీరోయిన్లకు పేరు వచ్చే సినిమాల్లో నటించేందుకు చాలా మంది హీరోలు ఇష్టపడరంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. చదవండి: బాలీవుడ్ డ్రగ్స్ కేసు.. మరో కొత్త విషయం వెలుగులోకి.. ఇక సినిమాల్లో పురుషాధిక్యతపై స్పందిస్తూ.. ‘ఒక సినిమాలో నాది డబుల్ రోల్. అందులో హీరో పాత్ర కోసం ఓ నటుడిని నిర్మాతలు సంప్రదించారు. అయితే ఆ హీరో నాతో నటించేందుకు ఒప్పుకోలేదు. నిజానికి ఆయన నాతో అంతకుముందు ఓ సినిమా కూడా చేశారు. ఆయన ఓ పెద్ద స్టార్ అయినప్పటికీ నాతో నటించడానికి ఆయన అభద్రత భావంగా ఫీల్ అయ్యారు. అది నిజంగా బాధాకరం. ఒకటి రెండు సినిమాలు చేసిన హీరోలు కూడా ఆ పాత్ర చేయడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే అది మహిళ ప్రాధాన్యత ఉన్న చిత్రం. దీంతో ప్రేక్షకుల మార్కులు హీరోయిన్ పాత్రకు పడతాయనే ఉద్దేశంతోనే వారు ఆ సినిమాలో నటించేందుకు ఒప్పుకోలేదు’ అంటూ తాప్సీ వివరించారు. -
'రకుల్ పెళ్లి ఆగిపోతుంది.. జైలుకు వెళ్లే అవకాశం'!
Venu Swamy Shocking Comments On Rakul Preet Singh Marraige: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి ఎంగేజ్మెంట్ వరకు వచ్చి ఆగిపోతుందని, ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి తెలిపారు. ఒకవేళ వివాహం జరిగినా విడిపోతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా హీరో, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్న రకుల్ ఈ విషయాన్ని ఇటీవలె ప్రకటించిన సంగతి తెలిసిందే. తన 31 వ పుట్టినరోజు సందర్భంగా జాకీ భగ్నానీతో తన రిలేషన్ను బయటపెట్టింది. చదవండి: చార్ ధామ్ యాత్ర: ప్రత్యేక పూజలు నిర్వహించిన సామ్ త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కనుంది. అయితే రకుల్- జాకీ భగ్నానీల జాతకాన్ని పరిశీలించిన అనంతరం వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. జాకీ భగ్నానీది మకర రాశి అని, ఆయన జాతకంలో శని దృష్టి చంద్రుడు, శుక్రుడిపై ఉన్నందున వివాహానికి సంబంధించిన సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. ఇక రకుల్ది మిధున రాశి అని, ఆమె జాతకంలో గురువు, కేతువు కలిసి ఉండటం వల్ల కుటుంబం సౌఖ్యం ఉండదని చెప్పుకొచ్చారు. రకుల్ ప్రీత్ సింగ్- జాకీ భగ్నానీల పెళ్లి నిశ్చితార్థం వరకు వచ్చి ఆగిపోతుంది. ఒకవేళ పెళ్లి జరిగినా ఆ తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. సంతానం కలగకపోవడం సహా న్యాయ పరమైన ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా రకుల్ ఓ కేసు విషయమై జైలు కెళ్లే అవకాశం ఉంది అని షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో సమంత- నాగచైతన్యల వివాహానికి సంబంధించి వేణుస్వామి చెప్పింది నిజమైంది. భార్యభర్తలుగా ఇక కొనసాగలేమంటూ చై-సామ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి రకుల్ విషయంలో వేణు స్వామి చెప్పింది జరుగుతుందో లేదో చూడాల్సి ఉంది. చదవండి: ChaySam Divorce: పెళ్లికి ముందే చెప్పారు.. సమంత-నాగ చైతన్య విడిపోతారని.. నేను అనుకున్నది నిజమైంది.. నా కల నెరవేరింది: సమంత -
అమ్మాయిలకు అర్ధరాత్రి బీచ్లో ఏం పని? గోవా సీఎం వ్యాఖ్యలు
పనాజీ: గోవాలో బాలికలపై అత్యాచారం సంఘటనపై అధికార పక్షంపై ప్రతిపక్షాలు ముప్పేట దాడి చేస్తున్నాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని.. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. ఇదే విషయాన్ని అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు ప్రస్తావించగా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బాధితుల కుటుంబసభ్యుల తీరును తప్పుబట్టారు. అర్ధరాత్రి పిల్లలను బయటకు ఎందుకు పంపాలి? బీచ్లో వారికేం పని? సీఎం ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమవుతున్నాయి. జూలై 24వ తేదీన రాజధాని పనాజీకి 30 కిలో మీటర్ల దూరంలోని కోల్వా బీచ్లో ఓ పార్టీ జరిగింది. మొత్తం పది మంది బాలబాలికలు హాజరయ్యారు. పార్టీ అయిపోయాక వారిలో 6 మంది ఇళ్లకు వెళ్లారు. మిగతా నలుగురిలో ఇద్దరు చొప్పున అమ్మాయిఅబ్బాయిలు రాత్రంతా బీచ్లోనే ఉండిపోయారు. ఆ సమయంలో అటుగా వచ్చిన వారు కొందరు అమ్మాయిలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన గోవాలో సంచలనంగా మారింది. తాజాగా బుధవారం (జూలై 28) జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు అత్యాచారం అంశంపై చర్చకు ప్రతిపాదించారు. ఈ చర్చలో ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పై వ్యాఖ్యలు చేశారు. అర్ధరాత్రి పిల్లలు బయటకు వెళ్లారంటే.. తల్లిదండ్రులకు బాధ్యత లేదా? వారి బాధ్యతారాహిత్యంపై ప్రభుత్వం, పోలీసులను తప్పుబట్టడం సరికాదు’ అని సీఎం సావంత్ తీవ్రంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. అయితే అత్యాచారం ఘటనలో నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. -
‘కోచ్ అవాక్కయ్యాడు.. తప్పు తెలుసుకుని క్షమాపణలు కోరా’
ముంబై: 2011 ప్రపంచకప్ సమయంలో టీమిండియా మెంటల్ కండిషనింగ్ కోచ్గా వ్యవహరించిన ప్యాడీ అప్టాన్ సంచలన విషయాలను వెల్లడించాడు. తాను రచించిన పుస్తకం 'ద బేర్ఫుట్ కోచ్'లో ఈ షాకింగ్ విషయాలను ప్రస్తావించాడు. భారత్ను రెండోసారి విశ్వ విజేతగా నిలిపిన ఆ ప్రపంచకప్లోని మ్యాచ్లకు ముందు టీమిండియా ఆటగాళ్లను సెక్స్ చేయాల్సిందిగా సూచించినట్లు పేర్కొన్నాడు. అయితే తాను ఇచ్చిన ఈ సలహాకు నాటి హెడ్ కోచ్ గ్యారీ కిర్స్టెన్ అవాక్కయ్యాడని తెలిపాడు. ఆతర్వాత తన సలహా సరైంది కాదని భావించి క్షమాపణలు కోరినట్లు ప్యాడీ అప్టాన్ ప్రస్తావించాడు. అంతకుముందు 2009 ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా తాను ప్లేయర్స్ కోసం నోట్స్ సిద్ధం చేశానని, అందులో సెక్స్ వల్ల కలిగే ప్రయోజనాలను సవివరంగా రాశానని దక్షిణాఫ్రికాకు చెందిన ఈ మానసిక నిపుణుడు చెప్పాడు. కాగా, గేమ్కు ముందు సెక్స్ చేయడం వల్ల ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేయగలరా అంటే కచ్చితంగా అవుననే అంటున్నాడు అప్టాన్. దీంతో పాటు రాహుల్ ద్రవిడ్ను శ్రీశాంత్ తిట్టడం, ధోనీ కెప్టెన్సీపై నాటి జట్టులో భిన్నాభిప్రాయాలు తదితర ఆసక్తికర అంశాలను ఆయన తన పుస్తకంలో ప్రస్తావించాడు. ఇదిలా ఉంటే, నాటి టీమిండియా కోచ్ గ్యారీ కిర్స్టెన్.. ప్యాడీ అప్టాన్ను పట్టుపట్టి మరీ మెంటల్ కండిషనింగ్ కోచ్గా అపాయింట్ చేసుకున్నాడు. వీరిద్దరు కోచ్లుగా వ్యవహరిస్తుండగా ధోనీ హయాంలో టీమిండియా 28 ఏళ్ల తర్వాత రెండోసారి వన్డే ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. నాటి ప్రపంచకప్లో టీమిండియా కేవలం ఒక్క మ్యాచ్లో(దక్షిణాఫ్రికా) మాత్రమే ఓటమి చవిచూసింది. లీగ్ దశలో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్ టైగా ముగిసింది. అనంతరం క్వార్టర్స్లో నాటి డిఫెండింగ్ ఛాంపియన్ ఆసీస్కు షాక్ ఇచ్చిన ధోని సేన.. సెమీస్లో చిరకాల ప్రత్యర్ధి పాక్కు మట్టికరిపించి ఫైనల్కు చేరింది. తర్వాత తుది పోరులో పట్టిష్టమైన శ్రీలంకకు షాకిచ్చి రెండోసారి జగజ్జేతగా అవతరించింది. -
స్కూలు ఫీజులు పెంచారని చెబితే.. వెళ్లి చావండన్న మంత్రి
భోపాల్: స్కూళ్లలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని తమ గోడును వెళ్లబోసుకోవడానికి వెళ్లిన పేరెంట్స్పై సాక్షాత్తు విద్యాశాఖ మంత్రే నోరు పారేసుకున్న ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. భోపాల్లోని స్కూలు పిల్లల తల్లిదండ్రులు మధ్యప్రదేశ్ పాలక్ మహాసంఘ్ అనే బ్యానర్ కింద ఓ యూనియన్గా ఏర్పడి, అధిక ఫీజుల విషయమై ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్ను కలిసేందుకు అతని నివాసం వద్దకు వెళ్లారు. కరోనా కారణంగా అధిక స్కూల్ ఫీజులు భారంగా మారాయని, వెంటనే వాటిని నియంత్రించాలని వారు మంత్రికి మొరపెట్టుకున్నారు. అయితే ఈ విషయంలో సదరు మంత్రి స్పందన చూసి పేరెంట్స్ కమిటీ సభ్యులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. పేరెంట్స్ అభ్యర్ధనను విన్న మంత్రి.. ‘వెళ్లి చావండి, మీకిష్టమొచ్చినట్టు చేసుకోండి’ అంటూ తిట్టిపోయడంతో అక్కడున్న వారంతా ముక్కున వేలేసుకున్నారు. ఈయనేం మంత్రిరా బాబు..! బాధను చెప్పుకుందామని వెళితే మాపైనే ఫైరయ్యాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి వ్యాఖ్యలను అక్కడున్న సభ్యులు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారాయి. తలిదండ్రుల బాధను అర్ధం చేసుకోకుండా, నోరు పారేసుకున్న మంత్రిని నెటిజన్లు ఏకీ పారేస్తున్నారు. కాగా, కరోనా విపత్కర పరిస్థితుల్లో స్కూళ్లలో అధిక ఫీజులు వసూలు చేయరాదని ఆ రాష్ట్ర హైకోర్టు ఇదివరకే తీర్మానం చేసింది. కేవలం ట్యూషన్ ఫీజులు మాత్రమే తీసుకోవాలని విద్యాసంస్థలను ఆదేశించింది. అయితే అత్యున్నత న్యాయస్థానం తీర్పును బేఖాతరు చేస్తూ ప్రైవేటు విద్యాసంస్థలు అధిక ఫీజుల దోపిడికి పాల్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్ధుల తల్లిదండ్రులు సంబంధిత మంత్రికి తమ గోడు వెళ్లబుచ్చుకుందామని వెళ్లారు. బాధితుల ఫిర్యాదుకు మంత్రి రెస్పాన్స్ చూసి వారంతా షాక్కు గురయ్యారు. తమపై నోరుపారేసుకున్న మంత్రి వెంటనే రాజీనామా చేయాలంటూ ఆయన ఇంటి ముందే ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రి శివ్రాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయమై వెంటనే కల్పించుకుని తమకు న్యాయం జరిగేలా చూడటంతో పాటు సంబంధిత మంత్రిని ప్రభుత్వం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పేరెంట్స్ కమిటీ పోరాటానికి ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా మద్దతు తెలపడంతో మంత్రి రాజీనామా విషయమై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. అయితే, ఈ విషయమై మంత్రి స్పందించకపోవడం గమనార్హం. -
'అతని వల్లే ఆర్తి అగర్వాల్ కెరీర్ ఫేడ్ అవుట్ అయ్యింది'
ఆర్తి అగర్వాల్..తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. చిరంజీవి,వెంటకేష్, తరుణ్, మహేష్బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ సహా దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ జతకట్టింది. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్లో స్టార్ ఇమేజ్ని సంపాదించుకుంది. కెరీర్ మంచి పీక్ స్టేజ్లో ఉండగానే పలు వివాదాలు ఆమెను చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. హీరో తరుణ్తో ప్రేమాయణం, ఆపై ఆత్మహత్యాయత్నం వంటివి ఆమె కెరీర్లో కోలుకోలేని దెబ్బతీశాయి. తాజాగా ఆర్తి అగర్వాల్కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమెకు సినిమా అవకాశాలు తగ్గిపోవడం, ఆమె కెరీర్ ఫేడ్ అవ్వడానికి గల కారణలపై నిర్మాత చంటి అడ్డాల షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె తండ్రి ఆర్తి అగర్వాల్కు సంబంధించి ప్రతీ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేవాడని,షూటింగ్కు కరెక్ట్ టైంకు వెళ్తానంటే కూడా అడ్డు చెప్పేవాడని పేర్కొన్నారు. ఆర్తి అగర్వాల్ వాళ్ల పేరెంట్స్ మీద చాలా వరకు డిపెండ్ అయ్యేదని, వాళ్లు ఏం చేయమంటే అది చేసేదని చెప్పారు. 'వాళ్ల పేరెంట్స్ షూటింగ్ లొకేషన్కి రానప్పుడు చాలా కన్వినెంట్గా పనిచేసేది. అదే వాళ్లు వచ్చారంటే మాత్రం ఈమెతో పని చేయనిచ్చేవారు కాదు. ఆర్తి అగర్వాల్ తండ్రీ ప్రతిదానికి అడ్డుపడేవాడు. షూటింగ్ ప్యాకప్ ఎప్పుడు చెప్పాలో కూడా ఆయనే డిసైడ్ చేసేవాడు. వాళ్ల ఫాదర్ వళ్లే ఆర్తి అగర్వాల్ ఇబ్బంది పడేది. ఆయన లేకపోతే ఆమె చాలా ఫ్రీగా పనిచేసేది. నిజానికి ఆమె కెరీర్ ఫేడ్ అవుట్ అవ్వడానికి ఆమె తండడ్రే కారణం' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక బరువు తగ్గేందుకు చేయించుకున్న ఆపరేషన్ వికటించి 2015 జూన్ 6న ఆర్తి అగర్వాల్ గుండెపోటుతో మరణించింది. చదవండి : తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న జెనీలియా.. ఆ హీరోతో సినిమా? ఆ కారణంతో సినిమాలు మానేద్దామనుకున్న సౌందర్య -
మరోసారి రెచ్చిపోయిన హైపర్ ఆది.. వ్యాఖ్యలు దుమారం
హైపర్ ఆది..ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. తనదైన కామెడీ టైమింగ్, పంచు డైలాగులతో షోని రక్తి కట్టిస్తాడు. అయితే ఒక్కోసారి శృతి మించే పంచ్లు నవ్వు తెప్పించకపోగా ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తాయి. తాజాగా హైపర్ ఆది మరోసారి తన డబుల్ మీనింగ్ డైలాగులతో యాంకర్పై రెచ్చిపోయాడు. ఓ షోలో పాల్గొన్న హైపర్ ఆది..యాంకర్ వర్షపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్మీడియాలో హల్చల్ అవుతున్నాయి. హైపర్ ఆది-వర్షకు మధ్య జరిగిన ఓ డిస్కషన్లో ఎలా ఉన్నావు అని ఆది అడగ్గా...బావున్నానండీ. ఎందుకంటే నా పని నేను చూసుకుంటాను కాబట్టి అని వర్ష చెప్పింది. దీనికి కౌంటర్గా... 'అదే పనిగా నీకు వచ్చే కామెంట్లు చూసుకుపోయావా..షోలో కొత్తగా వచ్చిన లేడీ గెటప్ ఎవరు అని చాలామంది అడుగుతున్నారు' అంటూ వర్షపై బాడీషేమింగ్ వ్యాఖ్యలు చేశాడు. ఆమె జెండర్పై ఆది చేసిన ఈ వల్గర్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. లేడీ యాంకర్ల పరువు తీసేలా ఆది బిహేవ్ చేస్తున్నాడంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. చదవండి : ప్రేమలో ఉన్నా.. సురేఖ వాణి షాకింగ్ పోస్ట్ జాతిరత్నాలు డైరెక్టర్కు కాస్ట్లీ లంబోర్గిని కారు! -
నిధులివ్వనప్పుడు సమావేశాలెందుకు?
సాక్షి, హైదరాబాద్: ‘బడ్జెట్లో పెట్టిన నిధులు ఇవ్వరు, బడ్జెట్తో సంబంధం లేని పనులను హడావుడిగా చేపడుతూ నిధులను ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తున్నారు. అలాంటప్పుడు ఈ సభ ఎందుకు, సమావేశాలు ఎందుకు?’అంటూ కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చేసిన వ్యాఖ్యలు గురువారం అసెంబ్లీలో దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంతరెడ్డి పేర్కొనగా, పవిత్ర సభను అవమానించేలా ఎలా మాట్లాడతారని, అలా చేస్తే మాట్లాడేందుకే అనుమతి ఇవ్వనని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ మీద గౌరవం లేనప్పుడు సభలో మాట్లాడటమెందుకని ప్రశ్నించారు. బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సభలో ఆవేశంగా మాట్లాడారు. తొలుత ఆయన పేరును కోమటిరెడ్డి వెంకటరెడ్డిగా స్పీకర్ పిలవగా, తన పేరు రాజగోపాలరెడ్డి అంటూ ఆయన పేర్కొనటంతో స్పీకర్ సారీ చెప్పారు. ఆ తర్వాత రాజగోపాల్రెడ్డి మాట్లా డుతూ తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ వెంట ఎక్కువగా నడిచింది నిరుద్యోగులేనని, రాష్ట్రం సిద్ధిస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని, ఉపాధికి ఢోకా లేదని కేసీఆర్ చెప్పారని, కానీ ఇప్పుడు అది అమలు కాకపోయేసరికి నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశ, నిస్పృహలు అలుముకొన్నాయని అన్నారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడంలేదు.. పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు రావటం లేదని, ప్రైవేటులో 50 శాతం ఉద్యోగాలు స్థానికు లకే ఇచ్చేలా చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదని రాజగోపాల్రెడ్డి అన్నారు. చౌటుప్పల్లో 100 ఫార్మా కంపెనీలుంటే స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదని ఆరోపించారు. యువతకు ఉపాధి కల్పించనప్పుడు ఎమ్మెల్యేగా ఉండి ఉపయోగ మేంటని ప్రశ్నించారు. పథకాలు రూపొందించినా అమలుకు నిధులు ఇవ్వక పనుల కోసం సర్పంచులపై ఒత్తిడి పడుతోందని పేర్కొన్నారు. కొన్ని నియోజకవర్గాలకు వేల కోట్ల నిధులు పోతు న్నాయని, మరి తమ నియోజకవర్గాలకు నిధులు ఇవ్వట్లేదని, ప్రతిపక్ష సభ్యులను గెలిపించుకోవటం మా నియోజకవర్గ ప్రజలు చేసుకున్న పాపమా అంటూ ప్రశ్నించారు. శివన్నగూడెం ప్రజలు ప్రాజెక్టుకు భూములిచ్చి త్యాగం చేస్తే పరిహారం విషయంలో అన్యాయం జరుగుతోందన్నారు. -
బాబుపై పవన్ సంచలన వ్యాఖ్యలు
విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలోని ఎంబీ భవన్లో పవన్ విలేకరులతో మాట్లాడారు. ‘ 2014 ఎన్నికల్లో 60 లేదా 70 స్థానాలకు పోటీ చేస్తానని చంద్రబాబుతో చెప్పాను..మీరు విడిగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోతాయని చంద్రబాబు చెప్పారు. ఎన్నికల తర్వాత రాజ్యసభ సీట్లు ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఆ రోజు మాట్లాడింది వేరు మరుసటి రోజు వారి పేపర్లలో చంద్రబాబు రాయించింది వేరు. అప్పుడే చంద్రబాబుకు ఒక దండం పెడదాం అనుకున్నాను. తరవాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినవే. నేను ఆ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే నాకు కొన్ని సీట్లు వచ్చేవ’ ని పవన్ కల్యాణ్ అన్నారు. తాను తెలుగుదేశం గురి మాట్లాడకుండా ఉంటే తనను టీడీపీ తొత్తు అన్నారు. మరి చంద్రబాబు, బీజేపీని ఏమీ అనడంలేదు..మరి ఆయన ఎవరి తొత్తు అని సూటిగా ప్రశ్నించారు. యూటర్న్ తీసుకున్నానని చంద్రబాబు, తనపై ఆరోపణలు చేయడం తగదని పవన్ అన్నారు. తెలుగు దేశం నాయకులు రాజధానిలో వేల ఎకరాల భూమిని ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం భూసేకరణ పేరుతో అడ్డగోలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నదని ధ్వజమెత్తారు. రైతులపై పీడీయాక్ట్, 144 సెక్షన్లు విధిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు వచ్చిన తర్వాత ఏపీలో నిరుద్యోగులకు జాబు మాత్రం రాలేదు గానీ వాళ్లబ్బాయి లోకేష్కు మాత్రం జాబ్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఎంబీభవన్లో పలువురు జనసేన పార్టీలో చేరారు. వారికి పవన్ కల్యాణ్ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. -
చంద్రబాబుపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
-
పీతల సుజాత సంచలన వ్యాఖ్యలు
సాక్షి, నెలమూరు: ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే పీతల సుజాత సంచలన వ్యాఖ్యలు చేశారు. పెనుమంట్ర మండలం నెలమూరు గ్రామదర్శిని సభలో మంత్రులు నారా లోకేష్, పితాని సత్యనారాయణ, మాజీ మంత్రి పీతల సుజాత, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అంటూ సంభోదించారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్వరలో కేంద్రానికి వెళ్తారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పీతల సుజాత వ్యాఖ్యలతో పశ్చిమగోదావరి జిల్లా టీడీపీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశమైంది. అంతకుముందు పెనుగొండ గ్రామదర్శిని సభలో మంత్రి నారా లోకేష్కు మహిళలు షాక్ ఇచ్చారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి పితాని సత్యనారాయణ సమక్షంలోనే మహిళలు సమస్యలపై మొరపెట్టుకున్నారు. తమకు ఇళ్లు, మరుగుదొడ్లు లేవని, ఇళ్ల స్థలాలు ఇప్పించండంటూ మహిళలు పెద్ద సంఖ్యలో అర్జీలు ఇచ్చారు. పితాని సమక్షంలోనే భారీగా ఫిర్యాదులు రావడంతో పాటు సమస్యలు పరిష్కరించాలని మొరపెట్టుకోవడంతో మంత్రి లోకేష్, ఇన్ని సమస్యలు నియోజకవర్గంలో ఉన్నాయా అని విస్తుపోయారు. -
ఎంపీ మంత్రి షాకింగ్ కామెంట్స్
సాక్షి, భోపాల్ : మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ క్యాబినెట్లో మరో మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఓటు వేసిన వారికే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందుతాయని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం వృధా అని మంత్రి మాయా సింగ్ ఓటర్లతో పేర్కొనడం దుమారం రేపింది. ‘కమలం గుర్తుకు ఓటు వేస్తే అంతా సవ్యంగా సాగుతుంది..చేయి గుర్తుకు ఓటేస్తే మాత్రం మీరు పొరపాటు చేసినట్టే’నని మంత్రి ఉప ఎన్నికల ప్రచారంలో ఓటర్లను హెచ్చరించారు. చేయి గుర్తుకు ఓటేసి తప్పు చేసిన వారు ఏ ప్రయోజనం పొందలేరని స్పష్టం చేశారు. అంతకుముందు బీజేపీ ఎంఎల్ఏ యశోధరరాజె సింధియా కోలరస్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు పరోక్ష హెచ్చరికలు చేశారు. ఉచిత గ్యాస్ పథకం బీజేపీ ప్రవేశపెట్టిందని..తమ పార్టీకి ఓటు వేస్తేనే మీకు గ్యాస్ వస్తుందని..కాంగ్రెస్కు ఓటు వేస్తే ఈ పథకం మీకు వర్తించదని ఆమె వ్యాఖ్యానించారు. మరోవైపు బీజేపీ మంత్రి ఓటర్లను హెచ్చరించడం పట్ల మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అరుణ్ యాదవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల నిబంధనావళికి విరుద్ధంగా మంత్రి వ్యాఖ్యలున్నాయని ఆరోపించారు. -
కేంద్ర మంత్రి మేనకా గాంధీ షాకింగ్ కామెంట్లు
-
షాకింగ్: అందరి ముందే మేనకాగాంధీ...
బరేలి : బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవిలో ఉన్న మేనకా గాంధీ షాకింగ్ కామెంట్లు చేశారు. శుక్రవారం నిర్వహించిన పబ్లిక్ మీటింగ్లో, మేనకాగాంధీ ఓ అధికారిని విపరీత వ్యాఖ్యలతో దూషించారు. అందరి ముందే పరుష పదజాలంతో చివాట్లు పెట్టారు. ఆ అధికారి అవినీతి పాల్పడుతున్నారంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేనకా గాంధీ ఈ విధంగా స్పందించారు. పబ్లిక్ మీటింగ్లో ఆయన్ను ఈ విధంగా తిట్టడంతో, ఒక్కసారిగా అందరూ అవాక్కయ్యారు. ముఖ్యంగా ఆయన్ను అందరి ముందు తిట్టడం, అవమానించడం చర్చనీయాంశమైంది. ఉత్తరప్రదేశ్ బహేరీలో పీడీఎస్ స్కీమ్ను పరిశీలించడానికి వెళ్లిన్నప్పుడు మేనకా ఈ వ్యాఖ్యలు చేశారు. మేనకా గాంధీ ప్రస్తుత ప్రభుత్వంలో మహిళా, శిశు సంక్షేమ శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
కమల్ హాసన్ పై చారుహాసన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై : తన పుట్టినరోజు సందర్భంగా కొత్త పార్టీ ప్రారంభించే పనిలో తమిళ సీనియర్ హీరో కమల్ హాసన్ సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయాల్లోకి వస్తే సక్సెస్ అవుతాడా? అన్న సందేహం సాధారణ ప్రజానీకంతోపాటు మీడియాను వేధిస్తోంది. అందుకే ఆయన కుటుంబ సభ్యులను కూడా వదలకుండా అభిప్రాయాలను సేకరిస్తోంది. ఈ క్రమంలో ఆయన సోదరుడు చారు హాసన్ తంతి ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కమల్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చారు హాసన్ పేర్కొన్నారు. ‘కమల్ రాజకీయాల్లోకి రావటాన్ని స్వాగతిస్తున్నా. అయితే అతను రాజకీయాల్లో ఏ మేర విజయవంతం అవుతాడో చెప్పటం కష్టం. కమల్తో పోలిస్తే రజనీకాంత్కే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి’ అని చారుహాసన్ చెప్పారు. అయితే రజనీ రాజకీయాల్లోకి రాడనే భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. న్యాయ దిగ్గజం.. జాతీయ అవార్డు నటుడు అయిన చారుహాసన్ సోదరుడి ఎంట్రీపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. ప్రస్తుతం ఉన్న నేతల్లో పీఎంకే నేత, కేంద్ర మాజీ మంత్రి అన్బుమణి రామదాస్ ముఖ్యమంత్రి అభ్యర్థికి అన్ని విధాల అర్హుడని చారు హాసన్ పేర్కొన్నారు. -
గ్లామర్పై రష్మి షాకింగ్ కామెంట్స్ !
-
ఇవాళ అలంకరణకే హీరోయిన్లు!
కాలం మారింది. ఒకప్పటితో పోలిస్తే... నటీమణుల్ని ఇప్పుడు కేవలం అందానికీ, అలంకరణకీ వాడే సామగ్రిలా చూస్తున్నారే తగిన గౌరవం ఇవ్వడం లేదు. ఈ మాట అందరూ అనుకొనేదే అయినా, గౌరవప్రదమైన నటి ఎవరైనా అంటే? అవును. నటి సుహాసిని నోట ఇప్పుడు ఈ మాటే వచ్చింది. ‘‘1980లలో పరిశ్రమలో నటిగా మంచి స్థానంలో ఉన్నందుకు గర్విస్తున్నా. నన్నడిగితే - ఆ సమయంలో సినిమాల్లో హీరోయిన్లుగా చేసిన నటి రాధిక, నేను, రేవతి, సరిత - ఇలా మేమందరం చాలా అదృష్టవంతులం. అప్పట్లో మేము చేసినవన్నీ వ్యక్తిత్వమున్న బలమైన పాత్రలు’’ అని నటి - దర్శకురాలు సుహాసినీ మణిరత్నం ఇటీవల ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నారు. అప్పటికీ, ఇప్పటికీ వచ్చిన మార్పుల గురించి ఆమె వ్యాఖ్యానిస్తూ, ‘‘దురదృష్టవశాత్తూ, ఇవాళ నటీమణుల్ని కేవలం అలంకరణ సామగ్రిలా వాడుతున్నారు. ఈ తరం హీరోయిన్లు అందగత్తెలే కాదు, అపారమైన ప్రతిభావంతులు. వాళ్ళకు ప్రపంచం గురించీ బాగా తెలుసు. కానీ, ఇప్పుడు స్త్రీ ప్రధాన పాత్రలు చాలా తక్కువగా వస్తున్నాయి’’ అని అన్నారు. ఉత్తరాదితో పోలిస్తే, దక్షిణాదిలో పరిస్థితి మరీ బాగా లేదని సుహాసిని అభిప్రాయపడ్డారు. ‘‘మన కన్నా హిందీ చిత్రపరిశ్రమ కొంత మెరుగ్గా ఉంది. అక్కడ విద్యాబాలన్, కంగనా రనౌత్ లాంటివాళ్ళు బలమైన పాత్రలు పోషిస్తున్నారు. ఉత్తరాది లానే దక్షిణాది సినీపరిశ్రమలో కూడా ఎక్కువ భాగం పురుషాధిత్యమే. అయితే, రానురానూ అక్కడి కన్నా ఇక్కడ పరిస్థితి మరింత దిగజారుతోంది. ఇప్పుడొస్తున్న అమ్మాయిలు కూడా బలమైన పాత్రలు చేసే కన్నా, సులభమైన మార్గాలు చూసుకుంటున్నారు’’ అని సుహాసిని అన్నారు. ‘‘పురుషాధిపత్యం ఎక్కువగా ఉండే ఈ పరిశ్రమలో కథానాయకుడికిచ్చే పారితోషికానికీ, కథానాయికకు ఇచ్చే డబ్బుకూ మధ్య కూడా చాలా తేడా ఉంది’’ అని ఆమె వాపోయారు. అయితే, 1980ల నాటి నటీనటులందరం ఇటీవల తరచూ కలుస్తూ, అభిప్రాయాలు కలబోసుకోవడం వల్ల చాలామంది పాత రోజుల్ని మళ్ళీ గుర్తు చేసుకోగలుగుతున్నామని ఆమె అన్నారు. కమల్కు తగని సిగ్గు: ఇది ఇలా ఉండగా, బాబాయ్ కమలహాసన్ గురించి ఆమె ఓ ఆసక్తికరమైన అంశం బయటపెట్టారు. వెండితెర మీద చాలామంది హీరోయిన్లతో కలసి రొమాన్స్ను పండించే కమల్కు నిజానికి, ఆడవాళ్ళంటే తగని సిగ్గు అని సుహాసిని చెప్పారు. ‘‘మా ఇంటికి వచ్చే ఆడవాళ్ళను ఆయన ఎప్పుడూ కళ్ళలో కళ్ళు పెట్టి చూడరు, మాట్లాడరు. వాళ్ళను గౌరవంగా పలకరించి, ఆ వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోతారు’’ అని ఆమె చెప్పారు. మొత్తానికి, ఆడవాళ్ళ పట్ల గౌరవం విషయంలో సుహాసిని ఆవేదన అర్థం చేసుకోవాల్సిందే.