breaking news
Silk fabrics
-
3 నెలల్లో చెన్నూర్ దసలి పట్టు వస్త్రాలు
చెన్నూర్: దసలి పట్టుకాయ దిగుబడిలో మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంటున్న మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టు పరిశ్రమ మరో అడుగు ముందుకేసింది. రైతులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో పట్టు దారం, వస్త్ర తయారీకి సన్నద్ధం అవుతోంది. వస్త్ర తయారీకి అవసరమైన యంత్రాల కోసం ప్రభుత్వం రూ.20.54 లక్షలు మంజూరు చేసింది. దారం, వస్త్రాల తయారీపై శిక్షణకు 30 మంది రైతులను ఎంపిక చేశారు. నెల రోజులపాటు నిపుణులతో చెన్నూర్ పట్టు పరిశ్రమలో శిక్షణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో మూడు నెలల్లో చెన్నూర్ కేంద్రంగా పట్టు వస్త్రాల ఉత్పత్తి ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు.రెండు నెలల శ్రమతో రూ.1.5 లక్షల సంపాదనఅటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవించే గిరిజన, ఎస్సీ, బీసీ నిరుపేద రైతులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దసలి పట్టు కాయ సాగును ప్రోత్సహిస్తోంది. కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో భూమి లేని రైతులను గుర్తించి దసలి కాయ పండించే విధానంపై శిక్షణ ఇచ్చింది. గత మూడు దశాబ్దాలుగా ఇక్కడ సుమారు వెయ్యి మంది రైతులు 7,500 ఎకరాల్లో దసలి పట్టు కాయలు పండిస్తున్నారు.కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా గొల్లతరివిడి, కౌటాల, బెజ్జూర్, మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం మన్నెగూడెం, కోటపల్లి మండలం కొత్తపల్లి, రాజారాం, లింగన్నపేట, నాగంపేట, ఎదుల్లబంధం, వేమనపల్లి మండలం ముల్కల్లపేట, చెన్నూర్ మండలం కిష్టంపేట, లింగంపల్లి గ్రామాల్లో దసలికాయను పండిస్తూ ఉపాధి పొందుతున్నారు. రెండు నెలల శ్రమతో ఒక్కో రైతు రూ.80 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు సంపాదిస్తున్నారు.మూడు నెలల్లో వస్త్ర తయారీ ప్రారంభం గత ఏడాది దసలి పట్టు రైతుల కిసాన్ మేళాలో నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.40 లక్షలు మంజూరు చేసింది. నిర్మాణం పూర్తి కాగా ఇటీవల మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు. భవనంలో దారం తీసే యంత్రాలను అమర్చి రీలింగ్ చేసి వస్త్రం ఉత్పత్తి చేస్తాం. త్వరలో రైతులకు శిక్షణ తరగతులు ప్రారంభించి మూడు నెలల్లో వస్త్రం తయారు చేస్తాం. –పార్వతి రాథోడ్, ఏడీ, సెరికల్చర్ -
తయారీకి చేయూత
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘భారత్లో తయారీ’లో భాగంగా దేశీ తయారీని ప్రోత్సహించే చర్యలను ఈ బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు. పది రంగాలకు సంబంధించి దిగుమతి చేసుకునే పలు ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాలను భారీగా పెంచారు. చైనా నుంచి చౌకగా వచ్చి పడుతున్న దిగుమతులను నియంత్రించడంతోపాటు, దేశీయంగా ఉపాధిని పెంచేందుకు ఈ చర్యలు తీసుకున్నారు. సిల్క్ ఫ్యాబ్రిక్స్పై కస్టమ్స్ సుంకాన్ని ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ రెట్టింపు చేశారు. ప్రస్తుతం ఇది 10 శాతం ఉండగా దీన్ని 20 శాతంగా బడ్జెట్లో పేర్కొన్నారు. అయితే ఈ చర్యను సిల్క్ ఎగుమతిదారుల సమాఖ్య మాత్రం వ్యతిరేకించింది. ఎగుమతులపై ఇది ప్రభావం చూపిస్తుందని సమాఖ్య చైర్మన్ సతీష్ గుప్తా ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, మొబైల్ ఫోన్లపై 15 శాతంగా ఉన్న కస్టమ్స్ సుంకాన్ని 20 శాతం చేశారు. మొబైల్ యాక్సెసరీలపై 7.5 శాతం నుంచి 15 శాతానికి, టీవీలపైనా 15 శాతానికి కస్టమ్స్ సుంకాన్ని పెంచారు. కొత్తగా చార్జింగ్ అడాప్టర్లపై 10 శాతం సుంకం ప్రవేశపెట్టారు. ముఖ్యంగా పళ్లరసాలపై భారీగా పెంచారు. కాన్బెర్రీ జ్యూస్పై ఐదు రెట్లు పెంచి 50 శాతం చేశారు. అన్ని రకాల పళ్ల, కూరగాయల జ్యూస్పైనా 30 నుంచి 50 శాతం చేశారు. సిల్క్ ఫ్యాబ్రిక్స్ మాదిరే పాదరక్షలపైనా దిగుమతి సుంకాన్ని 20 శాతానికి పెంచారు. ఫర్నిచర్, ల్యాంపులు, కళ్లద్దాలు, కొవ్వొత్తులు, పతంగులు, లైటర్లు, సెంట్ స్ప్రేయర్లు, పెర్ఫ్యూమ్లు, గడియారాలు, ఆట వస్తువులపైనా రెట్టింపైంది. ఆటోమొబైల్ విడిభాగాలు, కొన్ని రకాల యాక్సెసరీలు, మోటారు కార్లు, మోటారు సైకిళ్లపై 7.5–10 శాతం మధ్య పన్ను ఉండగా దాన్ని 15 శాతానికి పెంచారు. -
దుర్గమ్మకు టీటీడీ పట్టువస్త్రాలు
ఇంద్రకీలాద్రి: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు టీటీడీ పట్టువస్త్రాలు సమర్పించింది. దసరా సందర్భంగా టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్బంగా టీటీడీ తరపున డిప్యూటీ ఈవో బాలాజీ పట్టు వస్త్రాలను దుర్గ గుడి ఆలయ అధికారులకు అందజేశారు. అమ్మవారికి సమర్పించే సమయంలో మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. -
దుర్గమ్మకు టీటీడీ పట్టు వస్త్రాలు
ఇంద్రకీలాద్రి : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి మంగళవారం పట్టు వస్త్రాలను సమర్పించారు. దసరా సందర్భంగా టీటీడీ తరఫున పట్టు వస్త్రాలను సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా చదలవాడ కృష్ణమూర్తి, టీటీడీ అర్చకులతో కలసి దుర్గమ్మ ఆలయానికి వచ్చారు. వారికి దేవస్థానం ఈవో నర్సింగరావు స్వాగతం పలికారు. అమ్మవారికి టీటీడీ తరఫున పట్టు చీర, పసుపు, కుంకుమ, పూలు సమర్పించారు. చదలవాడకు ఈవో నర్సింగరావు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. -
మల్లన్న పెళ్లికి చంద్రన్న
స్వామి వారికి పట్టు వ్రస్త్రాలు సమర్పించనున్న సీఎం కేసీఆర్ రెండున్నర గంటల పర్యటన కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణానికి ఆదివారం సీఎం కే.చంద్రశేఖరరావు వస్తున్నారు.. స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.. ఈ సందర్భంగా ఏర్పాట్లను సీఎం ఇంటెలిజెన్స సెక్యూరిటీ ఐజీ ఎం.ఎం. మహేశ్ భగవత్, ఎస్పీ అంబర్ కిషోర్ఝా, కలెక్టర్ కిషన్ పర్యవేక్షించారు.. - చేర్యాల/హన్మకొండ అర్బన్ శ్రీయుత గౌరవనీయులైన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గారు.. అయ్యూ.. మేము శ్రీ మల్లికార్జున స్వామి భక్తులం. ఏటా జాతర బ్రహ్మోత్సవాల్లో కొమురెల్లి మల్లన్నను దర్శించుకునేటోళ్లం. మది నిండా మల్లన్నను నింపుకొని కొమురెల్లికి వస్తే.. ఇక్కడ సమస్యలే స్వాగతం పలుకుతున్నారుు. ప్రతీ ఏడాది వచ్చే మాకు ఎప్పుడూ గీ అవస్థలే ఎదురవుతున్నారుు. నేడు(ఆదివారం) జరిగే మల్లన్న పెండ్లికి మీరు కూడా వస్తున్నరని తెలిసింది. మీతో చెప్పుకుంటే మా కష్టాలు తీరుతాయనే నమ్మకంతోనే గీ లేఖ రాస్తున్నం. మాకు తోచిన పరిష్కారాలు కూడా పేర్కొన్నం. జెర పరిశీలించుండ్రి. వచ్చే ఏటికన్నా.. అన్ని వసతులు కల్పించుండ్రి. సమస్య : దర్శనానికి వచ్చినోళ్లం గుడారాలు వేసుకుని ఉంటున్నం. పరిష్కార మార్గాలు : అర్ధంతరంగా నిలిచిపోరుున చౌల్ట్రీ(వసతి గృహ సముదాయం) నిర్మాణాన్ని పూర్తిచేయూలి. స్వామి దర్శనం కోసం క్యూ లైన్ ఇక్కట్లు సుమారు 5 గంటలు నిల్చుంటేనే దర్శనం లభిస్తుంది. క్యూ లైన్లలో భక్తులకు కూర్చునే వె సులుబాటు, తాగునీరు, ఫ్యాన్లు, తదితర వసతులు కల్పించాలి. రాజగోపురం పక్కన ఖాళీస్థలంలో మూత్రశాలలు నిర్మించాలి. వృద్ధులు, వికలాంగులు, భారీకాయులు దర్శనానికి అవస్థలు పడుతున్నారు. ఆలయ ప్రాంగణంలో లిఫ్ట్ ఏర్పాటు చేయూలి. భక్తుల వస్తు సామగ్రికి రక్షణ ఉండడం లేదు రాజగోపురం వద్దచెప్పుల స్టాండ్, లగేజీ స్టాండ్లు ఏర్పాటు చేయూలి. డబ్బుల అత్యవసరమైతే సిద్ధిపేట, దుద్దెడకు వెళ్లాల్సి వస్తోంది. కొమురవెల్లిలో ఏటీఎంలు ఏర్పాటు చేయూలి. ఆలయ ప్రాంగణంపై అధికారులు దృష్టి పెట్టడం లేదు. ఆలయ ఆవరణ, పరిసర వీధుల్లో సీసీ రోడ్లు వేసి డ్రెరుునేజీలు కట్టించాలి. జాతరలో లక్షకుపైగా భక్తులకు తాగునీటి వసతి సరిగా లేదు. స్థానిక నీటి ట్యాంకులకు తోడు కోడెల స్తంభం, బస్టాండ్, దాసారం గుట్ట, సినిమాటాకీసు, రాంసాగర్ రోడ్డు, పెద్దమ్మ ఆలయం వద్ద మరిన్ని నీటి ట్యాంకులు ఏర్పాటు చేయూలి. మల్లన్న చెరువులోకి మురికి నీరు చేరి మా మనోభావాలు దెబ్బతింటున్నారుు. ఇందులో స్నానం చేయలేపోతున్నారు. ఈ మురికినీటిని మత్తడి నుంచి బయటకు పంపించేలా ప్లానింగ్ చేయించి నిధులు విడుదల చే రుుంచాలి. మల్లన్నకు మొక్కులు చెల్లించాక మల్లన్న గుట్టపైన రేణుక ఎల్లమ్మకు బోనాలు అప్పగిస్తాం. కానీ అక్కడికెళ్లడానికి తిప్పలు పడుతున్నం. మల్లన్న గుట్టపైకి మెట్లకు మరమ్మతులు చేరుుంచాలి. గుట్టపై రేకుల షెడ్డు, కుర్చీలు వేయూలి. తాగునీటి వసతి కల్పించాలి. ఆలయూనికి భక్తుల రాక పెరిగినా అభివృద్ధి జరగడం లేదు. మల్లన్న జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించి ఏటా నిధులు కేటారుుస్తే ఐదేళ్లలో దశ మారనుంది. సీఎంగారూ.. ఇంకో ముచ్చట మల్లన్న గుట్ట ప్రకృతి సోయగాల నడుమ వెలసింది. ఇక్కడి అందాలను భక్తులు పూర్తిస్థారుులో ఆస్వాదించేలా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుంది. ఆధ్యాత్మికతతోపాటు ఆహ్లాదానికి మల్లన్న ఆలయూన్ని నెలవుగా మార్చినట్లవుతుంది. ఆలయ పరిసర ప్రాంతంలో పార్కులు ఏర్పాటు చేసి పిల్లలు ఆడుకునేందుకు, ఇతర సామగ్రి సమకూర్చితే ఉపయోగకరమవుతుంది. మల్లన్న చెరువులో బోటింగ్ను ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది. గుట్టపైకి వెళ్లడానికి రూప్వేను ఏర్పాటు చేయాలి. గతంలోనూ పాలకులు మల్లన్న జాతరకు వచ్చి అనేక హామీలు ఇచ్చి విస్మరించారు. పొన్నాల లక్ష్మయ్య దేవాదాయ ధర్మదాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడూ నిధులు పెద్దగా దక్కలేదు. తొలిసారి స్వరాష్ట్రంలో జరుగుతున్న మల్లన్న కల్యాణ వేదిక వద్ద.. ఆలయ దశ మార్చే ప్రకటనను మేమంతా ఆశిస్తున్నాం. ఆ తదిపరి కార్యాచరణనూ కోరుకుంటున్నాం. ఇట్లు కొమురెల్లి మల్లన్న భక్తులు సీఎం షెడ్యూల్ ఉదయం(గంటలు) 10.45 : బేగంపేట నుంచి బయల్దేరుతారు. 11.00 : చేర్యాలకు చేరుకుంటారు. 11.30 : కొమురవెల్లికి చేరుకుంటారు. 11.50 : కల్యాణంలో పాల్గొంటారు. మధ్యాహ్నం.. 12.30 : కురుమ సంఘ భవనం ప్రారంభోత్సవం. 1.00 : భోజనం 1.30 : తిరుగు పయనం