Sivarathiri
-
Mahashivratri: మనోభీష్టాలు నెరవేర్చే.. ఐదు విశిష్ట శివాలయాలు..
రేపు (ఫిబ్రవరి 26, బుధవారం) మహాశివరాత్రి.. దేశంలోని శివాలయాలన్నీ శివనామస్మరణలతో మారుమోగిపోనున్నాయి. మహాశివుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరనున్నారు. మహాశివరాత్రి సందర్భంగా పలు శివాలయాలను ఇప్పటికే అందంగా ముస్తాబు చేశారు. మనదేశంలో పలు పురాతన శివాలయాలు ఉన్నాయి. వీటిలో ఐదు శివాలయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.కేదార్నాథ్కేదార్నాథ్ దేవాలయం ఉత్తరాఖంఢ్లోని రుద్రప్రయాగలో ఉంది. ఇది నాలుగు ధామ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. కేదార్నాథ్, బద్రీనాథ్ దేవాలయాలు ఉత్తరాఖండ్లోని రెండు ప్రధాన పుణ్యక్షేత్రాలు.సోమనాథ్ గుజరాత్లోని కథియావర్ ప్రాంతంలో సముద్ర తీరంలో సోమనాథ్ ఆలయం ఉంది. ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ ఆలయ వైభవం గురించి మహాభారతం, భగవద్గీత, స్కంద పురాణాలలో కూడా ఉందని చెబుతారు. శివుణ్ణి తన ప్రభువుగా భావించిన చంద్రుడు ఇక్కడ తపస్సు చేశాడని అంటారు.త్రయంబకేశ్వర్ త్రయంబకేశ్వర్ ఆలయం మహారాష్ట్రలోని గోదావరి నది ఒడ్డున ఉంది. ఈ ఆలయం నల్ల రాతితో నిర్మితమయ్యింది. ఇక్కడికి వచ్చిన శివ భక్తుల కోరికలు తప్పక నెరవేరుతాయని చెబుతుంటారు.దక్షేశ్వర్ఉత్తరాఖంఢ్లోని హరిద్వార్లో దక్షేశ్వర శివాలయం ఉంది. ఈ ఆలయంలోని శివలింగానికి అభిషేకం చేస్తే పలు ప్రయోజనాలు కలుగుతాయని చెబుతుంటారు.అమర్నాథ్ అమర్నాథ్ ఆలయం జమ్ముకశ్మీర్లో ఉంది. ఈ ఆలయం ఒక గుహ రూపంలో ఉంటుంది. ఈ పవిత్ర గుహలో దాదాపు 10 అడుగుల ఎత్తున సహజ శివలింగం మంచుతో ఏర్పడుతుంది. ఆషాఢ పూర్ణిమ నుండి రక్షాబంధన్ వరకు భక్తులు అమరనాథుణ్ణి దర్శనం చేసుకునేందుకు తరలివస్తుంటారు.ఇది కూడా చదవండి: Mahashivratri: నేపాల్కు 10 లక్షలమంది భారతీయులు -
ప్రతిరూపం.. కళ్లెదుటే నిర్జీవం
► ఎన్నో నోముల ఫలితం లేక లేక కలిగిన సంతానం ► అప్పటి వరకు ఆడిపాడిన ఆ బుడిబుడి అడుగులు ► మృత్యుదరికి చేరాయి పెదాలను వీడని బోసినవ్వులు ► శాశ్వతంగా కనుమరుగుయ్యాయి కన్నవారికి కడుపుకోత మిగిల్చాయి నార్పల : నార్పల మండలం నిలువురాయి గ్రామంలో రత్నమ్మ, ఆదినారాయణ దంపతుల ముద్దుల తనయ లిఖిత(6) బుధవారం సాయంత్రం జరిగిన విద్యుదాఘాతానికి బలైంది. తన ఈడు పిల్లలతో కలసి ఆడుకునేందుకు గ్రామ సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లి అకాల మృత్యువాతపడింది. జరిగిందేమిటంటే... లిఖిత గ్రామంలోని పాఠశాలలో ఒకటో తరగతి చదివేది. సాయంత్రం పాఠశాల వదలగానే తోటి పిల్లలతో కలసి వెంకటేశ్ అనే రైతుకు చెందిన తోటలోకి ఆడుకునేందుకు వెళ్లింది. అక్కడ బోరు మోటారుకు చెందిన స్టార్టర్ పెట్టె నేలపై ఉండడంతో కేబుల్ వైర్ నుంచి విద్యుత్ ప్రసారమయ్యే కాపర్ తీగలు బయటపడ్డాయి. వాటిని తాకితే ఏమవుతుందో తెలియని చిన్నారి పొరపాటున పాదం మోపింది. ఒక్కసారిగా విద్యుత్ షాక్కు గురై సమీపంలోని నీటి తొట్టెలోకి నెట్టేయబడింది. అక్కడికక్కడ మరణించింది. తోటి పిల్లలు గట్టిగా కేకలు వేయగా, సమీప పొలాల్లోని రైతులు సహా గ్రామస్తులు పరుగున అక్కడికి చేరుకున్నారు. నీటి తొట్టెలో పడిపోయిన లిఖితను వెలికితీయగా అప్పటికే ఆమె ప్రాణం కోల్పోయింది. ఈ ఘటన గ్రామంలో విషాదం నింపింది. అప్పుడే నూరేళ్లు నిండాయా తల్లీ.. ఇక తమ బిడ్డ లేదని తెలిసి లిఖిత తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. నిర్జీవంగా మారిన లిఖితను ఆమె తల్లి తన చేతుల్లోకి తీసుకుని అయ్యో బిడ్డా.. ‘బంగారు. నా బంగారు లేమ్మా.. నన్ను ఒక్కసారి చూడమ్మా... నేను మీ అమ్మను కదా. నాతో మాట్లాడు.. శివరాత్రికి అమ్మమ్మ వారి ఊరికి వెళ్దామంటివే.. అంతలోనే మా నుంచి దూరమైపోయావా కన్నా... అంటూ లిఖి త తల్లి రత్నమ్మ ఒక్కో మాట అడుగుతుంటే అక్కడున్న వారి హృదయాలు బరువెక్కాయి. మనవరాలిని చూసి నాన్నమ్మ సైతం కన్నీరుమున్నీరుగా విలపించింది.