SPSR Nellore District Latest News
-
చీఫ్ నిర్లక్ష్యం.. విద్యార్థికి సంకటం
కందుకూరు రూరల్: కందుకూరులోని టీఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్, పరీక్ష కేంద్ర చీఫ్ సూపరింటెండెంట్ నాగూర్వలీ నిర్లక్ష్యంతో ఓ విద్యార్థిని పరీక్ష రాయలేదు. ఉన్నతాధికారుల సూచనలను సైతం లెక్క చేయకుండా.. పరీక్షకు విద్యార్థినిని దూరం చేశారు. జరిగిందిదీ.. టీఆర్ఆర్ జూనియర్ కళాశాల కేంద్రంలో ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు తెలుగు, సంస్కృతం, ఉర్దూ సబ్జెక్టులకు పరీక్షను జరపాలి. అయితే ప్రతిభ కళాశాలకు చెందిన ఇంద్రకంటి శరణ్య సంస్కృతాన్ని చదివినా, ఆమెకు ఇచ్చిన హాల్టికెట్లో తెలుగు సబ్జెక్టుగా ముద్రించారు. పరీక్ష కేంద్రంలోకి వెళ్లేంత వరకు ఈ అంశాన్ని విద్యార్థిని గమనించలేదు. తీరా తెలుగు ప్రశ్నపత్రాన్నిచ్చారు. అయితే తాను చదివింది సంస్కృతమని, ఆ ప్రశ్నపత్రాన్నే ఇవ్వాలని కోరారు. కాగా హాల్టికెట్లో ఏ సబ్జెక్టుంటే దాన్నే ఇస్తామని ఖరాఖండీగా చెప్పడంతో మూడు గంటల పాటు పరీక్ష రాయకుండా విద్యార్థిని కూర్చుండిపోయారు. ఆదేశాలు బేఖాతర్ హాల్టికెట్లలోని సబ్జెక్టుల్లో ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే ముందే మార్చుకోవాలని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. ఒకవేళ పొరపాటు జరిగితే విద్యార్థి ఏ పరీక్ష రాస్తారో అదే ప్రశ్నపత్రాన్ని ఇవ్వాలని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయినా చీఫ్ నాగూర్వలీ వీటిని ఏ మాత్రం పట్టించుకోకుండా విద్యార్థినిని పరీక్షకు దూరం చేశారు. కాగా ఈ అంశమై ఆర్ఐఓ శ్రీనివాసులును సంప్రదించగా, విద్యార్థినిని పరీక్ష రాయనీయకపోవడం పొరపాటేనని, దీనిపై విచారణ జరుపుతామని బదులిచ్చారు. ఇంటర్ పరీక్షలో చేదు అనుభవం చదివింది సంస్కృతం.. కానీ హాల్టికెట్లో తెలుగుగా ముద్రణ అందులో ఏది ఉంటే అదే రాయాలని ఆదేశం చివరికి ఎగ్జామ్ రాయకుండానే వెనుదిరిగి -
అరాచకాలకు అడ్డొస్తే కక్షసాధింపే
నెల్లూరు సిటీ: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీ నేతల కక్షసాధింపులు పరాకాష్టకు చేరుకుంటున్నాయి. తమకు అడ్డొచ్చినా.. ప్రశ్నించినా తట్టుకోలేకపోతున్నారు. వీరిపై అధికారులను ఉసిగొల్పి ఇబ్బందులకు గురిచేయడం పరిపాటిగా మారింది. నోటీసులివ్వకుండానే.. రూరల్ మండలంలోని ఆమంచర్ల బిట్ – 2 ఎంపీటీసీ సురేంద్రరెడ్డికి చెందిన స్థల హద్దు కంచెను ఎలాంటి నోటీసులివ్వకుండానే రెవెన్యూ అధికారులు తొలగించారు. వాస్తవానికి అప్పయ్యకండ్రిగలోని పడమర వీధిలో ఎంపీటీసీ చింతా సురేంద్రరెడ్డికి 50 అంకణాల స్ధలం ఉంది. తాతల నాటి నుంచే ఇది సంక్రమించింది. అక్కడ దశాబ్దాలుగా ఉన్న చిన్న ఇల్లు పాతబడటంతో కొన్నేళ్ల క్రితం తొలగించారు. స్థలం ప్రస్తుతం ఖాళీగా ఉండటంతో చుట్టూ కంచె వేశారు. పచ్చ నేతల సూచనలతోనే.. స్థలం వద్దకు స్థానిక సర్వేయర్, వీఆర్వో శనివారం చేరుకొని, టీడీపీ నేత వేణుకు సంబంధించిన జేసీబీని తీసుకొచ్చారు. రూరల్లోని ఓ టీడీపీ ముఖ్యనేత ఆదేశాలతో స్థలం చుట్టూ ఉండే కంచెను తొలగించేందుకు సిద్ధమయ్యారు. ఎంపీటీసీ కుమారుడు మస్తాన్రెడ్డి అక్కడికి చేరుకొని అడ్డుకున్నారు. ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నించగా, తామేమీ చేయలేమని, టీడీపీ పెద్దల సూచనలతోనే వచ్చామని బదులిచ్చారు. అధికారుల తీరుపై స్థానికులు మండిపడ్డారు. వాగ్వాదం జరుగుతున్న సమయంలోనే కంచెను జేసీబీతో తొలగించారు. కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. కాగా పచ్చ నేతలను కలవాలని సూచించి, అధికారులు నిష్క్రమించారు. బాధితులకు అండగా నిలిచినందుకే.. ఆమంచర్లలోని 23 కుటుంబాలకు సంబంధించిన భూమిని టీడీపీకి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించేందుకు యత్నించారు. ఈ వ్యవహారంలో పేదలకు ఎంపీటీసీ సభ్యుడు అండగా నిలిచారు. సమస్యను కలెక్టర్ దృష్టికీ తీసుకెళ్లారు. దీంతో కక్ష పెంచుకున్న వారు ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా పొరంబోకు స్థలమంటూ కంచె తొలగింపు చర్యలకు అధికారులు పూనుకున్నారు. ఇలా వ్యవహరించడం దారుణమని సురేంద్రరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీటీసీ సభ్యుడి స్థల హద్దు కంచె తొలగింపు టీడీపీ ముఖ్యనేత ఆదేశాలకు అధికారుల జీహుజూర్ మూడు తరాలుగా అక్కడే నివాసం ఉన్న కుటుంబం -
తోపుడు బండ్లను ఢీకొన్న కారు
నెల్లూరు(క్రైమ్): కారు మితిమీరిన వేగంతో రోడ్డుపక్కనే ఉన్న తోపుడు బండ్లు, స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటన నెల్లూరులోని కేవీఆర్ పెట్రోల్ బంకు సమీపంలో ఆదివారం జరిగింది. సేకరించిన సమాచారం మేరకు.. కస్తూరిదేవి గార్డెన్స్ ఎదురు ఖాళీ స్థలం వద్ద రోడ్డుమార్జిన్లో తోపుడు బండ్లపై కొందరు పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఫత్తేఖాన్పేట నుంచి కేవీఆర్ పెట్రోల్ బంకు వైపు కారు మితిమీరిన వేగంతో వస్తూ రెండు పండ్ల బండ్లను, ఒక స్కూటీని ఢీకొట్టి ఆగిపోయింది. వ్యాపారులు, స్కూటీ యజమాని సకాలంలో పక్కకు దూకడంతో ప్రమాదం తప్పింది. ప్రమాదానికి కారణమైన కారు ముందుబాగం దెబ్బతింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు. తల్లీబిడ్డల అదృశ్యంముత్తుకూరు: భర్త వైఖరితో మనస్తాపం చెందిన ఓ భార్య తన ఇద్దరు పిల్లలను తీసుకుని అదృశ్యమైన ఘటన కృష్ణపట్నం పంచాయతీలో జరిగింది. ఆదివారం కృష్ణపట్నం ఎస్సై శ్రీనివాసరెడ్డి వివరాలు వెల్లడించారు. ఆర్కాట్పాళేనికి చెందిన సురేష్, పామంజి కల్యాణి దంపతులకు లీలా మనోహర్, భార్గవ్ అనే పిల్లలున్నారు. సురేష్ నిరుద్యోగిగా ఉండటం భార్యకు నచ్చలేదు. పుట్టింటి నుంచి తెచ్చిన డబ్బుతో భర్త ద్వారా రొయ్యల పెంపకం చేయాలనుకుంది. కాగా అందులో సగం డబ్బు ఖర్చు కావడం ఆమెను తీవ్ర వేదనకు గురిచేసింది. భర్తపై అలిగి ఇద్దరు పిల్లలను తీసుకుని శనివారం కల్యాణి ఇంటి నుంచి వెళ్లిపోయింది. సురేష్ గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరులో యువతినెల్లూరు(క్రైమ్): ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు బయోడేటా తయారు చేసుకుని వస్తానని ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైంది. పోలీసుల కథనం మేరకు.. గుప్తా పార్కు ప్రాంతానికి చెందిన యువతి ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. బయోడేటా తయారు చేసుకునేందుకు గాంధీబొమ్మ సెంటర్కు వెళ్తున్నానని ఆమె ఆదివారం కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చింది. తిరిగి రాకపోవడంతో కుటుంబం గాలించింది. ఆచూకీ తెలియకపోడంతో సంతపేట పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చూస్తే.. కన్నీరే..!
● స్వస్థత కోసం ఏఎస్పేట దర్గాకు మతిస్థిమితం లేని వారు దక్షిణాది రాష్ట్రాల్లో సుప్రసిద్ధమైన దర్గాల్లో ఏఎస్పేటలోని హజరత్ ఖాజానాయబ్ రసూల్ దర్గా ఒకటి. దీని దర్శనార్థం దేశ, విదేశాలకు చెందిన ఎంతో మంది భక్తులు వస్తుంటారు. స్వస్థత నిమిత్తం మతిస్థిమితం లేని వారిని ఇక్కడికి తీసుకొస్తే ఆ సమస్య నయమవుతుందనేది ప్రగాఢ విశ్వాసం. ఈ నమ్మకంతో పలువుర్ని ఈ ప్రాంతంలో వదిలేసి కుటుంబసభ్యులు వెళ్తుంటారు. ఈ అవకాశాన్నే సంరక్షకులు చక్కగా క్యాష్ చేసుకుంటున్నారు. మానసిక వ్యాధిగ్రస్తులను చైన్లతో కట్టి.. వేధింపులకు పాల్పడుతూ అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు పర్యవేక్షణలేక కొందరు అటవీ ప్రాంతంవైపు వెళ్లి మృత్యువాత పడుతున్న ఘటనలూ ఉన్నాయి. ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తులు నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు. మానసిక రోగైన మస్తాన్ను కుటుంబసభ్యులు ఏఎస్పేటలోని ఓ కేర్ టేకర్ వద్ద మూడు నెలల క్రితం వదిలారు. ఆయనకు తోడుగా సోదరి ఉంటున్నారు. ఆమైపె కన్నేసిన కేర్ టేకర్ షరీఫ్ ఎలాగైనా లొంగదీసుకోవాలనే ఉద్దేశంతో మస్తాన్ను ఓ గదిలో మూడు రోజుల క్రితం బంధించి కొట్టారు. తనకు సహకరించకపోతే సోదరుడ్ని చంపేస్తానంటూ ఆమెను బెదిరించారు. అంతటితో ఆగకుండా గదిలోకి లాక్కెళ్లి చేయి చేసుకున్నారు. తప్పించుకున్న ఆమె.. ఏఎస్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో షరీఫ్పై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గొలుసుతో అమానవీయంగా బంధించి సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఏఎస్పేటలోని హజరత్ ఖాజానాయబ్ రసూల్ దర్గా భక్తుల విశ్వాసానికి ప్రతీక. దీన్ని దర్శించుకుంటే తమ మొక్కులు తీరుతాయనే నమ్మకం చాలా మందిలో బలంగా నాటుకుంది. మతిస్థిమితం లేని వారిని ఇక్కడ కొంతకాలం ఉంచితే నయమవుతుందనే భావనా ఉంది. దీంతో వీరిని ఇక్కడి సంరక్షణ కేంద్రాల్లో కుటుంబసభ్యులే వదిలేసి వెళ్తారు. వీరి సంరక్షణ నిమిత్తం ఒక్కో కేంద్రానికి ఒక్కో కేర్ టేకర్ ఉంటారు. సంరక్షకులే.. భక్షకులు కేర్ టేకర్ ముసుగులో మానసిక రోగులను సంరక్షకులు వేధింపులకు గురిచేస్తున్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఓ మహిళపై కేర్ టేకర్ షరీఫ్ అఘాయిత్యానికి పాల్పడిన ఘటన పెద్ద దుమారమే రేపింది. ఇలాంటి ఘటనలు జరిగినా బయటి ప్రపంచానికి చెప్పుకోలేక మరింతగా కుంగిపోతున్నారు. ఏఎస్పేటలో దాదాపు ఐదుగురు కేర్ టేకర్లుండగా, ఒక్కో కేంద్రంలో 50 నుంచి 70 మంది వరకు మానసిక రోగులు ఉంటున్నారు. నగదు ఇవ్వకపోతే.. గెంటివేతే ఇక్కడ ఉండే వారికి నిత్యం అన్నం పెడతారు. చేయిచాస్తే దయార్థులిచ్చే చిల్లరతో టీ, కాఫీలు సేవిస్తుంటారు. వసతిగృహాల్లోని గదులు దుర్భరంగా దర్శనమిస్తాయి. పరిశుభ్రత కానరాదు. కాలకృత్యాలు తీర్చుకునే సమయంలోనూ సంకెళ్లు తీయని ఘటనలు ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నెలవారీగా కుటుంబసభ్యుల నుంచి నగదును మాత్రం తెప్పించుకుంటారు. ఒకవేళ జాప్యం జరిగితే వసతిగృహం నుంచి గెంటేస్తారు. నమ్మకమే.. గేట్ వే..! ఏఎస్పేట దర్గాలో తిరిగే మానసిక రోగుల ఆరోగ్యం కుదుటపడిన ఉదంతాలూ చాలానే ఉన్నాయి. నెలల వ్యవధిలోనే సాధారణ స్థితికొచ్చి తిరిగి స్వస్థలాలకు వెళ్తుండటంతో ఇది మానసిక రోగులకు నిలయంగా మారింది. వైద్యం చేయించినా ప్రయోజనం లేకపోతే దర్గా పరిసర ప్రాంతాల్లో వదిలేస్తే దైవమే నయం చేస్తుందనే నమ్మకం ఉంది. దీంతో చాలా మందిని ఇక్కడ వదిలి వెళ్తుంటారు. క్షుద్బాధతో మృత్యువాత పేద మానసిక రోగులకు ప్రత్యేక వసతి గృహాల్లో స్థానం ఉండదు. దీంతో దేవుడిపై కుటుంబసభ్యులు భారమేసి బయటే వదిలి వెళ్తున్నారు. పర్యవేక్షణ లేక వీరు అడవిబాట పడుతున్నారు. అలా వెళ్లిన వారు రోజుల తరబడి అక్కడే ఉంటూ ఆకలితో అలమటించి, తాగునీరు దొరక్క మృత్యువాత పడుతున్న ఘటనలూ ఉన్నాయి. ఐదేళ్లలో ఈ తరహాలో దాదాపు పది మంది వరకు మృత్యువాత పడ్డారని తెలిసింది. ఇలాంటి ఘటనల్లో కుటుంబసభ్యులకు సమాచారమిచ్చే పరిస్థితీ ఉండదు. గుర్తుతెలియని మృతదేహాలుగా పోలీసులు కేసు నమోదు చేసి అక్కడే అంత్యక్రియలు చేయించాల్సి వస్తోంది. ఓ ఇంట్లో మానసిక రోగులు ఏఎస్పేట దర్గాలో మానసిక రోగుల కోసం ప్రత్యేక వసతి గృహాలను నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దర్గా ప్రస్తుతం వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉంది. దీని నిర్వహణపై ఎన్నో ఫిర్యాదులూ వెళ్లాయి. వసతుల ఏ ర్పాటులో నిర్లక్ష్యం వహిస్తున్న తీరు ను తప్పుబడుతున్నారు. అక్కడే వదిలేస్తున్న కుటుంబసభ్యులు చుట్టూ తిరిగితే వ్యాధి తగ్గుతుందనే నమ్మకం అవకాశాన్ని సొమ్ము చేసుకుంటున్న సంరక్షకులు చైన్లతో కట్టి.. ఆపై హింసిస్తూ.. పర్యవేక్షణ లేక అటవీ ప్రాంతం వైపు వెళ్లి మృత్యువాత మానసిక రోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంటుంది. కాళ్లు, చేతులకు సంకెళ్లేసి వదిలేస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు వీటితోనే నడవాల్సి ఉంటుంది. వారికంటూ ప్రత్యేక చికిత్సే ఉండదు. ఏఎస్పేట దర్గా పరిసర ప్రాంతాల్లో దాదాపు 300 మంది వరకు మానసిక రోగులున్నారు. వీరిలో ఎక్కువ మంది ప్రైవేట్ వ్యక్తులు ఏర్పాటు చేసిన వసతి గృహాల్లోనే ఉంటున్నారు. పర్యవేక్షకులు మాత్రం వీరిని సాటి మనుషులుగా పరిగణించరు. ఎదురుతిరిగితే కర్రతో చావబాదుతారు. దీంతో వీరి శరీరం నిండా దెబ్బలే కనిపిస్తాయి. భయపడి పర్యవేక్షకులు చెప్పిన విధంగా నడుచుకోవాల్సి వస్తోంది. ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తులు కొద్ది నెలలుగా కేర్టేకర్ షరీఫ్ వద్ద ఉంటున్నారు. వీళ్లను బేల్దారీ పనులకు పంపిస్తూ ఆదాయాన్ని గడిస్తున్నారు. మానసిక రోగులనే కనికరం లేకుండా కర్రతో కొడుతూ వికృతానందం పొందుతున్నారు. ఒక్కొక్కరికి నెలకు రూ.15 వేలను కుటుంబసభ్యుల వద్ద వసూలు చేస్తుంటారు. వీరిని వివిధ పనులకు పంపిస్తూ కూలి డబ్బులనూ కొల్లగొడుతున్నారు. -
పెత్తనం నీదా.. నాదా..?
సైదాపురం మండలంలోని గనుల కోసం కూటమి నేతలు కొట్లాడుకుంటున్నారు. ప్రధానంగా శ్రీనివాసా పద్మావతి మైన్ను సొంత చేసుకునేందుకు ప్రచ్ఛన్న యుద్ధానికి తెరలేపారు. నెల్లూరుకు చెందిన ఓ ముఖ్యనేత ఆధిపత్యాన్ని సహించలేని స్థానిక ప్రజాప్రతినిధి మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే పోలీస్.. రెవెన్యూ అధికారులను ఆదివారం రంగంలోకి దించారు. అయితే సదరు ముఖ్యనేత జోక్యం చేసుకోవడంతో చేసేదిలేక చేతులెత్తేశారు. తూతూమంత్రంగా చర్యలు చేపట్టి ముఖం చాటేశారు. మైనింగ్కు అనుమతి లేదు శ్రీనివాసా పద్మావతి గనిలో అక్రమ మైనింగ్పై ఫిర్యాదులొచ్చాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు పరిశీలించాం. ఇక్కడ కేవలం పంపింగ్ను మాత్రమే చేస్తున్నారు. ఖనిజాన్ని తరలించేందుకే అనుమతి ఉంది. మైనింగ్కు లేదు. – రమాదేవి, తహసీల్దార్, సైదాపురం ఫిర్యాదు అందలేదు శ్రీనివాసా పద్మావతి గనిలో అక్రమ మైనింగ్పై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు చేపడతాం. ఇక్కడ వాహనాలను స్వాధీనం చేసుకోలేదు. ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదు. – క్రాంతికుమార్, ఎస్సై, సైదాపురం ●శ్రీనివాసా పద్మావతి గని కోసం కూటమి నేతల ఘర్షణ ● సిండికేట్కు వ్యతిరేకంగా స్థానిక ప్రజాప్రతినిధి ఆదేశాలు ● ముఖ్యనేత జోక్యంతో తలలు పట్టుకుంటున్న అధికారులు సైదాపురం: మండలంలోని రామసాగరం, సైదాపురం గ్రామాలకు చెందిన ప్రభుత్వ భూమిని శ్రీనివాసా పద్మావతి గనికి గతంలో కేటాయించారు. 2019లోనే లీజు కాలపరిమితి ముగియడంతో అది కాస్తా మూతపడింది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వమొచ్చిన అనంతరం దానిపై పలువురు నేతల కన్నుపడింది. ఎలాంటి అనుమతుల్లేకుండా నెల్లూరుకు చెందిన టీడీపీ పెద్దల ఆధ్వర్యంలో మైనింగ్ ప్రారంభమైంది. ఈ క్రమంలో రామసాగరం గ్రామస్తులు కొందరు అక్రమ మైనింగ్ను ఆదివారం అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన మైనింగ్ సిండికేట్కు చెందిన వ్యక్తులు తమకు అధికార పార్టీ ఎంపీ, మరో నాయకుడి మద్దతు ఉందంటూ గ్రామస్తులను బెదిరించి తరిమేశారు. ప్రజాప్రతినిధి ఆగ్రహం మైనింగ్ సిండికేట్ దౌర్జన్యాలపై రామసాగరం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన వెంటనే ఫోన్ చేసి మైనింగ్ నిర్వాహకులపై చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు మైన్ వద్దకు వచ్చిన పోలీసులు ఎనిమిది మోటార్సైకిళ్లు, ఓ ఎస్యూవీ వాహనాన్ని స్వాధీనం చేసుకొని స్టేషన్కు తరలించారు. తదనంతరం ఏమి జరిగిందో గానీ.. పోలీసులు సీజ్ చేసి వాహనాలు స్టేషన్ ఆవరణ నుంచి వెళ్లిపోయాయి. ఈ విషయం స్థానిక ప్రజాప్రతినిధికి తెలియడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారి ఆదేశాల మేరకు తహసీల్దార్ రమాదేవి, ఎస్సై క్రాంతికుమార్ హుటాహుటిన శ్రీనివాసా పద్మావతి గని వద్దకు చేరుకొని, అక్రమ మైనింగ్పై విచారణ చేపట్టారు. అనుమతుతెలా..? శ్రీనివాసా పద్మావతి గనిలో మైనింగ్ కోసం వచ్చిన దరఖాస్తును జనవరిలో తిరస్కరించారు. ఇంతలో ఏమైందో తెలియదు గానీ నెల గడవక ముందే సదరు గనిలో 1.5 లక్షల టన్నుల ఖనిజాన్ని తవ్వుకొని తరలించుకునేందుకు అనుమతులు మంజూరయ్యాయి. ఈ గనిపై కోర్టులో కేసు నడుస్తుండగానే అధికారులు పర్మిషన్ ఇవ్వడం గమనార్హం. -
పీడించండి.. వసూలు చేయండి
● హడలెత్తిస్తున్న మార్కెటింగ్ శాఖ ● సెస్ వసూలు విషయంలో ఉన్నతాధికారుల ఒత్తిళ్లు ● 15 రోజుల్లో రూ.7 కోట్లు ముక్కుపిండి వసూలు ● కూటమి ప్రభుత్వంపై కన్నెర్రగోదాము (ఫైల్) నెల్లూరు(సెంట్రల్): జిల్లాలో నెల్లూరు, కోవూరు, కావలి, కందుకూరు, రాపూరు, ఆత్మకూరు, ఉదయగిరి, సర్వేపల్లి మార్కెట్ కమిటీలున్నాయి. వాటి పరిధిలో పండించిన వ్యవసాయ ఉత్పత్తులను వివిధ ప్రాంతాలకు సరఫరా చేసేందుకు మార్కెట్ శాఖకు సెస్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది విధించిన లక్ష్యం రూ.34.43 కోట్లు. ఈ నెలాఖరుకు వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏ ప్రాంతాల్లో ఎంతంటే.. నెల్లూరులో రూ.5.13 కోట్లు, కోవూరులో రూ.6 కోట్లు, కావలిలో రూ.3.83 కోట్లు, కందుకూరులో రూ.1.36 కోట్లు, రాపూరులో రూ.46 లక్షలు, ఆత్మకూరులో రూ.1.17కోట్లు, ఉదయగిరిలో రూ.1.18 కోట్లు, సర్వేపల్లిలో రూ.1.49 కోట్ల చొప్పున ఇప్పటి వరకు వసూలు చేసినట్లు తెలిసింది. నెలాఖరు సమీపిస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల ఒత్తిడితో గత 15 రోజుల్లో సుమారు రూ.7 కోట్ల వరకూ ముక్కుపిండి వసూలు చేసినట్లు సమాచారం. ఎన్నడూ లేని విధంగా.. సాధారణంగా వ్యవసాయ ఉత్పత్తులు తరలించే వారి నుంచి సెస్ వసూలు చేస్తుంటారు. కూటమి ప్రభుత్వం ముక్కుపిండి వసూలు చేసే విధానానికి తెర తీసింది. ఎన్నడూ లేని విధంగా విద్యార్థులుండే హాస్టల్స్, బేకరీలు, స్వీట్ షాపుల్లో మార్కెట్ శాఖ తనిఖీలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. హాస్టల్స్లో వాడే బియ్యం ఎక్కడి నుంచి తెచ్చారు?, బిల్లు ఉందా?, ఏ మిల్లు నుంచి తెచ్చారు? లేక ఏ రైతు నుంచి కొనుగోలు చేశారనే వివరాలను తెలుసుకుంటున్నారు. నిర్వాహకులు నేరుగా రైతుల నుంచి తీసుకుని కొనుగోలు చేస్తే దానికి సెస్ కట్టారా?, ఆ రైతు వివరాలు ఇవ్వండంటూ బెంబేలెత్తిస్తున్నారు. దీంతోపాటు స్వీట్ షాపులు, బేకరీల్లో తనిఖీలు చేస్తూ మీరు వాడుతున్న స్వీట్స్కు జీడిపప్పు, బాదం పప్పు, ఇతర పప్పు దినుసులు ఎక్కడి నుంచి కొన్నారు? తదితరాలను అడుగుతూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఒత్తిడి చేయడంతో.. పనులన్నీ పక్కనపెట్టి సెస్ వసూళ్లపైనే దృష్టి పెట్టాలని ప్రభుత్వం ఒత్తిడి తేవడంతో మార్కెటింగ్ శాఖ అధికారులు, సిబ్బందికి నిద్రాహారాలు కరువయ్యాయి. రాత్రి, పగలు తేడా లేకుండా చెక్పోస్టు పాయింట్లలో ఉండి వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. టార్గెట్ పూర్తి చేయకపోతే చర్యలు తప్పవని ఉన్నతాధికారులు తెగేసి చెప్పడంతో అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు.వ్యాపారులు నష్టాల్లో ఉన్నా.. వ్యవసాయంలో లాభాలు రాకపోయినా.. మనకు సంబంధం లేదు. ఆహార ఉత్పత్తులు రవాణా చేసే వారి నుంచి సెస్ను ముక్కుపిండి వసూలు చేయాలని జిల్లాలోని మార్కెటింగ్ శాఖ అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక సెస్ వసూళ్లంటూ అధికారులు తనిఖీల పేరుతో హడావుడి చేస్తున్నారు. నిబంధనల ప్రకారం వసూలు మార్కెట్ శాఖకు కట్టాల్సిన సెస్ వసూళ్లలో మేం నిబంధనలు పాటిస్తున్నాం. సెస్ కట్టాల్సిన వారి నుంచి తప్పకుండా వసూలు చేసేలా అధికారులు ముందుకెళ్తున్నారు. ఇప్పటికే రూ.20 కోట్ల మేర వసూలైంది. ఈనెల చివరికి టార్గెట్ పూర్తి చేసే పనిలో ఉన్నాం. – అనితాకుమారి, ఏడీ, జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ -
6 నుంచి మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు
నెల్లూరు(అర్బన్): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 6వ తేదీ నుంచి మూడురోజులపాటు జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు నిర్వహిస్తామని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మన్నేపల్లి పెంచలరావు తెలిపారు. నెల్లూరు దర్గామిట్టలోని ఎన్జీఓ భవన్లో ఆ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశాన్ని మహిళా విభాగం చైర్పర్సన్ ఉదయగిరి చిన్నమ్మ అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెంచలరావు మాట్లాడుతూ పోటీలను ఏసీ స్టేడియంలో కలెక్టర్ ఆనంద్ ప్రారంభిస్తామన్నారు. మహిళా ఉద్యోగులు పాల్గొనేందుకు కలెక్టర్ రెండురోజులపాటు ప్రత్యేక అనుమతి ఇచ్చారన్నారు. 8న సెలవు మంజూరు చేశారన్నారు. ఈ మూడురోజులు ఉద్యోగులకు భోజనం, తాగునీరు ఇతర వసతులు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శివారెడ్డి, విద్యాసాగర్లు ముఖ్యఅతిథిలుగా విచ్చేస్తారన్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ పోటీలలో మహిళా ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారుపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి రామకృష్ణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి లక్కాకుల పెంచలయ్య, ఇంకా ఆంజనేయవర్మ, ప్రసాద్రెడ్డి, కరుణమ్మ, కృష్ణంరాజు, సతీష్బాబు, రాజేంద్రప్రసాద్, విజయబాబు, కృష్ణకుమార్, సువర్ణ, స్వర్ణలత, నవోదయ, లక్ష్మి, జానకి, కిష్టమ్మ, సుమన తదితరులు పాల్గొన్నారు.వర్చుసా లేఅవుట్ ప్రారంభంమనుబోలు: మండల పరిధిలోని కాగితాలపూరు క్రాస్రోడ్డు సమీపంలో జాతీయ రహదారి పక్కన వర్చుసా లేఅవుట్ను ఆదివారం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చేతుల మీదుగా లేఅవుట్ను ప్రారంభించారు. సినీ హీరోయిన్లు నిధి అగర్వాల్, ఐశ్వర్య రాజేష్, జబర్దస్త్ కమెడియన్లు సందడి చేశారు. ఈ సందర్భంగా లేఅవుట్ యజమాని వెంకటేశ్వర్లు, జీఎం శివాజీ మాట్లాడుతూ హైవే పక్కనే అందరికీ అందుబాటులో లేఅవుట్ను తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు. బస్సు సౌకర్యం, 300 మీటర్ల దూరంలో రైలు సౌకర్యాలున్నాయని తెలిపారు. లేఅవుట్లో విశాలమైన రోడ్లు, డ్రెయినేజీ, విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. నేడు ప్రత్యేక ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంకలువాయి: మండలంలోని మాదన్నగారిపల్లి సచివాలయంలో సోమవారం జాయింట్ కలెక్టర్ కార్తీక్, ఆత్మకూరు ఆర్డీఓ అధ్యక్షతన ప్రత్యేక ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమం నిర్వహించనున్నట్టు తహసీల్దార్ శ్యామ్సుందర్రాజు ఆదివారం తెలిపారు. రైతులు హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని కోరారు.వృద్ధుడి ఆత్మహత్యనెల్లూరు(క్రైమ్): అనారోగ్యమో మరే ఇతర కారణమో స్పష్టంగా తెలియదు గానీ ఓ వృద్ధుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. సంతపేటకు చెందిన సత్యనారాయణ (60), సుజాత దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. ఒకరు అమెరికాలో ఉండగా, మరొకరు ఇక్కడే ఉంటున్నారు. సత్యనారాయణ గతంలో కుదువ వ్యాపారం చేసేవాడు. రెండేళ్లుగా మతిస్థిమితం సక్రమంగా లేక ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. అప్పుడప్పుడు వచ్చి భార్యకు కనిపించేవాడు. శనివారం రాత్రి ఆయన సంతపేట సమీపంలో పురుగు మందు తాగాడు. చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. సుజాత ఫిర్యాదు మేరకు సంతపేట ఎస్సై బాలకృష్ణ కేసు నమోదు చేశారు. కండలేరులో 51.647 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 51.647 టీఎంసీ నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ విజయకుమార్రెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 760, లోలెవల్ కాలువకు 110, హైలెవల్ కాలువకు 160, మొదటి బ్రాంచ్ కాలువకు 70 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.నిమ్మ ధరలు (కిలో) పెద్దవి : రూ.61 సన్నవి : రూ.40 పండ్లు : రూ.30 పౌల్ట్రీ అసోసియేషన్ ధరలు బ్రాయిలర్ (లైవ్) : 116 లేయర్ (లైవ్) : 80 బ్రాయిలర్ చికెన్ : 210 బ్రాయిలర్ స్కిన్లెస్ : 230 లేయర్ చికెన్ : 136 -
ఎల్ఐసీలో పాలసీదారులకు నూరుశాతం భద్రత
నెల్లూరు(అర్బన్): ప్రభుత్వ రంగంలో నడుస్తున్న అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీలో పాలసీదారుల ప్రీమియంకు నూరుశాతం భద్రత ఉంటుందని ఎల్ఐసీ డివిజనల్ (నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలు) సేల్స్ మేనేజర్ జి.ప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం నెల్లూరులోని మద్రాస్ బస్టాండ్ వద్ద ఉన్న ఓ హోటల్లో ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ప్రజల నుంచి సేకరించిన ప్రీమియంను ప్రభుత్వ ఆధ్వర్యంలోని రైల్వేలు, రోడ్లు, భారీ పరిశ్రమల్లోనే పెట్టుబడిగా పెట్టే సంస్థ ఎల్ఐసీ అన్నారు. జీవన్ ఉత్సవ్, జీవన్ ఉమాంగ్, అమృత్బాల్, జీవన్ ఆనంద్ లాంటి పాలసీలకు పెద్దఎత్తున ప్రజల నుంచి స్పందన రావడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి పాలసీల పట్ల ప్రజలకు ఏజెంట్లు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఎండీఆర్టీ, ఇతర లక్ష్యాలను సాధించిన ఏజెంట్లను సన్మానించారు. కార్యక్రమంలో బుచ్చిరెడ్డిపాళెం బ్రాంచ్ మేనేజర్ పెంచలయ్య, డీఓ బాలసుబ్రహ్మణ్యం, పలువురు ఏజెంట్లు పాల్గొన్నారు. -
హైలెవల్ కాలువను వెంటనే నిర్మించాలి
మర్రిపాడు: సోమశిల హైలెవల్ కెనాల్ను వెంటనే పూర్తి చేయాలంటూ మర్రిపాడులో రైతు సదస్సును సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య మాట్లాడారు. మెట్ట ప్రాంత తాగు, సాగునీటి అవసరాల కోసం నిర్మించనున్న దీన్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. ప్రాజెక్ట్ పూర్తి చేసేలా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చొరవ చూపాలని కోరారు. ఈ విషయమై నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడ్ని ఈ నెల ఐదున కలవనున్నామన్నారు. నేతలు మూలె వెంగయ్య, నాగయ్య, లక్కు ప్రసాద్, చండ్రా నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. ఏడు నెలల పాపతో తల్లి ఆత్మహత్యాయత్నం ● రక్షించిన పోలీసులు నెల్లూరు(క్రైమ్): కుటుంబకలహాలతో మనస్తాపానికి గురైన వివాహిత తన ఏడు నెలల కుమార్తెతో కలిసి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు వీరిని రక్షించారు. వివరాలు.. చింతారెడ్డిపాళేనికి చెందిన నితిన్, జాస్మిన్ గతేడాది ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఏడు నెలల పాప ఉంది. కొంతకాలం సజావుగా సాగిన వీరి కాపురంలో కలతలు చోటుచేసుకున్నాయి. ఈ తరుణంలో జాస్మిన్ తన పాపతో కలిసి ఇంటి నుంచి శనివారం రాత్రి బయటకొచ్చారు. సౌత్ రైల్వేస్టేషన్ సమీపంలోని పట్టాల వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా, అటుగా వెళ్తున్న హరీష్.. 112కు సమాచారం అందించారు. చిన్నబజార్ ఇన్స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు ఆదేశాల మేరకు కానిస్టేబుళ్లు ప్రభు కిరణ్, పుల్లయ్య హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని తల్లీకుమార్తెను రక్షించి పోలీస్స్టేషన్కు తరలించారు. వివరాలు సేకరించి ఆమె కుటుంబసభ్యులకు సమాచారాన్ని ఇన్స్పెక్టర్ అందించారు. అనంతరం నెల్లూరు రూరల్ పోలీస్స్టేషన్కు పంపారు. బాధితురాలి కుటుంబసభ్యులకు రూరల్ ఇన్స్పెక్టర్ వేణు కౌన్సెలింగ్ చేసి వీరిని అప్పగించారు. -
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
● గతంలో పూరిళ్లు, గడ్డివాములు అధికంగా అగ్నికి ఆహుతయ్యేవి. ఇప్పుడు ఎక్కువ ప్రమాదాలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్, గ్యాస్ లీకేజీ తదితరాలు కారణాలుగా నిలుస్తున్నాయి. ● నివాసాలు, పొలాల గట్లపైన ఉన్న గడ్డివాముల చుట్టూ కంచె నిర్మించుకోవడం మంచిది. వీటికి సమీపంలో పొగతాగడం, చుట్ట, సిగరెట్, బీడీ వంటివి ఆర్పకుండా పారేయడం ప్రమాదకరం. ● ఎండుగడ్డిని ట్రాక్టర్లు, లారీల్లో రవాణా చేసే సమయంలో విద్యుత్ వైర్లకు తగలకుండా చూడాలి. ● రహదారి, కాలువగట్టు, నివాసాల పక్కన చెత్త వేయడం మంచిదికాదు. చెత్తకు నిప్పంటించడం ప్రమాదకరం. అది చుట్టుపక్కల వ్యాపించే అవకాశం ఉంటుంది. ● నాణ్యత కలిగిన విద్యుత్ వైర్లు, పరికరాలను మాత్రమే ఇళ్లు, దుకాణాల్లో వినియోగించుకోవాలి. ● ప్రమాదం సంభవించిన వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేసే ఆధునిక ఆపరేటింగ్ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలి.● కొద్దిరోజుల క్రితం మర్రిపాడు మండలంలోని నందవరంలో ఓ పొగాకు బ్యారెన్ దగ్ధమైంది. క్యూరింగ్ కోసం ఏర్పాటు చేసిన పొగాకు కర్రలు జారిపడిపోవడంతో సాయంత్రం 5.30 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించినా రాత్రి 7.30 గంటలకు కూడా ఫైరింజిన్ ఘటనా స్థలానికి రాలేదు. సీఎం పర్యటన నేపథ్యంలో ఇక్కడి అగ్నిమాపక శకటాన్ని నెల్లూరుకు తరలించినట్లు చెబుతున్నారు. సుమారు రూ.5 లక్షల మేర నష్టం వాటిల్లింది. నెల్లూరు(క్రైమ్): ఎండలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. వేసవి పూర్తిగా రాకముందే భానుడు తన ప్రకోపాన్ని మెల్లమెల్లగా పెంచుతున్నాడు. అజాగ్రత్త, ఏమరపాటో, ఆకతాయిల చేష్టలు ఇలా కారణం ఏదైతేనేం ఏదో ఒకచోట నిప్పు రాజుకుంటూనే ఉంటోంది. ఆ సమయంలో ప్రతిక్షణం అమూల్యమైనదే. ఆలస్యమయ్యే కొద్దీ నష్టం పెరుగుతుంది. జిల్లాలో అవసరం మేరకు అగ్నిమాపక కేంద్రాల్లేక ప్రమాదాల నివారణ సవాలుగా మారుతోంది. కేంద్రాలున్న చోట కూడా సిబ్బంది కొరత వేఽధిస్తోంది. కొన్ని ప్రాంతాలు కేంద్రాలకు దూరంలో ఉండటంతో ఫైరింజిన్లు చేరుకునేలోగా బూడిద మిగులుతోంది. తరచూ మరమ్మతులకు.. భానుడి భగభగలకు మానవ తప్పిదాలు తోడైతే పెను నష్టం వాటిల్లుతుంది. వేసవిలో అగ్నిప్రమాదాలు మరింత పెరిగే అవకాశం ఉంది. అగ్నిమాపక శాఖ అప్రమత్తంగా లేకపోతే ప్రజల ఆస్తులు, ప్రాణాలు బుగ్గిపాలు కావాల్సిందే. జిల్లాలో నెల్లూరు, కందుకూరు, కావలి, వింజమూరు, ఉదయగిరి, మర్రిపాడు, ఆత్మకూరు, రాపూరు, పొదలకూరుల్లో అగ్నిమాపక కేంద్రాలున్నాయి. స్టాండింగ్ ఫైర్ అడ్వైజరీ కౌన్సిల్ ప్రమాణాల మేరకు ప్రతి 50 వేల జనాభాకు ఒక ఫైరింజిన్ ఉండాలి. ప్రస్తుతం 11 మాత్రమే ఉండగా అందులో ఒకటి మరమ్మతులకు గురైంది. మినీ ఫైరింజిన్ మూలనపడింది. కొన్ని వాహనాలకు పూర్తిస్థాయిలో ఫిట్నెస్ లేకపోవడంతో తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. దీంతో అగ్నిప్రమాదాలను సకాలంలో అరికట్టేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జనాభా పెరుగుదల, విస్తరిస్తున్న ప్రాంతాలతో ప్రమాద సమయంలో అగ్నిమాపక వాహనాలు సకాలంలో అక్కడకు చేరుకోలేక పోతుండటంతో ఆస్తి, ప్రాణనష్టం జరుగుతోంది. తీవ్ర ఇబ్బందులు జిల్లాలో అపార్ట్మెంట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వాటిల్లో కొన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినవే. అపార్ట్మెంట్లలో సెట్బ్యాక్ లేకపోవడంతో ప్రమాదం జరిగితే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాస్తవానికి అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఫైరింజిన్లు సులువుగా వెళ్లి మంటలను అదుపు చేసే పరిస్థితి ఉండాలి. అయితే అది చాలాచోట్ల లేదు. అలాగే గోదాముల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇంకా కొన్ని ప్రైవేట్ పాఠశాలలు, ఆస్పత్రులను బహుళ అంతస్తుల భవనాల్లో నిర్వహిస్తున్నారు. వీటిలో అధికశాతం ప్రమాద నివారణకు అవసరమైన పరికరాలు ఉంచడం లేదు. దీంతో ఆస్తితోపాటు ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది. సర్వం కాలిపోయి.. నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో నెల్లూరు అగ్నిమాపక కేంద్రం నుంచి అగ్నిమాపక శకటాలు వెళ్లి మంటలను ఆర్పుతున్నాయి. ముత్తుకూరు, వెంకటాచలం, ఇందుకూరుపేట, రాజుపాళెం, కోవూరు, బుచ్చిరెడ్డిపాళెం తదితర ప్రాంతాలకు వెళ్లాలంటే 30 నిమిషాల నుంచి గంటపైగా సమయం పడుతుంది. దీంతో అనుకోని ఘటన జరిగితే ఫైరింజిన్లు అక్కడికి చేరుకునేలోపే సర్వం బుగ్గిపాలవుతోంది. కొండాపురం, వరికుంటపాడు తదితర ప్రాంతాల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న ప్రాంతాలకు అనుగుణంగా మండలానికి ఒక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదనలు పంపారు. అత్యవసర ప్రాతిపదిక కింద నెల్లూరు రూరల్, బుచ్చిరెడ్డిపాళెంలో నూతన అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటు, ఆత్మకూరు, ఉదయగిరి కేంద్రాల రెన్నోవేషన్, కావలిలో డబుల్ యూనిట్ పెట్టేందుకు చర్యలు చేపట్టారు. అవి కార్యరూపంలో ఉండగానే ఎన్నికలు రావడం, కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో ఆ ప్రక్రియ మందగించింది. ఖాళీలిలా.. అగ్నిమాపక శాఖలో సిబ్బంది కొరత వెంటాడుతోంది. జిల్లా కేంద్రంలో ఏడీఎఫ్ఓ, ఆరుగురు లీడింగ్ ఫైర్మెన్లు, ఐదు డ్రైవర్/ఆపరేటర్, 18 మంది ఫైర్మెన్స్, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో అగ్నిమాపక కేంద్రానికి ఎస్ఎఫ్ఓ, ముగ్గురు లీడింగ్ ఫైర్మెన్లు, ముగ్గురు డ్రైవర్/ఆపరేటర్, తొమ్మిది మంది ఫైర్మన్లుండాలి. జిల్లాలో 158 మంది సిబ్బందికి గానూ 35 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎనిమిది మంది ఫైర్ ఆఫీసర్లకు గానూ ఐదుగురు మాత్రమే ఉన్నారు. మర్రిపాడు, ఉదయగిరి, ఆత్మకూరుల్లో ఫైర్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 90 మంది ఫైర్మెన్లకు గానూ 58 మంది మాత్రమే ఉన్నారు. వారి స్థానంలో హోంగార్డులను వినియోగిస్తున్నారు. అయితే వారూ సరిపడనంతా లేకపోవడంతో ఉన్నవారిపైనే పనిభారం పడుతోంది. అగ్నిమాపక శాఖను వేధిస్తున్న సిబ్బంది కొరత భారీ ప్రమాదాలు సంభవిస్తే అంతే సంగతులు అందుబాటులో 11 ఫైరింజిన్లు తరచూ మరమ్మతులకు గురవుతున్న వైనం ఆ శాఖలో కొన్ని పోస్టులు ఖాళీ -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
పొదలకూరు: పట్టణంలోని దుకాణాల వద్ద భిక్షాటన చేసుకుంటూ మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న వ్యక్తి (45) స్థానిక శివాలయ సమీపంలోని శ్మశాన వాటికలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారాన్ని శనివారం అందించారు. సీఐ శివరామకృష్ణారెడ్డి, ఎస్సై హనీఫ్ ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి తలపై గాయాలుండటం, రక్తపు మడుగులో పడి ఉండటంతో హత్యగా అనుమానిస్తున్నారు. హిందీ మాట్లాడే సదరు వ్యక్తి రెండేళ్లుగా పట్టణంలో తిరిగేవారని స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ ద్వారా ప్రాథమిక ఆధారాలను సేకరించారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. రైలు ఢీకొని యువకుడి దుర్మరణంనెల్లూరు(క్రైమ్): రైలు ఢీకొనడంతో గుర్తుతెలియని యువకుడు మృతి చెందిన ఘటన వేదాయపాళెం రైల్వేస్టేషన్ సమీపంలో చైన్నె వైపు వెళ్లే పట్టాలపై శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మృతుడు సుమారు 30 నుంచి 35 ఏళ్లలోపు వయస్సు కలిగి.. మెరూన్, నలుపు రంగు చెక్స్ ఫుల్హ్యాండ్స్ చొక్కా, బ్లూ రంగుపై తెలుపు డిజైన్ షార్ట్ను ధరించి ఉన్నారు. మృతుడి కుడిచేతిపై ఆర్ఏకేయూ అని ఇంగ్లిష్ అక్షరాలతో పచ్చబొట్టు ఉంది. మృతదేహాన్ని నెల్లూరు రైల్వే ఎస్సై మాలకొండయ్య పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు నెల్లూరు రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు. బైక్ ఢీకొని వృద్ధుడు.. తోటపల్లిగూడూరు: బైక్ ఢీకొనడంతో వృద్ధుడు మృతి చెందిన ఘటన విలుకానుపల్లిలో శనివారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై వీరేంద్రబాబు సమాచారం మేరకు.. విలుకానుపల్లి దళిత కాలనీకి చెందిన గెద్ది శేషయ్య (64) బహిర్భూమి నిమిత్తం గ్రామ సమీపంలోని కోడూరు ప్రధాన రహదారివైపు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో వెళ్లారు. తిరిగి ఇంటికి రాకపోవడంతో గాలింపు చర్యలను కుటుంబసభ్యులు చేపట్టారు. కోడూరు ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న పంచాయితీ దొరువులో శేషయ్య పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. నెల్లూరులోని ఓ వైద్యశాలకు తరలించగా, అప్పటికే మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. పోస్ట్మార్టం నిమిత్తం నెల్లూరులోని జీజీహెచ్కు తరలించారు. ఘటన స్థలంలో లభ్యమైన ఏటీఎం కార్డుల ఆధారంగా సౌత్ఆములూరుకు చెందిన సుమన్ బైక్ ఢీకొని ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన స్థలానికి చేరుకొని పోలీసులు విచారణ చేపట్టారు. ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు. రేపట్నుంచి ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలు నెల్లూరు (టౌన్): ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలను సోమవారం నుంచి ఈ నెల 15 వరకు జిల్లాలోని 20 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 వరకు నిర్వహించనున్న పరీక్షలకు 3580 మంది అభ్యాసకులు హాజరుకానున్నారు. ఐదు ఫ్లయింగ్.. పది సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు 20 మంది చొప్పున, ఇన్విజిలేటర్లుగా 200 మందిని నియమించారు. సమస్యలుంటే హెల్ప్డెస్క్ 83414 08109 నంబర్ను సంప్రదించొచ్చు. పరీక్ష సమయానికి గంట ముందే కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. కాగా పరీక్షల్లో అవకతవకలకు పాల్పడితే యాజమాన్యాలపై చర్యలు తప్పవని డీఈఓ బాలాజీరావు స్పష్టం చేశారు. వీఎస్యూలో 4న జాబ్మేళా వెంకటాచలం: కాకుటూరు సమీపంలోని విక్రమ సింహపురి యూనివర్సిటీ (వీఎస్యూ)లో జాబ్మేళాను ఏపీఎస్సెస్డీసీ, జిల్లా ఎంప్లాయ్మెంట్ కార్యాలయం, సీడాప్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించనున్నామని వీసీ అల్లం శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరై ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారని చెప్పారు. 18 నుంచి 35 ఏళ్లలోపు ఉండి, ఎస్సెస్సీ, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ చదివిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
బెట్టింగ్ జాడ్యం
● జిల్లాలో జోరుగా క్రికెట్ పందేలు ● ఆన్లైన్లో నిర్వహిస్తున్న వైనం ● ఉచ్చులోచిక్కుకుంటున్న మహిళలు ● అప్పులపాలై దొంగతనాలకు ● తాజాగా దొరికిన ఇద్దరు మహిళా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ● అయినా దృష్టి సారించని పోలీసులు ఈమె రమ్మశ్రీ (పేరు మార్చాం). నెల్లూరు కిసాన్నగర్లో నివాసముంటున్నారు. ప్రభుత్వ వైద్యశాఖ కార్యాలయంలో ఎఫ్ఎన్ఓగా పనిచేస్తోంది. పదేళ్ల క్రితం వివాహం జరిగింది. క్రికెట్ బెట్టింగ్లు, రమ్మీతో పాటు పలు ఆన్లైన్ గేములు ఆడుతుంది. అంతేకాకుండా పేటీఎం, ఫోన్పే తదితర వాటి ద్వారా ఆన్లైన్లో సుమారు రూ.5 లక్షల వరకు రుణం, అలాగే స్నేహితుల వద్ద మరో రూ.5 లక్షలు అప్పు తీసుకుని ఆన్లైన్ బెట్టింగులకు పాల్పడుతూ రూ.10 నుంచి రూ.20 లక్షల వరకు అప్పులపాలైంది. ఈఎంఐలు చెల్లించలేక అప్పులు ఎలా తీర్చాలో తెలియక కోవూరులో రెండు రోజుల క్రితం చైన్ స్నాచింగ్ చేస్తూ దొరికిపోయింది. సాక్షిప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ మళ్లీ జడలు విప్పుకుంది. ప్రధాన పట్టణాల నుంచి పల్లెల వరకు ఈ జాడ్యం పాకింది. ప్రస్తుతం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. బుకీలకు కాసులు కురిపిస్తోంది. ప్రజలు బెట్టింగ్ ఉచ్చులో పడి చేతులు కాల్చుకుంటున్నారు. ఒకరిద్దరు పందేలు గెల్చుకుంటున్నా, ఓడిపోయేవారే కోకొల్లలు. బెట్టింగ్లో సర్వం కోల్పోయి అప్పుల బాధలు తాళలేక కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుండగా మరికొందరు నేరాలకు తెగబడుతున్నారు. బెట్టింగ్ను పూర్తిస్థాయిలో కట్టడి చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో జిల్లాలో జోరుగా బెట్టింగ్లు సాగుతున్నాయి. బెట్టింగ్ విధానాల్లో మార్పులు క్రికెట్ ఫార్మాట్లో వస్తున్న మార్పుల తరహాలోనే బెట్టింగ్ విధానాల్లోనూ మార్పులు వస్తున్నాయి. గతంలో మ్యాచ్ టూ మ్యాచ్ మాత్రమే బెట్టింగ్లు కాసేవారు. ప్రస్తుతం టాస్ ఎవరు గెలుస్తారు? గెలిచిన జట్టు ఎంత స్కోర్ చేస్తుంది? ప్రతి బంతికి, ఓవర్కు ఎన్ని పరుగులు వస్తాయి? ఫలానా బ్యాట్స్మెన్ ఎన్ని పరుగులు చేస్తారు? బౌలర్ ఎన్ని వికెట్లు తీస్తారు? ఇలా ప్రతి అంశంపై బెట్టింగ్లు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా రూపొందించిన యాప్ల ద్వారా బెట్టింగ్లు జరుగుతున్నాయి. సెల్ఫోన్లతోనే బెట్టింగ్లు జరుగుతున్నాయి. టీవీల్లో చూసే వాటి కంటే రెండు, మూడు నిమిషాల ముందుగానే ప్రత్యేక యాప్ల్లో మ్యాచ్ వివరాలు తెలిసిపోతుండటం గమనార్హం. గతంలో నగరాలు, పట్టణాలకే పరిమితమైన బెట్టింగ్లు నేడు గ్రామీణ ప్రాంతాలకు పాకాయి. సులువుగా డబ్బులు సంపాదించే అవకాశం ఉందంటూ బుకీలు ఎరవేయడంతో యువత, విద్యార్థులు, కూలీలు, కార్మికులు, వ్యాపారస్తులతో పాటు వివిధ రంగాల్లోని వారు బెట్టింగ్ మాఫియా వలలో చిక్కుకుంటున్నారు. బెట్టింగ్ వ్యసనాలకు బానిసై రూ.లక్షల్లో అప్పులు చేసి మరీ బెట్టింగ్లు కాస్తున్నారు. బెట్టింగ్ల్లో నష్టపోయి అప్పులను తీర్చలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంకొందరు దొంగతనాలకు పాల్పడుతూ వచ్చిన సొమ్ముతో అప్పులు తీర్చి తిరిగి బెట్టింగ్లు కాస్తూనే ఉన్నారు. ఈమె పేరు జానకి (పేరు మార్చాం). నెల్లూరు మూలాపేటలో నివాసం. కోవూరు మండలంలోని ఓ వ్యక్తితో వివాహమైంది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. కరోనా సమయంలో విజయవాడలోని ఎఫ్ఎన్ఓ ట్రైనింగ్ పూర్తి చేసి 2022లో కోవూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవుట్ సోర్సింగ్ ఎఫ్ఎన్ఓగా చేరారు. కరోనా సమయంలో నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో కొందరితో స్నేహం కుదిరి వారి ద్వారా ఆన్లైన్ బెట్టింగ్లు అలవాటు చేసుకుంది. అప్పటి నుంచి ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడుతూ అప్పులు తీర్చేందుకు దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. ● వనంతోపు సెంటర్కు చెందిన ఓ యువకుడు తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీతో సరదాగా బెట్టింగ్లు కాయడం ప్రారంభించాడు. అది వ్యసనంగా మారిపోవడంతో తెలిసిన వారివద్ద అప్పులు చేశాడు. తల్లిదండ్రులు కొని ఇచ్చిన బైక్ను కుదువపెట్టి మరీ బెట్టింగ్లు కాశాడు. అందులో నష్టాలు రావడంతో బైక్ దొంగతనం జరిగిందని తల్లిదండ్రులను నమ్మించే ప్రయత్నం చేశాడు. చివరకు వారు గట్టిగా నిలదీయడంతో బెట్టింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎక్కడ చూసినా క్రికెట్ పందేలే చాపకింద నీరులా బెట్టింగ్ భూతం విస్తరిస్తూ ప్రజల జీవితాలను, కుటుంబాలను ఛిద్రం చేస్తున్నా పోలీసులు అటువైపుగా దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. పోలీసులకు చిక్కకుండా పకడ్బందీగా క్రికెట్ బెట్టింగ్ సాగుతోంది. నగరంలోని బార్లు, హోటల్స్, అపార్ట్మెంట్లు, వ్యాపారసంస్థలు ఎక్కడ చూసినా క్రికెట్ పందేలే. ఈ జాడ్యం వందలాది కుటుంబాల్లో చిచ్చురేపుతోంది. మార్చి 9వ తేదీన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముగుస్తున్నా.., మార్చి 22 నుంచి మే 25వ తేదీ వరకు ఐపీఎల్ జరగనుంది. ఈసీజన్లో ఎంతమంది ఆర్థికంగా చితికిపోతారో? ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారో? ఎన్ని కుటుంబాలు వీధినపడనున్నాయో తలచుకుంటేనే భయం కలుగుతోంది. ఇప్పటికై నా పోలీసు అధికారులు స్పందించి బెట్టింగ్పై ఉక్కుపాదం మోపాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. ● బుచ్చిరెడ్డిపాళెం చెందిన శ్రీనివాసులు బెట్టింగ్ల్లో నష్టపోయాడు. బెట్టింగ్రాయుళ్ల ఒత్తిడితో రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈవిషయం తెలుసుకున్న అతని భార్య యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకుంది. ఎంతో సంతోషంగా ఉండే ఆ కుటుంబాన్ని బెట్టింగ్ భూతం కబళించింది. ఇలా జిల్లాలో అనేకమంది నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు.ఉదాహరణలు ఇవిగో.. నెల్లూరు నగరానికి చెందిన ఇద్దరు యువకులు సులువుగా డబ్బు సంపాదించాలని బెట్టింగ్లు ఎంచుకున్నారు. చిన్న చిన్న మొత్తాలతో పందేలు కాయడం.. వారు ఎంచుకున్న జట్లు గెలుపొందడంతో డబ్చు వచ్చింది. దీంతో తమ తాహతుకు మించి అప్పులు చేసి మరీ రూ.లక్షల్లో బెట్టింగ్లు కాశారు. కథ అడ్డం తిరగడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయి బైక్ దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కి జైలుపాలయ్యారు. -
దర్జాగా ప్రభుత్వ భూమి కబ్జా
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సర్వేపల్లి నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా ఆక్రమించేస్తున్నారు. విలువైన ప్రభుత్వ భూములపై కన్నేసి రాత్రికి రాత్రే పెద్ద యంత్రాలతో చదును చేసి రూపురేఖలు మార్చేస్తున్నారు. తాజాగా వెంకటాచలం మండలం చవటపాళెం పంచాయతీ అనుపల్లిపాడు వద్ద రూ.2 కోట్ల విలువైన సుమారు మూడెకరాల ప్రభుత్వ భూమిని టీడీపీ నాయకులు దర్జాగా కబ్జా చేయడంపై నాలుగు గ్రామాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పరిధిలో అనుపల్లిపాడు గ్రామానికి వెళ్లే మార్గంలో రహదారికి ఆనుకుని విలువైన ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంది. టీడీపీ నాయకులు నాలుగు రోజుల క్రితం యంత్రాలతో సదరు భూమిని, దానికి అనుకుని ఉన్న దశాబ్దాల క్రితం తవ్విన పంట కాలువను పూడ్చి చదును చేశారు. పంట కాలువ రూపురేఖలు లేకుండా చేశారు. సుమారు మూడెకరాలను కబ్జా చేసేశారు. ఆక్రమణలకు గురైన ఈ భూమి జాతీయ రహదారికి కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఎకరా పొలం ధర రూ.70 లక్షలు ఉంటుందని రైతులు చెబుతున్నారు. టీడీపీ నాయకులు కబ్జా చేసిన పంట కాలువ ద్వారానే అనుపల్లిపాడు, నాయుడుపాళెం, జంగాలపల్లి, రామదాసుకండ్రిగ గ్రామాల రైతులకు సాగునీరు విడుదల చేయాల్సి ఉంది. కబ్జా విషయం తెలుసుకున్న రైతులు వెంటనే అక్కడకు చేరుకుని ఆక్రమణదారులతో వాగ్వాదానికి దిగారు. నాలుగు గ్రామాలకు సాగునీరు విడుదల చేసే కాలువను ఎలా పూడ్చివేస్తారని ప్రశ్నించినా వారు లెక్కచేయకుండా పనులు కొనసాగించారు. పట్టించుకోని అఽధికారులు? పంట కాలువను కబ్జా చేస్తున్నారని ఆయా గ్రామాల రైతులు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. ఈ కాలువను పూడ్చివేస్తే తమ పొలాలు బీడు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందని, వెంటనే ఆక్రమణలు తొలగించి, పంట కాలువను యథావిధిగా ఉంచాలని ఫిర్యాదు చేశారు. అయితే ఏ ఒక్క అధికారి కూడా అటువైపు కన్నెత్తి చూడటం లేదు. టీడీపీ పెద్దల సహకారంతోనే పంట కాలువను కబ్జా చేసి చదును చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఉన్నతాఽఽధికారులు జోక్యం చేసుకోవాలని, లేకపోతే కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగుతామని రైతులు హెచ్చరిస్తున్నారు. టీడీపీ నాయకుల ఇష్టారాజ్యం ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమితోపాటు పంట కాలువ ఆక్రమణ నాలుగు గ్రామాల రైతుల ఆగ్రహం ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు -
చేనేతలకు అన్యాయం
నెల్లూరు(వీఆర్సీసెంటర్): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో చేనేత రంగానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఏపీ చేనేత కార్మిక సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు పముజుల హరి ఆరోపించారు. నగరంలోని తన కార్యాలయంలో విలేకరులతో శనివారం ఆయన మాట్లాడారు. చేనేత రంగానికి బడ్జెట్లో రూ.138 కోట్లను కేటాయించడం దారుణమని, ఇందులో రూ.ఐదు కోట్లే చేనేత సహకార సంఘాలకు ఉపయోగపడతాయని, మిగిలిన మొత్తం అలంకారప్రాయంగా మారనుందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో అందజేసిన నేతన్న నేస్తం కంటే మెరుగైన పథకాలను ఇస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. చేనేత రంగాన్ని నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. -
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
● తొలిరోజు 914 మంది గైర్హాజరు నెల్లూరు (టౌన్): ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు శనివారం తొలిరోజు ప్రశాంతంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 79 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. తొలిరోజు 29,102 మంది విద్యార్థులకుగానూ 28,188 మంది హాజరయ్యారు. 914 మంది గైర్హాజరయ్యారు. ఆర్ఐఓ శ్రీనివాసులు స్టోన్హౌస్పేటలోని నారాయణ, శ్రీచైతన్య, విశ్వసాయి, కృష్ణచైతన్య తదితర పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులతో పాటు వచ్చిన తల్లిదండ్రులు బయట పడిగాపులు కాశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పరీక్షా కేంద్రాల సమీపంలోని చెట్లు కింద సేద తీరారు. కేంద్రాల వద్ద తాగునీరు ఏర్పాటు చేయకపోవడంతో మంచినీటి కోసం ఇబ్బంది పడ్డారు. -
మందులకు కొరత తలెత్తకూడదు
నెల్లూరు(అర్బన్): జిల్లాలోని అన్ని పీహెచ్సీలు, యూపీహెచ్సీల్లో మందులకు కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని డీఎంహెచ్ఓ సుజాత సూచించారు. సంతపేటలోని వైద్యశాఖ కార్యాలయంలో ఫార్మసీ అధికారులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మందుల సరఫరా, వినియోగం, నిల్వ ఉంచే విధానాలపై జాగ్రత్తలు తీసుకొని వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని కోరారు. వేసవిలో చిన్నారులకేసే టీకాలకు సంబంధించిన కోల్డ్ చైన్ను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ఉమామహేశ్వరి, జిల్లా ఎపిడమిక్ అధికారి భాస్కర్, స్టాటిస్టికల్ అధికారి సహన, ఫార్మసీ ఆఫీసర్ రాధమ్మ పాల్గొన్నారు. మున్సిపల్ డ్రైవర్ల ధర్నా నెల్లూరు(బారకాసు): నగరంలోని పాత మున్సిపల్ కార్యాలయ సమీపంలో చెత్త వాహనాలు నిలిపే వెహికల్ షెడ్ వద్ద నిరసనను డ్రైవర్లు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు కత్తి శ్రీనివాసులు, నగరాధ్యక్షుడు సునీల్కుమార్ మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఆప్కాస్ విధానాన్ని రద్దు చేసి, ప్రైవేట్ కాంట్రాక్టర్లకు కట్టబెట్టేందుకు చర్యలు చేపట్టడం దారుణమన్నారు. క్రమబద్ధీకరించేంత వరకు ఆందోళనను కొనసాగిస్తామని తెలిపారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నెల్లూరు నగర కార్యదర్శి అశోక్, లోకేశ్, డ్రైవర్స్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు జయకుమార్, మనోజ్, నేతలు శివ, షఫీ, రమేష్, నాగేశ్వరరావు, కామేశ్వరరావు పాల్గొన్నారు. -
కనిపించిన ‘నెలవంక’
● పవిత్ర రంజాన్ మాసం ఆరంభం ● సంబరాలు చేసుకున్న ముస్లింలు నెల్లూరు(బృందావనం): ఆకాశంలో శనివారం సాయం సంధ్యవేళ నెలవంక కనిపించడంతో రంజాన్ నెల ఆరంభమైంది. నెలవంకను వీక్షించిన అనంతరం మతపెద్దల సూచనలతో ముస్లింలు రాత్రి 8.45 గంటలకు తరావీనమాజు ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక ‘దువా’ (ప్రార్థన) చేశారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ‘రంజాన్’ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మిఠాయిలు పంచుకుని, బాణసంచా పేల్చి ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకున్నారు. రంజాన్ మాసంలో నెల రోజులపాటు ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఆథ్యాత్మిక చింతనతో గడుపుతారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సంప్రదాయంగా నియమ నిబంధనలను పాటిస్తూ కఠోర ఉపవాసంతో దీక్షలో ఉంటారు. ప్రతి రోజు వేకువజామున ‘సహరి’తో ఉపవాసం ఆరంభించి సాయంత్రం సంధ్యవేళ ‘ఇఫ్తారి’తో ఉపవాసం దీక్ష విరమణ పరిపాటి. ఎఫ్ఆర్ఎస్ హాజరు వేయకపోతే కఠిన చర్యలు ● డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ పద్మావతి నెల్లూరు(అర్బన్): ముఖ ఆధారిత హాజరు (ఎఫ్ఆర్ఎస్) వేయని వైద్యశాఖ అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ కె.పద్మావతి పేర్కొన్నారు. విజయవాడ నుంచి వచ్చిన ఆమె శనివారం నగరంలోని వైద్యశాఖ కార్యాలయంలోని డీఎంహెచ్ఓ చాంబర్లో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విధుల్లో సమయపాలన పాటించని వారిపైన కూడా చర్యలు తప్పవన్నారు. ప్రతి అధికారి, ఉద్యోగి వారు విధులు నిర్వర్తించే ప్రాంతంలోనే తప్పనిసరిగా నివాసముండాలని సూచించారు. ఐపీ, ఓపీ, ఆస్పత్రులలో ప్రసవాలు, ల్యాబ్ టెస్ట్లు, ఐయుసీడీల ఆధారంగా సీహెచ్సీలకు గ్రేడింగ్ విధానం అమలు చేస్తున్నామన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ సుజాత, అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ ఖాదర్వలి, డీఐఓ డా.ఉమామహేశ్వరి పాల్గొన్నారు. నుడా ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు ● జిల్లా కలెక్టర్ ఆనంద్ నెల్లూరు(బారకాసు): నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా) ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ నుడా కమిటీ సభ్యులు, అధికారులకు సూచించారు. శనివారం వేదాయపాలెం గాంధీనగర్లోని కార్యాలయంలో నుడా అథారిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ ఆనంద్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, వైస్ చైర్మన్ సూర్యతేజ, అథారిటీ సభ్యులు హాజరయ్యారు. నుడా కార్యకలాపాల కోసం సిబ్బంది నియామకం, లేఅవుట్ల అభివృద్ధికి బడ్జెట్ కేటాయింపులు అజెండాలో ప్రధాన అంశాలుగా పొందుపరిచారు. పలు అంశాలను సభ్యుల సమక్షంలో కలెక్టర్ సమీక్షించి ఆమోదించారు. నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ నగరంతో పాటు జిల్లాలోని పలు పట్టణాలు, పంచాయతీల్లో నుడా ఆధ్వర్యంలో లేఅవుట్లు వేసి తక్కువ ధరకు ఇంటి స్థలాలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. వైస్చైర్మన్ మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ మాట్లాడుతూ నుడా ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తూ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఇరిగేషన్, ఆర్అండ్బీ ఎస్ఈలు దేశ్నాయక్, గంగాధర్, పరిశ్రమల శాఖ జీఎం ప్రసాద్, ఆర్డీఓ వంశీకృష్ణ, ముఖ్య ప్రణాళికాధికారి కె హిమబిందు, నుడా సెక్రటరీ పెంచలరెడ్డి, ప్రణాళికాధికారి ఎం హిమబిందు పాల్గొన్నారు. -
మహిళలకూ సోకిన వ్యసనం
పురుషులకు సమానంగా తామేమి తీసిపోమంటూ మహిళలూ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడడం ఆందోళన కల్గించే విషయం. ఇంటి అవసరాలకు భర్త ఇచ్చిన దాంట్లో మిగుల్చుకుని కొందరు, ఉద్యోగం చేస్తూ వచ్చిన నగదుతో మరికొందరు బెట్టింగ్లు కాస్తున్నారు. కొందరు రూ.లక్షల్లో బెట్టింగులు కాస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు. బయటకు చెప్పుకోలేక సొంత ఇళ్లలోనే దొంగతనాలు చేస్తున్న వారు కొందరుండగా, బలవన్మరణాలకు పాల్పడుతున్న వారు లేకపోలేదు. ఇంకొందరు నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా కోవూరులో ఓ వృద్ధురాలు తన మనవడ్ని ఇంటి ముందు ఆడిస్తుండగా ఇద్దరు మహిళలు స్కూటీపై అక్కడికి వచ్చారు. వృద్ధురాలి కళ్లలో కారం కొట్టి ఆమె మెడలోని రెండున్నర సవర్ల బంగారు సరుడును తెంపుకెళ్లేందుకు యత్నించారు. వృద్ధురాలు పెద్దగా కేకలు వేయడంతో కుటుంబసభ్యులు, స్థానికులు వారిని పట్టుకుని పోలీసుస్టేషన్లో అప్పగించారు. విచారణలో సదరు మహిళలు వైద్యశాఖలో హెల్త్ అసిస్టెంట్లనీ, క్రికెట్ బెట్టింగుల్లో రూ.30 లక్షలు అప్పులపాలై దొంగతనానికి యత్నించినట్లు వెల్లడైంది. ఈ విషయం అందర్నీ విస్మయానికి గురిచేసింది. మహిళలు సైతం బెట్టింగ్లకు పాల్పడుతున్నారంటే జిల్లాలో ఏ స్థాయిలో పందేలు సాగుతున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. -
విధుల నుంచి ఇద్దరు ఎఫ్ఎన్ఓల తొలగింపు
నెల్లూరు(అర్బన్): జిల్లా వైద్యారోగ్య శాఖ పరిధిలో పనిచేస్తూ దొంగతనానికి పాల్పడి రెడ్హ్యాండెడ్గా దొరికిన ఇద్దరు ఎఫ్ఎన్ఓలను విధుల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ డీఎంహెచ్ఓ వి.సుజాత శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. యల్లాయపాళెం పీహెచ్సీ ఎఫ్ఎన్ఓ దార్ల జీవిత, సర్వాయపాళెం పీహెచ్సీ ఎఫ్ఎన్ఓ వాసుకిలు ఆప్కాస్లో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారు. వీరిద్దరూ కోవూరు మండలం పాటూరు రోడ్డులో గురువారం రాత్రి ఓ వృద్ధురాలి నుంచి బంగారు చైన్ చోరీ చేస్తూ పట్టుపడ్డారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. అందువల్ల వీరిని ఉద్యోగాల నుంచి తొలగించామని తెలిపారు.న్యాయవాదుల కోర్టు విధుల బహిష్కరణనెల్లూరు(లీగల్): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అడ్వకేట్ యాక్ట్ 2025 బిల్లును వ్యతిరేకిస్తూ నెల్లూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు శుక్రవారం కోర్టు విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు వేనాటి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ కొత్త బిల్లును పునః పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. న్యాయవాదులందరు తమ ఆందోళన విరమించి విధులకు హాజరు కావాలని కోరారు. బార్ అధ్యక్షుడు ఉమామహేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులూ.. విజయీభవ ● నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ● 79 కేంద్రాల ఏర్పాటు నెల్లూరు(టౌన్): ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 79 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. విద్యార్థులను అరగంట ముందుగా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 53,200 మంది హాజరుకానున్నారు. ప్రథమ సంవత్సరానికి సంబంధించి 28,176 మంది, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 25,024 మంది ఉన్నారు. కోవూరు, తోటపల్లిగూడూరు, బిట్రగుంట, మర్రిపాడు, ఆత్మకూరు, ఉదయగిరి, రావూరు, కుల్లూరు, చేజర్ల, పొదలకూరు, బుచ్చిరెడ్డిపాళెం, అల్లూరు ప్రాంతాల్లోని పరీక్ష కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. హాల్టికెట్లను బోర్డు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని హాజరుకావొచ్చు. దానిపై సంబంధిత కళాశాల ప్రిన్సిపల్ సంతకం ఉండాల్సిన అవసరం లేదు. విద్యార్థుల సమస్యలు, ఇబ్బందుల కోసం కంట్రోలు రూమ్ను ఏర్పాటు చేశారు. 0861 – 2320312 ఫోన్ నంబర్ను సంప్రదించాలి. మాస్ కాపీయింగ్కు తావులేకుండా నాలుగు ఫ్లయింగ్, 5 సిటింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. 1,400 మందికి పైగా ఇన్విజిలేటర్లను నియమించారు. విద్యార్థులు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఆర్ఐఓ ఆదూరు శ్రీనివాసులు సూచించారు. నేడు పింఛన్ల పంపిణీనెల్లూరు (పొగతోట): సామాజిక పెన్షన్ల పంపిణీ ప్రక్రియకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. శనివారం జిల్లా వ్యాప్తంగా 3,07,232 మంది లబ్ధిదారులకు రూ.132 కోట్ల నగదును పంపిణీ చేయనున్నారు. దీనికి సంబంధించి సచివాలయాల ద్వారా నగదును సిబ్బందికి అందజేశారు. పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది ఉదయం నుంచి నగదు పంపిణీ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఇసుక మోసిన విద్యార్థులు దుత్తలూరు: దుత్తలూరులోని ఏపీ మోడల్ పాఠశాలలో శుక్రవారం విద్యార్థుల చేత ఇసుక బస్తాలు మోయించారు. స్కూల్లో సరస్వతీదేవి విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరుబయట ఉన్న ఇసుకను బస్తాల్లోకి నింపి లోపలికి మోయించడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని గురించి ప్రిన్సిపల్ సైమన్రావును వివరణ కోరగా తాము విద్యార్థులకు ఎటువంటి పని చెప్పలేదని, వారే స్వయంగా తీసుకొచ్చారని తెలిపారు. -
నిరుద్యోగ భృతి ఎక్కడ?
సూపర్ సిక్స్కూ ఎగనామమేనా! అంకెల గారడీ చేసిన ఆర్థిక మంత్రి కేశవ్ సాక్షిప్రతినిధి, నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్లో జిల్లాకు మొండిచేయి మిగిలింది. రూ.3.22 లక్షల కోట్లతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ‘కలరింగ్ ఎక్కువ.. కంటెంట్ తక్కువ’ అన్న రీతిలో ఉందని జిల్లాలోని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. బడ్జెట్ను పరిశీలిస్తే ప్రధానంగా పొదుపు మహిళలు, కౌలు రైతులు, నిరుద్యోగులు, పింఛనుదారులు వీరంతా నష్టపోతున్నారు. జిల్లాలోని పెన్నా డెల్టాకు, తెలుగుగంగ ప్రాజెక్టు, సోమశిల–స్వర్ణముఖి కెనాల్కు ఆశించిన మేర నిధులు కేటాయించలేదు. అరకొరగా కేటాయించి చేతులు దులుపుకొన్నారు. అది మినహా జిల్లాకు ఒరిగిందేమి లేదు. సున్నా వడ్డీ ఊసేలేదు జిల్లాలో 39,358 పొదుపు గ్రూపులున్నాయి. వీటిలో 4,02,729 మంది సభ్యులున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో వీరికి సున్నా వడ్డీ కింద రూ.188 కోట్లు అందజేసింది. నేటి బడ్జెట్లో సున్నా వడ్డీ ఊసే లేకపోవడంతో పొదుపు మహిళలు తీవ్రంగా నష్టపోతున్నారు. పింఛన్లకు కోత జిల్లాలో పింఛన్దారులు 3.7 లక్షల మంది ఉన్నారు. వీరికి ప్రతి నెలా రూ.132 కోట్లు పింఛన్ రూపంలో ప్రభుత్వం చెల్లిస్తోంది. అయితే బడ్జెట్లో రాష్ట్ర వ్యాప్తంగా రూ.27,500 కోట్లు పింఛన్దారుల కోసం కేటాయించారు. ఇప్పుడు ఇస్తున్న లెక్కల ప్రకారమే రాష్ట్రంలో రూ.32,628 కోట్లు పింఛన్కు ఖర్చవుతోంది. అంటే రూ.5,128 కోట్ల మేర కోత వేయబోతున్నారు. తల్లికి వందనంలో మతలబు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జూన్ 2024కు పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా 43,96,000 మంది విద్యార్థులకు రూ.6,590 కోట్లు అమ్మఒడి కింద ఇచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్పినట్టు 1 నుంచి 12వ తరగతి వరకు ఎంతమంది విద్యార్థులు చదువుతుంటే అంతమందికి రూ.15 వేలు చొప్పున ఇవ్వాలి. విద్యార్థుల సంఖ్యను పరిశీలిస్తే 87.41 లక్షల మంది ఉన్నారు. వీరందరికీ తల్లికి వందనం నిధులివ్వాలంటే రూ.13 వేల కోట్లకు పైగా ఇవ్వాలి. అయితే బడ్జెట్లో కేటాయింపులు రూ.9,407 కోట్లుగా పేర్కొన్నారు. అంటే వేలాది మందికి తల్లికి వందనం సొమ్ముకు ఎగనామం పెట్టనున్నారు. ఎన్నికల హామీలో భాగంగా టీడీపీ నిరుద్యోగ భృతి కల్పిస్తామంది. జిల్లాలో సుమారు లక్ష మంది నిరుద్యోగులు డిగ్రీలు చేతబట్టుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నికల హామీ మేరకు వీరికి నిరుద్యోగ భృతి కింద బడ్జెట్లో నిధులు కేటాయించాలి. ఆ ఊసేలేదు. 18 ఏళ్ల వయసు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇస్తామన్నారు. ఈ హామీకి కూడా బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. జిల్లాలో నూతన పరిశ్రమలకు ప్రోత్సాహం లేదు జిల్లాలో ఆత్మకూరు సమీపంలోని నారంపేట వద్ద గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు నెలకొల్పేందుకు శ్రీకారం చుట్టారు. అక్కడ కొంత మేరకు పనులు జరిగాయి. ప్రభుత్వం మారింది. బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆటో కార్మికులు, మత్స్యకారులు, కాయకష్టం చేసుకునే కూలీలు ప్రతి నెలా ఏదో ఒక పథకం ద్వారా లబ్ధిపొందేవారు. ఇప్పుడు అన్నీ ఆగిపోయాయి. పాఠశాల విద్యకు ఇంతేనా? బడ్జెట్లో రాష్ట పాఠశాల విద్యకు 20 శాతం నిధులు కేటాయించాలి. 2025–26కి బడ్జెట్లో పాఠశాల విద్యాశాఖకు 9.86 శాతం నిధులు కేటాయించడం సరికాదు. ఈ నిధులు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఏ మాత్రం సరిపోవు. మోడల్ ప్రైమరీ స్కూల్స్కు కావాల్సిన తరగతి గదులు, వసతులు కోసం బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయించలేదు. – నవ కోటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి, యూటీఎఫ్ బడ్జెట్ సంతృప్తికరంగా లేదు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంతృప్తికరంగా లేదు. విద్య, వైద్యం, రైతు, యువతకు గత బడ్జెట్తో పోల్చుకుంటే ఈ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. గత ప్రభుత్వం ధరల స్థిరీకరణకు రూ.3,000 కోట్లు కేటాయిస్తే, ప్రస్తుత ప్రభుత్వం రూ.300 కోట్లు మాత్రమే కేటాయించడం దారుణం. జలాశయాల అభివృద్ధికి అరకొరగా నిధులు కేటాయింపులు చేశారు. – కాకు వెంకటయ్య, రైతు నాయకుడు, ఉదయగిరి బడ్జెట్లో జిల్లాకు మొండి చేయి నిరుద్యోగ భృతి ప్రస్తావన లేదు పింఛన్దారులకు కష్టకాలమే. కలరింగ్ ఎక్కువ.. కంటెంట్ తక్కువ బడ్జెట్పై ప్రజల అసంతృప్తి -
ఉద్యోగాల పేరుతో టోకరా
నెల్లూరు(అర్బన్): అతను అటెండర్ స్థాయి ఉద్యోగి. రాష్ట్ర ఉన్నతాధికారుల పేరుతో ఫోర్జరీ సంతకాలు చేసి నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో (పెద్దాస్పత్రి) నియమిస్తూ ఉద్యోగ ఉత్తర్వులు కూడా అందజేశాడు. వాటిని నిజమైనవిగా భావించిన నిరుద్యోగులు పెద్దాస్పత్రికి వెళ్లారు. తీరా తాము మోసపోయామని తెలిసి లబోదిబోమంటున్నారు. మోసం చేసింది ఎవరో కాదు.. పెద్దాస్పత్రిలో సర్జికల్ విభాగంలో అటెండర్గా ఉద్యోగం చేస్తున్న రెగ్యులర్ ఉద్యోగి మురళి. నెల్లూరు పొదలకూరు రోడ్డులో నివసిస్తున్న జాన్ అనే వ్యక్తి కొత్తూరు వద్ద కరెంటాఫీస్లో వాచ్మెన్గా పనిచేస్తూ ఇటీవల రిటైరయ్యారు. పెద్దాస్పత్రిలో పనిచేసే మురళి ఆయనతో పరిచయం పెంచుకున్నాడు. ఆరు నెలల క్రితం జాన్ కుమార్తె షారోన్ మాధురికకు ల్యాబ్ టెక్నీషియన్గా కాంట్రాక్ట్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. రూ.1.50 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో చెల్లిస్తే సరిపోతుందని నమ్మబలికాడు. జాన్ పలుదఫాలుగా ఫోన్పే ద్వారా మురళికి నగదు పంపాడు. అలాగే తన తమ్ముడు కుమార్తె హారికకు ఉద్యోగం కోసం రూ.75 వేల వరకు మురళికి ఇప్పించాడు. డబ్బులిచ్చాక ఉద్యోగం ఎక్కడని ప్రశ్నించడంతో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారి పేరుతో దొంగ సంతకం చేసి 2024 నంబర్ ఒకటో తేదీన ఉద్యోగమిస్తూ అపాయింట్మెంట్ ఉత్తర్వులిచ్చాడు. మొత్తం 8 మందికి ఉద్యోగాలిస్తూ ఫేక్ లెటర్లు ఇచ్చాడు. వాటిని నిజమని నమ్మి పెద్దాస్పత్రికి వెళ్లగా ఇక్కడ ఖాళీల్లేవని ఎవరో మోసం చేశారని అధికారులు చెప్పడంతో అప్పటికి గాని తాము మోసపోయినట్టు జాన్ సోదరులకు తెలియలేదు. దీంతో వారు డబ్బుల కోసం మురళిపై ఒత్తిడి తెచ్చారు. అతను తప్పించుకుని తిరగడంతో నాలుగో నగర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మురళిని పిలిపించారు. అతని తల్లి అక్కడకు వచ్చి తన బిడ్డను వదిలేయాలని, ఆ డబ్బు తాను చెల్లిస్తానని బతిమాలుకుంది. దీంతో జాన్ సోదరులు రాజీపడి డబ్బుల కోసం ఎదురు చూడసాగారు. స్పందన లేకపోవడంతో మురళి కోసం శుక్రవారం జాన్ పెద్దాస్పత్రికి వచ్చాడు. మోసాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్కు తెలిపాడు. ఎనిమిది మందికి.. ఆరుగురికి జూనియర్ అసిస్టెంట్లుగా, ఒకరికి ల్యాబ్ టెక్నీషియన్గా, మరొకరికి అటెండర్గా మురళి ఉత్తర్వులిచ్చాడు. అందులో రిజర్వేషన్, ఆధార్ నంబర్లు, జీతం స్కేల్ పొందుపరుస్తూ దొంగ ఉత్తర్వులు ఇవ్వడం విశేషం. వారిలో ఎస్కే రేష్మ, కె.కలీమ్, ఎస్కే వశీం అహ్మద్, ఎ.షారోన్ మాధురిక, కామాటి అనూష, జొన్నవాడ షాలీము, ఎం.నాగసుమతి, టి.నరేంద్ర తదితరులున్నారు. తమను మోసం చేశాడని తెలుసుకున్న కొంతమంది నిరుద్యోగులు మురళిపై ఒత్తిడి తెచ్చి డబ్బు తిరిగివ్వాలని డిమాండ్ చేయసాగారు. మరో వైపు ఈ కథ పోలీసులకు చేరింది. దీంతో మురళి పెద్దాస్పత్రి విధులకు రావడం మానేశాడు. తప్పించుకుని తిరుగుతున్నాడు. అమాయకులను మోసం చేసి సుమారు రూ.15 లక్షల వరకు దండుకున్నాడనే ప్రచారం పెద్దాస్పత్రిలో జరుగుతోంది. నకిలీ ఉత్తర్వుల అందజేత ఏకంగా డీఎంఈ సంతకం ఫోర్జరీ ఒక్కో ఉద్యోగానికి రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వసూలు పెద్దాస్పత్రిలోని ఓ చిరుద్యోగి నిర్వాకం పోలీసులకు బాధితుల ఫిర్యాదువిచారణ చేస్తున్నాం ఉద్యోగాలు కల్పిస్తామంటూ డబ్బులు వసూలు చేయడం, డీఏంఈ పేరుతో దొంగ ఉత్తర్వులు సృష్టించినట్టు ఫిర్యాదు అందింది. విచారణ చేస్తున్నాం. డిప్యూటీ కలెక్టర్ మహేశ్వరరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. – డాక్టర్ సిద్ధానాయక్, పెద్దాస్పత్రి సూపరింటెండెంట్ -
టీడీపీ నేత ఆధ్వర్యంలో పేకాట శిబిరం
నెల్లూరు టాస్క్ఫోర్స్: కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు మండల స్థాయి టీడీపీ నేత పేకాట శిబిరం నిర్వహిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టీడీపీ నేతలు మద్యం తాగుతూ పేకాట ఆడుతున్న వీడియో వైరల్ కావడం చర్చనీయాంశమైంది. నార్తురాజుపాళేనికి చెందిన టీడీపీ నేత జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అనధికార పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నాడు. జిల్లా నలుమూలల నుంచి జూదరులు వచ్చి అక్కడ మూడు ముక్కలాడుతున్నారు. నిత్యం రూ.లక్షలు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేత రెండేళ్ల క్రితం అనధికార పేకాట శిబిరం నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. అయినా మార్పురాలేదు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్లీ యథేచ్ఛగా పేకాట శిబిరం నిర్వహిస్తూ ఆదాయ వనరులుగా మార్చుకున్నాడు. రోజూ ప్లేస్లు మార్చేస్తూ.. ఈజీ మనీకి అలవాటు పడిన సదరు టీడీపీ నేత నియోజకవర్గంలోని కొడవలూరు, యల్లాయపాళెం ప్రాంతాల్లో అనధికార పేకాట శిబిరాలను నిర్వహించేవాడు. కానీ ప్రజల్లో వ్యతిరేకత రావడంతో ప్లేస్లు మార్చేస్తూ మూడు ముక్కలాటతో సొమ్ము చేసుకుంటున్నాడు. సర్వేపల్లి నియోజకవర్గంలోని ఓ ప్రాంతంలో పేకాట ఆడుతున్న వీడియోను కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అక్కడే మద్యం తాగుతూ, డ్యాన్స్లు చేస్తూ, పేకాట ఆడుతున్న వీడియో పెద్ద దుమారమే రేపింది. కమీషన్లతో రూ.లక్షల్లో ఆదాయం ఈ అనధికార పేకాట శిబిరం నిర్వహణ కోసం పేకాటరాయుళ్లు సదరు టీడీపీ నేతకు 20 శాతం కమీషన్ సమర్పించాలి. ఆటలో కూర్చోవాలంటే ముందుగా రూ.5,000 కట్టాలి. ఆపై పెట్టే ప్రతి రూపాయిలో 20 శాతం ముందుగానే తీసుకుని టోకెన్లు ఇస్తారు. ఆ టోకెన్లు ఉంటేనే ఆడాలి. ఇలా రోజువారీ టీడీపీ నేతకు రూ.లక్షల్లో ఆదాయం వస్తోంది. రోజువారీగా రూ.లక్షలు చేతులు మారుతున్న వైనం కొడవలూరు మండల టీడీపీ నేత నిర్వాకం సోషల్ మీడియాలో వీడియో వైరల్ -
అనారోగ్యంతో బాధపడుతూ..
● జీవితంపై విరక్తితో వృద్ధుడి ఆత్మహత్య నెల్లూరు(క్రైమ్): జీవితంపై విరక్తి చెంది పురుగు మందు తాగిన ఓ వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగుకు చెందిన ఎన్.సుధాకర్ (81) కొంతకాలంగా కేన్సర్తో బాధపడుతూ నెల్లూరులో చికిత్స చేయించుకుంటున్నాడు. ఆయన బుధవారం చికిత్స నిమిత్తం నెల్లూరుకు వచ్చాడు. ఆరోగ్యం కుదుట పడకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మకూరు బస్టాండ్లోని మున్సిపల్ మరుగుదొడ్ల సమీపంలో పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన స్థానికులు వృద్ధుడిని చికిత్స నిమిత్తం జీజీహెచ్లో చేర్పించారు. సుధాకర్ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. మృతుడి కుమారుడు సురేష్ నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శిశు ఆధార్ను నమోదు చేయాలి
నెల్లూరు(అర్బన్): బిడ్డ పుట్టిన వెంటనే శిశు ఆధార్ను నమోదు చేయించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఉప సంచాలకుడు శ్రీనివాసరెడ్డి సూచించారు. విజయవాడ నుంచి నెల్లూరొచ్చిన ఆయన డీఎంహెచ్ఓ సుజాతతో పాటు ఇతర అధికారులతో సమీక్ష సమావేశాన్ని నగరంలోని వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శిశు ఆధార్తో పాటు జనన ధ్రువీకరణ పత్రాలను సకాలంలో పొందేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. టీకాలేయడం, ఫీవర్ సర్వే, ఎన్సీడీ, మలేరియా, కుష్టు, టీబీ తదితర సర్వేలు, వ్యాధుల నియంత్రణలో నూరు శాతం ప్రగతి సాధించేందుకు కృషి చేయాలని కోరారు. పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్లో అర్జీలు పెండింగ్లో లేకుండా చూడాలన్నారు. ఏపీ మెడికల్ అండ్ హెల్త్ స్టాటిస్టికల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలెండర్లను ఆవిష్కరించారు. అనంతరం దర్గామిట్టలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన శిశు ఆధార్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పెద్దాస్పత్రి సూపరింటెండెంట్ సిద్ధానాయక్తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. డెమో అధికారి కనకరత్నం, స్టాటిస్టికల్ ఆఫీసర్ సహన, డిప్యూటీ ఎస్ఓ మల్లికార్జున, డీపీహెచ్ఎన్ఓ మంజుల, డీపీఓ రమేష్, ఏఎస్ఓలు రమేష్, మణికంఠ, డీపీఏ ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. -
కుటుంబ కలహాలతో..
ఉదయగిరి: ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ మహిళ ఉదయగిరి ఆనకట్టలో శవమై తేలిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని యాదవవీధికి చెందిన పువ్వాడి ధనలక్ష్మి (53) అనే మహిళకు 35 సంవత్సరాల క్రితం వెంకటాద్రి అనే వ్యక్తితో వివాహమైంది. వారికి కుమార్తె, కుమారుడు సంతానం. కుమారుడు హరినాథ్కు వివాహమై తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడు. కుమార్తెకు వివాహమై గుంటూరులో ఉంటోంది. హరినాథ్కు భార్య శిరీషతో విభేదాలున్నాయి. బుధవారం వారి మధ్య వివాదం నెలకొనడంతో ధనలక్ష్మి ఎవరికీ చెప్పకుండా గుంటూరులోని తన కుమార్తె వద్దకు వెళ్లింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో తన బంగారు ఆభరణాలను కిటికీలో నుంచి వారి ఇంట్లోకి విసిరింది. అనంతరం కారును అద్దెకు తీసుకొని అర్ధరాత్రి సమయంలో ఉదయగిరి ఆనకట్ట వైఎస్సార్ సర్కిల్ వద్ద దిగింది. అయితే ఇంటికి వెళ్లకుండా సమీపంలోని ఆనకట్ట నీటిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. గురువారం ఉదయం ఆనకట్టపై వాకింగ్ చేస్తున్న స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్సై కర్నాటి ఇంద్రసేనారెడ్డి తన సిబ్బందితో ఆనకట్ట వద్దకు చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించి వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. తన భార్య కనిపించడం లేదని వెంకటాద్రి బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసి ఉన్నాడు. కాగా మృతురాలి తండ్రి బాలయ్య తన కుమార్తె మృతిపై అనుమానాలున్నాయని ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఇంటి నుంచి వెళ్లిపోయిన మహిళ ఉదయగిరి ఆనకట్టలో మృతదేహం అనుమానం వ్యక్తం చేసిన తండ్రి -
సజావుగా పింఛన్లు అందజేయాలి
నెల్లూరు (పొగతోట): సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియను సజావుగా జరపాలని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి ఆదేశించారు. నగరంలోని డీఆర్డీఏ కార్యాలయం నుంచి మండలాధికారులతో గురువారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 3,07,232 మంది లబ్ధిదారులకు రూ.132 కోట్లను శనివారం ఉదయం నుంచే పంపిణీ చేయాలని సూచించారు. సచివాలయాల వారీగా బ్యాంకుల నుంచి నగదును డ్రా చేసి సిబ్బందికి సకాలంలో అందజేయాలన్నారు. కిచెన్ గార్డెన్ లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. మహిళలకు అవగాహన కల్పించి ఇంటి చుట్టుపక్కల ఉండే స్థలాలు, ఇంటి పైభాగంలో కుండీలను ఏర్పాటు చేసి కూరగాయల మొక్కలను సాగు చేసేలా చూడాలని సూచించారు. అప్పులపాలై.. ఆపై దొంగలై ● మహిళ కళ్లలో కారం కొట్టి బంగారు సరుడు అపహరణ ● పోలీసులకు ఇద్దరు మహిళల అప్పగింత ● వైద్యశాఖలో హెల్త్ అసిస్టెంట్లుగా విధులు..! కోవూరు: ఇంటి ముందు మనవడ్ని ఆడిస్తున్న ఓ మహిళ కళ్లలో కారం కొట్టి బంగారు చైన్ను ఇద్దరు మహిళలు తెంపుకెళ్లిన ఘటన పట్టణంలోని పాటూరు రోడ్డులో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల వివరాల మేరకు.. స్థానికంగా నివాసం ఉంటున్న అత్తిపల్లి సతీష్కుమారి తన మనవడ్ని ఇంటి ముందు రోడ్డుపై ఆడించసాగారు. ఈ తరుణంలో స్కూటీపై వచ్చిన ఇద్దరు మహిళలు.. వీధిలో ఏమైనా ఇళ్లు ఖాళీగా ఉన్నాయానని అడిగారు. సమాధానం చెప్తున్న సమయంలో నీరు కావాలని స్కూటీ నడుపుతున్న మహిళ కోరారు. ఈలోపు వెనుక కూర్చున్న మహిళ తన వెంట తెచ్చుకున్న కారంపొడిని ఆమె కళ్లలో కొట్టారు. ఆమె మెడలోని రెండున్నర సవర్ల బంగారు సరుడును తెంపుకొని పరారయ్యేందుకు యత్నించారు. బాధితురాలు కేకలేయడంతో చుట్టుపక్కల వారు, ఆమె కుమారుడు అనూప్రెడ్డి వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కాగా చైన్ స్నాచింగ్కు పాల్పడిన దార్ల జీవిత యల్లాయపాళెం పీహెచ్సీలో.. వాసుకి డిప్యూటీ డీఎంహెచ్ఓ కార్యాలయంలో హెల్త్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారనే అంశం పోలీసుల విచారణలో వెల్లడైంది. ఐపీఎల్లో బెట్టింగులు పెట్టి వీరిద్దరూ రూ.30 లక్షల మేర అప్పులపాలయ్యారని తెలిసింది. మెయిన్బజార్లో బురఖా కొనుక్కొని స్కూటీపై తిరుగుతూ చైన్ స్నాచింగ్కు పాల్పడ్డారని వెల్లడైంది. కోవూరు పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
తప్పుడు ప్రచారాలు సిగ్గుచేటు
నెల్లూరు(బారకాసు): తమ కుటుంబం గురించి వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేయడం సిగ్గుచేటు అని వైఎస్సార్సీపీ రూరల్ ఇన్చార్జి ఆనం విజయకుమార్రెడ్డి అన్నారు. ప్రభుత్వ స్థలాన్ని వైఎస్సార్సీపీ నేత కబ్జా చేశారంటూ ఎల్లో మీడియాలో అసత్య వార్తను ప్రచారం చేయడంపై చింతారెడ్డిపాళెంలోని ఆయన నివాసంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. 1946లో నగరంలోని ముత్తుకూరు గేట్ సెంటర్, సర్వేపల్లి కాలువ పక్కనే ఉన్న స్థలం ఓరుగంటి వెంకటరెడ్డికి చెందినదని, అందులో ప్రభుత్వ అనుమతులు పొంది ఆయన పేరుమీద రైస్మిల్లును నిర్మించారన్నారు. ఆ మిల్లును వెంకటరెడ్డి కుమార్తె అయిన నా తల్లి వెంకటరమణమ్మకు రాసిచ్చినట్లు తెలిపారు. ఇందులో మా నలుగురు అన్నదమ్ములకు సమాన భాగం ఉండేలా మా తల్లి సెటిల్మెంట్ పత్రం రాసిపెట్టిందని, ఆ పత్రం తన వద్దే ఉందని మీడియాకు చూపించారు. తమ ఇంటికి సంబంధించిన పలు విషయాల్లో ఒకటైన రైసుమిల్లుకు సంబంధించిన విషయాలను మొదటి నుంచి తానే చూసుకునేవాడినని వెల్లడించారు. అప్పటి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఫ్యాక్టరీల శాఖ నుంచి అనుమతి పొంది నిబంధనల మేరకే రైస్మిల్లు నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. అంతేకాకుండా రైస్మిల్లు స్థలానికి సంబంధించి అప్పట్లో శిస్తులు, ప్రస్తుత కార్పొరేషన్కు కూడా పన్ను, విద్యుత్ బిల్లులను చెల్లిస్తున్నామని చెప్పారు. 70 ఏళ్లకు పైబడిన రైస్మిల్లు నిర్మాణం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుందని, దానిని తొలగించి నూతన నిర్మాణం చేపట్టాలనే ఆలోచనతో మా కుటుంబసభ్యుల ఆమోదంతోనే శంకుస్థాపన చేశామన్నారు. ఈ వాస్తవాలు తెలుసుకోకుండా బురదజల్లే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. ఆనం కుటుంబానికి చెందిన స్థలాన్ని తానేదో కబ్జా చేస్తున్నానని అధికారులకు తప్పుడు ఫిర్యాదులు ఇచ్చారని, దీంతో వారు వచ్చి స్థలాన్ని పరిశీలించి పత్రాలను సరిచూసి వెనుదిరిగి వెళ్లారన్నారు. ఈ విషయాలు తెలుసుకోకుండా కొందరు తప్పుడు సమాచారం అందజేసి నాపై దుష్ప్రచారం చేయించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. నాపై బురద జల్లేందుకు యత్నిస్తే ఉపేక్షించను వైఎస్సార్సీపీ రూరల్ ఇన్చార్జి ఆనం విజయకుమార్రెడ్డి -
బాబూ.. నమ్మండయ్యా..!
పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్, పార్ట్నర్షిప్తో నిర్వహించేదే పీ – 4 సర్వే. దీన్ని విశ్వసించాలని పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లు.. మండలాల్లో ఎంపీడీఓలు ప్రజలను అభ్యర్థిస్తున్నారు. జిల్లాలోని 927 సచివాలయాల పరిధిలో 13,35,459 కుటుంబాలను సర్వే చేయాల్సి ఉంది. ఇంటి వద్దకు సిబ్బంది వెళ్లి వివిధ సమాచారాన్ని సేకరించి యాప్లో నమోదు చేస్తున్నారు. సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని.. దీన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని.. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను గుర్తించేందుకు ఇది దోహదపడుతుందనే అంశాన్ని ప్రజలకు తెలియజేయాలని క్షేత్రస్థాయి సిబ్బందికి అధికారులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు యథావిధిగా కొనసాగుతాయని, ఇందులో ఎలాంటి అపోహలొద్దని చెప్తున్నా, క్షేత్రస్థాయిలో అంతా అయోమయం నెలకొంది. కావలి: సూపర్ సిక్స్.. ఈ నినాదాన్ని గత ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు తన ప్రచార సభల్లో తరచూ ఉచ్ఛరించేవారు. వీటిని అమలు చేస్తే తమ జీవితాలు మెరుగుపడతాయనే ఆశతో ఆ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. తీరా అధికారంలోకి వచ్చి ఎనిమిదిన్నర నెలలవుతున్నా, వీటి అమలును విస్మరించిన ప్రభుత్వం.. తాజాగా పీ – 4 సర్వే పేరిట ఉన్న వాటిని కొల్లగొట్టేందుకు శ్రీకారం చుట్టింది. ఫోన్.. టీవీ.. ఏసీ.. ఇతర గృహోపకరణాలు.. బైక్లున్నాయా.. ఇళ్ల స్వరూపం... రేకులా, స్లాబా.. బ్యాంక్ అకౌంట్.. ఇలా 27 రకాల ప్రశ్నల్ని సంధించి, సమాధానాలను సిబ్బంది నింపాల్సిన పరిస్థితి. ఆపై ప్రజల ఫోన్కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి ప్రక్రియను ముగిస్తున్నారు. ఏసీ ఉన్నా లక్షాధికారులేనా..? జిల్లాలో 7,33,520 కుటుంబాలకు రేషన్ కార్డులున్నాయి. వీటి కోసం మరో 1,45,438 ఫ్యామిలీలు ఎదురుచూస్తున్నాయి. వీరందరూ దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలుగానే పరిగణించాలి. అప్పో సొప్పో చేసో.. నెలవారీ వాయిదాలతోనో.. లేక ఎవరైనా కానుకగా ఇస్తే వారి ఇళ్లలో ఏసీలను ఎక్కువ మంది ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఇది ఉందని తెలిస్తే చాలు వెంటనే సదరు వివరాలను ప్రభుత్వ రికార్డుల్లోకి సిబ్బంది నమోదు చేస్తున్నారు. ఈ వ్యవ హారంతో తమకు సంక్షేమ పథకాలు ఆగిపోతాయనే ఆందోళన పేదల్లో నెలకొంది. -
చికిత్స పొందుతూ..
వేర్వేరు చోట్ల ఇద్దరి మృతినెల్లూరు(క్రైమ్): అనారోగ్యం తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. కొడవలూరు మండలం తలమంచికి చెందిన పి.శ్రీనివాసులు అలియాస్ శీనయ్య (35) అవివాహితుడు. అతను నెల్లూరు హరనాథపురం ఒకటో వీధిలో శ్రీరాజరాజేశ్వరి ప్రొవిజన్స్ షాపు నిర్వహిస్తున్నాడు. రోజూ ఇంటి వద్ద నుంచి షాపునకు వచ్చి వెళ్లేవాడు. రెండేళ్లుగా శీనయ్య అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే మద్యానికి బానిసయ్యాడు. ఆరోగ్యం ఎంతకీ కుదుట పడకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఈనెల 24వ తేదీ రాత్రి తన షాపు వద్దనే మద్యంలో పురుగు మందు కలిపి తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పక్కనే ఉన్న నారాయణ కళాశాల వాచ్మెన్ ఈ విషయాన్ని గమనించి శీనయ్య కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలియజేశాడు. అనంతరం శీనయ్యను అపోలో హాస్పిటల్లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. మృతుడి అన్న ప్రసాద్ గురువారం బాలాజీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై ఎం.పుల్లారెడ్డి కేసు నమోదు చేసి మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.రోడ్డు ప్రమాదంలో..రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్కు చెందిన శ్యామ్ బిహారీ (28), ప్రీతి దంపతులకు ఇద్దరు సంతానం. అతను పీఓపీ (సీలింగ్) పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటంతో కొన్నేళ్ల క్రితం అతను ఒక్కడే ఉపాధి నిమిత్తం నెల్లూరు వైఎస్సార్నగర్లో ఉంటున్న బంధువుల వద్దకు వచ్చాడు. అయ్యప్పగుడి ప్రాంతానికి చెందిన పప్పు రాజ్ మేసీ్త్ర వద్ద పనులు చేస్తున్నాడు. అప్పుడప్పుడు భార్యాపిల్లల వద్దకు వెళ్లి వచ్చేవాడు. ఈనెల 25వ తేదీన శ్యామ్ తన సహచరుడు బబ్లూరాజ్తో కలిసి బైక్పై పనికి బయలుదేరాడు. వేదాయపాళెం రైల్వేస్టేషన్ ఆర్చ్ వద్ద రోడ్డు దాటుతుండగా అయ్యప్పగుడి వైపు వెళ్తున్న బైక్ వేగంగా ఢీకొంది. ఈ ఘటనలో శ్యామ్కు తీవ్రగాయాలయ్యాయి. జీజీహెచ్లో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. పప్పు రాజ్ ఫిర్యాదు మేరకు సౌత్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. -
కేన్సర్పై అవగాహన అవసరం
నెల్లూరు(అర్బన్): కేన్సర్ వ్యాధిపై అవగాహన పెంచుకొని, ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని రెడ్క్రాస్ కేన్సర్ ఇన్స్టిట్యూట్ మెడికల్ సూపరింటెండెంట్, సర్జికల్ ఆంకాలజిస్ట్ నాగేశ్వరరావు పేర్కొన్నారు. పొదలకూరు రోడ్డులోని కేన్సర్ ఇన్స్టిట్యూట్లో విద్యార్థులకు గురువారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. జంక్ఫుడ్, పంటలకు ఎక్కువగా వాడుతున్న పురుగుమందులు, రసాయనిక ఎరువులు, ప్లాస్టిక్ వినియోగం, కొన్ని రకాల వైరస్లు, పొగాకు వినియోగం, కాలుష్య కారణంగా కేన్సర్ రోగాలు పెరిగాయని చెప్పారు. ప్రజలు తమ ఆహార అలవాట్లను మార్చుకోవాలని కోరారు. 30 ఏళ్లు దాటిన వారు ఏడాదికోసారి స్కానింగ్ లాంటి పరీక్షలను చేయించుకోవాలని సూచించారు. చిన్న పరీక్షల ద్వారా కేన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తించొచ్చన్నారు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ లక్ష్మి, రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ వాకాటి విజయకుమార్రెడ్డి, సర్జికల్ ఆంకాలజిస్ట్ ముత్తు, ఆస్పత్రి జీఎం ఇస్కా భక్తవత్సలరెడ్డి, నర్సింగ్ సూపరింటెండెంట్లు మోహనాంబ, మృదుల తదితరులు పాల్గొన్నారు. -
కుష్టు వ్యాధి నివారణే లక్ష్యం
నెల్లూరు(అర్బన్): కుష్టు వ్యాధి నివారణే లక్ష్యంగా వైద్య సిబ్బంది కృషి చేయాలని ఏడీఎంహెచ్ఓ ఖాదర్వలీ పేర్కొన్నారు. కుష్టువ్యాధిపై నగరంలోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఎల్సీడీ సర్వేలో జిల్లాలో 28 మంది కుష్టు రోగులను గుర్తించారని, వీరికి మందులను సకాలంలో అందజేశామని చెప్పారు. మందులను సక్రమంగా వినియోగిస్తే నయమవుతుందని తెలిపారు. పీహెచ్సీల పరిధిలోని అనుమానిత రోగులను పరీక్షించి వ్యాధిని నిర్ధారించాలని కోరారు. డీపీఎమ్మార్ శిబిరాలను పీహెచ్సీల పరిధిలో ప్రతి నెలా నిర్వహిస్తూ అనుమానిత కుష్టు రోగులను గుర్తించి పరీక్షలు చేయించి చికిత్సను అందించాలని చెప్పారు. అంగవైకల్యం ఉన్న కేసులను గుర్తించి వారికి శస్త్ర చికిత్సలు చేయించేందుకు డీఎఫ్ఐటీ కేంద్రానికి పంపాలన్నారు. డీఎన్ఎంఓ సురేంద్రబాబు, ఫిజియోథెరపిస్ట్ నరసింహులు, డీఎఫ్ఐటీ అధికారి పీటర్, సిబ్బంది మల్లమ్మ, ప్రసాదాచారి తదితరులు పాల్గొన్నారు. -
వేరుశనగ సాగు.. అంతంతమాత్రం
పొదలకూరు: వేరుశనగ సాగులో జిల్లా వెనుకబడి ఉంది. కేవలం 900 హెక్టార్లలోనే పండిస్తున్నారు. ఈ విస్తీర్ణాన్ని పెంపునకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. వాస్తవానికి నూనెగింజల సాగు మన దేశంలో తక్కువ. వంట నూనెలకు సంబంధించి 60 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న పరిస్థితులున్నాయి. 70 శాతానికి పైగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న దేశంలోని రైతులు నూనెగింజల సాగుపై మాత్రం మొగ్గు చూపడం లేదు. ప్రధానంగా పామాయిల్, వేరుశనగ, పొద్దుతిరుగుడు తదితర వాటికి సంబంంధించి ఓ ప్రాంతం లేదా ఒక రాష్ట్రం వరకే పరిమితమవుతున్నారు. దాదాపుగా అన్ని ప్రాంతాల్లో నూనెగింజలను పండిస్తే విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదనేది వ్యవసాయ శాస్త్రవేత్తల అభిప్రాయం. నూనె గింజల సాగులో ప్రధానమైన వేరుశనగ విస్తీర్ణం జిల్లాలో పెరగడం లేదు. అనంతపురం జిల్లాలో బాగుంది. సత్యసాయి జిల్లాలో ఉన్న కదిరి వ్యవసాయ పరిశోధన స్థానంలో ఆరు రకాల విత్తనాలను రూపొందించారు. అవగాహన లేక.. జిల్లాలో వేరుశనగ సాగుపై రైతులకు అవగాహన లేకపోవడం వల్ల విస్తీర్ణం పెరగడం లేదని తెలుస్తోంది. విత్తన ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటే ఎకరాకు 30 బస్తాల వరకు దిగుబడి సాధించేందుకు అవకాశం ఉంటుందని వ్యవసాయాధికారులు అంటున్నారు. సాధరణంగా వేరుశనగలో నూనె శాతం అధికంగా ఉంటుంది. వంట నూనెను వీటి నుంచే తీయడం తెలిసిందే. ఇసుక నేలల్లో అధికంగా పండిస్తారు. కదిరి లేపాక్షి 1812 రకం సాగు చేస్తే రైతులకు గిట్టుబాటు అవుతున్నట్టు తెలుస్తోంది. కదిరి పరిశోధన స్థానం కనుగొన్న ఆ రకాన్ని తెలంగాణ, మన రాష్ట్రంలోని రైతులు సాగు చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు అధికంగా ఉండే రాయలసీమలో సైతం ఈ రకం సాగువుతున్నట్టు వ్యవసాయాధికారులు వెల్లడించారు. చీడపీడలు తక్కువగా ఉంటాయని, ఎకరాకు రూ.50 వేలు పెట్టుబడి పెడితే 30 బస్తాలకు పైబడి దిగుబడి సాధించేందుకు అవకాశం ఉంది. ఒక్కో మొక్కకు 100 నుంచి 150 కాయలు కాస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల వేరుశనగ పంటకు సంబంధించి టీఎస్జీఎస్ 1707 (ఐసీఏఆర్ – కోణార్క్) స్పానిష్ బంచ్, నంద్యాల గ్రామ్ (ఎల్బీఈజీ 1267) రకాలు ఏపీలో అనుకూలంగా ఉంటాయని సూచించింది. ఇక్కడిలా.. పొదలకూరులో చిరుధాన్య పరిశోధన స్థానం ఉంది. ఇక్కడికి ప్రధాన శాస్త్రవేత్తగా ప్రసన్న రాజేష్ కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి ఇక్కడకు వచ్చారు. ఆయన వేరుశనగ పంటపై అనేక పరిశోధనలు చేశారు. జిల్లాలో విస్తీర్ణం పెంపొందించేందుకు కృషి చేస్తానంటున్నారు. రైతులు ముందుకొస్తే పంటల మార్పిడికి కూడా ఊతం ఇచ్చినట్టవుతుంది. పొదలకూరు మండలంలోని కొనగలూరు, నల్లపాళెం, సూరాయపాళెం తదితర గ్రామాల్లో స్వల్పంగా వేరుశనగను పండిస్తున్నారు.వేరుశనగ పంట (ఫైల్) జిల్లాలో కేవలం 900 హెక్టార్లలోనే.. విస్తీర్ణం పెంపునకు శాస్త్రవేత్తల కృషి కదిరి లేపాక్షి రకం విత్తనం మేలంటున్న శాస్త్రవేత్తలు పొదలకూరు చిరుధాన్య పరిశోధన స్థానం నుంచి అవగాహన -
ఇంటర్ పరీక్షలకు వేళాయె
ఇంటర్ పరీక్షలకు జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు సర్వం సిద్ధం చేశారు. పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. శనివారం నుంచి మార్చి 20 వరకు వీటిని నిర్వహించనున్నారు. జంబ్లింగ్ పద్ధతిలో జరిపేందుకు చర్యలు చేపట్టారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి లైవ్ స్ట్రీమింగ్ను రాష్ట్ర, జిల్లా ఇంటర్ బోర్డు కార్యాలయాలకు అనుసంధానం చేశారు. నెల్లూరు (టౌన్): ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా 28 ప్రభుత్వ, 51 ప్రైవేట్.. మొత్తం 79 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 53,200 మంది హాజరుకానున్నారు. వీరిలో ప్రథమ సంవత్సర జనరల్ విద్యార్థులు 26,931, ఒకేషనల్ 1,245 మంది కలిపి 28,176.. ద్వితీయ సంవత్సర జనరల్ 23,994 మంది, ఒకేషనల్ 1,030 మంది కలిపి 25,024 మంది ఉన్నారు. వీరిలో 326 మంది ప్రత్యేకావసరాల విద్యార్థులు ఉన్నారు. వీరి అవసరాల మేరకు స్క్రైబ్లను ఏర్పాటు చేయనున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో పరీక్షలు రాసేలా చర్యలు చేపట్టారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. ఇప్పటికే మూడు సెట్ల ప్రశ్నపత్రాలు జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. వీటిని ఆయా పరీక్ష కేంద్రాల సమీపంలోని 51 స్టోరేజీ పాయింట్లు (పోలీస్ స్టేషన్లు)ల్లో ఖాకీల పహారాలో భద్రపర్చారు. 12 సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు జిల్లాలో మొత్తం 12 సమస్యాత్మక పరీక్ష కేంద్రాలను జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు గుర్తించారు. వీటిలో కోవూరు, తోటపల్లిగూడూరు, బిట్రగుంట, మర్రిపాడు, ఆత్మకూరు, ఉదయగిరి, రాపూరు, కుల్లూరు, చేజర్ల, పొదలకూరు, బుచ్చిరెడ్డిపాళెం, అల్లూరు పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. వీటిపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. ఈ కేంద్రాలకు అదనంగా అడిషనల్ చీఫ్ సూపరిటెండెంట్లు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకులను నియమించనున్నారు. పక్కాగా నిర్వహణ ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా ఇంటర్ అధికారులు ఏర్పాట్లు చేశారు. 79 కేంద్రాల్లో ప్రతి కేంద్రానికీ చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులను నియమించారు. 1,200 మందికి పైగా ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తించనున్నారు. పరీక్షలు జరిగే కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ను అమలు చేయనున్నారు. సమీపంలోని జిరాక్స్, ఆన్లైన్ సెంటర్లను మూయించనున్నారు. పరీక్ష కేంద్రాల్లోకి చీఫ్ సూపరింటెండెంట్లకు మాత్రమే ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసిన సెల్ఫోన్ను అనుమతిస్తారు. విద్యార్థులు కాలిక్యులేటర్, మొబైల్, ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లకూడదు. పరీక్ష కేంద్రాల ద్వారం వద్ద విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించాకే లోపలికి అనుమతించనున్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు విద్యార్థుల ఇబ్బందులు, సమస్యల పరిష్కారానికి 0861–2320312 నంబర్తో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. bie.ap.gov.in వెబ్సైట్ లేదా 95523 00009 వాట్సాప్ నంబర్కు హాల్ టికెట్ నంబర్, ఆధార్ లేదా డేట్ ఆఫ్ బర్త్ను నమోదు చేసి పంపడం ద్వారా నే రుగా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ను కల్పించారు. హాల్ టికెట్పై సంబంధిత కళాశాల ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదు. ఎవరైనా ఇబ్బంది పెడితే నేరుగా ఆర్ఐఓకు ఫిర్యాదు చేయాలి. పరీక్ష సమయానికి అరగంట ముందుగా కేంద్రంలోకి అనుమతించనున్నారు. గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవా లని ఇంటర్ బోర్డు అధికారులు సూచిస్తున్నారు. రేపట్నుంచి మార్చి 20 వరకు.. జంబ్లింగ్ విధానం అమలు 79 కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు హాజరుకానున్న 53,200 మంది విద్యార్థులు ప్రతి కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారుల నియామకం 1200 మందికి పైగా ఇన్విజిలేటర్లు 4 ఫ్లయింగ్.. ఐదు సిట్టింగ్ స్క్వాడ్ల ఏర్పాటు సజావుగా జరిగేలా చర్యలు ఇంటర్ పబ్లిక్ పరీక్షలు సజావుగా జరిగేలా చర్యలు చేపడుతున్నాం. పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశాం. కలెక్టర్ ఆనంద్ ఆదేశాల మేరకు పకడ్బందీగా నిర్వహిస్తాం. పరీక్ష సమయానికి ఐదు నిమిషాల వరకే విద్యార్థులను కేంద్రంలోకి అనుమతించనున్నాం. ట్రాఫిక్లో చిక్కుకోకుండా గంట ముందే కేంద్రం వద్దకు చేరుకోవాలి. సమస్యాత్మక కేంద్రాల్లో అదనంగా సిబ్బందిని నియమిస్తాం. విద్యార్థులు ఒత్తిడికి గురికా కూడదు. సమస్యలుంటే కంట్రోల్ రూమ్ నంబర్కు ఫోన్ చేస్తే వెంటనే పరిష్కరిస్తాం. – శ్రీనివాసులు, ఆర్ఐఓ -
గుర్తుతెలియని వ్యక్తి మృత్యువాత
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు రామలింగాపురం రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలోని గుడి వద్ద గురువారం గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో ఉండటాన్ని స్థానికులు గుర్తించి 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు బాలాజీ నగర్ పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. వారు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి పక్కనే ఉన్న సంచిలో బేల్దారి పనిముట్లను గుర్తించారు. వయసు 60 ఉంటుందని భావిస్తున్నారు. వృద్ధుడు ఉదయం 7 గంటల నుంచి ముత్తుకూరు బస్టాండ్ వద్ద ఆటోలు ఆపుతుండగా మద్యం తాగి ఉన్నాడని ఎవరూ స్పందించలేదని స్థానికులు తెలిపారు. దీంతో మద్యం మత్తులో ఊపిరాడకో లేదా అనారోగ్యంతో మృతిచెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిసిన వారు బాలాజీ నగర్ పోలీస్స్టేషన్ను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. -
మిల్లర్.. చీటర్
మిల్లర్లు రైతులను దోచుకోవడమే పనిగా పెట్టుకుంటున్నారు. సీజన్ ప్రారంభం కాగానే అన్నదాతల ఎదుట వాలిపోతున్నారు. ధాన్యాన్ని ధర తగ్గించి కొనుగోలు చేసి ఆపై మిల్లులకు తరలిస్తున్నారు. అక్కడ బియ్యంగా ఆడించి మార్కెట్కు తరలించి రేట్లు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆరుగాలం కష్టించి పండించే ధాన్యానికి గిట్టుబాటు ధర ఉండకపోగా.. అడ్డగోలుగా దోచుకెళ్తున్న మిల్లర్లు ఆడించే బియ్యం రేటు మాత్రం అధికంగా ఉండటం గమనార్హం. దీనిపై అధికారులు సైతం చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.సిండికేట్గా ఏర్పడి ధాన్యం ధర తగ్గింపు ● తాము ఆడించే బియ్యానికి రేట్లు తగ్గకుండా జాగ్రత్తలు ● తూకాల్లోనూ మోసాలు ● లబోదిబోమంటున్న అన్నదాతలు ● కన్నెత్తి చూడని అధికారులుసూళ్లూరుపేట: జిల్లాలో మిల్లర్ల మాయాజాలానికి రైతులు, వినియోగదారులు బలవుతున్నారు. మొదట సీజన్ ప్రారంభంలోనే మిల్లర్లు సిండికేట్గా ఏర్పడుతున్నారు. ఆపై బినామీలతో రేట్లు ఉండవని ఊదరగొట్టి రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. చివరగా కష్టించి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేకుండా రైతుల నుంచి ఒకటికి సగానికి కొనుగోలు చేస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన ధాన్యాన్ని తమ మిల్లుల్లో ఆడించి బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. ఆపై ఆ బియ్యం రేట్లు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నేతల నుంచి అధికారుల వరకు సహకరిస్తుండటంతో వీరి అక్రమ వ్యాపారం మూడు బస్తాలు.. ఆరు లారీలుగా వర్థిల్లుతోంది. సీజన్ ప్రారంభం కాగానే.. వరికోతల సీజన్ ప్రారంభం కాగానే మిల్లర్లు దళారులను రంగంలోకి దింపుతారు. బస్తా ధాన్యాన్ని రూ.1,800 దాకా కొనుగోలు చేసి హైప్ చూపిస్తారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను వీరు పట్టించుకోరు. ఆ తర్వాత మిల్లర్లందరూ సిండికేట్గా మారి దళారుల చేతనే రేట్లు తగ్గిపోయాయని చెప్పిస్తారు. ఉదాహరణకు తమిళనాడులో పంటలు బాగా పండటంతో అక్కడ రేట్లు లేవు. తెలంగాణలోని కోదాడ, ఖమ్మం నుంచి భారీగా ధాన్యం వస్తోంది. పైపెచ్చు విదేశాలకు ఎగుమతులు ఆగిపోయాయి. అందుకే రేట్లు భారీగా తగ్గిపోయాయని రైతులను కలవర పెడుతుంటారు. ఆ తర్వాత మిల్లర్ల బినామీలు రంగప్రవేశం చేసి రూ.1,600, రూ.1,650 కొనుగోలు చేస్తారు. గతేడాది రూ.2,200 అమ్మిన బస్తా ధాన్యం ఈ ఏడాది ఎందుకు తగ్గిపోయిందో అర్థం కాని పరిస్థితి. ప్రతి ఏటా ఇదే తంతు జరుగుతున్నా స్పందించే వారే లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. మిల్లర్ల ముడుపులు మిల్లర్లు సిండికేట్ ఏర్పడి అఽధికార పార్టీ వారికి ముడుపులు చెల్లిస్తారు. ఆపై అధికారులను బుట్టలో వేసుకుని రైతుల కడుపు కొట్టడం ప్రారంభిస్తారు. అన్నదాతలు అప్పుల బారినపడి ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి దిగజారుస్తారు. ధాన్యాన్ని కొనుగోలు చేసుకుని వ్యాపారం చేసే మిల్లర్లు మాత్రం కోట్ల రూపాయలకు పడగలెత్తుతారు. రేషన్ బియ్యాన్నీ వదలకుండా.. రాష్ట్రంలోని రేషన్ షాపుల్లో ఇచ్చే బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు. వాటిని తాము ఆడించే బియ్యంలో పాలిష్ పట్టి బస్తాకు 7 నుంచి 9 కిలోల వరకు కలిపేస్తారు. ఇక్కడ మరొక ట్విస్ట్ ఏమిటంటే రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసేటప్పుడు 75 కిలోల ధాన్యం బస్తాకి మరో ఐదు కిలోలు తరుగు కింద లాగేస్తారు. అదే బియ్యం వద్దకొచ్చే సరికి గోతం మీద నెట్ వెయిట్ 25 కిలోలని ఉంటుంది. దాన్ని తూకం వేస్తే 23, 24 కిలోలు మాత్రమే ఉంటుంది. ఈ విషయం తూనికలు, కొలతల శాఖ అధికారుల తనిఖీల్లో బయట పడినా ఎలాంటి చర్యలుండవు. ఎందుకంటే ఆమ్యామ్యాలతో అంతా సర్దేసుకుంటారు మరి. ఇష్టారాజ్యంగా.. తిరుపతి జిల్లా కంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే రైస్ మిల్లులు ఎక్కువ. ముఖ్యంగా నెల్లూరు నగరం చుట్టూ వంద నుంచి 150 రైస్మిల్లులున్నాయి. తిరుపతి జిల్లాలో సూళ్లూరుపేట నియోజకవర్గంలో పది, శ్రీకాళహస్తిలో మరో పది రైస్ మిల్లులున్నాయి. ఇక తిరుపతి, చంద్రగిరిలో ఐదారు మిల్లుల వరకూ ఉన్నాయి. అదే నెల్లూరులో అయితే ఇదొక పెద్ద ఇండస్ట్రీలా ఉంది. సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల నుంచి నెల్లూరులోని మిల్లులకే ధాన్యం వెళ్తుంది. రేషన్ బియ్యం కూడా అక్కడి కొన్ని మిల్లులకు వెళ్తున్నట్టు సమాచారం. తమిళనాడులో ఇచ్చే రేషన్ బియ్యం (ఉప్పుడు బియ్యం) నెల్లూరు మిల్లులకే తరలిస్తున్నారు. నెల్లూరు అంటే మిల్లర్ల అడ్డాగా ఉంది. -
బీపీసీఎల్ నిర్మాణానికి ప్రజలంతా వ్యతిరేకం
ఉలవపాడు: బీపీసీఎల్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారని.. తీరప్రాంతంలో చేస్తున్న భూసేకరణ ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని మానవహక్కుల వేదిక డిమాండ్ చేసింది. వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు వీఎస్ కృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేష్, రాష్ట్ర కార్యదర్శి రోహిత్, చేనేత జన సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు మోహనరావు, మత్స్యకార సంఘం నాయకులు దుర్గారావులు మూడురోజులుగా మండల పరిధిలోని కరేడు, కొత్తపల్లెపాళెం, టెంకాయచెట్లపాళెం, అలగాయపాళెం, చాకిచర్ల, పెదపట్టపుపాళెం గ్రామాల్లో పర్యటించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. గురువారం ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రాంతంలో ఆరువేల ఎకరాల్లో సంవత్సరానికి 9 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో రిఫైనరీ, పెట్రో కెమికల్స్ కాంప్లెక్స్తోపాటు అదనంగా భవిష్యత్ అవసరాల కోసం మరో పదివేల ఎకరాలు తీసుకోవాలనుకోవడం రైతులకు ఏ మాత్రం ఇష్టం లేదన్నారు. కరేడు నుంచి పోర్టు వరకు రైల్వే లైను, సముద్రం మధ్య ఉన్న అధిక శాతం మత్స్యకారులు, గిరిజనులతో మాట్లాడగా వారు ఈ ప్రాజెక్ట్కు వ్యతిరేకమని చెప్పారన్నారు. మానవహక్కుల వేదిక ప్రజాభిప్రాయ సేకరణ భూసేకరణ ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ -
అండగా ఉంటాం : పర్వతరెడ్డి
వెంకటాచలం: మండలంలోని చెముడుగుంటలో సెంట్రల్ జైల్లో ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఎ.శ్రీధర్రెడ్డిని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి గురువారం ములాఖత్ ద్వారా కలిశారు. గుంటూరు జిల్లాకు చెందిన శ్రీధర్రెడ్డిపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు మోపడంతో జైల్లో ఉన్నాడు. దీంతో చంద్రశేఖర్రెడ్డి అతడి ఆరోగ్య విషయాలు తెలుసుకుని, అధైర్యపడొద్దని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.పశుగణన గడువు పొడిగింపు నెల్లూరు(సెంట్రల్): పశుగణన గడువును మార్చి 31వ తేదీ వరకు పొడిగించినట్లుగా జిల్లా పశుగణన నోడల్ అధికారి మంజునాథ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదట ఈనెలాఖరు వరకు గడువు ఇచ్చారన్నారు. అయితే పలు ప్రాంతాల్లో ఇంకా గణన చేయాల్సి ఉందన్నారు. పశుసంవర్థక శాఖ అధికారులు వచ్చినప్పుడు పాడి రైతులు సహకరించాలని సూచించారు. ఆటోను ఢీకొన్న కారునాయుడుపేట టౌన్: స్వర్ణముఖి నది కాజ్వే వద్ద గురువారం కారు వేగంగా వచ్చి ఆటోను ఢీకొంది. పోలీసుల కథనం మేరకు.. మాచవరం గ్రామానికి చెందిన రవివర్మ ఆటోలో నాయుడుపేటకు వచ్చి తిరిగి స్వగ్రామానికి స్నేహితుడితో కలిసి బయలుదేరాడు. స్వర్ణముఖి నది కాజ్వే వద్ద వెనుక నుంచి కారు ఢీకొంది. దీంతో ఆటో కాజ్వే పైనుంచి స్వర్ణముఖి నదిలోకి బోల్తా పడింది. రవివర్మ గాయపడ్డాడు. -
సోమశిలకు రక్షణేదీ..?
ఆత్మకూరు: జిల్లాలో సాగు, తాగునీటికి వరదాయినైన సోమశిల జలాశయ సేఫ్టీ వాల్కు రక్షణ కరువైంది. వాస్తవానికి నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన ఇది ప్రస్తుతం ప్రమాదభరితంగా మారింది. ఈ అంశంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. బీటలు వారి.. దుర్భరంగా జలాశయంలో ఐదు నెలలుగా 60 టీఎంసీలకుపైగా నీరు నిల్వ ఉంది. 1979 – 80లో ఆప్రాన్కు.. జలాశయానికి రక్షణగా ఉండేలా ఎడమ వైపు రాళ్లతో పటిష్టంగా రక్షణ గోడను కోర్వాల్గా నిర్మించారు. 100 మీటర్ల వెడల్పు.. 40 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ రక్షణ గోడ పలుచోట్ల బీటలు వారి.. రాళ్లు సైతం ఊడి రంధ్రాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఫలితంగా ఎప్పుడు ఏ ప్రమాదం చోటు చేసుకుంటుందోననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇసుకతో అధిక బరువు మూడేళ్ల క్రితం వచ్చిన భారీ వరదలకు ఆప్రాన్ దెబ్బతినింది. మరమ్మతులను ఐదు నెలల క్రితం ప్రారంభించి అర్ధాంతరంగా నిలిపేశారు. దెబ్బతిన్న రక్షణ గోడ పైభాగంలోని ఖాళీ స్థలంలో టన్నుల ఇసుకను ఆ సమయంలో నిల్వ ఉంచారు. బీటలు వారి దెబ్బతిన్న రక్షణ గోడపై బరువు మరింత పెరిగింది. పనులను నిలిపేయడంతో ఇవి నేటికీ అలానే ఉన్నాయి. మరోవైపు ఆప్రాన్ మరమ్మతుల సమయంలో సంబంధిత కాంట్రాక్టర్ తగు సాంకేతిక పరిజ్ఞానం లేకుండా బ్లాస్టింగ్ పనులు చేయడంతో రక్షణ గోడ దెబ్బతిని ఉండొచ్చని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సైతం ఎలాంటి నివేదికను ఉన్నతాధికారులకు అందించలేదు. హామీ నీటిమూటేనా..? సోమశిల జలాశయ పరిశీలన నిమిత్తం మంత్రులతో కలిసి సీఎం చంద్రబాబు గతేడాది అక్టోబర్లో వచ్చారు. మరమ్మతు పనులను ఆరు నెలల్లో పూర్తి చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే ఐదు నెలలు పూర్తయినా ఆప్రాన్ పనులు సగం కూడా కాలేదు. మిగిలిన పనులు ఎప్పటికి పూర్తవుతాయో నేటికీ స్పష్టత లేదు. నాలుగు దశాబ్దాల క్రితం సేఫ్టీ వాల్ నిర్మాణం నేడు ప్రమాదభరితంగా.. నిలిచిన ఆప్రాన్ పనులు ఆరు నెలల్లో పూర్తి చేస్తామని సీఎం హామీ నేటికీ అతీగతీ లేని వైనం ప్రమాదమేమీలేదు జలాశయ రక్షణ గోడను పరిశీలిస్తున్నా. ప్రమాదమేమీలేదు. గోడ పైభాగంలో ఉన్న ఇసుకను జేసీబీలతో తొలగించాలని సిబ్బందిని ఆదేశించా. ఆప్రాన్ పనులు నిలిచిన విషయం వాస్తవమే. త్వరలోనే ప్రారంభి రక్షణ గోడకు మరమ్మతులు చేయిస్తాం. – దశరథరామిరెడ్డి, ప్రాజెక్ట్ ఈఈ -
ఓవైపు అప్పులు.. మరోవైపు ఆరోగ్య సమస్యలు
● ఆత్మహత్య చేసుకున్న యువకుడు నెల్లూరు సిటీ: ఓవైపు ఆరోగ్య సమస్యలు.. మరోవైపు ఆర్థిక సమస్యలు. అతడికి ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి చావే దిక్కని నిర్ణయించుకున్నాడు.. గన్నేరు పప్పు తిని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. గురువారం పోలీసులు వివరాలు వెల్లడించారు. దొంతాలికి చెందిన సూరిశెట్టి శ్రీనివాసులు (28)కు మల్లేశ్వరితో నాలుగు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరు కోడూరుపాడు కల్తీ కాలనీలో కాపురం ఉంటున్నారు. శ్రీనివాసులు పాల వ్యాపారం చేసేవాడు. కొంతకాలంగా అతడిని ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇదే క్రమంలో పాల వ్యాపారంలో కూడా రూ.20 లక్షలు వరకు నష్టం వాటిల్లింది. అప్పుల బాధ తట్టుకోలేకపోయాడు. ఈనెల 25వ తేదీన మధ్యాహ్నం ఇంటి వద్ద గన్నేరు పప్పు తిని అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. రూరల్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కండలేరులో 51.938 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో గురువారం నాటికి 51.938 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ విజయకుమార్రెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 620, పిన్నేరు కాలువకు 120, లోలెవల్ కాలువకు 210, హైలెవల్ కాలువకు 210, మొదటి బ్రాంచ్ కాలువకు 70 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.వీఎస్యూలో వాల్పోస్టర్ల ఆవిష్కరణ వెంకటాచలం: విక్రమ సింహపురి యూనివర్సిటీ (వీఎస్యూ) నేషనల్ యూత్ పార్లమెంట్ – 2025 వాల్పోస్టర్లను వీసీ అల్లం శ్రీనివాసరరావు గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని జిల్లాస్థాయిలో నిర్వహించడానికి వీఎస్యూ ఎన్ఎస్ఎస్ విభాగం, నెహ్రూ యువ కేంద్రానికి బాధ్యతలు అప్పగించారన్నారు. ఆసక్తి గల వారు మై భారత పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. వికసిత్ భారత్పై ఒక నిమిషం నిడివి గల వీడియోను చిత్రీకరించి అప్లోడ్ చేయాల్సిందిగా సూచించారు. 150 మందిని ఎంపిక చేసి, జిల్లా స్థాయిలో వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అనే అంశంపై మూడు లేదా నాలుగు నిమిషాలు మాట్లాడేలా అవకాశం కల్పిస్తామన్నారు. ప్రతిభ చూపిన పదిమందిని ఎంపిక చేసి రాష్ట్ర స్థాయిలో యూత్ పార్లమెంట్కు పంపిస్తారని తెలియజేశారు. అక్కడ ఉత్తమ ప్రతిభ చూపిన ముగ్గురికి ప్రధాని నరేంద్రమోదీ సమక్షంలో తమ ఆలోచనలను వెల్లడించేందుకు అవకాశం కల్పిస్తారని తెలియజేశారు. కార్యక్రమంలో ఇన్చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత, ప్రిన్సిపల్ సీహెచ్ విజయ, ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డాక్టర్ ఉదయ్శంకర్ తదితరులు పాల్గొన్నారు. నేడు ఐటీఐలో జాబ్మేళా నెల్లూరు(టౌన్): ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎంప్లాయ్మెంట్ ఆఫీస్, సీడాప్లు సంయుక్తంగా నెల్లూరు వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలుర ఐటీఐలో శుక్రవారం జాబ్మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ శ్రీధర్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్, అమర్రాజా బ్యాటరీస్ తదితర కంపెనీలు మేళాలో పాల్గొంటాయన్నారు. ఎస్ఎస్సీ, డిగ్రీ, డిప్లొమా చదివిన వారు హాజరుకావొచ్చన్నారు. వివరాలకు 94944 56326, 97045 10793 ఫోన్ నంబర్లును సంప్రదించాలని తెలియజేశారు. -
ధాన్యానికి రేట్లు లేవు
రైతులు పండించే ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వకుండా మిల్లర్లు సిండికేట్గా మారి మోసం చేస్తున్నారు. వారు తయారు చేసే బియ్యానికి మాత్రం రేట్లు తగ్గించకుండా విక్రయిస్తున్నారు. ఇక్కడ చూస్తుంటే రైతు పండించిన ధాన్యానికి రేట్లు లేకుండా చేసి పబ్లిక్ మార్కెట్లోనేమో బియ్యం కొనుగోలు చేసే వినియోగదారులకు రేట్లు పెంచడమే కాకుండా తూకాల్లో కూడా ఒకటి రెండు కేజీలు తగ్గించి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలి. – గాలి మల్లికార్జున్రెడ్డి, సుగ్గుపల్లి, సూళ్లూరుపేట మండలం -
బియ్యం ధరలు ఎందుకు తగ్గించరు?
నేను గతంలో వరి సాగుచేసేవాడ్ని. ప్రస్తుత పరిస్థితులు బాగోలేక వ్యవసాయం చేయడం మానేశా. కష్టపడి పండించిన పంటను ఎవరో మిల్లర్లు వచ్చి దోచుకెళుతున్నారు. ఆరునెలలపాటు పడిన కష్టాన్ని వ్యాపారం చేసుకునే వారు తక్కువ రేట్లతో దండుకుని వెళ్తున్నారు. ఇలా చేస్తే వ్యవసాయంలో అప్పులు తప్ప ఏమీ మిగలవు. ప్రస్తుతం ధాన్యానికి ధరలు లేవు కదా! మరి మార్కెట్లో బియ్యం రేట్లు ఎందుకు తగ్గట్లేదు..? – వంకా చంద్రశేఖర్, సూళ్లూరుపేట -
రోడ్ల అభివృద్ధికి ప్రతిపాదనలు
ఆర్అండ్బీ ఎస్ఈ గంగాధరం నెల్లూరు(అర్బన్): ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆర్అండ్బీ పరిధిలోని 460 కిలోమీటర్ల పరిధిలో రోడ్లు వేసేందుకు, 15 మేజర్ బ్రిడ్జిల నిర్మాణానికి, రోడ్ల వెడల్పుకు, సింగిల్ రహదారులను డబుల్గా మార్చేందుకు రూ.1,000 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపామని ఆ శాఖ ఎస్ఈ గంగాధరం తెలిపారు. నెల్లూరులోని తన కార్యాలయంలో గురువారం ఆయన వివరాలు వెల్లడించారు. అన్ని మండల హెడ్క్వార్టర్స్కు రోడ్లు వేస్తామన్నారు. ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన రూ.19.8 కోట్లతో 790 కిలోమీటర్ల పరిధిలో చేపట్టిన ప్యాచ్ వర్కు పనులు 95 శాతం పూర్తయ్యాయని తెలిపారు. 255 కిలోమీటర్ల పరిధిలో ప్యాచ్వర్కులు చేసినా వాటిని సరిచేయలేమన్నారు. వీటి ని పునఃనిర్మించేందుకు రూ.80 కోట్ల అవసరం కానున్నాయన్నారు. నెల్లూరులోని పొదలకూరు రోడ్డులో మరమ్మతులు జరుగుతున్నాయన్నారు. -
హైస్కూల్లో 50 కుళాయిల చోరీ
● పది తలుపులు, పది వాష్బేసిన్ల ధ్వంసం కొడవలూరు: మండలంలోని యల్లాయపాళెం జెడ్పీ హైస్కూల్లో బుధవారం చోరీ జరిగింది. దుండగులు పది తలుపులు పగులగొట్టి బాలబాలికల మరుగుదొడ్లు, తాగునీటికి సంబంధించిన 50 స్టీల్ కుళాయిలను అపహరించారు. కుళాయిల కోసం పది వాష్బేసిన్లను పగులగొట్టారు. ఈ ఘటన సెలవు రోజైన బుధవారం మధ్యాహ్నం జరిగిందా లేక రాత్రి జరిగిందా? అని తెలియాల్సి ఉంది. పాఠశాలకు గురువారం ఉదయం వచ్చిన విద్యార్థులు ముందుగా మరుగుదొడ్లు ధ్వంసం కావడాన్ని చూసి ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానోపాధ్యాయుడు మోహన రామలింగయ్య పరిశీలించి చూసి సుమారు రూ.2.50 లక్షల నష్టం వాటిల్లిందని తెలిపారు. హెచ్ఎం, ఎంపీటీసీ సభ్యుడు గరికపాటి రాజేంద్ర, స్థానిక నాయకులు వంశీధర్రెడ్డి, రియాజ్, కేతు వెంకటరమణారెడ్డి, ప్రభాకర్రెడ్డి, రాఘవేంద్రలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై సీహెచ్ కోటిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. ఇదే పాఠశాలలో 2023 డిసెంబర్ 31న చోరీ జరిగ్గా పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి మృతి
సంగం: ఈనెల 16వ తేదీన పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ వ్యక్తి నెల్లూరులోని వైద్యశాలలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందినట్లు సంగం పోలీసులు తెలిపారు. వారి కథనం మేరకు.. మండలంలోని అనసూయనగర్కు చెందిన ఎ.హరిబాబు (32) మద్యానికి బానిసై అప్పులపాలయ్యాడు. అప్పుల బాధలు తాళలేక పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు గుర్తించి నెల్లూరులోని వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
వివాహిత బలవన్మరణం
నెల్లూరు(క్రైమ్): ఓ వివాహిత ఇంట్లోని ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు రూరల్ మండలం కాకుపల్లికి చెందిన శేషసాయి పొదలకూరు మండలం మర్రిపల్లికి చెందిన శివప్రియ (26)లు రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. తొలుత కాకుపల్లిలో కాపురం పెట్టి మూడునెలల క్రితం ప్రశాంతినగర్కు వచ్చారు. వారికి నెలల వయసున్న కుమారుడున్నాడు. బాబు విషయంలో గురువారం దంపతుల నడుమ వాగ్వాదం జరిగింది. శేషసాయి పని నిమిత్తం ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. సాయంత్రం ఆమె తన భర్తకు వాట్సాప్లో గుడ్బై అని మెసేజ్ చేసింది. ఇది చూసిన భర్త వెంటనే ఆమెకు ఫోన్ కాల్ చేయగా లిఫ్ట్ చేయలేదు. దీంతో అతను జరిగిన విషయాన్ని తన ఇంటి యజమానికి తెలియజేయగా, వారు వెళ్లి కిటికీలో నుంచి చూశారు. అప్పటికే శివప్రియ ఉరేసుకుని ఉండటాన్ని గమనించి ఇదే విషయాన్ని భర్తకు తెలియజేశారు. అనంతరం అందరూ కలిసి ఇంటి తలుపులు పగులగొట్టి ఆమెను చికిత్స నిమిత్తం అపోలో హాస్పిటల్కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు భర్త నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్స్పెక్టర్ అన్వర్బాషా హాస్పిటల్కు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు నెల్లూరుకు బయలుదేరారు. పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది. -
గిరిజన బాలికను గర్భవతిని చేసి మోసం
కావలి: మండలంలోని ఒక గ్రామానికి చెందిన గిరిజన బాలికను ఓ వ్యక్తి గర్భవతి చేసినట్లు బుధవారం కావలిరూరల్ పోలీసులకు ఫిర్యాదు అందింది. బాలికకు రుతుస్రావం ఆగిపోవడంతో కుటుంబ సభ్యులు పట్టణంలోని వైద్యశాలకు తీసుకొచ్చి పరీక్షలు చేయించారు. బాలిక గర్భం దాల్చినట్లు వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. ఇంటికి తీసుకెళ్లి బాలికను కుటుంబ సభ్యులు విచారించగా గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ చదివిన వ్యక్తి మాయమాటలు చెప్పి శారీరకంగా కలిసినట్లు వెల్లడించింది. దీంతో వారు కావలిరూరల్ పోలీస్స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు అందజేశారు. అయితే బాధితురాలి కుటుంబ సభ్యులను రెండు రోజుల తర్వాత పోలీస్స్టేషన్కు రావాలని పోలీసులు పంపించేశారు. అయితే ఈ వ్యవహారంపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. -
నిబంధనల మేరకే విధులు
● నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ నెల్లూరు(బారకాసు): నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో తనతోపాటు టౌన్ప్లానింగ్ అధికారులు ఇతర విభాగాల అధికారులందరూ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే విధులు నిర్వహిస్తున్నామని కమిషనర్ సూర్యతేజ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాప్రతినిధులందరూ తమకు అన్ని విధాలా సహకరిస్తున్నారని పేర్కొన్నారు. తామెవరూ బదిలీలు కావాలని కోరుకోవడం లేదని, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లోనే పని చేయాలని కోరుకుంటున్నామన్నారు. నెల్లూరు నగరాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పరిపాలన కొనసాగిస్తున్నామని, తమపై ఎవరి వల్ల ఎలాంటి ఒత్తిడి లేదని సూర్యతేజ స్పష్టం చేశారు. రేపు జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు నెల్లూరు (టౌన్): జాతీయ సైన్స్ దినోత్సవం సందర్శంగా ఈ నెల 28న స్థానిక దర్గామిట్టలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో సైన్స్ దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు జిల్లా సైన్స్ అధికారి కరుణాకర్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారున. ‘2025 థీమ్ అభివృద్ధి చెందిన భారతదేశం కోసం సైన్స్ ఆవిష్కరణలో ప్రపంచ నాయకత్వం కోసం భారతీయ యువతకు సాధికారత కల్పించడం’ అనే అంశంపై ప్రాథమిక విద్య 3 నుంచి 8వ తరగతి వరకు, సెకండరీ విద్య 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లతోపాటు బహమతి ప్రదానం చేస్తామన్నారు. గండిపాళెం ఘటనపై బాలల హక్కుల కమిషన్ సీరియస్ ఉదయగిరి: మండలంలోని గండిపాళెం గురుకుల పాఠశాలలో విద్యార్థులతో పనులు చేయిస్తున్న విషయం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సీరియస్ అయింది. ‘విద్యార్థులతో వంట పనులు’ శీర్షిక ఈ నెల 24వ తేదీ సాక్షిలో కథనం ప్రచురితమైన విషయం విదితమే. మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో వివరణ ఇవ్వాలని కమిషనర్ పద్మావతి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. పిల్లలతో పనులు చేయించడం చట్టరీత్యా నేరమైనందున, ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే అవకాశముంది. విద్యార్థులకు వంట చేసేందుకు ఇద్దరు కుక్లు, మరో ఇద్దరు సహాయకులు ఉన్నారు. కానీ వీరు కొన్ని పనులను విద్యార్థులతో చేయిస్తున్నారు. ప్రతి రోజు వంట పనులతో పాటు ఇతర పనులు చేసేందుకు విద్యార్థులను బ్యాచ్లుగా విభజించారు. ప్రతి బ్యాచ్లో 15 మంది ఉంటారు. వీరు రోటేషన్ పద్ధతిలో వంట పనులు చేస్తున్న పరిస్థితి. 3 నుంచి ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలు నెల్లూరు (టౌన్): ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్షలకు వచ్చే నెల 3వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరగనున్నట్లు డీఈఓ బాలాజీరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు సంబంధించి అభ్యాసకులు హాల్ టికెట్లను సంబంధిత స్టడీ సెంటర్లలో పొందాలన్నారు. నేడు రాష్ట్ర స్థాయి ఎడ్ల పందేలు కొనకనమిట్ల: మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా గురువారం మండలంలోని వాగుమడుగు పంచాయతీ అంబాపురంలో రాష్ట్ర స్థాయి ఎడ్ల పందేలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు బుధవారం తెలిపారు. అంబాపురంలోని అంబబాల సంగేశ్వరస్వామి ఆలయం ఆవరణలో పాలపళ్ల విభాగం నుంచి ఆరుపళ్లు సైజు వరకు (12 క్వింటాళ్ల బండ) ఎడ్ల పోటీలు నిర్వహిస్తారు. మొత్తం 10 జతల ఎడ్లు పోటీల్లో పాల్గొంటున్నాయని, గెలుపొందిన ఎడ్లకు మొదటి, రెండు, మూడు బహుమతులు వరుసగా రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు దాతల సహకారంలో ఇస్తున్నట్లు చెప్పారు. శివాలయం వద్ద భక్తులకు అన్నదానం, రాత్రికి విద్యుత్ ప్రభ ఏర్పాటు చేస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఎడ్ల పందేలకు వచ్చే వారు వివరాలకు 8790612406, 9704364204 నంబర్లలో సంప్రదించాలని నిర్వాహకులు కోరారు. పక్షుల కేంద్రంలో రైల్వే డీఆర్ఎం దొరవారిసత్రం: మండలంలోని నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రాన్ని బుధవారం విజయవాడ డివిజన్ డీఆర్ఎం నరేంద్ర ఎ.పాటిల్ సందర్శించారు. కడప చెట్లపై విడిది చేసిన విహంగాల విన్యాసాలను కెమెరాతో చిత్రీకరించారు. ఈ సందర్భంగా నేచర్ గైడ్ హుస్సేనయ్య పక్షుల జీవన విధానాలను వివరించారు. -
కప్పం కడితే సక్రమం.. లేదంటే అక్రమం
కోవూరులో అన్ని అనుమతులతో ఏర్పాటు చేసిన లేఅవుట్ కోవూరు నియోజకవర్గంలో తమ్ముళ్ల దోపిడీకి, దాష్టీకాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఒక్కో వ్యాపారానికి ఒక్కో మాఫియా తయారైంది. ఇసుక, కోళ్ల వ్యర్థాలు, రేషన్ బియ్యం అక్రమ రవాణా, పేకాట, మద్యం వంటి అసాంఘిక కార్యకలాపాలతో చెలరేగిపోతున్న తమ్ముళ్లు చివరకు పశువుల వ్యాపారంతో అక్రమార్జనకు పాల్పడుతున్నారు. తాజాగా రియల్ వెంచర్లపై పడి దోచుకునేందుకు సిద్ధమయ్యారు. గత ప్రభుత్వ హయాంలో అన్నీ అనుమతులతో ఏర్పాటు చేసి ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న వెంచర్ల యజమానులను వాటాలివ్వాలంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ● పాత లేఅవుట్ల యజమానులకు షాడో ఎమ్మెల్యే హుకుం ● రూ.10 లక్షలు కట్టి రసీదు తీసుకోమంటున్న తమ్ముళ్లు ● గతంలోనే అన్ని అనుమతులు తీసుకుని ప్లాట్లు వేసిన యజమానులు ● వీరి తీరుతో రియల్ ఎస్టేట్ ఢమాల్ కోవూరు: ధనార్జనే ధ్యేయంగా టీడీపీ నేతలు, షాడో ఎమ్మెల్యేలు బరి తెగిస్తున్నారు. కప్పం కడితే సక్రమం లేదంటే.. అక్రమం చేస్తామని బెదిరిస్తున్నారు. ప్రతి వ్యాపారాన్ని మాఫియాగా మార్చుకుని అక్రమ దందాలకు పాల్పడుతున్నారు. సహజ వనరుల నుంచి అసహజ వ్యాపారాల మాఫియాలకు అండగా ఉంటూ దోచుకుతుంటున్న తమ్ముళ్లు తాజాగా రియల్ వెంచర్లపై కన్నేశారు. పాత వెంచర్లకు నోటీసులు పేరుతో రూ.లక్షల్లో వసూళ్లకు తెర తీస్తున్నారు. గతంలో అనుమతులు పొంది ప్లాట్లు విక్రయించుకున్న యజమానులకు షాడోలు ఫోన్లు చేసి బెంబేలెత్తిస్తున్నారు. ఇప్పటికే ఆయా వెంచర్లలో ప్లాట్ల కొనుగోలు చేసిన యజమానులు గృహాలు నిర్మించుకుని నివాసాలు ఉంటున్నారు. వారికి సైతం నోటీసులు జారీ చేయించి నరకం చూపిస్తున్నారు. రూ.కోట్ల దండుకునే కుట్ర.. కోవూరు పంచాయతీ పరిధి శివారు ప్రాంతాల్లో గత ప్రభుత్వంలో దాదాపు 10 వెంచర్లు పంచాయతీ అనుమతులతో లేఅవుట్లు ఏర్పాటు చేశారు. ఆ మేరకు డీటీసీపీ అనుమతులు కూడా తీసుకున్నారు. ఇప్పటికే ఆయా లేఅవుట్లలో గృహాల నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. తాజాగా ఆయా వెంచర్లకు అనుమతులు లేవంటూ పంచాయతీ అధికారులు నోటీసులు ఇస్తున్నారు. తాజా పరిణామాలతో గృహ నిర్మాణదారులు భయపడుతున్నారు. రూ.లక్షలు వెచ్చించి ప్లాట్లు కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకుంటే ఇప్పుడు అనుమతుల పేరిట ఇబ్బందులు పెడుతున్నారని ఆందోళన చెందుతున్నారు. ఆయా వెంచర్ల యజమానులతోపాటు ప్లాట్ల యజమానులను బెదిరించి రూ.కోట్ల దండుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. రద్దు చేయిస్తామంటే... అనుమతులున్నట్లే కదా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీ నేతలు దండుకోవడమే పరమావధిగా పెట్టుకుని దోచుకుంటున్నారు. గతంలోనే ఏర్పాటు చేసిన లేఅవుట్లకు రూ.10 లక్షల ముడుపులుగా ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేస్తుంటే, అంతే మొత్తం మాకు ఇవ్వాలంటూ పంచాయతీ కార్యదర్శి నుంచి జిల్లా పంచాయతీ అధికారి వరకు డిమాండ్ చేస్తున్నారని, లేదంటే అనుమతులు రద్దు చేస్తామని బెదిరిస్తున్నారని, అన్ని నిబంధనల ప్రకారమే డబ్బులు చెల్లించామని, మళ్లీ ఇప్పుడు ఇవ్వాలంటే ఎలా అని యజమానులు వాపోతున్నారు. పంచాయతీ అనుమతులు రద్దు చేయిస్తామంటే వాటికి అనుమతులు ఉన్నట్లే కదా? మేమెక్కడ అక్రమంగా లేఅవుట్లు వేశామంటూ వెంచర్ల యజమానులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే పంచాయతీ అధికారుల దోపిడీ మామూలుగా లేదు. డీటీసీపీ అనుమతులు లేవంటూ అందుకు మరో రూ.5 లక్షల ఇవ్వాలంటూ పంచాయతీ కార్యదర్శి ఓపెన్గానే డిమాండ్ చేయడం గమనార్హం. ఈ విధంగా టీడీపీ నేతలు, పంచాయతీ అధికారులు ఎడాపెడా దోపిడీతో రియల్ వెంచర్ల యజమానులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇక ప్లాట్లు కొనుగోలు చేసిన యజమానులు కూడా ప్రస్తుతం ఇల్లు కట్టలేమంటూ వాయిదా వేసుకుంటున్నారు. లోకాయుక్తకు ఫిర్యాదు చేయించి కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పార్టీ నేతలు వెంచర్లపై కన్నేశారు. యజమానులను బెదిరించి ప్రతి లేఅవుట్కు అడిగినంత ఇవ్వాలని లేదంటే ఆయా లేఅవుట్ల అనమతులు రద్దు చేస్తామంటూ బెదిరిస్తున్నారు. వెంచర్ల యజమానులు సమాధానం చెప్పకపోవడంతో నాయకులు తమకు అనుకూలంగా ఉండే హైదరాబాద్లో ఉంటున్న వ్యక్తితో లోకాయక్తలో ఫిర్యాదు చేయించారు. విచారించి నివేదిక ఇవ్వాలనే లోకాయుక్త ఆదేశాలను పట్టుకుని నాయకుల నుంచి అధికారుల వరకు ఒక్కో లేఅవుట్కు రూ.10 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారు. ఆయా లేఅవుట్లలో కొనుగోలు చేసిన స్థలాల్లో ఇల్లు నిర్మించుకుందామంటే అనుమతులకు టీడీపీ నేతల నుంచి అధికారుల వరకు అన్ని స్థాయిల్లో పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాలతో ఎవరైనా కొత్తగా ప్లాట్లు కొనుగోలు చేయాలంటే ఆలోచిస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో ప్లాట్లు కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంచర్లలో ప్లాట్లు అమ్ముకోలేక పెట్టుబడులు వడ్డీలు రాక యజమానులు అప్పుల పాలవుతున్నారు. నిబంధనల ప్రకారమే లేఅవుట్లు కోవూరు పంచాయతీ పరిధిలో వేసిన లేఅవుట్లను నిబంధనల ప్రకారమే ఏర్పాటు చేశారు. నుడా నిబంధనల ప్రకారమే రోడ్లు, ప్రజాప్రయోజనాల అవసరార్థం స్థలాల కేటాయింపు ఆయా లేఅవుట్లలో జరిగాయి. దీనికంటే ముందు వ్యవసాయ భూములను కమర్షియల్ భూములుగా కన్వెర్షన్ ప్రక్రియ కూడా సక్రమంగా జరిగింది. అందుకు సంబంధించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన చార్జీలను యజమానులు చెల్లించారు. ఇక లేఅవుట్ల ఏర్పాటుకు సంబంధించి కూడా పంచాయతీకి చెల్లించాల్సిన బెటర్మెంట్ చార్జీలను కూడా చెల్లించారు. -
గర్భిణిపై టీడీపీ నేత అమానుషం
బుచ్చిరెడ్డిపాళెం : మండలంలోని చెల్లాయపాళెంలో నిండు గర్భిణిపై తన సొంత పెదనాన్న, టీడీపీ నేత అమానుషంగా దాడి చేసిన ఘటన బుధవారం జరిగింది. ఆ గర్భిణి బాధతో విలవిలలాడుతూ పోలీసులకు ఫోన్ చేసినా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో తన భర్త సహకారంతో పోలీస్స్టేషన్కు వచ్చి అర్ధ గంటసేపు బాధతో విలవిలలాడుతూ కూర్చున్నా.. పోలీసులు పట్టించుకోకపోవడం తీవ్ర చర్చకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. చెల్లాయపాళెంకు చెందిన టీడీపీ నేత తమ్మిరెడ్డి మల్లికార్జున్ సోదరుడు చనిపోవడంతో అతని భార్య, బిడ్డలతో పొలం వివాదం ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం తమ్ముడి భార్య, రెండో కుమార్తెతోపాటు మరికొందరిపై దౌర్జన్యం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. తన పుట్టింట్లో ఉన్న తమ్మిరెడ్డి శరణ్య బుధవారం మందులు తెచ్చుకునేందుకు బుచ్చిరెడ్డిపాళెం బయలుదేరింది. ఆమెను చూసిన పెదనాన్న మల్లికార్జున్, నానమ్మ అడ్డగించారు. శరణ్య నిండు గర్భిణి అని తెలిసి కూడా ఆమె కడుపుపై విచక్షణా రహితంగా కాళ్లతో తన్నుతూ, కర్రలతో కొట్టారు. దీంతో బాధితురాలు అక్కడి నుంచి పోలీస్స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేసినా స్పందించలేదు. శరణ్య బాధతో రోదించి పోలీస్స్టేషన్ వద్దే స్పృహ తప్పి పడిపోయింది. దీంతో ఆమె భర్త హరికిరణ్ స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పుడొచ్చిన పోలీసులు నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించేందుకు ప్రయత్నించగా తాము చికిత్స పొందుతున్న వైద్యశాలకు వెళ్తామని శరణ్య, ఆమె భర్త చెప్పడంతో అక్కడికి తరలించారు. టీడీపీ నేతల దురాగతానికి, మహిళపై దాడి చేసినా తొలుత పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం అంశాలు దిగ్భ్రాంతి కలిగిస్తోంది. -
ప్రణవుడికి.. ప్రణమిల్లి..
శివశివ శంకర.. భవహర.. కై లాసపురి దేవరా.. హరహరా.. నీలకంఠేశ్వరా.. అఖండ తేజోమయ.. లోకేశ్వరా.. రుద్రాయ భద్రాయ.. భూతనాథయ.. ఓం నమశ్శివాయ.. అంటూ శివనామస్మరణలతో శైవక్షేత్రాలు మార్మోగిపోయాయి. కై లాశాధిపతి, ఓంకారుడు, ప్రణవుడు, గరళకంఠుడు, సర్వేశ్వరుడు సకల నామరూపధారుడు పరమశివుడికి ప్రీతికరమైన మహాశివరాత్రి సందర్భంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా ఆది దంపతులు కొలువైన శైవక్షేత్రాల్లో వేకువజాము నుంచే మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, అర్ధరాత్రి లింగోద్భవాభిషేకం, విశేష పూజలు చేశారు. క్షేత్రాల్లో దీపాలు వెలగించి ఆరాదించారు. ప్రణవుడికి ప్రణమిల్లి ప్రార్థించారు. ముక్తిప్రదాతను ముకుళిత కరాలతో ప్రణమామ్యహం అంటూ మోకరిల్లారు. ఉమామహేశ్వరుల నిలయాలు వేకువజాము నుంచి కిటకిటలాడాయి. త్రినేత్రుడిని దర్శించుకునేందుకు బారులు తీరారు. ముక్కంటి విశేషాలంకారంలో భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. సముద్రంలో పుణ్యస్నానాలు ఆచరించారు. భక్త వల్లభుడు ముక్కంటేశ్వరుడి ఆలయాల్లో కోలాహలం నెలకొంది. – సాక్షి, నెట్వర్క్ కై వల్య నాథుడికి విశేష కై ంకర్యాలు ముకుళిత కరాలతో ముక్తిప్రదాతకు ప్రణమామ్యహం భక్తిశ్రద్ధలతో మహాశివరాత్రి కిటకిటలాడిన కై లాసనాథుడి కొలువులు -
రైల్లో వెళ్తూ.. పెన్నానదిలో పడి..
● గుర్తుతెలియని వ్యక్తి మృతి నెల్లూరు(క్రైమ్): కావలి వైపు వెళ్లే రైల్లో నుంచి పెన్నానదిలో పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన బుధవారం నెల్లూరులో పెన్నా బ్రిడ్జి వద్ద జరిగింది. మృతుడి వయసు సుమారు 30 నుంచి 35 ఏళ్లలోపు ఉంటుందని భావిస్తున్నారు. క్రీమ్ కలర్ ఫుల్ హ్యాండ్స్ చొక్కా, నలుపు రంగు నైట్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై జి.మాలకొండయ్య ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో నదిలో నుంచి మృతదేహాన్ని వెలికితీసి జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంగారు హారం బహూకరణ రాపూరు: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో ఉన్న ఆదిలక్ష్మీదేవికి బుధవారం బంగారు కాసులహారాన్ని దాతలు బహూకరించినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం లింగాలవలస గ్రామానికి చెందిన గురుబెల్లి లక్ష్మీనారాయణ, చైతన్యలు 39 గ్రాముల బంగారు లక్ష్మీదేవి కాసులహారాన్ని అర్చకులు బాలాజీ స్వామికి అందించారన్నారు. కార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులు, ఆలయ సిబ్బంది వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు. సైబర్ నేరంపై కేసు నమోదునెల్లూరు(క్రైమ్): ఓ వ్యక్తి క్రెడిట్ కార్డు కోసం ఆన్లైన్లో వివరాలు నమోదు చేయగానే అతని బ్యాంక్ ఖాతాలోని రూ.3.17 లక్షల నగదును సైబర్ నేరగాళ్లు దోచేసిన ఘటనపై నెల్లూరు దర్గామిట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన డేవిడ్ పీటర్ ముత్తుకూరులోని ఓ పవర్ ప్లాంట్లో పనిచేస్తూ నెల్లూరు ఇస్కాన్ సిటీలోని శ్రీనివాస్ అపార్ట్మెంట్ పెంట్హౌస్లో నివాసం ఉంటున్నాడు. గతేడాది డిసెంబర్లో క్రెడిట్ కార్డు కోసం ఓ జాతీయ బ్యాంక్కు చెందిన వెబ్సైట్ను తెరిచి అందులో వివరాలు నమోదు చేశాడు. పాత క్రెడిట్ కార్డు వివరాలను ఇవ్వగా అతని బ్యాంకు ఖాతానుంచి పలు దఫాలుగా రూ.3,17,438 నగదు డ్రా అయినట్లు ఫోన్కు మెసేజ్లు వచ్చాయి. దీంతో నిర్ఘాంతపోయిన బాధితుడు వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు బాఽధితుడు బుధవారం దర్గామిట్ట పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. ఎస్సై జీవీ సుబ్బారావు కేసు నమోదు చేశారు.బ్యారేజ్ వద్ద గుర్తుతెలియని మృతదేహం పొదలకూరు: సంగం బ్యారేజ్ 50వ పిల్లర్ వద్ద గుర్తుతెలియని మృతదేహాన్ని బుధవారం పోలీసులు వెలికి తీయించారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. బ్యారేజ్ పిల్లర్ పక్కనే తేలియాడుతున్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే ఎస్సై ఎస్కే హనీఫ్ అక్కడికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రక్ ఆటోను ఢీకొన్న బైక్
బిట్రగుంట: బోగోలు మండలం ముంగమూరు గ్రామంలో బుధవారం ట్రక్ ఆటోను మోటార్బైక్ ఢీకొన్న ఘటనలో యాదగిరి శ్రీను (17) అనే యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. స్థానికుల కథనం మేరకు.. కావలి రూరల్ మండలం గౌరవరం గిరిజన కాలనీకి చెందిన శ్రీను, గణేష్లు ముంగమూరు గ్రామంలో పొలంలో పురుగు మందులు పిచికారీ చేసే పని చేసి తిరిగి బైక్పై ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ముంగమూరు గ్రామంలో మినరల్ వాటర్ అమ్మకాలు చేసే ట్రక్ ఆటోను బైక్ ఢీకొట్టింది. దీంతో శ్రీను మరణించగా, గణేష్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని కావలి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
డీవీసత్రంలో దొంగల హల్చల్
దొరవారిసత్రం: మండలంలోని దొరవారిసత్రం పరిధిలోని జాతీయ రహదారి వెంబడి ఉన్న వివిధ దుకాణాల వద్ద దొంగలు హల్చల్ చేస్తున్నారు. మంగళవారం రాత్రి ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు తలకు టోపీ, ముఖం కనిపించకుండా రుమాలు, చేతికి గ్లౌజ్లు తొడుక్కున్న ఇద్దరు ఓ దుకాణంలో చోరీకి ప్రయత్నించారు. అక్కడ ఏర్పాటు చేసిన అలర్ట్ సైరన్ మోగడంతో దుండగులు మోటార్బైక్పై పరారయ్యారు. జాతీయ రహదారి వెంబడి ఉన్న పలువురి షాపుల్లో ఇటీవల వరుసగా చోరీలు జరుగుతున్నాయి. దీంతో యజమానులు భయాందోళన చెందుతున్నారు. మూడు రోజుల క్రితం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఒక వ్యక్తి బైక్ను చోరీ చేశారు. గతంలోనూ అనేక బైక్లను ఎత్తుకెళ్లారు. పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
భూముల క్రమబద్ధీకరణకు అవకాశం
● జేసీ కార్తీక్ నెల్లూరు రూరల్: అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారు క్రమబద్ధీకరణ చేసుకోవడానికి ముందుకు రావాలని జేసీ కె.కార్తీక్ ఒక ప్రకటనలో కోరారు. 2019 అక్టోబర్ 10వ తేదీ కంటే ముందు నిరభ్యంతరకర భూముల్లో ఆర్సీసీ స్లాబుతో లేదా రేకులతో ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న వారు రెగ్యులరైజ్ చేసుకోడానికి ఆధారాలతో మీ–సేవ, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. గుడిసెలు, తాటాకు పూరిళ్లకు ఇది వర్తించదన్నారు. 150 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరణ చేస్తామని, రిజిస్ట్రేషన్ ఫీజు సైతం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. 151 నుంచి 300 గజాల్లోపు అయితే బేసిక్ ధరలో 15 శాతం, రిజిస్ట్రేషన్ ఫీజులో 50 శాతం చెల్లించాలన్నారు. లేఅవుట్లు, కాలువలు, నదీ ప్రవాహ గట్లు, మాస్టర్ ప్లాన్, జోనల్ ప్లాన్లో నిర్దేశిత స్థలాలు, జలవనరులకు సంబంధించిన వాటిల్లో క్రమబద్ధీకరణ చేయబోరన్నారు. అర్హత కలిగిన వారి జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారని, అభ్యంతరాలు స్వీకరించి తహసీల్దార్లు తుది జాబితాను సబ్ కలెక్టర్, ఆర్డీఓకు పంపిస్తారన్నారు. సబ్ డివిజనల్ లెవల్ అప్రూవల్ కమిటీ ప్రకటించిన అర్హుల జాబితాపై అభ్యంతరాలుంటే జేసీకి 30 రోజుల్లోగా అప్పీల్ చేసుకోవచ్చన్నారు. అర్హుల జాబితా ఖరారైన తర్వాత ఆ వివరాలను తహసీల్దార్లు ఆ ప్రాంత సబ్ రిజిస్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రార్లకు పంపుతారని తెలియజేశారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
సంగం: పెన్నానదిలో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన మండలంలోని కోలగట్లలో బుధవారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. ఆత్మకూరుకు చెందిన గంగాధర్, ప్రసన్న దంపతుల రెండో కుమారుడు యశ్వంత్ (15) ప్రగతి స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. మహాశివరాత్రి పండగ సందర్భంగా పాఠశాలకు సెలవు ప్రకటించారు. దీంతో ఆత్మకూరు నుంచి యశ్వంత్, మరో ఏడుగురు విద్యార్థులు సరదాగా ఈత కొట్టేందుకు కోలగట్లకు వచ్చారు. నాగార్పమ్మ గుడి సమీపంలోని పెన్నానదిలోకి యశ్వంత్, ఐదుగురు ఈతకు వెళ్లగా ఇద్దరు గట్టుపై కూర్చున్నారు. యశ్వంత్, మరొకరు సుమారు 500 మీటర్ల ముందుకు ఈదుతూ వెళ్లారు. ఒక్కసారిగా యశ్వంత్ నీటిలోకి మునిగిపోయాడు. అతడిని కాపాడేందుకు స్నేహితులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఒడ్డుకు చేరుకున్న వారు సెల్ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. విద్యార్థులు ఆందోళన చెందుతుండటంతో గ్రామస్తులు సంగం ఎస్సై రాజేష్కు సమాచారం ఇచ్చి పెన్నానదిలో గాలింపు చేపట్టారు. యశ్వంత్ను బయటకు తీసి ఆత్మకూరు వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో మృతదేహాన్ని ఇంటికి తరలించారు. ఎస్సై తన సిబ్బందితో ఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. యశ్వంత్ మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. -
పూరిల్లు దగ్ధమై.. కట్టుబట్టలతో మిగిలి..
● రూ.1.5 లక్షల నగదు, 5 సవర్ల బంగారం అగ్నికి ఆహుతి ● ఫైరింజిన్ మరమ్మతులకు గురైందన్న సిబ్బంది ● అదే ఇంట్లో రెండు నెలల క్రితం చోరీకావలి: పట్టణంలోని రైల్వేస్టేషన్ సమీపంలో బుధవారం పూరిల్లు దగ్ధమైంది. పట్టణానికి చెందిన గుంజి వెంకటేశ్వర్లు ఆటో డ్రైవర్గా పని చేస్తుంటాడు. అతని భార్య కోటేశ్వరి ఇళ్లల్లో పని మనిషిగా చేస్తోంది. బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో మంటలు ఎగసిపడ్డాయి. ఆటో కొనుగోలు చేయడానికి అప్పుగా తెచ్చుకున్న రూ.1.5 లక్షల నగదు, 5 సవర్ల బంగారం పూర్తిగా కాలిపోయాయి. ఇతర విలువైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. పూరిల్లు కాలిపోతోందని స్థానికులు అగ్నిమాపక శాఖ కార్యాలయానికి సమాచారమిచ్చారు. సిబ్బంది వచ్చి ఫైరింజిన్ మరమ్మతులకు గురైందని చెప్పడంతో బాధితులు, స్థానికులు నివ్వెరపోయారు. కాగా రెండు నెలల క్రితం ఈ ఇంట్లో చోరీ జరిగింది. రూ.60,000 నగదు, 3 సవర్ల బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి న్యాయం కోసం తిరుగుతున్నారు. తాజాగా ఇల్లు పూర్తిగా కాలిపోవడంతో కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. -
గుప్తనిధుల కోసం యథేచ్ఛగా తవ్వకాలు
జిల్లాలో చారిత్రాత్మకమైన కట్టడాలు, విలువైన సంపద, ఔషధ మొక్కలకు నిలయమైన ఉదయగిరి దుర్గం విధ్వంసం అయిపోతోంది. ప్రకృతి ప్రేమికులను అలరించే దుర్గం వైభవం, రూపురేఖలు కోల్పోతోంది. దుర్గంపై ఉన్న కోటకు ఐదు శతాబ్దాల చరిత్ర ఉంది. పల్లవులు, చోళులు, విజయనగర రాజులు, మహ్మదీయ వంశీయులు, ఆంగ్లేయుల పాలనా కేంద్రంగా గతంలో ఇది విరాజిల్లింది. ఈ నేపథ్యంలో కోటపై నిర్మించిన అనేక కట్టడాల కింద బంగారు ఆభరణాలు ఉంటాయని ప్రజలు విశ్వసిస్తుంటారు. ఈ క్రమంలో కొన్నేళ్లుగా విలువైన పురాతన కట్టడాలను గుప్తునిధుల కోసం గుల్లచేశారు. గుప్తనిధుల ముఠాపై నిఘా పెట్టాలిఉదయగిరి కొండపై ఉన్న దుర్గంలో అనేక ప్రాచీన కట్టడాలున్నాయి. ఈ కట్టడాల్లో విలువైన సంపద కోసం కొంతమంది అక్రమార్కులు వేట సాగిస్తున్నారు. ప్రాచీన కట్టడాలు ధ్వంసం అవుతున్నాయి. ఇలా అయితే రాజుల కాలం నాటి పురాతన కట్టడాల సంపద భవిష్యత్ తరాలు చూసే అవకాశం లేదు. ఈ వారసత్వ సంపదను కాపాడుకోవాలి. గుప్త నిధులు తవ్వే ముఠాలపై అధికారులు ప్రత్యేక నిఽఘా పెట్టాలి. – జి.ఓబులరెడ్డి, విశ్రాంత ఎంఈఓ ఉదయగిరి దుర్గం ●ఉదయగిరి: ఉదయగిరి దుర్గంపై అనేక చారిత్రాత్మక కట్టడాలున్నాయి. అలనాటి రాచరిక పాలన అంతరించిన తర్వాత మహ్మదీయులు పాలించిన కాలంలో అనేక కట్టడాలు ధ్వంసమయ్యాయి. సంప్రదాయ కట్టడాలు నేలమట్టం చేసి మసీదులు, బురుజులుగా మార్చారు. ఈ క్రమంలో అప్పటి కట్టడాల్లో విలువైన బంగారం, వజ్రాలు స్వాహా చేశారు. అనంతరం బ్రిటిష్ పాలన రావడంతో వారు కూడా సంపద కోసం అన్వేషణ చేసి దోచుకున్నారనే ప్రచారం ఉంది. స్వతంత్ర భారతంలో కూడా గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగాయి.. జరుగుతూనే ఉన్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత గుప్తనిధుల కోసం తవ్వకాలు మరీ ఎక్కువగా సాగుతున్నాయి. సెన్సార్ పరికరాలతో ప్రాచీన కట్టడాల అడుగు భాగంలో ఉన్న విలువైన సంపద గుర్తించి రాత్రి వేళల్లో తవ్వకాలు సాగిస్తున్నారు. మళ్లీ తవ్వకాలు ఇటీవల దుర్గంపై రాత్రి వేళల్లో లైటింగ్ కాంతుల్లో గుప్తనిధులు కోసం తవ్వకాలు జరిగాయి. మూడు రోజుల పాటు ఈ ప్రక్రియ సాగింది. రాత్రి వేళ దుర్గంపై కాంతులు కనిపించడంతో స్థానికులు గుప్తనిధుల ముఠా పనిగా అనుమానాలు వ్యక్తం చేశారు. మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. పోలీసు, అటవీ అధికారులు ప్రత్యేక దళంగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో గుప్తనిధుల కోసం సాగుతున్న తవ్వకాలను ఆపు చేసినట్లు సమాచారం. అయితే అక్కడ ప్రస్తుతం తవ్వకాలు జరిగినట్లు ఎక్కడా ఆధారాలు లేవంటూ ఈ బృందం బుకాయించింది. పోలీసులు, అటవీ శాఖ బృందం ఎందుకు ఈ విషయాన్ని దాచిపెట్టిందో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. గతంలో కూడా ప్రకాశం జిల్లాకు చెందిన ఓ ముఠా అక్కడే మకాం పెట్టి పేలుడు సామగ్రితో తవ్వకాలు జరిపారు. ఆ ముఠాలో ఓ వ్యక్తి మృతి చెందాడు. అప్పుట్లో ఇది సంచలనంగా మారింది. పేలుడు ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేక నరబలి ఇచ్చారా? అనే అనుమానాలు తలెత్తాయి. అయితే పోలీసు దర్యాప్తులో ప్రమాదంగా చెప్పినప్పటికీ, స్థానికులు మాత్రం ఇది నరబలిగానే ఇప్పటికీ అనుమానిస్తున్నారు. అటవీ, పోలీస్ సిబ్బంది పాత్రపై అనుమానాలు చారిత్రాత్మక చిహ్నాలు పెకళించేస్తూ.. మొక్కుబడిగా అటవీ శాఖ సిబ్బంది, పోలీసుల గాలింపు తవ్వకాల వెనుక వీరి పాత్రపై అనుమానాలు గతంలో విలువైన పురాతన సంపద దోపిడీ ప్రత్యేక దర్యాప్తు అధికారులతో నిజాలు వెలుగు చూసే అవకాశంఉదయగిరి దుర్గం అటవీ శాఖ పరిధిలో ఉంటుంది. ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకున్న దాఖలాల్లేవు. ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అటవీ శాఖ అఽధికారులు ఘటనలు జరిగినప్పుడు నాలుగు రోజులు హడావుడి చేయడం, ఆ తర్వాత షరా మాములే. ఈ తవ్వకాల ముఠాకు మర్రిపాడు మండలానికి చెందిన ఓ వ్యక్తితో సంబంధాలున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆ వ్యక్తి అటవీ, పోలీసు శాఖలో ఉన్న దిగువ స్థాయి సిబ్బందితో సంబంధాలు పెట్టుకుని ఈ తవ్వకాలు జరుపుతున్నట్లు సమాచారం. అటవీ, పోలీసు శాఖల్లో ఇప్పటికీ కీలకమైన సిబ్బంది గుప్తనిధుల ముఠాతో సంబంధాలు సాగిస్తున్నారు. ఈ విషయం పైస్థాయి అధికారులకు తెలిసినా పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. దీంతో అక్రమార్కులు సులువుగా తప్పించుకుంటున్నారు. ఇంటి దొంగల గుట్టు రట్టు చేయాలంటే ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ చేపడితే అనేక వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉందని తెలుస్తోంది. -
క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నాం
● వీఎస్యూ వీసీ అల్లం శ్రీనివాసరావు వెంకటాచలం: క్రీడాకారులను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నామని విక్రమ సింహపురి యూనివర్సిటీ వీసీ అల్లం శ్రీనివాసరావు తెలిపారు. ఈనెల 28వ తేదీన సేలంలో జరుగనున్న సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ హ్యాండ్బాల్ టోర్నమెంట్లో వీఎస్యూ పురుషుల జట్టు పాల్గొననుంది. జట్టు సభ్యులకు వీఎస్యూ వీసీ మంగళవారం క్రీడా దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో రాణించేందుకు క్రమశిక్షణ, కృషి చాలా ముఖ్యమన్నారు. విద్యార్థులు రాణించి వర్సిటీ ప్రతిష్టను మరింత పెంచాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత, స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ ఎ.రామయ్య తదితరులు పాల్గొన్నారు. -
అక్రమంగా మట్టి తరలిస్తుండగా..
● రెండు ట్రాక్టర్ల స్వాధీనం విడవలూరు: అనుమతి లేకుండా మండలంలోని ముదివర్తి గ్రామం నుంచి మట్టి తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్తుల కథనం మేరకు.. కొంతకాలంగా పగలు, రాత్రి తేడా లేకుండా మట్టిని చుట్టుపక్కల గ్రామాలతోపాటు, ఇటుకబట్టీలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని రెండు ట్రాక్టర్లను పోలీస్స్టేషన్కు తరలించారు. అయితే ఇంతవరకు ఎలాంటి కేసు నమోదు కాలేదు. -
ఉత్సాహంగా ఎడ్ల బండ లాగుడు పోటీలు
కొడవలూరు: మండలంలోని గండవరం ఉదయకళేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్థానిక జెడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో మంగళవారం రాష్ట్ర స్థాయి ఎడ్ల బండ లాగుడు పోటీలు జరిగాయి. ప్రొద్దుటూరుకు చెందిన డి.గురవారెడ్డి, అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన కె.రమేష్ యాదవ్ల ఎడ్ల జత సంయుక్తంగా విజేతగా నిలిచాయి. వాటికి రూ.లక్ష బహుమతి అందజేశారు. మైదుకూరుకు చెందిన కుర్ర వెంకటేష్ యాదవ్ ఎడ్ల జత రెండో స్థానంలో నిలిచి రూ.75 వేలు అందుకున్నాయి. పల్నాడు జిల్లాకు చెందిన సాయిగణేష్శర్మ, కటకం లక్ష్మణ్కు చెందిన ఎడ్ల జత మూడో బహుమతి రూ.50 వేలు గెలుచుకున్నాయి. ప్రొద్దుటూరుకు చెందిన ఎం.సుబ్బారెడ్డికి చెందిన ఎడ్ల జత నాలుగో స్థానంలో నిలిచి రూ.30 వేలు అందుకున్నాయి. బాపట్లకు చెందిన వీరాస్వామి ఎడ్ల జత ఐదో బహుమతి రూ.20 వేలు కై వసం చేసుకుంది. పోటీల్లో మరో నాలుగు ఎడ్ల జతలు పాల్గొనగా వారికి రూ.10 వేల వంతున ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. విజేతలకు నిర్వాహకులు, పౌరసరఫరాల శాఖ రాష్ట్ర డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి బహుమతుల ప్రదానం చేసి మాట్లాడారు. ఇక్కడ తొలిసారిగా పోటీలు జరగ్గా తిలకించేందుకు జనం భారీగా తరలివచ్చారు. ఎండ తీవ్రతను లెక్క చేయలేదు. పోటీలను ఆలయ బ్రహ్మోత్సవ కమిటీ చైర్మన్ ఆలం మాలకొండయ్య పర్యవేక్షించారు. పోటీలకు వినియోగించిన 2,100 కిలోల బండను చుండి వెంకటరెడ్డి జ్ఞాపకార్ధం కుమారుడు అమర్నాఽథ్రెడ్డి ఇచ్చారు. కొడవలూరు సీఐ ఎ.సురేంద్రబాబు, ఎస్సై సీహెచ్ కోటిరెడ్డిలు తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో విజయభాస్కర్రెడ్డి, పెనాక వెంకటేశ్వర్లురెడ్డి, ఈశ్వర్రెడ్డి, బచ్చు సురేష్ రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి విజేతగా ప్రొద్దుటూరు తిలకించేందుకు భారీగా వచ్చిన జనం -
ఐదువేల సీసీ కెమెరాల ఏర్పాటే లక్ష్యం
● ఎస్పీ కృష్ణకాంత్ వెల్లడి ముత్తుకూరు: జిల్లాలో మార్చి 31వ తేదీకల్లా ఐదువేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఎస్పీ జి.కృష్ణకాంత్ వెల్లడించారు. ముత్తుకూరు పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు సంబంధించిన కంట్రోల్ రూమ్ను మంగళవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముత్తుకూరు పోలీస్స్టేషన్ పరిధిలో 32 లొకేషన్లలో 55 కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. నేరాలు జరిగినప్పుడు దర్యాప్తును త్వరగా ముగించేందుకు, నేరాలకు పాల్పడిన వారిని గుర్తించేందుకు సీసీ కెమెరాలు దోహదపడతాయన్నారు. ట్రాఫిక్ జామ్ అయిన ప్రాంతాలను వెంటనే గుర్తించవచ్చన్నారు. జిల్లాలో ఇప్పటికే 2,500 కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అపార్ట్మెంట్లు, జనావాసాలు, వాణిజ్య సముదాయాలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో నేరాలు అదుపు చేసేందుకు కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నా రు. ప్రజలు సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సీహెచ్ సౌజన్య, రూరల్ డీఎస్పీ జి.శ్రీనివాసరావు, కృష్ణపట్నం సీఐ రవినాయక్, ముత్తుకూరు ఎస్సై విశ్వనాథరెడ్డి, కృష్ణపట్నం ఎస్సై శ్రీనివాసరెడ్డి తదిత రులు పాల్గొన్నారు. -
వేధిస్తున్నారంటూ వివాహిత ఫిర్యాదు
నెల్లూరు(క్రైమ్): భార్యను వేధింపులకు గురిచేయడమే కాకుండా దాడి చేసిన భర్త, అతడికి సహకరిస్తున్న కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. బీవీ నగర్కు చెందిన అరుణకు 2017లో ప్రసాద్ అనే వ్యక్తితో వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రసాద్ మహిళలతో సన్నిహితంగా ఉంటూ భార్యను వేధింపులకు గురిచేయసాగాడు. ఈ విషయమై పలుమార్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదులు చేయడంతో వారు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇటీవల ప్రసాద్ ఓ మహిళతో ఫోన్లో మాట్లాడుతుండగా భార్య నిలదీసింది. దీంతో కోపోద్రిక్తుడైన అతను అరుణపై దాడి చేశాడు. ఈ విషయమై నిలదీసిన అరుణ కుటుంబ సభ్యులు, బంధువులపై సైతం ప్రసాద్ దౌర్జన్యం చేశాడు. తనను వేధింపులకు గురిచేయడమే కాకుండా దాడి చేసిన భర్త, అతడికి సహకరిస్తున్న అత్తింటివారిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు మంగళవారం వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు దర్యాప్తు చేస్తున్నారు.మద్యం మత్తులో బీభత్సంఉదయగిరి: మండలంలోని దాసరపల్లి పీర్లచావిడి సమీపంలో సోమవారం రాత్రి కొందరు యువకులు మద్యం మత్తులో ఉన్న కారులో వెళ్తూ బీభత్సం సృష్టించారు. వేగంగా కారును నడిపుతూ సిమెంట్ బెంచీలు, మోటార్బైక్ను ఢీకొట్టగా అవి ధ్వంసమయ్యాయి. హైదరాబాద్కు చెందిన ఈ ముగ్గురు యువకులు వడ్లమూడిపల్లి గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుందని చెబుతున్నారు. కాగా ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు. నిమ్మ ధరలు (కిలో)పెద్దవి : రూ.47 సన్నవి : రూ.35 పండ్లు : రూ.22 -
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు
● జాయింట్ కలెక్టర్ కార్తీక్ పొదలకూరు: జిల్లాలోని రైతు సేవా కేంద్రాల్లో 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నామని జేసీ కార్తీక్ పేర్కొన్నారు. పొదలకూరు సచివాలయం బిట్ – 3 వద్దనున్న రైతు సేవా కేంద్రంలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జేసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. రైతులు నిబంధనల ప్రకారం ఆరబెట్టి కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకురావాల్సిందిగా సూచించారు. పొదలకూరు సొసైటీలో ఏడు వేల గోతాలను అందుబాటులో ఉంచడం జరిగిందని, ఉచితంగా రైతులకు అందజేస్తారన్నారు. కేంద్రాల్లో పరికరాలు, సిబ్బందిని అందుబాటులో ఉంచామని చెప్పారు. జేసీ వెంట డీసీఓ గుర్రప్ప, ఏడీఏ శివనాయక్, ఏఓ వాసు, తహసీల్దార్ సురేఖ, వ్యవసాయ శాఖ సిబ్బంది ఉన్నారు. -
అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం
నెల్లూరు (లీగల్): నెల్లూరు ఫ్యామిలీ కోర్టు కమ్ 6వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఏపీపీగా సీనియర్ న్యాయవాది మద్దిబోయిన సుందరయ్య, బాలలపై లైంగికక దాడుల విచారణ ప్రత్యేక కోర్టు (పోక్సో) ఏపీపీగా దూబిశెట్టి చంద్రశేఖర్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడేళ్ల పాటు ఏపీపీలుగా కొనసాగుతారు. రైతులకు యూనీక్ కోడ్ అవసరం నెల్లూరు(సెంట్రల్): రైతులకు యూనీక్ కోడ్ అవసరమని, అందుకు సంబంధించి ఈ నెల 28వ తేదీ వరకు గడువు ఉందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సత్యవాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 1.71 లక్షల మంది పీఎం కిసాన్ రైతులు ఉన్నారని, ఇప్పటి వరకు లక్ష మందికిపైగా రైతులకు యూనిక్ కోడ్ కేటాయించామన్నారు. మిగిలిన దాదాపు 71 వేల మంది రైతులు యూనీక్ కోడ్ నంబర్ పొందాల్సి ఉందన్నారు. గ్రామాల్లోకి వ్యవసాయ శాఖ అధికారులు వచ్చినప్పుడు, లేక రైతు సేవా కేంద్రాల్లో యూనీక్ కోడ్ నంబర్ తీసుకోవాలని కోరారు. ఈ కోడ్ ఉంటేనే ప్రభుత్వం నుంచి వచ్చే వ్యవసాయ పథకాలు అందుతాయని తెలిపారు. 28 లోపు దరఖాస్తు చేసుకోవాలి నెల్లూరు (టౌన్): జిల్లాలో 2025–26కు సంబంధించి అన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు అఫిలియేషన్ రెన్యువల్, అదనపు సెక్షన్లు, కోర్సులు, ద్వితీయ భాష, మీడియం, పేరు, మేనేజ్మెంట్ మార్పు, మూసివేత, లేదా పునః ప్రారంభం, ఫిక్స్డ్ డిపాజిట్ రసీదు విడుదలకు ఈ నెల 28వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఆర్ఐఓ ఆదూరు శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటలో తెలిపారు. ఎఫ్డీఆర్ విడుదల, సొసైటీ, మేనేజ్మెంట్ మార్పు ఏడాదిలో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అవసరమైన ధ్రువపత్రాలు, నిర్ణీత ఫీజు, సంబంధిత ధరఖాస్తును ఆన్లైన్లో సమర్పించాలన్నారు. దరఖా స్తు చేసిన కళాశాలలను తనిఖీ కమిటీలు సందర్శించి అందజేసిన నివేదిక ఆధారంగా బోర్డు అదనపు సెక్షన్లను అమలు చేస్తుందన్నారు. ఇతర వివరాల కోసం జిల్లా ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు. వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు బిట్రగుంట: బోగోలు మండలం తాళ్లూరు, కొత్తూరు, వెస్ట్రన్ కాలనీ, రామస్వామిపాళెం తదితర ప్రాంతాలకు సమీపంలోని అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల వేట సాగుతోందనే సమాచారంతో అటవీశాఖ అధికారులు మంగళవారం వేకువన విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. కొత్తూరు, రామస్వామిపాళెం, తాళ్లూరుకు సమీపంలోని అటవీ ప్రాంతాల్లో జింకలు, అడవి పందుల సంచారం ఎక్కువగా ఉండడంతో కొంత మంది ఉచ్చులు ఏర్పాటు చేసి రాత్రి వేళల్లో వేట సాగిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల గౌరవరం కేంద్రంగా జింక మాంసం కూడా విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో అటవీశాఖ అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. కొత్తూరుకు సమీపంలోని పొలాల్లో కొంత మంది రైతులు అడవి పందులు పంటలు పాడు చేయకుండా ఉండేందుకు విద్యుత్ తీగలు అమర్చి ఉండడాన్ని గుర్తించి సంబంధిత రైతులను అధికారులు మందలించారు. విద్యుత్ తీగల కారణంగా వన్యప్రాణులతో పా టు మనుషుల ప్రాణాలకు కూడా ప్రమాదం వా టిల్లే అవకాశం ఉందని, మరోసారి ఇలాంటి చర్య లు పునరావృతమైతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అటవీశాఖ అధి కారి సుమన్,సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. రేపటి నుంచి న్యాయవాదుల కోర్టు విధుల బహిష్కరణ నెల్లూరు (లీగల్): న్యాయవాదుల చట్టం – 1961కు సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అడ్వొకేట్ యాక్ట్ – 2025కు వ్యతిరేకంగా గురు, శుక్రవారాల్లో కోర్టు విధులను న్యాయవాదులు బహిష్కరించనున్నారని నెల్లూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉమామహేశ్వర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుందరయ్యయాదవ్, జాయింట్ సెక్రటరీ వరప్రసాద్ మంగళవారం తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయవాదుల సమావేశ మందిరంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు సహకరించాలని కోరారు. -
ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించండి
● భయపడినట్లుగానే ధాన్యం ధరలు పతనం చంద్రబాబు పాలన అంటేనే.. అన్నదాతలకు హడల్. రైతులు ముందే భయపడినట్లే ధాన్యం ధరలు దారుణంగా పతనం అయ్యాయి. గత సీజన్ వరకు ధాన్యాన్ని నిలబెట్టి డిమాండ్గా అమ్ముకున్నారు. ఈ సీజన్ నాటికి టీడీపీ ప్రభుత్వంలో అధికారంలో ఉండడంతో రైతుల పాలిట శాపంగా మారింది. గతేడాదికి ఈ ఏడాదికి సగానికి సగం ధర దిగజారిపోవడం చూస్తే రైతులపై టీడీపీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. గత ప్రభుత్వం ధాన్యానికి గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఇతర జిల్లాల మిల్లర్లను రప్పించి డిమాండ్ పెంచింది. కానీ కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకపోగా మిల్లర్ల దోపిడీకి మద్దతుగా నిలుస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధరలు కల్పించలేమన్నట్లుగా ఇటీవల మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లా పర్యటనతో స్పష్టమైంది. ● చేతులెత్తేసిన మంత్రి నాదెండ్ల ● ఏ గ్రేడ్ రకం క్వింటా రూ.2,320, సాధారణ రకం రూ.2,300 ● మద్దతు ధర కల్పన.. ప్రకటనలకే పరిమితం ● గత సీజన్లో బీపీటీ పుట్టి రూ.28 వేలకు పైగా విక్రయం ● ప్రస్తుతం రూ.15 వేల నుంచి రూ.16 వేలు మాత్రమే ● ఇతర జిల్లాల మిల్లర్లను రప్పించి డిమాండ్ పెంచిన గత ప్రభుత్వం ● ఊరూరా అన్నదాతల ఆక్రందనలు నెల్లూరు (పొగతోట): జిల్లాలో ధాన్యం దిగుబడులు, ధరలు అన్నదాతలను హతాశులను చేస్తోంది. కరువు కాటకాలు, విపత్తులు, అకాల వర్షాలను అధిగమించి సాగు చేస్తే.. ప్రకృతి శాపమో, పాలకుడి పాదమో తెలియదు కానీ దిగుబడులు తగ్గాయి. ధరలు పతనమయ్యాయి. ఎటు చూసినా అన్నదాతల ఆక్రందనలు మిన్నంటుతున్నాయి. ప్రకృతి సహకరించక ధాన్యం దిగుబడులు తగ్గి రైతులు ఆందోళనకు గురవుతుంటే మరో పక్క రైస్ మిల్లర్లు, దళారులు కుమ్మకై ్క ధరలు తగ్గించి రైతుల నడ్డి విరుస్తున్నారు. అధికారులు చెబుతున్న పరిస్థితులకు, వాస్తవానికి పొంతన లేకుండా ఉంది. గతేడాది రూ.28 వేలు.. ఇప్పుడు రూ.16 వేలు ప్రస్తుత టీడీపీ పాలనలో రైతులకు ‘మద్దతు’ దక్కడం లేదు. మిల్లర్ల దోపిడీకే ‘మద్దతు’ లభిస్తోంది. ధాన్యానికి అధికారికంగా ఏ గ్రేడ్ రకం క్వింటా రూ.2,320 (పుట్టి రూ.19604) సాధారణ రకం రూ.2,300 (పుట్టి రూ.19,435) మద్దతు ధర ప్రకటించినా.. ప్రస్తుతం బీపీటీలను పుట్టి రూ.15 వేల నుంచి రూ.16 వేలకే రైస్మిల్లర్లు, దళారులు కుమ్మక్కై కొనుగోలు చేస్తున్నారు. గతేడాది ఇదే సీజన్లో పుట్టి ధాన్యం ఊహించని విధంగా పుట్టి ధాన్యం బీపీటీ రకం రూ.27 వేల నుంచి రూ.28 వేలకు ధరలు పలికాయి. దీన్ని బట్టి ప్రభుత్వం ప్రకటించిన ‘మద్దతు’ రైతులకా? మిల్లర్లకా? అనేది స్పష్టమవుతోంది. ప్రకృతి శాపం.. ప్రభుత్వ నిర్లక్ష్యం ఈ ఏడాది ప్రకృతి శాపం.. ప్రభుత్వం నిర్లక్ష్యం వెరసి అన్నదాతలకు ప్రాణసంకటకంగా మారింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ధాన్యం ధరలు పూర్తిగా పతనమయ్యాయి. ఈ రబీ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 3,57,500 హెక్టార్లలో వరి సాగు చేపట్టారు. అయితే మంచు అధికంగా కురవడం, చలి ఎక్కువ కాలం ఉండడం వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులతో వరి దిగుబడులు తగ్గాయి. దీంతోపాటు ధాన్యం ధరలు కూడా తగ్గడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం వరి కోతలు ఊపందుకున్నాయి. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం పుట్టికి రూ.12 వేల వరకు నష్టపోతున్నారు. జిల్లా అధికారుల నుంచి ప్రభుత్వ పెద్దలకు పంటకు మద్దతు ధర కల్పిస్తామంటూ చెబుతున్నారే కానీ క్షేత్రస్థాయిలో కనీస ధరలు అమలు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జిల్లాకు వచ్చిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మద్దతు ధర కల్పిస్తామంటూనే.. ఈ సారికి మా ప్రభుత్వంపై కనికరం చూపాలంటూ రైతు సంఘాల నేతలను బతిమిలాడుకోవడం చూస్తే పరిస్థితి అర్థమవుతోంది. రైతులను పట్టించుకోవడం లేదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల అభివృద్ధిని పట్టించుకోవడం లేదు. ఈ ఏడాది అధిక వర్షాలు, విపరీతమైన మంచు కారణంగా పంట పూర్తిగా దెబ్బతింది. నాటిన నెల రోజుల లోపే వెన్ను తీసింది. ఎకరాకు 40 నుంచి 50 బస్తాల దిగుబడి రావాల్సి ఉండగా, 20 నుంచి 25 బస్తాలకు పడిపోయింది. ఈ ఏడాది రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. – రావి మాల్యాద్రి, సీపీఎం నాయకుడు, జలదంకి ధాన్యం ధరలు ఆశాజనకంగా లేవు ఈ ఏడాది వరి సాగు నుంచి ధాన్యం విక్రయం వరకు ఇబ్బందులే. ధాన్యం ధరలు కూడా ఆశాజనకంగా లేవు. గతేడాది పుట్టి వరి కోతల సమయంలో రూ.24 వేలు ఉంటే.. ఈ ఏడాది రూ.18,000 కూడా కొనుగోలు చేయడం లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిబంధనల పేరుతో బస్తాకు 3 నుంచి 5 కేజీల తరుగు తీస్తున్నారు. ఈ ఏడాది దిగుబడులు కూడా తగ్గాయి. – వాకా శ్రీనివాసులురెడ్డి, రైతు ● కలెక్టర్ ఆనంద్కు రైతుల విజ్ఞప్తి పొదలకూరు: వరి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించమని మండలానికి చెందిన పలువురు రైతులు కలెక్టర్ ఓ ఆనంద్కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం కలెక్టర్ మండలంలోని మహ్మదాపురం గ్రామానికి రావడంతో అక్కడి రైతులు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారు మాట్లాడుతూ రబీలో పండించిన ధాన్యం దిగుబడి దారుణంగా ఉందని, దీనికితోడు ధరలు గిట్టుబాటు కావడం లేదన్నారు. కళ్లాల్లో మిల్లర్లు కేఎన్ఎం 1638 రకం ధాన్యాన్ని రూ.17,500 కొనుగోలు చేస్తున్నట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దిగుబడి ఎకరాకు 2 నుంచి 2.50 పుట్లు ధాన్యం మాత్రమే దిగుబడి అవుతోందని రైతుకు మిగిలేదేమి ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యంలో 22 నుంచి 23 తేమ శాతం వస్తుందని, అధికంగా ఉంటే మిల్లర్లకు తరుగు ఇచ్చేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. గతేడాది ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారని, ప్రస్తుతం ఇంకా కేంద్రం తెరవలేదన్నారు. వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయించాల్సిందిగా కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఆరబెట్టుకుని కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్ముకుంటే సమస్య ఉండదన్నారు. నిబంధనల ప్రకారం 17 శాతం తేమ ఉండేలా రైతులు చూసుకోవాలన్నారు. గతంలో మద్దతు ధరలు అమలు వైఎస్సార్సీపీ పాలనలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర దక్కేలా చర్యలు చేపట్టింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే అధికంగా వస్తే రైతులు బయటకు అమ్ముకునే విధంగా అవకాశం కల్పించింది. ప్రతి రైస్మిల్లర్ ఆర్బీకేల ద్వారానే ధాన్యం కొనుగోలు చేయాలనే నిబంధనలు పెట్టింది. అప్పటి జిల్లా అధికార యంత్రాంగం రైస్ మిల్లర్లను దగ్గరకు రానివ్వకుండా ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, వైఎస్సార్, కర్నూలు తదితర జిల్లాల రైస్ మిల్లర్లను ఆహ్వానించారు. దీంతో ధాన్యానికి డిమాండ్ పెంచి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఎంత మద్దతు ధర ప్రకటించిందో అంతే ధరకు రైతులు ధాన్యాన్ని అమ్ముకున్నారు. మార్కెట్లో బీపీటీ, నెల్లూరు మసూర, ఇతర రకాలకు డిమాండ్ అధికంగా ఉంది. వైఎస్సార్సీపీ పాలనలో పుట్టి రూ.27 వేల నుంచి రూ.28 వేల వరకు కొనుగోలు చేశారు. మద్దతు ధర కల్పించేలా చర్యలు రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. ధాన్యం కోతలు ప్రారంభమయ్యాయి. ధరలు తగ్గించిన ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేస్తాం. రైతులు బహిరంగ మార్కెట్లో ధరలు అధికంగా ఉంటే అక్కడ విక్రయించుకోవచ్చు. – అంకయ్య, డీఎస్ఓ -
టీడీపీది దుర్మార్గ సంస్కృతి
కావలి: అధికారం చేతిలో ఉందని కావలి నియోజకవర్గంలో టీడీపీ నేతలు దుర్మార్గ సంస్కృతికి తెర తీశారని, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడం, అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం అనే కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టి అమలు చేస్తున్నారని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ దా ష్టీకానికి కావలి సబ్ జైల్లో ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను మంగళవారం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బోగోలు మండలం ఏనుగులబావి పంచాయతీ కోళ్లదిన్నెకు చెందిన వైఎస్సార్సీపీ మద్దతుదారుడు శ్రీనివాసులురెడ్డిపై టీడీపీ గూండాలు కాపు కాచి దాడి చేయడంతోపాటు చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరిన తర్వాత మరోసారి అతనిపై, తోడుగా వచ్చిన అట్ల రాజా, వెంకటేశ్వర్లు, పులి శ్రీహరిపై కత్తులతో దాడి చేసిన విషయం రాష్ట్రమంతా చూసిందన్నారు. అయినా కూడా పోలీసులు బాధితులపైనే తప్పుడు కేసులు పెట్టి 20 రోజులుగా సబ్జైల్లో ఉంచడం దారుణమన్నారు. అధికారులు అధికార పార్టీ నాయకుల మాటలు విని తప్పుడు కేసులు పెడితే ఆ ఫలితం తప్పకుండా అనుభవించాల్సి ఉంటుందన్నారు. తమ పార్టీ కార్యకర్తలతోపాటు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్లపై తప్పుడు కేసులు పెట్టి జైలు పాల్జేయడం సరికాదన్నారు. రైతుల కడుపుకొడుతున్నారు.. నియోజకవర్గంలో అభివృద్ధి లేదు.. ఉపాధి లేదు.. మరో వైపు రైతుల కడుపుకొడుతున్నారని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి ఆరోపించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందంచకపోవడంతో దిగుబడులు కూడా భారీగా తగ్గాయి. పంటలకు కనీస మద్దతు ధర లేదని, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు మచ్చుకు కూడా కనిపించడం లేదన్నారు. తీరంలో ఫిషింగ్ హార్బర్, రామాయపట్నం పోర్టు వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతోనే పూర్తయ్యాయన్నారు. వీటి అనుబంధంగా పరిశ్రమలకు సంబంధించి భూములకు అప్పట్లో ఎకరాకు ప్రభుత్వం రూ.30 లక్షల పరిహారం ఇచ్చేందుకు సిద్ధం కాగా, టీడీపీ అధికారంలోకి వస్తే రూ.50 లక్షలు ఇస్తామని మభ్య పెట్టిన టీటీపీ నాయకులు ప్రస్తుతం రూ.11 లక్షలే ఇస్తామని ప్రకటించి బలవంతపు భూసేకరణకు పాల్పడుతుండటం దారుణమన్నారు. ప్రశ్నించిన వాళ్లపైన కేసులతో బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. తమ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్లుగా తప్పుడు కేసులు పెట్టే వాళ్లను, పెట్టించే వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమని స్పష్టం చేశారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ నేతలు కేతిరెడ్డి శివకుమార్రెడ్డి, మద్దిబోయిన వీర రఘుయాదవ్, కల్యాణ్కుమార్, ఉప్పాల మాచర్ల, ప్రభాకర్రెడ్డి, ఏకే సుందర్రాజు, పాపన మల్లారెడ్డి, గ్రంధం ప్రసన్నాంజనేయులు, సమాధి చైతన్య, సన్నిబోయిన ప్రసాద్ యాదవ్, షేక్ నాయబ్ రసూల్ తదితరులు ఉన్నారు. దాడులు చేయడం.. జైలుకు పంపడం వారి నైజం కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డి -
రుస్తుంపై రుబాబు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కూటమి ప్రభుత్వం దాష్టీకానికి పొదలకూరు మండలంలోని తాటిపర్తిలో ఉన్న ‘రుస్తుం’ మైన్స్పై నమోదు చేసిన తప్పుడు కేసు అద్దం పడుతోంది. స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి చేస్తున్న ఇసుక దోపిడీ వ్యవహరం బట్టబయలు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా దూమారం రేగుతోంది. ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి దాదాపు 14 నెలల క్రితం తానిచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయాలంటూ మైనింగ్శాఖపై ఒత్తిడి తెచ్చి కేసు నమోదు చేయించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. రుస్తుంపై తప్పుడు కేసు జిల్లాలో అధికార యంత్రాంగం వాస్తవాలను పక్కన పెట్టి అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఊడిగం చేస్తోంది. ఎమ్మెల్యేలు ప్రేరేపించిన రెడ్బుక్ రాజ్యాంగాన్ని పక్కాగా అమలు చేస్తోంది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల తలొగ్గి.. మైనింగ్ శాఖాధికారులు ఆఖరికి తమ శాఖనే కించపరుస్తున్నారు. ఎమ్మెల్యేలు చెప్పారని.. అధికారులు వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారు. తాజాగా పొదలకూరు మండంలంలోని తాటిపర్తిలో ఉన్న ‘రుస్తుం’ మైన్స్లో అక్రమ మైనింగ్ జరిగిందంటూ గనుల శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాస్తవాలు తెలుసుకోకుండానే అధికార పార్టీ ఒత్తిళ్లతో ఆగమేఘాలపై కేసు నమోదు చేశారు. మైనింగ్శాఖ క్లీన్చిట్ ఇస్తే.. పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామ సర్వే నంబర్లు 697, 699,751/2, 759/1, 759/2, 924, 925ల్లోని ప్రభుత్వ భూముల్లో 32.71 ఎకరాల విస్తీర్ణంలో రుస్తుం మైనింగ్కు 2016 ఏప్రిల్ వరకు అనుమతి ఉంది. లీజు గడువు పూర్తికావడంతో యజమాని సైతం దాన్ని వదిలేశారు. అక్కడ మైనింగ్ వ్యవహారాలు కూడా జరగడంలేదు. అయితే 2023 డిసెంబర్లో అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతోందని సోమిరెడ్డి మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు మైనింగ్ అధికారులు జాయింట్ తనిఖీ నిర్వహించారు. ఆ మైన్స్లో అక్రమ మైనింగే జరగలేదని, ఆ ప్రాంతంలో ఫెల్డ్ స్పార్, క్వార్ట్జ్ మిశ్రమం కలిసిన పాత నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ఎక్కడ యంత్రాలు పెట్టి తవ్వకాలు చేసిన ఆనవాళ్లు సైతం కనిపించలేదు. రెండు శాశ్వత భవనాలు సైతం పాడుబడినవి ఉన్నట్లు గుర్తించి ఆ మేరకు నివేదిక ఇచ్చారు. ఆపై రెండు నెలల వ్యవధిలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం, ప్రభుత్వం మారింది. అసలు ఆ మైన్స్లో ఎక్కడా అక్రమాలు జరగలేదని నిర్ధారించి నివేదిక ఇచ్చిన ఆ శాఖ అధికారులే ప్రభుత్వం మారిన తొమ్మిది నెలలకు అక్రమ మైనింగ్ జరిగిందంటూ పోలీసు కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. ఈ కేసులో గనుల శాఖ అధికారులు న్యాయస్థానం ముందు దోషులుగా నిలబడక తప్పదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా అధికార పార్టీ రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. అధికారులు తమ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారు. ఏ తప్పు జరగకపోయినా.. తప్పుడు కేసులు పెట్టి వేధించడమే పనిగా వ్యవహరిస్తున్నారు. సోమిరెడ్డి ఇసుక దోపిడీ వ్యవహారంపై దుమారం రేగడంతో ఆ విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం తాజాగా ‘క్లీన్చిట్’ ఉన్న ‘రుస్తుం’ మైన్స్పై ఏడాది తర్వాత తెరపైకి తెచ్చి రు‘బాబు’ చేస్తున్నారు. మైనింగ్ శాఖ జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ అక్కడ అక్రమ మైనింగ్ జరగలేదని చెబితే.. అదే శాఖ ఇప్పుడు అక్రమ మైనింగ్ జరిగిందంటూ తప్పుడు కేసు పెట్టడం చూస్తే అధికార పార్టీ దాష్టీకానికి నిదర్శనంగా నిలుస్తోంది. రెడ్బుక్ కుట్రతోనే గనుల శాఖ డీడీ కేసు నమోదు 2023 డిసెంబర్లో సోమిరెడ్డి ఫిర్యాదుపై మైనింగ్ శాఖ జాయింట్ ఇన్స్పెక్షన్ అక్రమ మైనింగ్ జరగలేదంటూ నివేదిక ఇప్పుడు ఆ శాఖ అధికారులే ప్లేటు ఫిరాయించి తప్పుడు కేసులు సోమిరెడ్డి ఇసుక దోపిడీ బయటకు రావడంతో డైవర్షన్ రాజకీయం రెడ్బుక్ కుట్రతోనే.. ఎమ్మెల్యే సోమిరెడ్డి అవినీతి, అక్రమాలపై నిత్యం ప్రశ్నిస్తున్న మాజీమంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డిని టార్గెట్ చేసి అక్రమ కేసుల్లో ఇరికించేందుకు అధికార యంత్రాంగం సర్వశక్తులు ఒడ్డుతోంది. ఎక్కడా అవినీతి జరిగినట్లు రుజువులు లేకపోవడంతో ‘రుస్తుం’ మైన్స్లో ఆయన్ను ఇరికించేందుకు చేసిన ప్రయత్నాలు ప్రారంభించారు. మైనింగ్ అధికారులు తొమ్మిది నెలల తర్వాత పొదలకూరు స్టేషన్లో రుస్తుం మైన్స్లో అక్రమ మైనింగ్ జరిగిందంటూ అందులో పేర్నాటి శ్యామ్ప్రసాద్రెడ్డి, వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసులరెడ్డితోపాటు మరికొందరు అంటూ మైనింగ్ డీడీ బాలాజీనాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు రెడ్బుక్ కుట్రలో భాగంగానే జరిగిందని, అత్సుత్సాహం చూపే అధికారులు తప్పక శిక్ష అనుభవించక తప్పదని వైఎస్సార్సీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. -
హాజరుకానున్న 1.60 లక్షల మంది విద్యార్థులు
నెల్లూరు (టౌన్): వచ్చేనెల 1వ తేదీ నుంచి జూన్ నెల వరకు వరుసగా పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్తో ప్రారంభమయ్యే పరీక్షలు ఆయా కోర్సులకు నిర్వహించే ప్రవేశ పరీక్షలతో ముగియనున్నాయి. మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పబ్లిక్ పరీక్షలను నిర్వహించనున్నారు. మార్చి 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రెండో విడత జేఈఈ మెయిన్ పరీక్ష జరగనుంది. ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను మే 18న నిర్వహించనున్నారు. ఎంబీబీఎస్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే నీట్ మే 4వ తేదీన నిర్వహించనున్నారు. మే 19 నుంచి 27 వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు రాసిన విద్యార్థులకు ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలను నిర్వహించనున్నారు. అదే విధంగా డిగ్రీ 4వ సెమిస్టర్ పరీక్షలు మార్చి 5 నుంచి 2వ సెమిస్టర్ ఏప్రిల్ 8 నుంచి ప్రారంభం కానున్నాయి. వీటితో పాటు మే 2 నుంచి 5వ తేదీ వరకు ఏపీ ఆర్సెట్ (పీహెచ్డీ), మే 6న ఏపీ ఈసెట్, మే 7న ఏపీ ఐసెట్, మే 25న లాసెట్, జూన్ 5 నుంచి 7 వరకు పీజీ ఈసెట్, జూన్ 8న ఎడ్సెట్, జూన్ 9 నుంచి 13 వరకు పీజీ సెట్, జూన్ 25న పీఈసెట్ పరీక్షలు జరగనున్నాయి. అదే విధంగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. పరీక్షలకు 1.60 లక్షల మంది విద్యార్థులు వరుస పరీక్షలకు జిల్లా నుంచి ఆయా కోర్సులు చదువుతున్న విద్యార్థులు దాదాపు 1.60 లక్షల మంది హాజరవుతారని అంచనా. వీరంతా ఆయా పబ్లిక్ పరీక్షలతో పాటు పోటీ పరీక్షలకు హాజరుకానున్నారు. పదవ తరగతికి సంబంధించి రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు కలిపి మొత్తం 29 వేలు, ఇంటర్కు సంబంధించి ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు కలిపి మొత్తం 54వేల మంది హాజరుకానున్నారు. అదే విధంగా డిగ్రీకి సంబంధించి 40 వేల మంది, ఇంజినీరింగ్కు సంబంధించి 4 సంవత్సరాలు కలిపి 20 వేల మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ పరీక్షలతో పాటు బీఈడీ, లాసెట్, ఎడ్ సెట్, పీజీ సెట్, డీఎస్సీ తదితర పరీక్షలకు కూడా హాజరుకానున్నారు. -
తల్లిదండ్రుల్లో ఆందోళన
ఓ వైపు వరుస పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధమవుతుండగా మరో వైపు వచ్చేనెల 22 నుంచి ఇండియన్ ప్రైమరీ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ దాదాపు 40 రోజుల పాటు నిర్వహిస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. పరీక్షల సమయంలో ఐపీఎల్ ప్రారంభం కానుండటంతో తమ పిల్లలు సెల్ఫోన్లు, టీవీలకు అతుక్కుపోతారేమోనన్న భయం ఉంది. వేలు, లక్షల్లో ఫీజులు చెల్లించి ఏడాది మొత్తం కష్టపడి చదివించిన పిల్లలు ఐపీఎల్ మోజులో పడతారేమోనని తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. పరీక్షలకు సిద్ధం చేస్తున్నాం ప్రభుత్వ కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నాం. పరీక్షలతో పాటు ఏపీ ఈఏపీ సెట్, జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్, నీట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యార్థులకు బోధిస్తున్నాం. ఇప్పటికే సిలబస్ను పూర్తి చేసి రివిజన్ చేస్తున్నాం. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేలా కృషి చేస్తున్నాం. – మధుబాబు, డీవీఈఓ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం పదో తరగతిలో సిలబస్ను పూర్తి చేసి రివిజన్ చేస్తున్నాం. ప్రతిరోజు ఒక సబ్జెక్టు పరీక్ష నిర్వహించి ఫలితాల్లో కొంత వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. వారి సందేహాలను నివృత్తి చేసేందుకు సబ్జెక్టు టీచర్లను పూర్తిస్థాయిలో నియమించాం. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం. – ఆర్.బాలాజీరావు, డీఈఓ -
ఇళ్ల ముందు కంచైపె విచారణకు ఆదేశం
ఆత్మకూరు: ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు వెంకట్రావుపల్లి తూర్పువీధిలో రాజకీయ కక్షలతో వైఎస్సార్సీపీకి చెందిన వారి ఇళ్లకు వెళ్లే దారిలో టీడీపీ వర్గీయులు కంచె వేసిన విషయంపై సాక్షిలో సోమవారం కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై ఆత్మకూరు ఆర్డీఓ బి పావని స్పందించారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి విచారణ చేయాలని డిప్యూటీ తహసీల్దారు స్వరూప్ను, మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. గ్రామాల్లో ప్రజలు ప్రశాంతంగా జీవించాలని, కక్షలు పెంచుకోరాదని ఆమె సూచించారు. ఐటీడీఏ పీఓ బాధ్యతల స్వీకరణ నెల్లూరు (స్టోన్హౌస్పేట): జిల్లా ఐటీడీఏ ప్రాజెక్ట్ పీఓగా బి.మల్లికార్జున్రెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. దర్గామిట్టలోని ఐటీడీఏ కార్యాలయంలో ఆయనను ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరిమళ, ఏపీఓ రమణయ్య, సిబ్బంది పుష్పగుచ్ఛాలను అందజేసి స్వాగతం పలికారు. పెట్రోలు బంకుల్లో తనిఖీలునెల్లూరు (పొగతోట), నెల్లూరు(క్రైమ్): జిల్లాలో విజిలెన్స్, లీగల్ మెట్రాలజీ, పౌరసరఫరాల శాఖాధికారులు సంయుక్తంగా పెట్రోలు బంకుల్లో సోమవారం తనిఖీలు నిర్వహించారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో బుచ్చిరెడ్డిపాళెం, ముత్తుకూరు పెట్రోలు బంకులపై 6ఏ కేసులు నమోదు చేశారు. కందుకూరులోని ఎస్వీఎస్ ఫిల్లింగ్ స్టేషన్లో 5లీటర్లకు 40 ఎంఎల్ తేడా ఉండడంతో కేసు నమోదు చేశారు. బుచ్చిరెడ్డిపాళెంలో 2, ముత్తుకూరులో 1 పెట్రోలు బంకుల్లో రికార్డు నిర్వహణలో తేడాలు ఉన్నాయి. మొత్తం పెట్రోలు, డీజిల్ కలిపి రూ.32,77,664 విలువ చేసే పెట్రోలు, డీజిల్ను అధికారులు సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ అధికారులు నర్సింహారావు, శ్రీహరిరావు, సుభానీ, వేణుగోపాల్రావు, డీఎస్ఓ అంకయ్య, లీగల్ మెట్రాలజీ అధికారులు కరిముల్లా, రియాజ్ అహ్మద్ పాల్గొన్నారు. భూములు ఇవ్వాలంటే కష్టమే ఉలవపాడు: బీపీసీఎల్ కంపెనీకి భూములు ఇవ్వడం తమకు ఇష్టం లేదని గ్రామస్తులు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. రాష్ట్ర చేనేత జనసమాఖ్య మానవ హక్కుల వేదిక సంస్థలు సోమవారం మండల పరిధిలోని రామాయపట్నం, చాకిచర్ల, పెదపట్టపుపాళెం గ్రామాల్లో ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టాయి. బీపీసీఎల్ కోసం 6000 ఎకరాలు తీసుకుంటున్నారన్న కథనాలు రావడంతో అభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు సంస్థ సభ్యులు తెలిపారు. ప్రజల నుంచి భూసేకరణకు వ్యతిరేకత ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర చేనేత జనసమాఖ్య నాయకులు మాచర్ల మోహనరావు, రాజేష్, కృష్ణ, మానవ హక్కుల నాయకుడు రోహిత్ పాల్గొన్నారు. -
మురుగు, దోమలతో అల్లాడుతున్నాం
అరుంధతీయుల భూములు ఆక్రమించారు ● కలెక్టర్కు ఫిర్యాదు చేసిన ఆనం విజయకుమార్రెడ్డి నెల్లూరు(అర్బన్): రూరల్ మండల పరిధిలోని ఆమంచర్ల గ్రామంలో అరుంధతీయుల ఇళ్ల స్థలాలను ఆక్రమించడం తగదని నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్రెడ్డి పేర్కొన్నారు. స్థలాలు ఆక్రమించిన అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులతో కలిసి సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఆనంద్కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా విజయకుమార్రెడ్డి మాట్లాడుతూ గతంలో రెవెన్యూ అధికారులు అర్హులైన 23 మందికి ఒక్కొక్కరికి 9 అంకణాల చొప్పున నివేశన స్థలాలు పట్టాలుగా ఇచ్చారన్నారు. కూటమి ప్రభుత్వానికి చెందిన స్థానిక నేతలు వేణుగోపాల్నాయుడు, వాకా వెంకటేశ్వర్లు పేదలకు ఇచ్చిన లేఅవుట్ను దున్నేసి, హద్దురాళ్లు పీకేసి చుట్టూ ఫెన్సింగ్ వేసుకుని ఆక్రమించారని పేర్కొన్నారు. నిరుపేద దళితులకు ఇచ్చిన స్థలాలను ఆక్రమించడం సిగ్గుచేటన్నారు. కలెక్టర్ విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చెవిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఆమంచర్ల బిట్–2 ఎంపీటీసీ సురేంద్రరెడ్డి, నారాయణరెడ్డి, వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు నవీన్రెడ్డి, శివాజీ, సింహాద్రి, దశయ్య, రమణమ్మ, సుమతి తదితరులు పాల్గొన్నారు. మా ప్రాంతంలో ఎండోమెంట్కు చెందిన 2ఎకరాల భూమి పల్లపు ప్రాంతంలో ఉంది. దీంతో అక్కడ మురుగునీరు నిలిచిపోయి దోమలు ఉధృతంగా ఉన్నాయి. దోమల ధాటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అందువల్ల ఎండోమెంట్ స్థలాన్ని మట్టితోలించి చదును చేయించి పార్కు, ఆటస్థలంగా చేయాలి. మురుగు లేకుండా చేసి స్థానికుల ఆరోగ్యాన్ని కాపాడాలి. – రామకృష్ణ, బాబూరావు, వెంకటరాఘవరెడ్డి, పరమేశ్వరినగర్ వెల్ఫేర్ అసోసియేషన్, నెల్లూరు -
చికెన్ విక్రయం చితికిపోయింది
వ్యాపారాలు పడిపోయాయి ప్రస్తుతం బర్డ్ఫ్లూ భయంతో పూర్తిగా వ్యాపారాలు పడిపోయాయి. జిల్లాలో ఎక్కడా బర్డ్ఫ్లూ లేదు. కానీ ఉభయగోదావరి జిల్లాల్లో వెలుగులోకి రావడంతో మన జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రస్తుతం పౌల్ట్రీ రంగం తీవ్రమైన నష్టాల్లో ఉంది. ఈ ప్రభావం ఎన్ని రోజులు ఉంటుందో తెలియడం లేదు. –వెంకట రమణయ్య, బ్రాయిలర్ ఫార్మర్స్ అసోసియేషన్ నెల్లూరు(సెంట్రల్): బర్డ్ఫ్లూ భయంతో చికెన్ వాడకాన్ని వినియోగదారులు తగ్గించడంతో చికెన్ విక్రయదారులు, పౌల్ట్రీ నిర్వాహకులు నష్టాలు చవిచూస్తున్నారు. ఇటీవల కాలంలో ఉభయగోదావరి జిల్లాల్లో బర్డ్ఫ్లూ వెలుగులోకి రావడం... ఆరు నెలల క్రితం జిల్లాలోనూ ఈ వ్యాధి కలకలం సృష్టించడం తెలిసిందే. తాజాగా గోదావరి జిల్లాల్లో లక్షల్లో కోళ్లు చనిపోతుండడంతో బర్డ్ఫ్లూ దెబ్బకి చికెన్ కొనుగోళ్లు బాగా తగ్గిపోయాయి. విక్రయాలు ఎలా ఉన్నాయంటే.. జిల్లాలో గత నెల వరకు చికెన్ వినియోగం బాగానే ఉండేది. వ్యాపారాలు కూడా జోరుగానే సాగేవి. ఇక ఆదివారం వచ్చిందంటే మాంసం ముక్క పళ్లెంలో ఉండాల్సిందే. జిల్లాలో చిన్నా చితకా షాపులతో కలిపి దాదాపు 5 వేలకు పైగా చికెన్ షాపులు ఉన్నాయి. వీటి ద్వారా సాధారణ రోజుల్లో 30 వేల కేజీల నుంచి 40 వేల కేజీల వరకు విక్రయాలు జరుగుతుంటాయి. ఆదివారం ఒక్క రోజే 80 వేల నుంచి లక్ష కేజీల వరకు విక్రయాలు జరిగేవని చికెన్ వ్యాపారులు చెపుతున్నారు. ప్రస్తుతం బర్డ్ఫ్లూ భయంతో సాధారణ రోజుల్లో 10 వేల కేజీలు, ఆదివారాల్లో 35 వేల కేజీల వరకు విక్రయాలు జరుగుతున్నాయని చెపుతున్నారు. ధరలు తగ్గించినా... జిల్లాలో చికెన్ ధరలు గత నెల వరకు ౖపైపెకి ఎగబాకే పరిస్థితి ఉండేది. గత నెలలో స్కిన్లెస్ బ్రాయిలర్ కేజీ మాంసం రూ.300కి చేరువలో ఉండేది. రెండు వారాల క్రితం వరకు స్కిన్ లెస్ కేజీ రూ.260కి చేరువలో ఉండేది. కాని ప్రస్తుతం బర్డ్ఫ్లూ భయంతో విక్రయాలు తగ్గాయి. దీంతో పౌల్ట్రీ వ్యాపారులు కూడా ధరలు తగ్గించాలని నిర్ణయించి బ్రాయిలర్ స్కిన్లెస్ ధర కేజీ రూ.190కి విక్రయాలు చేస్తున్నారు. అయినా వైరస్ భయంతో చాలా వరకు విక్రయాలు తగ్గుముఖం పట్టాయని వాపోతున్నారు. చర్యలు శూన్యమే... బర్డ్ఫ్లూ దెబ్బకి జిల్లాలోని పౌల్ట్రీరంగంపై తీవ్ర ప్రభావం చూపినా ప్రభుత్వం మాత్రం పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉభయగోదావరి జిల్లాల్లో వెలుగులోకి వచ్చిన తరువాత అన్ని జిల్లాల అధికారులను అప్రమత్తం చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బర్డ్ఫ్లూ వెలుగులోకి వచ్చిన తరువాత వెంటనే చర్యలు తీసుకుని ఉంటే కొంత నష్ట నివారణ చేసే అవకాశం ఉండేదని పౌల్ట్రీ వ్యాపారులు వాపోతున్నారు. బర్డ్ఫ్లూ భయంతో తగ్గిన వినియోగం గతంలో సాధారణ రోజుల్లో నిత్యం 30 వేల నుంచి 40 వేల కేజీల విక్రయాలు ప్రస్తుతం 10 వేల కేజీలకు పరిమితం -
రూ.వంద కోట్ల ఇసుక దోపిడీకి సోమిరెడ్డి స్కెచ్
నెల్లూరు(బారకాసు): సర్వేపల్లి నియోజకవర్గంలో రూ.వంద కోట్ల ఇసుక అక్రమ రవాణాకు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి స్కెచ్ వేశారని అనేకసార్లు తాను చెప్పానని, నేడు అదే విషయం రుజువైందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్రెడ్డి అన్నారు. సోమిరెడ్డి మాత్రం తమది జమీందారి కుటుంబమని, అంతటి గొప్పవంశానికి చెందిన నేనా అవినీతికి పాల్పడేది? అంటూ సోషల్ మీడియాలోనూ, న్యూస్ ఛానల్స్లోనూ మాట్లాడేవారని, కానీ ఆయన మాటలకు జరుగుతున్న పనులు చూస్తే భిన్నంగా ఉన్నాయని అన్నారు. సోమవారం నెల్లూరు నగరంలోని డైకస్రోడ్డులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముందుగా సోమిరెడ్డి అవినీతిని సాక్ష్యాధారాలతో సహా మీడియాకు వివరించారు. అనంతరం కాకాణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రకృతి వనరులు దోపిడీకి గురవుతున్నాయని చెప్పారు. ప్రధానంగా సూరాయపాళెం ఇసుక రీచ్ నుంచి రూ.వంద కోట్లు దోపిడీకి సోమిరెడ్డి స్కెచ్ వేశారన్నారు. ఇటీవల జిల్లా మైనింగ్ అధికారి విరువూరు వద్ద అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీ, టిప్పర్లను పట్టుకున్నారని చెప్పారు. అదే సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి సోమిరెడ్డికి ఫోన్ చేసి జరుగుతున్న విషయాన్ని చెప్పడంతో మీరెందుకు అక్కడికి వెళ్లారని అధికారులను ఫోన్లోనే సోమిరెడ్డి బెదిరించారన్నారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడకుంటే అధికారులను బెదిరించాల్సిన అవసరం సోమిరెడ్డికి ఎందుకు వచ్చిందని కాకాణి ప్రశ్నించారు. ఆయా ఇసుక రీచ్ల సమీపంలోని పొలాలకు వెళ్లే దారులు ఉంటే వాటికి గండికొట్టి ధ్వంసం చేసి తాము ఏర్పాటు చేసిన దారిలోనే వెళ్లాలంటూ హుకుం జారీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. దీనిని బట్టి చూస్తుంటే సోమిరెడ్డి విచ్చలవిడి ఇసుక దోపిడీ తెలుస్తోందన్నారు. ఇసుక అక్రమ రవాణాపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఇప్పుడు ధైర్యం ఉంటే సోమిరెడ్డి వాటిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సర్వేపల్లికి తాను గతంలో ఎమ్మెల్యేగానూ, రాష్ట్ర మంత్రిగానూ పనిచేశానని.. నీలాగా అధికారులను బెదిరించడం, ఇసుక అక్రమ రవాణా, దోపిడీ వంటివి ఎన్నడూ చేయలేదన్నారు. ఇరిగేషన్కు సంబంధించి కాలువల్లో పూడికలు తీయకుండానే బిల్లులు చేసుకున్నారని ఆరోపించారు. దీనివల్ల పొలాలకు నీరు చేరక రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అనధికార బార్లను నిర్వహిస్తున్నారని ఈ విషయాన్ని తాను గతంలోనే చెప్పానన్నారు. సోమిరెడ్డి అవినీతి, అక్రమాలపై సాక్ష్యాధారాలతో సహా అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాలో కలెక్టర్, ఎస్పీలు ఉన్నా లేనట్టుగా ఉందన్నారు. నియోజకవర్గంలో లేఅవుట్ వేస్తే ఎకరాకు రూ.5లక్షలు సోమిరెడ్డికి సమర్పించుకోవాలని, నెల్లూరు కార్పొరేషన్కు సమీపంలో ఉన్న ప్రాంతాల్లోనైతే ఎకరాకు రూ.10లక్షలు ఇచ్చుకోవాలని ఇలా వసూలు చేస్తూ ఉన్న సోమిరెడ్డి.. తనను ఇబ్బంది పెట్టాలని అక్రమ కేసులు బనాయించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతికి పాల్పడిన ఏ ఒక్క అధికారిని కూడా విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. అధికారులను బెదిరించి మరీ దోచుకుంటున్నారు పూడికలు తీయకుండానే బిల్లులు చేసుకున్నారు సర్వేపల్లిలో అనధికార బార్లను నిర్వహిస్తున్నారు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి -
పేదల భూములను ఆక్రమిస్తున్నారు
మా గ్రామంలో 500 ఎకరాల ఇనాం భూములు 30 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయి. 1960లో ఒక ఇనాందారు ముత్తుకూరు మండలంలోని మెట్టా రాజగోపాల్రెడ్డికి 384 ఎకరాలు అమ్మాడు. తర్వాత వచ్చిన సీలింగ్ చట్టం వల్ల ప్రభుత్వం వద్ద కాంపెన్జేషన్ పొంది ఈ భూములను కొనుగోలు చేసిన రాజగోపాల్రెడ్డి వదులుకున్నాడు. అనంతరం అప్పటి తహసీల్దార్ 110 ఎకరాలను పేదలకు పట్టాగా ఇచ్చారు. వాటిని నిరుపేదలు సాగుచేసుకుంటున్నారు. కొన్నేళ్ల క్రితం మెట్టా రాజగోపాల్రెడ్డి కుమారుడు చంద్రశేఖర్రెడ్డి ఆ పొలాలు తనవే అంటూ అధికారుల ద్వారా చర్యలకు ఉపక్రమించారు. తాజాగా మరో కొత్త వ్యక్తి రాచమల్లు రమేష్ ఆ భూములు తనవే అంటూ అధికార పార్టీ నేతల ద్వారా ఆక్రమిస్తున్నాడు. ఇప్పటికే 20 ఎకరాలు ఆక్రమించడమే కాకుండా గ్రామంలో రోడ్డును సైతం ఆక్రమించాడు. కలెక్టర్ స్పందించి విచారణ జరిపి పేదలకు ఆ భూముల్లో పట్టాలు ఇవ్వాలి. – ఎన్వీ రమణయ్య, రవీంద్ర, పెంచలయ్య, మట్టెంపాడు గ్రామస్తులు – పి.జనార్ధన్, తిరుపాలు సీపీఎం నాయకులు -
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలంటూ ర్యాలీ
నెల్లూరు(అర్బన్): అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్టు చేసిన బాధితులందరికీ నగదు తిరిగి ఇచ్చేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర సమితి సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు ఏజెంట్లు, బాధితులు ర్యాలీ చేసి అనంతరం కలెక్టర్ ఆనంద్కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉదయగిరి, వరికుంటపాడు, కలిగిరి, దుత్తలూరు ప్రాంతాల్లో అగ్రిగోల్డ్ కంపెనీ భూముల్లో ఉన్న ఎర్రచందనం, టేకు, ఇతర సంపదను అక్రమార్కులు దోచుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఈవీ నాయుడు, తిరుపతిరావు, శేషగిరిరావు, రామరాజు తదితరులు పాల్గొన్నారు. -
రాళ్లలో కలిసిపోయిన శాసనాలు
ప్రతి ఊరుకు ఓ చరిత్ర ఉంటుంది. అలాంటి ప్రాచీన చరిత్ర కలిగిందే మరుపూరు. చారిత్రక ఆనవాళ్లు చెల్లాచెదురు అవుతున్నాయి. ఆదరణ లేకపోవడంతో కాలగర్భంలో కలిసి పోతున్నాయి. అలనాటి పూర్వీకుల జీవన విధానం, సంప్రదాయాలు, సంస్కృతులను తెలియజేస్తూ అప్పటి రాచరిక ప్రభువులు ఏర్పాటు చేసిన శిలా శాసనాలు, ఆలయాలు చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తాయి. శతాబ్దాలుగా భూగర్భంలో కలిసిపోయిన శిలాశాసనాలు అదృష్టవశాత్తు వెలుగు చూశాయి. వాటి ఆధారంగా ఇంకా మరికొంత చరిత్రను వెలుగులోకి తెచ్చే అవకాశం ఉన్నప్పటికీ పురావస్తుశాఖ ఆ ప్రయత్నం చేయడం లేదు. దొరికిన ఆధారాలను భద్రపరిచి భవిష్యత్ తరాలకు చూపించే ప్రయత్నం చేయడం లేదు. 1638లోనే కాశీవిశ్వనాథస్వామి ఆలయ నిర్మాణం ● చెరువులో ప్రాచీన చరిత్ర శాసనం లభ్యం ● అలనాటి శాసనాలు చెల్లా చెదురు ● గ్రామస్తుల చొరవతో వందల ఏళ్లనాటి ఆలయం పునర్నిర్మాణం పొదలకూరు: శాసనాలు, కట్టడాలు చరిత్ర ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి. అయితే పురావస్తుశాఖ నిధుల లేమితో నిస్తేజంగా మారడంతో చారిత్రక సాక్ష్యాలు కాల, భూగర్భంలో కలిసిపోతున్నాయి. మండలంలోని మరుపూరుకు చారిత్రక నేపథ్యం ఉంది. రాపూరు సీమను పాలించిన విజయనగర సామ్రాజ్య వంశస్తులకు సామంతు రాజులైన వెలుగోటి వంశస్తుల (వెంకటగిరి సంస్థానం) కాలంలో మరుపూరు అలనాటి పాలన, సంస్కృతి, సంప్రదాయాలకు చరిత్రగా నిలుస్తోంది. రెండేళ్ల క్రితం చరిత్రకారుడు డాక్టర్ గోవిందు సురేంద్ర ఇందుకు సంబంధించిన చారిత్రక సాక్ష్యాలను కనుగొన్నారు. గ్రామం, చెరువు, దేవస్థానం ఇప్పటికీ అలనాటి చరిత్రకు ఆధారాలుగా ఉన్నాయి. శతాబ్దాల కాలం నాటి నుంచే మరుపూరు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇక్కడ నాగరికతతోపాటు అప్పట్లోనే వరి పండిస్తున్నట్లు ఆ శాసనాల్లో ఉంది. యాదృశ్ఛికంగా చరిత్రకారుడు సురేంద్ర రాతి శాసనాలను పరిశీలించడంతో గ్రామ చరిత్ర, అలనాటి పాలకుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. క్రీ.శ. 1638వ సంవత్సరం నాటి రాతి శాసనాలు చెరువుకు సమీపంలో బయల్పడ్డాయి. ప్రాచీన తెలుగు భాషలో శాసనాలు చెల్లా చెదురుగా పడి ఉండడంతో కాలగర్భంలో కలిసిపోయే అవకాశం ఉంది. దేవస్థానం పునర్నిర్మాణం మరుపూరులో క్రీ.శ.1638లో దక్షిణాభిముఖంగా చెరువుకు సమీపంలో నిర్మించిన శ్రీకాశీవిశ్వనాథస్వామి, వరసిద్ధి వినాయకుని దేవస్థానం శిథిలావస్థకు చేరడంతో గ్రామ పెద్దలు విశిష్టత కలిగిన దేవస్థానం పునర్నిర్మాణ పనులను చేపట్టారు. దాతల సహకారంతో సుమారు రూ.1.50 కోట్ల అంచనాలతో శ్రీమల్లికార్జున కామాక్షితాయి ఆలయంగా నామకరణం చేసి నిర్మించారు. తూర్పు ముఖంతో ఆలయాన్ని నిర్మించడం వల్ల ప్రతినిత్యం సూర్యకిరణాలు గర్భగుడిని తాకుతున్నాయి. ఇది అరుదైన విషయంగా చెప్పుకుంటున్నారు. చారిత్రక ఆధారాల కోసం పరిశోధించాలి పురావస్తుశాఖ ఇక్కడ పరిశోధిస్తే శతాబ్దాల చారిత్రక ఆధారాలు వెలుగుచూసే అవకాశం ఉంది. అలనాటి దేవస్థానం, శాసనాల వివరాలు బయటపడతాయి. రాతి శాసనాలను భవిష్యత్ తరాలకు తెలిజేస్తూ భద్రపరచాల్సిన అవసరం ఉంది. ఆలయాన్ని భక్తులు, దాతల సహకారంతో నిర్మించాం. – వేణుంబాక చంద్రశేఖర్రెడ్డి, గ్రామపెద్ద, మరుపూరు ఎంతో విలువైన శాసనాలు మరుపూరులో రాతి శాసనాలను గుర్తించాం. ఈ శాసనాలు ఎంతో విలువైనవిగా చెప్పుకోవచ్చు. ఇలాంటి శాసనాలు చాలానే ఉన్నాయని మేము గుర్తించాం. ఇలాగే వదిలేస్తే ఇవి కాలగర్భంలో కలిసిపోతాయి. పురావస్తుశాఖ అధికారులు స్పందించి అలనాటి శాసనాలను భద్రపరిచాల్సి ఉంది. – జీ సురేంద్ర, చరిత్రకారుడు, నెల్లూరుగ్రామ చెరువుకు సమీపంలో రాతి శాసనాలు చాలా కాలంగా రాళ్లలో కలిసిపోయాయి. గ్రామానికి చెందిన పెద్దలు వైస్ ఎంపీపీ వేణుంబాక చంద్రశేఖర్రెడ్డి, మాజీ సర్పంచ్ వళ్లూరు గోపాల్రెడ్డి రాళ్లలో ఉన్న శాసనాలను గుర్తించి చరిత్రకారులతో పరిశీలన చేయడంతో ఆ శాసనాల ద్వారా చరిత్ర వెలుగులోకి వచ్చింది. వెంకటపతిరాయుడి కాలంలోనే మరుపూరులో చెరువు సమీపంలో శ్రీకాశీవిశ్వనాథ, వినాయకస్వామి ఆలయాలు నిర్మించారని రాతి శాసనం ద్వారా తెలుస్తోంది. నాటి గ్రామస్తులు పండించే పంటలో మేర భాగం అందజేయాలని కాపు, కరణం ఆదేశాలు ఇస్తున్నట్టుగా శాసనం ఉన్నందున రాతి శాసనాన్ని ధానధర్మ శాసనంగా వ్యవహరించే వారని తెలుస్తోంది. ఇదే అంశాన్ని మైసూరు పురావస్తు శాసన పరిశోధకుడు డాక్టర్ మునిరత్నంరెడ్డి ధ్రువీకరించినట్లు గ్రామ పెద్దలు వెల్లడించారు. -
మార్చి 1 నుంచి ఇంటర్
మార్చి 17 నుంచి టెన్త్.. ఏప్రిల్ 1 నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు వరుస టెస్ట్లకు సిద్ధమవుతున్న విద్యార్థులు మే 19 నుంచి ఏపీ ఈఏపీ సెట్ విద్యార్థులకు పరీక్షా సమయం ముంచుకువస్తోంది. వరుస పరీక్షల నేపథ్యంలో ఆయా కోర్సులు చదువుతున్న విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమయ్యే సమయం ఆసన్నమైంది. రానున్న 4 నెలల కాలం పరీక్షలకు హాజరై తమ ప్రతిభను నిరూపించుకోవాల్సిన సమయం. ఓ వైపు ఆయా కోర్సులు బోధిస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఇప్పటికే సిలబస్ను పూర్తి చేసి రివిజన్లో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. మరో వైపు రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించే దిశగా ఆయా ప్రైవేటు యాజమాన్యాలు తమ విద్యార్థుల మెదడుకు పదును పెట్టే పనిలో ఉన్నారు. మే 18న జేఈఈ అడ్వాన్స్డ్ మే 4న నీట్● -
వీఎస్యూకు ఎన్ఐఓటీ బృందం
వెంకటాచలం: మండలంలోని కాకుటూరు వద్ద ఉన్న విక్రమసింహపురి యూనివర్సిటీ (వీఎస్యూ)ని జాతీయ మహా సముద్ర సాంకేతిక సంస్థ (ఎన్ఐఓటీ) చైన్నె ప్రతినిధులు డాక్టర్ ఎన్వీ వినీత్, డాక్టర్ సచ్చితానందనం, డాక్టర్ ఎన్వీఎస్ దేవిరాం సోమవారం సందర్శించారు. వీఎస్యూలో మైరెన్ బయోలజీ విభాగం అచార్యులు, పరిశోధకులతో సమావేశమై సముద్ర జీవ వైవిధ్యం, ఉప్పు నీటి పరిశోధనలపై వివిధ అంశాలను చర్చించారు. ల్యాబ్లు, తరగతి గదులు, మ్యూజియం సందర్శించి పరిశోధనలపై విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం వీఎస్యూ వీసీ అల్లం శ్రీనివాసరావు, ఇన్చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీతతో సమావేశమై సముద్ర జీవ పరిసరాల అధ్యయనంలో పరిశోధనలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత, జాతీయ స్థాయి సంస్థలతో అనుసంధానంపై చర్చించారు. ప్రాణహాని ఉందని ఎస్పీకి ఫిర్యాదు వరికుంటపాడు: మండలంలోని తోటల చెరువుపల్లికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త పులి వెంకటప్రసాద్ తనకు తమ గ్రామానికి చెందిన అధికార పార్టీ నేత డి.మౌలాలి నుంచి ప్రాణహాని ఉందని సోమవారం నెల్లూరులో ఎస్పీ కృష్ణకాంత్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ నెల 17వ తేదీన కుటుంబ ఆస్తి విషయమై జరిగిన గొడవలో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేకపోయినా.. టీడీపీ నేత మౌలాలి జోక్యం చేసుకొని తమపై దాడికి పాల్పడ్డాడని, పోలీసులు సైతం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, తమ పైనే కేసు నమోదు చేశారని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. పూర్తిస్ధాయిలో విచారించి న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారని బాధితుడు తెలిపారు. ఆక్రమణలన్నీ తొలగించాల్సిందే రాపూరు : మండలంలోని కండలేరు జలాశయం భూమిని పలువురు ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారని, అయితే ఇందులో కొంత మందికే రెవెన్యూ అధికారులు ఆక్రమించిన స్థలాన్ని ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చినారని రాంబాబు, శేషుబాబు, వెంకటాద్రి ఆరోపించారు. ఆక్రమణలు తొలగించాల్సి వస్తే.. అందరినీ తొలగించాలని డిమాండ్ చేశారు. కండలేరు జలాశయానికి సంబంధించి 200 ఎకరాల భూమిని ఆ ప్రాంతంలోని పలువురు ఆక్రమించుకుని అనేక ఏళ్లు సాగు చేసుకుంటున్నారు. అందులో అధికార పార్టీకి చెందిన వ్యక్తి కూడా ఉన్నాడు. సదరు వ్యక్తి తన తోటకు వెళ్లేందుకు దారి కోసం అడ్డుగా ఉన్న ఆక్రమణలను తొలగించాలని రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తేవడంతోనే తమకు నోటీసులు ఇచ్చారని, ఇది ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. రెవెన్యూ అధికారులు కొంత మందిపై వివక్ష చూపడం ఏమిటని నిలదీశారు. తహసీల్దార్ లక్ష్మీనరసింహం మాట్లాడుతూ ఆ ప్రాంత ప్రజల ఫిర్యాదు ఇచ్చారని, ఆ మేరకు ఆక్రమణలో ఉన్న అన్ని భూములను ఖాళీ చేయిస్తామని తెలిపారు. బైక్ ఢీకొని మేకల కాపరి మృతి కోవూరు: మేకల కాపరిని వెనుక నుంచి బైక్ ఢీకొనడంతో మృతి చెందాడు. పోలీసుల సమాచారం మేరకు.. కోవూరు మండలం వేగూరుకు చెందిన గంధళ్ల శీనయ్య (59) మేకలు మేపుకుంటూ జీవనాధారం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం మేకలు తోలుకుని తిరిగి ఇంటికి వస్తుండగా, వేగూరు–మోడేగుంట మార్గంలో మోడేగుంట నుంచి వేగూరుకు వస్తున్న బైకిస్టు అతివేగంగా వెనుక నుంచి వచ్చి ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన శీనయ్యను స్థానికులు చికిత్స నిమిత్తం నెల్లూరులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలిస్తున్న క్రమంలో సోమవారం మార్గంమధ్యలోనే అంబులెన్స్లోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై రంగనాథ్, ట్రెయినీ డీఎస్పీ శివప్రియ సోమవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. శీనయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోవూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గంజాయి అక్రమ రవాణాదారుడి అరెస్ట్
● 10 కేజీల గంజాయి స్వాధీనం నెల్లూరు (క్రైమ్): గంజాయి అక్రమ రవాణాదారుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి 10 కేజీల గంజాయిని సోమవారం రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు రైల్వే పోలీసుస్టేషన్లో రైల్వే సీఐ కె. భుజంగరావు నిందితుడి వివరాలను వెల్లడించారు. నేరనియంత్రణ చర్యల్లో భాగంగా రైల్వే పోలీసులు రైళ్లు, రైల్వేస్టేషన్లలో నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నారు. సోమవారం నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్లో తనిఖీ చేస్తుండగా, రెండు, మూడో ప్లాట్ఫాంల మధ్యలో అనుమానాస్పదంగా ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా బురుగుబయలు గ్రామానికి చెందిన పి. సన్యాసిరావును అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న బ్యాగ్ను పరిశీలించగా రెండు కేజీల బరువు కలిగిన ఐదు గంజాయి ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని రైల్వే పోలీసుస్టేషన్కు తరలించి విచారించగా బెంగళూరు, చైన్నెల్లోని వ్యక్తులకు ఇచ్చేందుకు వెళుతున్నామని చెప్పారు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి గంజాయిని సీజ్ చేశారు. నిందితుడిపై రంపచోడవరంలో గంజాయి కేసు ఉందని సీఐ చెప్పారు. వేసవి సమీపిస్తున్న దృష్ట్యా నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ సమావేశంలో స్థానిక ఎస్ఐ మాలకొండయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
బీపీసీఎల్తో పర్యావరణానికి ప్రమాదం
● భూములివ్వమని చేవూరు గ్రామ ప్రజల ఉద్ఘాటన కందుకూరు: పర్యావరణానికి తీవ్ర నష్టం చేకూర్చే బీపీసీఎల్ పరిశ్రమకు తాము భూములివ్వమని గుడ్లూరు మండలంలోని చేవూరు గ్రామానికి చెందిన రైతులు స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. గతంలో ఇండో సోలార్ కంపెనీ పేరుతో తమ గ్రామ పరిధిలో భూములు సేకరించారని, ప్రస్తుతం ఆ భూములను బీపీసీఎల్ కంపెనీకి కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. గ్రామానికి చుట్టు పక్కల ఉన్న దాదాపు 1300 ఎకరాల భూములను ఇండో సోలార్ కంపెనీ కోసం సేకరించారని, ఆ సమయంలో అధికారులు ఐదు వేల ఎకరాల కావాలని చెప్పారన్నారు. సోలార్ కంపెనీ వస్తే భూముల విలువ పెరుగుతుందని చెప్పారు. దీంతో రైతులు అందరూ కంపెనీ వస్తే భూములు విలువ పెరగడంతో పాటు, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయనే, ప్రాజెక్టు వల్ల ఎటువంటి పర్యావరణ సమస్యలు రావనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా భూములివ్వడానికి ముందుకు వచ్చారన్నారు. తాగు, సాగునీటికి ఇబ్బందులు సోలార్ కంపెనీకి కేటాయించిన భూములను బీపీసీఎల్కు కేటాయించే పనుల్లో అధికారులు ఉన్నారని, బీపీసీఎల్ వల్ల భూగర్భ జలాలు కలుషితమై తాగునీటికి, సాగునీటికి ఇబ్బందుల వస్తాయన్నారు. ఊళ్లకు ఊళ్లే ఖాళీ చేసే పరిస్థితులు వస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా పొలాలు కోల్పోయిన రైతులు, కూలీలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కావున బీపీసీఎల్ ప్రాజెక్ట్కు భూములు కేటాయించొద్దని విన్నవించారు. కార్యక్రమంలో గ్రామ రైతులు నక్కా శరత్యాదవ్, సాయిశంకర్, ఎన్ విష్ణు, ఆర్ రామకృష్ణ, డి సురేష్, కె సునీల్, ఎన్రాము, పర్రే సుబ్బారాయుడు, నకాక హరినాథ్, యు సుబ్బారావు, వీ శ్రీను, ఆర్ పాపారావు, ఆర్ చెంచురామారావు, ఎన్ రమేష్, ఎన్ ఏసురత్నం, సీహెచ్ మోహన్, పి అనిల్, పి రవి, ఎల్ హరిబాబు, జి పేతురు, వై శ్రీను, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి ముప్పవరపు కిశోర్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పాశం కొండయ్య తదితరులు పాల్గొన్నారు.