sravana sukravaram
-
34 ఏళ్ల తర్వాత సూపర్ హిట్ సినిమాకు రీమేక్..
దివంగత దర్శకుడు రామనారాయణన్ అద్భుత సృష్టి 'ఆడివెళ్లి'. ఈ మూవీలో హీరోయిన్ సీత ప్రధాన పాత్రను పోషించింది. 1990లో విడుదలైన ఈ మూవీ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. శ్రావణ శుక్రవారం పేరిట తెలుగులోనూ అనువాదమై ఇక్కడా ఘనవిజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని రామనారాయణన్ కుమారుడు, నిర్మాత మురళి రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీని గురించి ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆడివెళ్లి గ్రామీణ నేపథ్యంలో రూపొందించిన చిత్రం కావడంతో అప్పట్లో అనూహ్య విజయాన్ని సాధించిందన్నారు. అప్పుడు నాకు తొమ్మిదేళ్లు ఆ చిత్రం నిర్మాణ సమయంలో తనకు తొమ్మిది సంవత్సరాలని, తండ్రి వెంట షూటింగ్కు వెళ్లిన విషయం తనకు ఇప్పటికీ జ్ఞాపకం ఉందని గుర్తు చేసుకున్నారు. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ప్రారంభదశలోనే తన తండ్రి దాన్ని చాలా బాగా వాడుకున్నారని చెప్పారు. ఆడివెళ్లి చిత్రాన్ని 90 రోజుల్లో పూర్తి చేశారన్నారు. ఆ చిత్రంలోని పాటలు ఇప్పటికీ ఉత్సవాల్లో మారుమోగుతూ ఉంటాయని పేర్కొన్నారు. ఏనుగు వంటి జంతువులకు ప్రాముఖ్యత కలిగిన ఆ చిత్రాన్ని రీమేక్ చేయడం కష్టంతో కూడిన పనేనన్నారు. అయినప్పటికీ ఈ చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. సీత పాత్రలో నయనతార? దీనికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కలిగిన దర్శకుడు అవసరమని చెప్పారు. ఆ కథను నేటి కాలానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ చిత్రంలో సీత పోషించిన ప్రధాన పాత్రలో నయనతార నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోందని, నిజానికి ఇంతవరకు ఇందులో నటించే నటీనటులను ఎంపిక చేయలేదన్నారు. ఏదేమైనా ఆడివెళ్లి రీమేక్లో నయనతార నటించనున్నట్లు ప్రచారం జరుగుతుండడంతో ఇందులో ఆమె నటిస్తే బాగుంటుందని తామూ భావిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే చిత్ర వివరాలను చెబుతామని నిర్మాత మురళి పేర్కొన్నారు. -
శ్రావణ లక్ష్మీ నమోస్తుతే..
-
ఇంద్రకీలాద్రిపై శ్రావణమాసం సందడి
-
శ్రావణ శుక్రవారం అమ్మవారి గుడికి భక్తులు
-
వీక్షకులు పంపిన వరలక్ష్మీ వ్రతం ఫొటోలు
-
విజయవాడ : మార్కెట్లో శ్రావణ శుక్రవారం రద్దీ
-
అందుకే భక్తుల రద్దీ తక్కువగా ఉంది
-
చంద్రబాబు దంపతులు పుష్కర స్నానం
-
అందుకే భక్తుల రద్దీ తక్కువగా ఉంది: చంద్రబాబు
విజయవాడ : శ్రావణ శుక్రవారం కావడం వల్ల కృష్ణా పుష్కరాల తొలి రోజు భక్తుల రద్దీ తక్కువగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు తెలిపారు. శుక్రవారం విజయవాడలోని దుర్గాఘాట్లో చంద్రబాబు దంపతులు పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ....రేపటి నుంచి అంటే శనివారం నుంచి భక్తుల రద్దీ పెరుగుతుందన్నారు. కృష్ణా పుష్కరాలు సందర్బంగా పవిత్ర సంకల్పాన్ని చేపట్టామని చెప్పారు. కృష్ణా పుష్కరాలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని వెల్లడించారు. రియల్ టైమ్ మానిటరింగ్ ద్వారా బస్సుల రద్దీని క్రమబద్దీకరిస్తున్నామన్నారు. విజయవాడ నగరంలో కొన్ని గుళ్లు తొలగించామని కొందరు గగ్గోలు పట్టారు.... అయినప్పటికీ చేయాల్సిన అభివృద్ధి చేయగాలిగామన్నారు. ప్రత్యేక హోదా కూడా త్వరగా రావాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.