SS Rajamouli
-
ఇలాంటి ప్రాంతాలను రక్షించుకోవడం మన బాధ్యత: ఎస్ఎస్ రాజమౌళి
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ29 మూవీతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒడిశాలోని కోరాపుట్ పర్వత ప్రాంతాల్లో జరిగింది. అక్కడ మొదటి షెడ్యూల్ పూర్తి కావడంతో చిత్రబృందం ప్యాకప్ చెప్పేసింది. దీంతో మూవీ టీమ్ అంతా తమ లోకేషన్ నుంచి తిరుగుపయనమయ్యారు. ప్రియాంక చోప్రా తాను ఎయిర్పోర్ట్కు వెళ్తుండగా తీసిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.తాజాగా ఎస్ఎస్ రాజమౌళి ఈ మూవీ షూటింగ్ లోకేషన్ సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఒడిశాలోని అత్యంత ఎత్తైన, అద్భుతమైన శిఖరం డియోమాలికి ట్రెక్కింగ్ చేసినట్లు వెల్లడించారు. పైనుంచి చూస్తే అత్యంత ఉల్లాసభరితంగా అనిపించిందని ట్విటర్లో పోస్ట్ చేశారు.అయితే ఆ పర్వతంపై పర్యాటకులు చెత్త చెదారం అలాగే ఉంచడం చూసి నిరుత్సాహానికి గురైనట్లు తెలిపారు. ఇటువంటి సహజమైన అద్భుతమైన ప్రాంతాలను ఎంతో బాగా చూసోకోవాలి.. ఒక ఒక్కరూ పౌరుడు బాధ్యతగా తీసుకుంటే చాలా పెద్ద మార్పు వస్తుంది... ప్రతి సందర్శకుడు ఇలాంటి ఆహ్లాదకరమైన స్థలాలను రక్షించడంలో సహాయపడటానికి మీ వ్యర్థాలను తిరిగి మీరే తీసుకువెళ్లాలని రాజమౌళి సూచించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.Had an amazing solo trek to Deomali, Odisha’s highest and most stunning peak. The view from the top was absolutely breathtaking.However, it was disheartening to see the trail marred by litter. Such pristine wonders deserve better. A little civic sense can make a huge… pic.twitter.com/8xVBxVqQvc— rajamouli ss (@ssrajamouli) March 19, 2025 -
రెమ్యునరేషన్ మోడల్ను మార్చేసిన ఫస్ట్ హీరో 'మహేష్బాబు'
స్టార్ హీరోలు ఒక్కో సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు అనేది ఇచ్చే నిర్మాతలకు, తీసుకునే హీరోలకు తప్ప ఎవరికీ తెలియదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వీరి పారితోషికానికి సంబంధించిన గాసిప్స్ చక్కర్లు కొడుతూనే ఉంటాయి. కానీ, సినిమా హిట్ అయితే నిర్మాతకు భారీగానే లాభాలు వస్తాయి. ఒకవేళ నష్టం వస్తే కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ప్రస్తుతం హీరోల అధిక రెమ్యునరేషన్లు చిత్ర పరిశ్రమ మనుగడకు ఇబ్బందిగా మారుతోందని పలువురు బహిరంగంగానే కామెంట్ చేస్తున్నారు. అధిక నష్టాల ఎఫెక్ట్ వల్ల కొత్తగా నిర్మాతలు ఎవరూ కూడా సినీ పరిశ్రమలో అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. రీసెంట్గా తీరని నష్టాల వల్ల లైకా ప్రొడక్షన్స్ సంస్థను షట్డౌన్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. దీనంతటికీ కారణం సినిమా బడ్జెట్ పెరగడమే అని చెప్పవచ్చు. అందులో అధిక భాగం హీరో రెమ్యునరేషన్ అనే ఎక్కువమంది చెబుతున్న మాట. అయితే, ఈ రెమ్యూనరేషన్ మోడల్ మొత్తంగా మహేష్బాబు మార్చేశారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే, అది నిర్మాతలకు భారీ ఊరటను కల్పించేలా ఉండటంతో ప్రిన్స్ మహేష్ బాబును అభినందిస్తున్నారు.నష్టం వస్తే జీరో రెమ్యునరేషన్దేశంలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరోగా అల్లు అర్జున్ రూ. 300 కోట్లతో (పుష్ప2) టాప్లో ఉన్నారు. అయితే, పుష్ప2 మూవీకి భారీ లాభాలు వచ్చాయి కాబట్టి సరిపోయింది. ఒకవేళ రిజల్ట్లో తేడా వచ్చింటే ఎవరూ ఊహించలేని నష్టాలను ఆ చిత్ర నిర్మాణ సంస్థ భరించాల్సి వచ్చిండేది. ఇప్పుడు మహేష్బాబు- రాజమౌళి (SSMB29) ప్రాజెక్ట్ కోసం సుమారు రూ. 1000 కోట్లు బడ్జెట్ పెడుతున్నారని వార్తలు వచ్చాయి. అయితే, ఈ మూవీ కోసం మహేష్బాబు తన రెమ్యునరేషన్గా సినిమాకు ఫైనల్గా వచ్చిన లాభాల్లో షేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అది కూడా లాభాల్లో 35 శాతం వరకు ఉండోచ్చని సమాచారం. ఈ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో గట్టిగానే వైరల్ అవుతుంది. సినిమాకు నష్టాలు వస్తే జీరో రెమ్యనరేషన్ అని ముందే డీల్ సెట్ చేసుకున్నారట.. ఇదే ప్లాన్ను దర్శకులు రాజమౌళి కూడా అనుసరిస్తున్నారట. అసలు రెమ్యూనరేషన్ అంటూ తీసుకోకుండా కేవలం వచ్చే ప్రాఫిట్లో షేర్ తీసుకోవడం నిర్మాతలకు భారీ ఊరట కల్పించే అంశమని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. భవిష్యత్లో ఇదే దారిలో చాలామంది హీరోలు వెళ్లే అవకాశం ఉంది. రెమ్యునరేషన్ విషయంలో ట్రెండ్ సెట్ చేసిన హీరోగా మహేష్ రికార్డ్ క్రియేట్ చేశారని చెప్పవచ్చు. -
కొరాపుట్ SSMB29: చిత్రయూనిట్కు సాయంగా నిలిచిందెవరంటే..?
పాన్ ఇండియా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్బాబు, ప్రియాంకచోప్రా కాంబినేషన్లో రూపొందుతున్న ‘ఎస్ఎస్ఎంబీ–29’(వర్కింగ్ టైటిల్) చిత్రానికి సంబంధించి కీలక షెడ్యూల్ షూటింగ్ ఒడిశాలోని కొరాపుట్ జిల్లాలో ముగిసింది. నెల రోజులుగా ఈ ప్రాంతంలో షూటింగ్ జరుగుతుండటంతో సందడి వాతావరణం నెలకొంది. మంగళవారంతో షెడ్యూల్ ముగియడంతో అదే రోజు రాత్రి కొంతమంది నటీనటులు, సిబ్బంది వెనుదిరగగా.. బుధవారం ఉదయం రాజమౌళి, ప్రియాంకచోప్రా, మిగిలిన సాంకేతిక బృందం వీడ్కోలు పలికింది. షెడ్యూల్ ముగిసిందనే సమాచారం తెలుసుకున్న పరిసర ప్రాంత అభిమానులు వేకువజామునే కొరాపుట్ జిల్లా సిమిలిగుడ పట్టణంలో రాజమౌళీ బృందం బస చేసిన హోటల్కు పోటెత్తారు. సిమిలిగుడ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రియాంక చోప్రాతో కలిసి ఫొటోలు దిగారు. కదిలిన కాంగ్రెస్ శ్రేణులు.. షెడ్యూల్ మొత్తం పొట్టంగి నియోజకవర్గంలోనే జరిగింది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్చంద్ర ఖడం నేతృత్వం వహిస్తున్నారు. ఆయన ప్రస్తుతం కాంగ్రేస్ పార్టీ శాసన సభాపక్షనేతగా ఉన్నారు. దాంతో ఖడం నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్లు, జిల్లా పరిషత్ సభ్యులు పెద్ద ఎత్తున షూటింగ్ స్పాట్కు చేరుకున్నారు. అక్కడ ఏ సినిమా షూటింగ్ జరిగినా సరే ఆయన నుంచి సాయం ఉంటుందని అక్కడి స్థానికులు చెబుతున్నారు. కొరాపుట్ జిల్లాలో పండించిన నల్ల ధాన్యం, కొరాపుట్ కాఫీ తదితర మిలెట్స్తో కూడిన బాక్స్ను రాజమౌళికి బహూకరించారు. మరోసారి ఇదే ప్రాంతంలో షూటింగ్కి రావాలని ఆహ్వానించారు. ఎప్పుడు ఎవరు షూటింగ్కు వచ్చినా తాము పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. మరోసారి ఈ ప్రాంతానికి తన సినిమా షూటింగ్ కోసం వస్తానని వారికి రాజమౌళీ మాటిచ్చారు. వీడ్కోలు పలికిన అధికారులు.. రాజమౌలి బృందానికి వీడ్కోలు పలకడానికి పెద్ద ఎత్తున ఉన్నతాధికారులు తరలివచ్చారు. కొరాపుట్ జిల్లా ఎస్పీ రోహిత్ వర్మ, ట్రైనీ ఐఏఎస్ జయపూర్ సబ్ కలెక్టర్ అక్కవరపు సశ్యా రెడ్డి, జయపూర్ ఎస్డీపీఓ పార్ధో జగదీష్ కశ్యప్లు రాజమౌళి బృందాన్ని కలిశారు. అనంతరం మహేష్బాబు ఉంటున్న దేవమాలి కాటేజీకి వెళ్లి ఫొటోలు దిగారు. చివరిలో రాజమౌళి, ప్రియాంక చోప్రాలు ప్రత్యేకంగా లేఖ విడుదల చేశారు. ఇక్కడి ప్రజల సహకారం, స్నేహశీలత మరువలేమన్నారు. ఆ లేఖను ఐఏఎస్ అధికారి సశ్యా రెడ్డికి అందజేసి ఎక్స్ వేదికగా ప్రకటించారు. తమకు ఇన్ని రోజులు భద్రత కల్పించిన పోలీసులకు స్వయంగా కృతజ్ఞతలు తెలిపారు. కాగా, గత నెల రోజులుగా వాహనాలు, వేలాది మంది సందర్శకులతో కళకళలాడిన తులమాలి పర్వత ప్రాంతం బోసిపోయింది. సినిమా యూనిట్ వాహనాలు తిరిగి వెళ్లిపోవడంతో ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారింది. సిమిలిగుడ పట్టణంలో ఒక్కసారిగా హోటళ్లలో సందర్శకుల తాకిడి తగ్గింది. -
కొరాపుట్లో SSMB29.. మహేష్బాబుతో ఐఏఎస్,ఐపీఎస్ అధికారులు (ఫోటోలు)
-
SSMB29 ఒడిశా షెడ్యూల్ పూర్తి.. ఫొటోలు వైరల్
గత కొన్నిరోజులు ఒడిశాలోని కోరాపుట్ లో జరుగుతున్న మహేశ్ బాబు-రాజమౌళి (SS Rajamouli) సినిమాకు సంబంధించిన షెడ్యూల్ పూర్తయింది. ఈ క్రమంలో పలువురు అధికారులు, అభిమానులు టీమ్ ని కలవగా ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు రాజమౌళి థ్యాంక్యూ నోట్ కూడా రిలీజ్ చేశాడు.(ఇదీ చదవండి: 'కన్నప్ప'కే టెండర్ వేసిన మంచు మనోజ్?)మహేశ్ బాబు హీరోగా రాజమౌళి ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. చాన్నాళ్ల క్రితమే హైదరాబాద్ లో షూటింగ్ మొదలుపెట్టారు కానీ ప్రకటించలేదు. ఒడిశాలోని కోరాపుట్ కొండలపై మహేశ్-పృథ్వీరాజ్-ప్రియాంక చోప్రా(Priyanka Chopra) తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇందుకు సంబంధించి ఓ వీడియో కూడా ఆ మధ్య లీకైంది.అలా వార్తల్లో నిలిచిన SSMB 29 ఇప్పుడు ఒడిశా షెడ్యూల్ ముగించుకుంది. ఈ మేరకు కోరాపుట్ హాస్పిటాలిటీకి రాజమౌళి ధన్యవాదాలు చెప్పాడు. మరిన్ని అడ్వెంచర్స్ చేసేందుకు మళ్లీ ఇక్కడికి వస్తానని అన్నాడు. దిగువన రాజమౌళి, ప్రియాంక చోప్రా సంతకాలు చేసిన ఓ నోట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అలానే సెట్ లో మహేశ్, ప్రియాంక, రాజమౌళితో పలువురు దిగిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి.(ఇదీ చదవండి: చిరంజీవికి ముద్దు.. ఈ ఫొటో వెనక ఇంత కథ ఉందా?) -
ఒకప్పటి మావోయిస్టుల కంచుకోటలో మహేశ్ బాబు సినిమా షూటింగ్!
ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోటగా ఉన్నటువంటి ఒడిశాలోని కొరాపుట్ జిల్లా నేడు సినిమా షూటింగ్స్తో సందడిగా మారింది. 15 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు దేశ ప్రజల దృష్టిని ఆకర్షించేవి. అయితే ప్రస్తుతం అంతా మారిపోయింది. ప్రకృతి అందాలకు ప్రసిద్ధిగాంచిన ఈ ప్రాంతం సినీ తారల ఆటపాటలతో కళకళలాడుతోంది. దీంతో ఒకప్పుడు ఈ ప్రాంతానికి బదిలీపై రావాలంటే భయపడిన అధికారులే నేడు బదిలీకి ముచ్చటపడుతున్నారు. లక్షలాది మంది దేశ, విదేశీయులు విహార యాత్రలకు కోసం తరలివస్తున్నారు. రాజమౌళి షూటింగ్ షురూ పాన్ ఇండియా దర్శకుడు రాజమౌళి కొద్దిరోజుల క్రితం సామాన్య వ్యక్తి మాదిరిగా విశాఖపట్నం నుంచి రోడ్డు మార్గంలో వస్తూ ఈ ప్రాంత అందాలను తిలకించారు. దీనిలో భాగంగా కొరాపుట్ జిల్లా సిమిలిగుడ పట్టణంలోని ఒక ప్రైవేటు హోటల్లో స్టే చేశారు. ఇక్కడి అందాలను గమనించి తాను ప్రస్తుతం సూపర్స్టార్ మహే‹Ùబాబుతో చేస్తున్న సినిమా షూటింగ్ షురూ చేశారు. దీంతో ఈ ప్రాంతం సందడిగా మారింది. ప్రస్తుతం సిమిలిగుడ ప్రాంతంలోని హోటళ్లలో గదులు దొరకడం లేదు. ఆంధ్ర సరిహద్దు సాలూరుకి కూతవేటు దూరంలో దేవమాలి పర్వతంపై ఈ సినిమా తీస్తున్నారు. అందువలన ప్రతిరోజూ ఆంధ్ర, ఒడిశా ప్రాంతాల నుంచి వందలాది మంది అభిమానులు తారలను చూసేందుకు తరలి వస్తున్నారు.తప్పని లీకుల గోల రాజమౌళి బృందం పటిష్ట చర్యలు తీసుకుంటున్నప్పటికీ లీకుల బెడద తప్పడం లేదు. మహేష్బాబుని విలన్ అనుచరులు నెట్టుకుంటూ వస్తుండగా, విలన్ వీల్ చైర్ మీద ఉండడం, మహేష్ బాబు అక్కడకి చేరడం వంటి వీడియోలు లీకయ్యాయి. ఇవి కొరాపుట్ జిల్లాలో, సోషల్ మీడియాలో ఆదివారం వైరల్ అయ్యాయి. ఒక వ్యక్తి సందర్శకుడి మాదిరిగా వచ్చి కారులో కూర్చుని ఈ వీడియో తీసి వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేసినట్లు తెలుస్తోంది. భారీ భద్రత రోజురోజుకీ సందర్శకుల తాకిడి పెరుగుతుండడంతో ప్రభుత్వం ఇక్కడ ప్లాటూన్ పోలీసులను మోహరించింది. ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు సుమారు 80 మంది భద్రతా ఏర్పాట్లలో మునిగి ఉన్నారు. ఇప్పటికే మహేష్బాబు, మళయాల విలన్ పృథ్వీవరాజ్ కరుణాకరణ్లు చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఇంకా హిందీ నటులు ప్రియాంక చోప్రా, జాన్ అబ్రహాంలు రావాల్సి ఉంది. ఒడిశా ప్రభుత్వం కూడా సినిమా నిర్మాణానికి పూర్తి సహకారం అందజేస్తోంది. తద్వారా ఈ ప్రాంతం పర్యటక రంగంలో అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తోంది. ప్రముఖుల హర్షం ప్రస్తుతం రాజమౌళి సినిమా బృందం సందడి చేస్తుండడంపై రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్ష నాయకుడు రాం చంద్ర ఖడం మాట్లాడుతూ.. తెలుగు సినిమా ఇండస్ట్రీ తమ ప్రాంతంలో షూటింగ్ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. అవసరమైతే తాము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు. మరిన్ని తెలుగు సినిమాలు ఇక్కడ షూటింగ్ చేయాలని కోరారు. బీజేడీకి చెందిన కొరాపుట్ జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ సస్మితా మెలక మాట్లాడుతూ.. రాజమౌళి బృందానికి ధన్యవాదాలు తెలిపారు. ఇటువంటి సినిమాలు ఈ ప్రాంతంలో తీయడం వలన స్థానికులకు ఉపాధితో పాటు ఆదాయం వనరులు పెరుగుతాయన్నారు.ఇప్పటివరకు చిత్రీకరణలు ఈ ప్రాంతంలో ఇదివరకే ప్రముఖ చిత్రాలు షూటింగ్ జరుపుకున్నాయి. పుష్ప–2 సినిమాను పక్కనే ఉన్న మల్కన్గిరి జిల్లాలో అత్యధిక భాగం షూటింగ్ చేవారు. ఇటీవల సూపర్హిట్గా నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాని కొరాపుట్ జిల్లాలోనే చిత్రీకరణ చేశారు. అప్పట్లో వేంకటేష్ తదితర నటులు ఈ ప్రాంతంలో పర్యటించారు. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఘాటీ సినిమా కొరాపుట్ జిల్లాలోనే అత్యధిక భాగం షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రజల ముందుకు రానుంది. ఈ సినిమా జయపూర్ మెయిన్ రోడ్డు మీద షూటింగ్ చేయడం గమనార్హం. -
మహేశ్-రాజమౌళి సినిమాపై ఒడిశా డిప్యూటీ సీఎం ట్వీట్
స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబు సినిమాతో బిజీగా ఉన్నాడు. ఒడిశాలో షూటింగ్ జరుగుతోంది. రెండు రోజుల క్రితం చిత్రీకరణలో మహేశ్ పాల్గొన్న వీడియో ఒకటి లీక్ అయింది. దీంతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరిగింది.సరే ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు మహేశ్-రాజమౌళి మూవీపై స్వయంగా ఒడిశా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ప్రవతి పరిడ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇందులో పుష్ప 2 మూవీ గురించి కూడా ప్రస్తావించడం విశేషం.(ఇదీ చదవండి: సినిమాలో ఫైట్స్ నచ్చకపోతే నన్ను చితక్కొట్టండి: టాలీవుడ్ నిర్మాత)'గతంలో మల్కన్ గిరిలో పుష్ప 2, ఇప్పుడు రాజమౌళి తీస్తున్న ssmb29. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్, అంతర్జాతీయ నటి ప్రియాంక చోప్రా.. కోరాపుట్ లో షూటింగ్ లో పాల్గొంటున్నారు. దీనిబట్టి ఒడిశా.. సినిమా చిత్రీకరణకు స్వర్గధామం అని అర్థమవుతోంది. ఇది ఒడిశా పర్యటక రంగానికి కూడా ప్రోత్సాహమే. మా దగ్గర షూటింగ్స్ చేసేందుకు అన్ని భాషా ఇండస్ట్రీలని స్వాగతిస్తున్నాం. మేం పూర్తిస్థాయి మౌళిక సదుపాయాలు కల్పిస్తాం' అని ప్రవిత పరిడ చెప్పుకొచ్చారు.బీజేపీ తరఫున గతేడాది ఎమ్మెల్యేగా గెలిచిన ఈమె.. ఒడిశా రాష్ట్రానికి తొలి మహిళా ఉపముఖ్యమంత్రిగానూ ఘనత సాధించారు. రాబోయే రోజుల్లో మరిన్ని పాన్ ఇండియా మూవీస్ షూటింగ్ జరగడం గ్యారంటీ!(ఇదీ చదవండి: 6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)Before, Pushpa-2 in Malkangiri, and now, renowned director SS Rajamouli's upcoming film SSMB29, starring South superstars Mahesh Babu and Prithviraj Sukumaran, along with internationally acclaimed actress Priyanka Chopra, is being shot in Koraput, proving that Odisha has a wealth…— Pravati Parida (@PravatiPOdisha) March 11, 2025 -
రామాయణం ఆధారంగా...
మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ఇటీవల ఒడిశాలో ప్రారంభమైంది. మహేశ్బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్లు పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు రాజమౌళి.అలాగే మంగళవారం నుంచి ఈ షెడ్యూల్లో ప్రియాంకా చోప్రా కూడా పాల్గొంటున్నారని తెలిసింది. మహేశ్, పృథ్వీరాజ్, ప్రియాంకల కాంబినేషన్ సీన్స్ను చిత్రీకరిస్తున్నారట. కాగా ఈ సినిమా షూటింగ్లోని ఓ వీడియో బయటికొచ్చింది. దీంతో మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నట్లుగా తెలిసింది.అలాగే ఈ చిత్రానికి మైథలాజికల్ టచ్ ఉందని, రామాయణంలోని కొన్ని ముఖ్య సంఘటనలను స్ఫూర్తిగా తీసుకుని, నేటి ఆధునిక కాలానికి అన్వయించి, ఈ కథను విజయేంద్రప్రసాద్ రెడీ చేశారని సమాచారం. కథలో కాశీ నగరానికి కూడా ప్రాముఖ్యత ఉందట... దాంతో కాశీ నగరాన్ని పోలిన సెట్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయాలనే ఆలోచనలో యూనిట్ ఉందని భోగట్టా. -
చరిత్ర తిరగరాస్తోన్న ఛావా.. ఏకంగా బాహుబలి-2 రికార్డ్ను కూడా!
బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన హిస్టారికల్ చిత్రం ఛావా. ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. మొదట హిందీలో మాత్రమే రిలీజైన ఈ సినిమా తిరుగులేని వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇటీవల తెలుగులోనూ విడుదలైన ఛావా కలెక్షన్ల పరంగా అదరగొడుతోంది.తాజాగా ఈ చిత్రం హిందీలో క్రేజీ రికార్డ్ను సొంతం చేసుకుంది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి-2 రికార్డ్ను అధిగమించింది. ప్రభాస్ నటించిన బాహుబలి-2 హిందీలో రూ.510 కోట్ల వసూళ్లు రాబట్టింది. తాజాగా ఛావా చిత్రం ఆ రికార్డ్ను దాటేసింది. కేవలం హిందీలోనే రూ.516 కోట్ల వసూళ్లు చేసింది. కేవలం విడుదలైన 25 రోజుల్లోనే బాహుబలి-2 రికార్డ్ను బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా హిందీ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ఆరో సినిమాగా నిలిచింది. దీంతో విక్కీ కౌశల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.తెలుగులోనూ దూసుకెళ్తోన్న ఛావా..బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'ఛావా' తెలుగులో కూడా భారీ కలెక్షన్స్ నమోదు చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఛావా తెలుగు వర్షన్ కలెక్షన్స్తో పాటు సినిమాలోని క్లైమాక్స్ సీన్ మేకింగ్ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. శంభాజీ మహారాజ్గా విక్కీ కౌశల్ ఈ మూవీ కోసం ఎంతలా కష్టపడ్డారో అందులో చూపించారు. ఔరంగజేబు పాత్రతో అక్షయ్ ఖన్నా మేకింగ్ విధానాన్ని కూడా చూపారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 530 కోట్ల మార్క్ను ఛావా చేరుకుంది. తెలుగు వర్షన్లో మాత్రం కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 10.91 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు గీతా ఆర్ట్స్ పేర్కొంది. -
SSMB29.. ఒక్క వీడియోకే కథ అల్లేస్తున్నారు!
రాజమౌళి-మహేశ్ బాబు కాంబోలో ఓ సినిమా తీస్తున్నారు. దీని షూటింగ్ ప్రస్తుతం ఒడిశాలోని కోరాపుట్ కొండల్లో జరుగుతోంది. అయితే చిత్రీకరణ జరుగుతున్న టైంలో రహస్యంగా తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో లీకైంది. దీన్ని చూసిన చాలామంది ఏకంగా కథ ఇదే అని కొన్ని చెప్పేస్తున్నారు.లీకైన వీడియోలో మహేశ్ బాబు నడుచుకుంటూ వస్తుండగా.. డిఫరెంట్ గా ఉండే వీల్ ఛైర్ లో పృథ్వీరాజ్ కూర్చుని ఉంటాడు. కాసేపటికి మహేశ్ ని మోకాళ్లపై కూర్చోబెడతారు. వీడియో ఇంతవరకే ఉంది. కానీ పలువురు నెటిజన్స్ మాత్రం కథ ఏమై ఉంటుందా అని చెప్పి అల్లేస్తున్నారు.(ఇదీ చదవండి: ప్రభాస్ @ 'బక'.. ఇంతకీ దీని అర్థమేంటి?)పృథ్వీరాజ్ ఏదో నిధి కోసం వెతుకుతుంటాడు. ఈ క్రమంలోనే నడవలేని స్థితికి వెళ్తాడని.. దీంతో మహేశ్ బాబుని ఆ నిధి వెతికేందుకు ఒప్పిస్తాడని.. ఇలా నోటికొచ్చినదంతా మాట్లాడుతూ సోషల్ మీడియాలో డిస్కషన్లు పెట్టేస్తున్నారు. ఇది నిజమా కాదా అనే సంగతి పక్కనబెడితే సినిమా మాత్రం జంగిల్ అడ్వెంచర్ అని మాత్రం తెలుసు.రూ.1000 కోట్ల వరకు బడ్జెట్ తో ఈ సినిమాను తీస్తున్నారని.. ప్రస్తుతం ఒడిశాలో షూటింగ్ జరుగుతోందని.. త్వరలో వైజాగ్, శ్రీలంక, కెన్యా తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరగనుందని సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
రాజమౌళికి భారీ షాక్.. మహేశ్ బాబు వీడియో లీక్!
సాధారణంగా రాజమౌళి(SS Rajamouli) సినిమా షూటింగ్ స్పాట్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. సెట్లోకి ఫోన్లు కూడా అనుమతించడు. చిన్న ఫోటో కూడా బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా షూటింగ్ చేస్తాడు. రిలీజ్ వరకు జనాలకు ఏం చూపించాలనుకుంటాడో అదే చూపిస్తాడు. ఆయన తెరకెక్కించిన గత సినిమాల్లో వీడియో, ఫోటో లీకులు తక్కువే. కానీ మహేశ్ బాబు సినిమా(SSMB29 )కు మాత్రం లీకుల బెడద తప్పడం లేదు. రాజమౌళి ఎంత స్ట్రిక్ట్గా ఉంటున్నా..ఆ సినిమాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు వెళ్తూనే ఉన్నాయి. ఇప్పటికే మహేశ్ లుక్ సంబంధించిన ఫోటో లీకైంది. తాజాగా షూటింగ్కి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చేసింది.సోషల్ మీడియాలో వైరల్ఎస్ఎస్ఎంబీ29(వర్కింగ్ టైటిల్) మూవీ షూటింగ్ ప్రస్తుతం ఒడిశాలో జరుగుతోంది. అక్కడ మహేశ్ బాబుపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈక్రమంలో మహేశ్ షూటింగ్ క్లిప్పు ఒకటి ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. కారులో నుంచి రహస్యంగా ఆ వీడియో రికార్డు చేసినట్లు తెలుస్తోంది.దయచేసి షేర్ చేయకండి.. ఫ్యాన్స్ విజ్ఞప్తిమహేశ్ బాబు(Mahesh Babu) షూటింగ్కి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయ్యొదని విజ్ఞప్తి చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్. ఇలాంటి సినిమాలను బిగ్ స్క్రీన్పైనే చూడాలని, ఇలా వీడియోలు లీక్ చేస్తే ఆ మజా పోతుందని కామెంట్ చేస్తున్నారు. తెలియకుండా ఎవరైనా షేర్ చేసి ఉంటే..వెంటనే ఆ వీడియోని డిలీట్ చేయాలని కోరుతున్నారు. అలాగే చిత్రబృందం కూడా ఆ వీడియో నెట్టింట్లో కనిపించకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరి రాజమౌళి ఈ లీకులపై ఎలా స్పందిస్తారో చూడాలి.రెండు భాగాలుగా..రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. ఈ పీరియాడికల్ ఫారెస్ట్ అడ్వెంచరస్ ఫిల్మ్కి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్తో పాటు ఇతర కీలక పాత్రల్లో ఎవరు నటిస్తునారనే విషయాలను రాజమౌళి గోప్యంగా ఉంచుతున్నారు. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించగా.. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు కథ అందించారు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మించిన ఈ చిత్రం తొలి భాగం 2027లో విడుదలయ్యే అవకాశం ఉందని భోగట్టా. -
journalist Bharadwaj: రాజమౌళికు - శ్రీనివాస్ కు ఉన్న రిలేషన్..?
-
మహేష్ కు విలన్ గా సలార్ ఫ్రెండ్
-
ఫారెస్ట్లో ఫైట్
ఒడిశాలో ల్యాండ్ అయ్యారు మహేశ్బాబు. ఎందుకంటే సినిమా షూటింగ్ కోసం. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ పీరియాడికల్ ఫారెస్ట్ అడ్వెంచరస్ ఫిల్మ్ చిత్రీకరణ ఇటీవల హైదరాబాద్లో మొదలైంది. నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ కోసం చిత్రయూనిట్ ఒడిశాలోని కోరాపుట్ ప్రాంతానికి వెళ్లిందని తెలిసింది. దాదాపు ఇరవై రోజుల వరకు ఈ సినిమా చిత్రీకరణ అక్కడే జరుగుతుందని సమాచారం. గత ఏడాది డిసెంబరు నెల చివర్లో ఒడిశా వెళ్లి, అక్కడి ఫారెస్ట్ లొకేషన్స్ని రాజమౌళి పరిశీలించారు. బుధవారం ఒడిశా వెళ్లారు. దీంతో ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో వచ్చే కొన్ని యాక్షన్ సీక్వెన్స్ల చిత్రీకరణ కూడా జరుగుతుందనే టాక్ వినిపిస్తోంది. ఇక ప్రముఖ నటి–నిర్మాత ప్రియాంకా చోప్రా మలయాళ దర్శక–నిర్మాత–నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారని తెలిసింది. విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు కథ అందించగా, కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా రానుందని, తొలి భాగం 2027లో విడుదలయ్యే అవకాశం ఉందని భోగట్టా. -
ఆ రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా: ఎస్ఎస్ రాజమౌళి
టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) తాజాగా ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ క్షణం కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. మార్చి 22వ తేదీ జరిగే అద్భుతమైన ప్రదర్శన కోసం వెయిట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంతకీ ఆ వివరాలేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.మార్చి 22వ తేదీన హైదరాబాద్ వేదికగా సంగీత దిగ్గజం ఎంఎం కీరవాణి(MM Keeravani) మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహిస్తున్నారని రాజమౌళి వెల్లడించారు. ఆ సంగీత ప్రదర్శన చూసేందుకు తాను కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నానని పేర్కొన్నారు. నా సినిమాలోని పాటలతో పాటు ఆయన చేసిన సాంగ్స్ కూడా ఈ ప్రదర్శనలో ఉంటాయని తెలిపారు. కేవలం పాటలు మాత్రమే కాకుండా.. ఓఎస్టీలు(ఒరిజినల్ సౌండ్ ట్రాక్) కూడా ప్రదర్శించాలని ఎంఎం కీరవాణి డిమాండ్ చేస్తున్నట్లు ట్విటర్ వేదికగా వీడియోను రిలీజ్ చేశారు.కాగా.. రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబు సినిమా పనులతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ కోసం ఇప్పటికే షూటింగ్ లోకేషన్స్ కూడా ఫిక్స్ చేశారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచరస్గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కీలక పాత్రలో కనిపించనుందని టాక్ వినిపిస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. Seeing all the singers share their playlists is making me excited for MMK’s live concert. But what makes me have an edge-of-the-seat experience is imagining him performing the OSTs of our favorite films… Remember peddanna, we are here for the #FullFeastMMK!Not just songs, we… pic.twitter.com/9dS8AeAbse— rajamouli ss (@ssrajamouli) February 28, 2025 -
నాటకాలా? నువ్వు, నీ ఫ్రెండ్ రాజమౌళి రోడ్డుమీద కొట్టుకోండి: నిర్మాత ఫైర్
టాప్ డైరెక్టర్ రాజమౌళి (SS Rajamouli)పై ఆయన సన్నిహితుడు ఉప్పలపాటి శ్రీనివాసరావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇద్దరూ ఒకమ్మాయినే ప్రేమించగా రాజమౌళి కోసం తన ప్రేమను త్యాగం చేశానన్నాడు. అతడి కోసం 34 ఏళ్ల జీవితాన్ని వదులుకున్నానని.. ఎప్పుడైతే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీని సినిమాగా తీస్తానన్నానో అప్పటి నుంచి తనను టార్చర్ పెట్టడం ప్రారంభించాడని ఆరోపించాడు. రాజమౌళి వల్ల తన ప్రాణాలు తీసుకునే పరిస్థితి వచ్చిందని వాపోయాడు.ఫ్రెండ్ అయితే చెవిలో చెప్పాలి!ఈ ఆరోపణలపై టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ (Natti Kumar) ఆగ్రహం వ్యక్తం చేశాడు. 30 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. రాజమౌళి స్టార్ డైరెక్టర్.. ఇప్పుడొచ్చి ఇదంతా చెప్పడం కరెక్ట్ కాదు. నిజంగా ఫ్రెండ్ అనుకుంటే వెళ్లి చెవిలో చెప్పాలి. అయినా ఆయన చేసిన ఆరోపణలు నిరాధారమైనవి. ఎందుకంటే.. ఎప్పుడో ట్రయాంగిల్ లవ్స్టోరీ చేశాం. రాజమౌళి కోసం ప్రేమ త్యాగం చేసి అతడి దగ్గరే అనుచరుడిగా పని చేశానన్నాడు. సడన్గా ఇలా మాట్లాడుతున్నాడంటే.. డబ్బు దగ్గర సమస్య వచ్చిందా?(చదవండి: డ్రాగన్ సక్సెస్.. టాలీవుడ్ యంగ్ హీరోతో ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ!)పిచ్చిపిచ్చి నాటకాలా?ఆయన చేసిన అభియోగాలకు ఏదైనా సాక్ష్యం ఉందా? నేను రాజమౌళికి సపోర్ట్ చేయడం లేదు. ఒకవేళ నిజంగానే రాజమౌళి బెదిరిస్తే పోలీసు దగ్గరకు వెళ్లొచ్చు. కానీ ఇలా బయటకు వచ్చి మాట్లాడటం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఏదో ఒకటి జరిగి ఉండొచ్చు.. కానీ 34 ఏళ్లుగా బయటకు రాని వ్యక్తి ఇప్పుడు వచ్చి మాట్లాడటం తప్పు. ఆ అమ్మాయికి పెళ్లయి పిల్లలు పుట్టి, మనవళ్లు కూడా ఉండొచ్చు. ముసలాడివయ్యాక ఇప్పుడు లవ్స్టోరీ గుర్తొచ్చి బయటపెడతావా? పిచ్చిపిచ్చి నాటకాలా? అమ్మాయితో ఆడుకుంటారా? ఏమైనా ఉంటే మీరిద్దరూ చూసుకోండి..రోడ్డుమీద పడి కొట్టుకోండి..అమ్మాయి మనోభావాలు దెబ్బతినేవిధంగా, ఆమెకు ఇబ్బంది కలిగేవిధంగా మాట్లాడటం తప్పు. మీరిద్దరూ మాట్లాడుకోండి, తిట్టుకోండి, అవసరమైతే రోడ్డుపై కొట్టుకోండి.. కానీ అమ్మాయిని రోడ్డు మీదకు లాగడం కరెక్ట్ కాదు. ఆయన నిజంగా ఆమెను ప్రేమించి ఉంటే తనను ఇబ్బందిపెట్టడం శ్రేయస్కరం కాదు. ఆమెకు నానమ్మ వయసొచ్చాక ఈ విషయాలు చెప్తారా? ఏంటిది? ఇవన్నీ పిచ్చిపిచ్చి వేషాలు అని నట్టికుమార్ మండిపడ్డాడు.చదవండి: ఓపక్క కీమోథెరపీ.. మరోపక్క షూటింగ్స్..: శివరాజ్కుమార్ -
రాజమౌళిపై సంచలన ఆరోపణలు.. ఆమె కోసం నా జీవితాన్ని నాశనం చేశాడు: శ్రీనివాస్
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్పై ఆయన స్నేహితుడు ఉప్పలపాటి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. రాజమౌళి తనను భరించలేనంతగా టార్చర్ చేస్తున్నాడని ఒక సెల్ఫీ వీడియోను సోషల్మీడియాలో షేర్ చేశారు. తమ మధ్య 34 ఏళ్ల స్నేహ బంధం ఉందని ఆయన చెప్పారు. కానీ, రాజమౌళి చేస్తున్న టార్చర్ వల్ల తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు ఆయన తెలిపారు.'భారతదేశంలోనే టాప్ డైరెక్టర్ రాజమౌళి, ఆయన సతీమణి రమా రాజమౌళి వల్ల నేను చనిపోతున్నాను. నేను పబ్లిసిటీ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. ఎమ్ ఎమ్ కీరవాణి, గుణ్ణం గంగరాజు, చంద్ర శేఖర్ యేలేటి, హను రాఘవపూడి, మైత్రీ మూవీస్ చెర్రీ ఇలా చాలామందితో కలిసి నేను పనిచేశాను. వీళ్లందరికీ కూడా రాజమౌళితో నా స్నేహం గురించి తెలుసు. 1990 నుంచి మేమిద్దరం స్నేహితులం. రామాయణం, మహాభారతం ఒక మహిళ వల్ల జరిగాయంటే ఏమో అనుకున్నాం. కానీ, ఒక మహిళ వల్ల మా జీవితం ఇలా అవుతుందని కలలో కూడా ఊహించుకోలేదు. అందరి జీవితాల్లో మాదిరే మా లైఫ్లోకి ఒక అమ్మాయి ప్రవేశించింది. ముందు రాజమౌళితోనే ఆమెకు పరిచయం.. ఆ తర్వాత నాతో కూడా స్నేహం. 'ఆర్య2' సినిమా మాదిరే మా జీవితాల్లోకి ఒక మహిళఆర్య2 సినిమా కథ మాదిరే మా స్టోరీ ఉంటుంది. మేము ముగ్గురం క్లోజ్ కాబట్టి ఏం చేద్దాం అంటూ నేనే రాజమౌళిని అడిగాను. ఆ అమ్మాయిని వదిలేయాలని రాజమౌళినే నన్ను కోరాడు. దానికి నేను ఒప్పుకోలేదు. ముగ్గురం కలిసే ఉందామని చెప్పాను. అలా చేస్తే చాలా చండాలంగా ఉంటుందని రాజమౌళి అన్నాడు. అప్పుడు ఆమెను నేనే పెళ్లి చేసుకుంటానని చెప్పి.. నలుగురం కలిసే ఉందామని కోరాను. దానికి కూడా రాజమౌళి ఒప్పుకోలేదు. కాలం అన్నీ మార్చేస్తుందని చెప్పి ఆమెకు దూరంగా ఉండమని నాకు రాజమౌళి చెప్పాడు. ఈ విషయం నుంచి తప్పుకోవాలని నన్ను కోరడంతో అందుకు ఓకే చెప్పాను. ఇదంతా జరిగింది మా కెరీర్ ప్రారంభం శాంతినివాసం సీరియల్ సమయంలో జరిగింది. అప్పుడు మా అందరి పరిస్థితి అంతంత మాత్రమే కాబట్టి నేను సైలెంట్గా ఉండిపోయాను. కొద్దిరోజుల పాటు నాతో రాజమోళి బాగానే ఉన్నాడు. అయితే, స్టార్ డైరెక్టర్గా రాజమౌళికి ఎప్పుడైతే స్టార్డమ్ వచ్చిందో గొడవలు మొదలుపెట్టాడు. వాడి కోసం నా 34 ఏళ్ల జీవితాన్ని వదులుకున్నాను. మన ట్రైయాంగిల్ స్టోరీని ఒక సినిమా తీస్తానని వాడితో ఒకరోజు అన్నందుకు నాకు నరకం అంటే ఏంటో చూపించాడు. వాడి పిల్లలను కూడా నేను దగ్గరుండే పెంచాను. నంబర్ వన్ డైరెక్టర్ కావడంతో నన్ను అడ్డుతొలిగించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు నాకు 54 ఏళ్లు .. పెళ్లి కూడా చేసుకోలేదు. సింగిల్గానే ఉంటున్నాను. వాడి వల్ల నా జీవితం నాశనం అయింది. ఒక ఫ్రెండ్ వల్ల నా జీవితం ఇలా అయిపోయింది. వాడిని నేను ఏ విషయంలోను డిస్ట్రబ్ చేయలేదు. కానీ, ఈ రహస్యాలన్నీ అందరికీ చెప్పాననుకొని నన్ను టార్చర్ చేస్తున్నాడు. ఇదంతా మా ముగ్గురి మధ్య జరిగింది. నేను చనిపోతున్నాను. ఆ తర్వాత అయినా సరే రాజమౌళికి లై డిటెక్టర్ టెస్ట్ చేయండి. అసలు విషయం తెలుస్తుంది. ఇవన్నీ నా మరణ వాగ్మూలంగా తీసుకోవాలని కోరుతున్నాను.' అంటూ వీడియోలో శ్రీనివాసరావు చెప్పాడు. అయితే, ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలీదు. కేవలం అతను చెబుతున్న ప్రకారం మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ వీడియో గురించి దర్శకులు రాజమౌళి రెస్పాండ్ అవుతారేమో చూడాల్సి ఉంది. అయితే, యమదొంగ సినిమా టైటిల్ కార్డ్లో తన పేరు కూడా ఉంటుందని శ్రీనివాసరావు చెప్పడం గమనార్హం . వివాదంలో స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి జక్కన్న పై సంచలన ఆరోపణలు చేసిన ఆయన స్నేహితుడు యు.శ్రీనివాసరావు. రాజమౌళి టార్చర్ భరించలేని ఆత్మహత్య చేసుకుంటా అంటూ సెల్ఫీ వీడియో, లెటర్. రాజమౌళితో దాదాపు 34 ఏళ్ల స్నేహం ఉందన్న శ్రీనివాసరావు. సెల్ఫీ వీడియో, లెటర్ ఆధారంగా… pic.twitter.com/VKQT3AlfY3— ChotaNews App (@ChotaNewsApp) February 27, 2025 -
మహేష్, ప్రియాంక చోప్రా పై పలు కీలకమైన సన్నివేశాలు చిత్రీకరణ?
-
యాంకర్ రష్మీతో రాజమౌళి లవ్!.. ఇదెప్పుడు జరిగింది?
యాంకర్ రష్మీ గౌతమ్ (Anchor Rashmi Gautam), దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) ప్రేమలో పడ్డారు. రష్మీ అయితే ఓ అడుగు ముందుకేసి తనతో కలిసి డ్యుయెట్ కూడా పాడేసింది. కాకపోతే అది కలలో! ఇదంతా రీల్ లైఫ్లో జరిగింది. వీరిద్దరి ప్రేమకహానీకి సంబంధించిన సన్నివేశం క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రష్మీ గౌతమ్ యాంకర్ అవడానికి ముందు సీరియల్స్ చేసింది. యువ సీరియల్ (Yuva Serial)లో ప్రధాన పాత్రలో నటించింది. ఇదే ధారావాహికలో రాజమౌళి కూడా అతిథి పాత్ర చేసినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన క్లిప్ను నెట్టింట వదిలారు.రాజమౌళితో డ్యుయెట్అందులో ఏముందంటే.. రష్మీ తన స్నేహితురాలితో కలిసి ఓ కెఫెలో కూర్చుంది. ఇంతలో రాజమౌళి అక్కడకు వస్తాడు. అది చూసిన రష్మీ ఫ్రెండ్.. ఇన్నిరోజులు నీకు ఫోన్ చేస్తోంది రాజమౌళియా? అని అడుగుతుంది. అటు రష్మీ మాత్రం తనతో ఇన్నాళ్లూ కబుర్లాడింది రాజమౌళి అని తెలిసేసరికి గాల్లో తేలుతుంది. జింతాత జితా జితా పాటకు తనతో కలిసి స్టెప్పులేస్తున్నట్లు కలగంటుంది. వెంటనే తేరుకుని తన ఫ్రెండ్ను అక్కడినుంచి పంపించేస్తుంది.(చదవండి: సింపుల్గా ఈ టిప్స్ పాటించి బరువు తగ్గాను: హన్సిక)అంకుల్ అయ్యుంటే..ఇంతలో జక్కన్న.. రష్మీ దగ్గరకు వస్తాడు. ఆమె సంతోషంతో.. నేనిదంతా నమ్మలేకపోతున్నాను. ఇన్నిరోజులు నాతో మాట్లాడుతుంది మీరా? అని అడుగుతుంది. అందుకు జక్కన్న రోజులు కాదు గంటలు.. అరగంటకోసారైనా మాట్లాడాలిగా అని డైలాగ్ వదులుతాడు. నేను అంకుల్ అయ్యుంటే ఏం చేసేవాడివని ప్రశ్నించగా పర్లేదు, నేను ఆంటీనయ్యేదాన్ని అని రష్మీ రిప్లై ఇచ్చింది. త్వరగా వెళ్లిపోవాలని రాజమౌళి అంటే అప్పుడే వెళ్లాలా అని అతడి చేయి నిమురుతుంది. రాజమౌళికి ప్రపోజ్ చేసిన రష్మీఏంటో చెప్పమని ఆరా తీస్తే రష్మి కనురెప్పలు టపాటపా కొడుతుంది. అది అర్థం చేసుకోలేని రాజమౌళి కళ్లు మండుతున్నాయా? అని అడుగుతాడు. దీంతో హీరోయిన్ కోపంతో ఊగిపోతూ షటప్.. దానర్థం ఐ లవ్యూ... నీక్కూడా తెలీదా? అని అరిచేస్తుంది. ఇది చూసిన జనాలు ఇదెప్పుడు జరిగిందని ఆశ్చర్యపోతున్నారు. రాజమౌళి కళాకారుడే.. రష్మిది చిన్న వయసు కాదన్నమాట.. ఇదెక్కడి కాంబినేషన్రా మావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కింగ్ నాగార్జున.. 2007లో యువ సీరియల్ నిర్మించారు. ఇందులో రష్మీ ప్రధాన పాత్రలో నటించింది. Whatttt!!! Rajamouli and rashmi ideppudu jarigindi 😭 pic.twitter.com/nHM2LwyuCI— EpicCommentsTelugu (@EpicCmntsTelugu) February 18, 2025చదవండి: ఆర్థిక ఇబ్బందుల్లో సమంత వెబ్ సిరీస్.. వెలుగులోకి భారీ స్కామ్ -
లాజిక్ లేకపోయినా రాజమౌళి సినిమాలు సూపర్హిట్టు: కరణ్ జోహార్
కొన్ని సినిమాలకు లాజిక్తో పని లేదంటున్నాడు బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ (Karan Johar). కథపై నమ్మకం ఉంటే చాలు అవి హిట్టవుతాయంటున్నాడు. తాజాగా కరణ్ జోహార్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. మనం ఎంచుకున్న కథను నమ్మడం అన్నింటికన్నా ముఖ్యమైనది. కొందరు ఉత్తమ దర్శకులనే ఉదాహరణగా తీసుకోండి.. వారు లాజిక్స్ను పట్టించుకోకుండా కథను నమ్మడం వల్లే పెద్ద విజయాలు అందుకున్నారు.లాజిక్ లేకపోయినా..సినిమా నచ్చితే లాజిక్ను ఎవరూ పట్టించుకోరు. ఉదాహరణకు రాజమౌళి (SS Rajamouli) సర్ సినిమాలే తీసుకోండి. ఆయన తీసిన సినిమాల్లో లాజిక్స్ గురించి జనాలు మాట్లాడుకుంటారా? లేదు కదా.. ఆయనకు కథపై పూర్తి నమ్మకం ఉంటుంది. ఎలాంటి సన్నివేశాన్నైనా ప్రేక్షకులకు నమ్మకం కలిగేలా తెరకెక్కించగలరు. యానిమల్, ఆర్ఆర్ఆర్, గదర్.. ఈ సినిమాలన్నింటికీ ఇదే ఫార్ములా వర్తిస్తుంది. ప్రేక్షకులు నమ్మారుఒక వ్యక్తి సింగిల్ హ్యాండ్తో వెయ్యిమందిని కొడుతున్నట్లు చూపించినప్పుడు అది ఎలా సాధ్యం? అని ఎవరూ లెక్కలు వేయరు. సన్నీ డియోల్ (Sunny Deol)కు వెయ్యి మందిని ఓడించే శక్తి ఉందని అనిల్ శర్మ నమ్మాడు. అదే వెండితెరపై చూపించాడు. ప్రేక్షకులూ అదే విశ్వసించారు. అందుకే గదర్ 2 అంత పెద్ద బ్లాక్బస్టర్ హిట్టయింది. దర్శకులు తమ కథను నమ్మినప్పుడే విజయాలు సాధించగలరు. చేసే పనిని సందేహించినా, ఆడియన్స్ ఏమనుకుంటారోనని లాజిక్పై ఎక్కువ ఫోకస్ పెట్టినా సమస్యలు చుట్టుముట్టడం ఖాయం' అని చెప్పుకొచ్చాడు.నిర్మాతగా ఫుల్ బిజీకరణ్ జోహార్ ప్రస్తుతం 'సన్నీ సంస్కారి కీ తులసి కుమారి' సినిమా నిర్మిస్తున్నాడు. శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ ధావన్, జాన్వీ కపూర్, సన్య మల్హోత్రా, రోహిత్ శరఫ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే కరణ్ తన ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లో అక్షయ్కుమార్- మాధవన్ల కేసరి: చాప్టర్ 2తో పాటు కార్తీక్ ఆర్యన్తో మరో సినిమా చేస్తున్నాడు.చదవండి: ఓటీటీ సెన్సేషన్.. జాన్వీ కపూర్ కంటే గొప్ప నటి.. అయినా పట్టించుకోరే? -
SSMB 29: మహేశ్కి జక్కన్న కండీషన్.. నిర్మాతకు రూ. కోటి సేఫ్!
రాజమౌళి(SS Rajamouli )తో సినిమా అంటే నటీనటులు ఎంత ఇష్టపడతారో అంతే భయపడతారు కూడా. ఒక్కసారి ఆయనతో సినిమా కమిట్ అయితే చాలు.. షూటింగ్ పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరు ఆయన మాట వినాల్సిందే. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే జక్కన్న పెట్టే కండీషన్స్ ఫాలో అవ్వాల్సిందే. ప్రస్తుతం ఈ దర్శకధీరుడు మహేశ్ బాబు(Mahesh Babu)తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే షూటింగ్ కూడా ప్రారంభమైంది. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ మూవీ కాబట్టి… ఖర్చుల దగ్గర జక్కన్న చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అనవసరపు ఖర్చులు తగ్గించి, ఆ డబ్బంతా సినిమా క్వాలిటీ కోసం ఖర్చు చేయబోతున్నారట. ఈ నేపథ్యంలో జక్కన్న ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెట్లో ప్లాస్టిక్ని పూర్తిగా నిషేదించారట. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ని సెట్లోకి అనుమతించట్లేదట. మహేశ్బాబుతో సహా ప్రతి ఒక్కరు ఈ రూల్ని పాటించాల్సిందేనట.నిర్మాతలకు రూ.కోటి వరకు సేఫ్రాజమౌళి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్లో రోజుకు దాదాపు రెండు వేల మంది వరకు పాల్గొంటున్నారట. అంత మందికి వాటర్ బాటిళ్లు అందించడం అంటే చాలా ఖర్చు అవుతుంది. అందుకే సెట్లో గాజు బాటిళ్లను ఏర్పాటు చేయిస్తున్నారట. దాహం వేస్తే ప్రతి ఒక్కరు దీనితోనే నీళ్లు తాగాలట. పర్సనల్గా తెచ్చుకున్న ప్లాస్టిక్ బాటిల్ అయితే ఉండొద్దని చెప్పారట. అలాగే ప్లాస్టిక్ వస్తువులను కూడా తప్పనిసరి పరిస్థితుల్లోనే వాడలని చెప్పారట. వీలైనంత వరకు ప్లాస్టిక్ని నిషేదించాలని యూనిట్ని ఆదేశించారట. దీని వల్ల నిర్మాతకు దాదాపు రూ. కోటి వరకు సేఫ్ అవుతుందట. ఈ నిర్ణయం కారణంగా డబ్బు ఆదా అవ్వడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు సహాయపడినట్లు అవుతుందని జక్కన్న ప్యామిలీ భావిస్తుందట. ఈ ఆలోచన కీరవాణి సతీమణి వల్లీకి వచ్చిందట. ఆమె చెప్పడంతోనే రాజమౌళి ప్లాస్టిక్ బాటిళ్లను నిషేదించారట.మహేశ్ సినిమాకు టైటిల్ కష్టాలు..మహేశ్- రాజమౌళి కాంబినేషన్లో సినిమా వస్తుందని చాలా రోజుల కిందటే ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ తర్వాత తాను మహేశ్తో సినిమా చేస్తున్నానని రాజమౌళి ప్రకటించినప్పటికీ.. కథ అప్పటికీ ఫిక్స్ కాలేదు. ఆర్ఆర్ఆర్ రిలీజైన కొద్ది రోజులకి ఈ కథపై దృష్టి పెట్టాడు. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో మాత్రం జక్కన్నకు ఇంకా క్లారిటీ రాలేదట. గతంలో గరుడ, మహారాజ్ లాంటి టైటిల్స్ వినిపించినా... ఏది ఫైనల్ కాలేదు. ప్రస్తుతం షూటింగ్ చేస్తూనే టైటిల్ ఫైనల్ చేసే పనిలో ఉంది జక్కన్న టీమ్. టైటిల్ పెట్టే వరకు మీడియాకు దూరంగా ఉండాలని, ఎలాంటి ఈవెంట్స్ నిర్వహించొద్దని రాజమౌళి ఆదేశించారట. అందుకే ఎలాంటి హడావుడి లేకుండా షూటింగ్ని ప్రారంభించారు. టైటిల్ ఫిక్స్ అయిన తర్వాత చిన్న టీజర్ని రిలీజ్ చేస్తూ టైటిల్ని వెల్లడించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట. -
'ఆర్ఆర్ఆర్'లో రామ్ చరణ్ ఎంట్రీ సీన్ ఎలా తీశారో తెలుసా..?
ఎన్టీఆర్(NTR), రామ్చరణ్(Ram charan) ఇద్దరు స్టార్ హీరోలతో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్.. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీని రాజమౌళి(Raja mouli) తెరకెక్కించారు. పాన్ ఇండియా రేంజ్లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయతే, ఇందులో రామ్చరణ్ ఎంట్రీ సీన్ను ఎలా క్రియేట్ చేశారో ఒక వీడియో ద్వారా మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ సన్నివేశం అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా మెప్పిస్తుంది. సుమారు 10 నిమిషాల పాటు ఎంతో ఉత్కంఠభరితంగా ఈ సీన్ కొనసాగుతుంది.తారక్ ఎంట్రీ సీన్కు ఎంత పాపులారిటీ వచ్చిందో రామ్ చరణ్ ఎంట్రీ కూడా అంతే బజ్ను క్రియేట్ చేస్తుంది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతీయులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతారు. సుమారు 900 మంది ఓ పోలీస్స్టేషన్ ఎదుట నినాదాలు చేస్తూ ఉంటారు. అయితే, వారిని కట్టడి చేసేందుకు ఎవరూ సాహసించరు. కానీ, పోలీస్ అధికారి అయిన రామ్చరణ్ రంగంలోకి దిగి అక్కడి పరిస్థితిని కంట్రోల్ చేస్తారు. రామరాజుగా చరణ్ చూపిన తెగువకు బ్రిటిష్ అధికారులే ఆశ్చర్యపోతారు. ఈ ఒక్క సీన్ క్రియేట్ చేసేందుకు 32 రోజులు పడినట్లు మేకర్స్ చెప్పారు. అలాంటి సీన్ను ఎలా క్రియేట్ చేశారో మీరు చూసేయండి. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ఎలా తెరకెక్కించారో పూర్తిగా తెలుసుకోవాలంటే.. 'ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్' అనే పేరుతో ఒక డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. -
మహేశ్ మూవీలో విలన్?
మహేశ్బాబు మూవీలో విలన్గా నటించనున్నారట ప్రియాంకా చోప్రా. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ ఫిల్మ్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా ఓ కీలక పాత్రకు ఎంపికయ్యారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇటీవల ప్రియాంకా చోప్రా హైదరాబాద్ రావడం, కొన్ని రోజులు ఇక్కడే ఉండటం వంటి అంశాలు ఈ మూవీలో ఆమె భాగమయ్యారనే విషయాన్ని పరోక్షంగా స్పష్టం చేస్తున్నట్లుగా ఉన్నాయి. కాగా ఈ మూవీలో ప్రియాంకా చోప్రా హీరోయిన్గా నటిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ ఆమె చేయనున్నది హీరోయిన్ రోల్ కాదని, నెగటివ్ షేడ్స్ ఉన్న విలన్ రోల్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఇటీవల మహేశ్–ప్రియాంక పాల్గొనగా హైదరాబాద్లో షూట్ జరిగింది. ఇది టెస్ట్ షూట్ అని, కాదు రెగ్యులర్ షూట్ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. -
కెన్యా కాలింగ్?
మహేశ్బాబు(Mahesh Babu) హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో అడ్వెంచరస్ యాక్షన్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ అతి కానుందని సమాచారం. హైదరాబాద్ శివార్లలో ఈ సినిమా కోసం భారీ సెట్ వర్క్ జరుగుతోంది. అలాగే గత ఏడాది అక్టోబరులో దర్శకుడు రాజమౌళి(Rajamouli) కెన్యా వెళ్లి, అక్కడి లొకేషన్స్ను పరిశీలించిన సంగతి గుర్తుండే ఉంటుంది.ముందుగా ఈ సినిమా షూటింగ్ కెన్యాలోనే ప్రారంభం అవుతుందని, ఆ దిశగా రాజమౌళి ఆల్రెడీ ఏర్పాట్లు పూర్తి చేశారని ఫిల్మ్నగర్ భోగట్టా. ఇక ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా ఓ కీలక పాత్రలో నటించనున్నారు. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ లీడ్ రోల్ చేస్తారనే ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతోంది. అయితే ఈ విషయంపై ఇంకా ఏదీ ఫైనలైజ్ కాలేదని, ఏదైనా ఉంటే మేమే చెబుతామని పృథ్వీరాజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027లో విడుదల కావొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు కీరవాణి స్వరకర్త. -
మహేశ్ బాబు- రాజమౌళి ప్రాజెక్ట్లో సలార్ హీరో.. క్లారిటీ ఇదే!
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు- దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో భారీ అడ్వెంచరస్ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ మూవీకి 'ఎస్ఎస్ఎంబీ29' అనే వర్కింగ్ టైటిల్ను ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పనులతో రాజమౌళి బిజీగా ఉన్నారు. ఇప్పటికే షూటింగ్ లోకేషన్స్ కోసం విదేశాలకు సైతం వెళ్లివచ్చారు మన డైరెక్టర్.అయితే ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త తెగ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లో సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా చేయనున్నారని నెట్టింట టాక్ నడుస్తోంది. సలార్తో తెలుగులోనూ సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సుకుమారన్ మహేశ్బాబు చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న వార్తలపై పృథ్వీరాజ్ సుకుమారన్ స్పందించారు. ప్రస్తుతం మలయాళంలో ఎంపురాన్ మూవీలో నటిస్తోన్న ఆయన దీనిపై క్లారిటీ ఇచ్చారు.నాకంటే మీకే ఎక్కువ విషయాలు తెలుస్తున్నాయని మీడియాతో అన్నారు. మహేశ్ బాబు చిత్రంలో నటించే విషయం గురించి ఇప్పుడే చెప్పలేను.. ప్రస్తుతానికైతే చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. అయితే ఇంకా ఏదీ ఫైనల్ కాలేదని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఓకే అయ్యాక ఈ విషయం గురించి మాట్లాడుకుందామని పృథ్వీరాజ్ సుకుమారన్ వెల్లడించారు. సలార్తో మరింత్ స్టార్డమ్ సొంతం చేసుకున్న పృథ్వీరాజ్.. సలార్-2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. సలార్ సమయంలో ప్రభాస్ నుంచి చాలా నేర్చుకున్నానని అన్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో భారీ బడ్జెట్తో ఎస్ఎస్ఎంబీ29 చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ భామ ప్రియాకం చోప్రాను హీరోయిన్గా ఎంపిక చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఇటీవలే ఆమె హైదరాబాద్లోని చిలుకురు బాలాజీ ఆలయాన్ని సందర్శించారు. కొత్త ప్రయాణం మొదలైంది అంటూ ఫోటోలను కూడా షేర్ చేశారు. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. -
సెట్లో ఫోన్లు నిషిద్ధం.. మహేశ్బాబు సహా అందరితో అగ్రిమెంట్!
రాజమౌళి (SS Rajamouli) సినిమా అంటే అంచనాలు ఆకాశాన్నంటాల్సిందే! అందులోనూ తెలుగు సూపర్స్టార్ మహేశ్బాబు (Mahesh Babu)తో అంటే బాక్సాఫీస్ను బ్లాస్ట్ చేసేందుకు జక్కన్న ఏదో గట్టిగా ప్లాన్ చేశాడనే అర్థం. వీరిద్దరి కాంబోలో ఇటీవలే #SSMB29 సినిమా లాంచ్ చేశారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథ రెండు భాగాలుగా రానుంది. తొలి భాగం ప్రేక్షకుల ముందుకు రావడానికి కనీసం రెండేళ్లయినా పట్టొచ్చని టాక్! ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) నటించనున్నట్లు ఒక వార్త తెగ వైరలవుతోంది.షూటింగ్ షురూ?!ఇప్పటికే తన సినిమా కోసం ఒక సింహాన్ని లాక్ చేసినట్లు ఓ పోస్ట్ పెట్టాడు రాజమౌళి. అంటే మహేశ్బాబును తన ప్రాజెక్ట్ కోసం లాక్ చేశానని చెప్పకనే చెప్పాడు. అలాగే షూటింగ్ షురూ అని కూడా హింట్ ఇచ్చాడు. ఈ పోస్టుకు మహేశ్బాబు స్పందిస్తూ.. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అని రిప్లై ఇచ్చాడు. ప్రియాంక చోప్రా.. ఫైనల్లీ అని కామెంట్ పెట్టింది. ఇదిలా ఉంటే తన సినిమా కోసం రాజమౌళి చాలా జాగ్రత్తపడుతున్నాడట! అగ్రిమెంట్ఎట్టి పరిస్థితుల్లోనూ కథ, షూటింగ్ క్లిప్స్, సినిమాలో నటించేవారి గురించి ఎలాంటి వివరాలు బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నాడట. ఈ విషయంలో చిత్రయూనిట్కు హెచ్చరికలు జారీ చేశాడట. నటీనటులు, సాంకేతిక నిపుణులతో నాన్ డిస్క్లోజ్ అగ్రిమెంట్ (NDA) చేయించినట్లు తెలుస్తోంది. మహేశ్బాబు, ప్రియాంక చోప్రాతోనూ ఈ ఒప్పందంపై సంతకం చేయించారట! ఈ అగ్రిమెంట్ ప్రకారం సినిమాకు సంబంధించిన ఏ చిన్న విషయాన్ని కూడా యూనిట్ సభ్యులు బయటకు చెప్పేందుకు వీల్లేదు. లీక్ చేశారంటే భారీ మూల్యం..దర్శకనిర్మాతల అనుమతి లేకుండా ఎవరైనా సమాచారాన్ని లీక్ చేస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదు. అలాగే హీరోతో సహా సెట్లో ఉన్న ఎవరూ ఫోన్లు తీసుకురావడానికి అనుమతి లేదని తెలుస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో తీస్తున్న సినిమా కాబట్టి ఆమాత్రం జాగ్రత్తలు పాటిస్తే తప్పేం కాదంటున్నారు సినీప్రియులు. జక్కన్న ప్లాన్ బానే ఉంది.. మరి ఆచరణ ఏమేరకు సాధ్యమవుతుందో చూడాలి! View this post on Instagram A post shared by SS Rajamouli (@ssrajamouli) చదవండి: గేమ్ ఛేంజర్ డిజాస్టర్పై స్పందించిన అంజలి.. బాధేస్తోందంటూ.. -
రాజమౌళిపై ట్రోలింగ్.. 'మీరు ఇండియన్స్ కాదా?'
కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం (జనవరి 25న) పద్మ అవార్డులు (Padma Awards 2025) ప్రకటించింది. వీటిలో ఏడు పద్మ విభూషణ్, 19 పద్మ భూషణ్, 113 పద్మ శ్రీ పురస్కారాలున్నాయి. వీటిని అందుకున్నవారిలో ఏడుగురు తెలుగువారు ఉన్నారు. వైద్య విభాగంలో దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి పద్మ విభూషణ్ అందుకున్నారు. కేఎల్ కృష్ణ (విద్యా సాహిత్యం) , మాడుగుల నాగఫణి శర్మ (కళా రంగం), మందకృష్ణ మాదిగ (ప్రజా వ్యవహారాలు), మిరియాల అప్పారావు (కళారంగం), వి. రాఘవేంద్రాచార్య పంచముఖి (సాహిత్యం, విద్య)లను పద్మశ్రీ వరించాయి. కళల విభాగంలో నందమూరి బాలకృష్ణ పద్మ భూషణ్కు ఎంపికయ్యారు.తెలుగువారికి ఏడు పద్మ పురస్కారాలుఈ సందర్భంగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli సోషల్ మీడియా వేదికగా వారిని అభినందిస్తూ ట్వీట్ చేశాడు. 'ఈసారి తెలుగువారికి ఏడు పద్మ అవార్డులు రావడం సంతోషకరం. పద్మ భూషణ్కు ఎంపికైన నందమూరి బాలకృష్ణగారికి అభినందనలు. పద్మ పురస్కారం గెల్చుకున్న తెలుగువారితో పాటు, ఇతర భారతీయులకు శుభాకాంక్షలు అని రాసుకొచ్చాడు. మరో ట్వీట్లో బాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కపూర్, తమిళ స్టార్ అజిత్ను ప్రశంసించాడు.బేధాలు దేనికి?ఇది కొంతమందికి అస్సలు మింగుడుపడలేదు. తెలుగువారు అని ప్రత్యేకంగా వర్ణించడం దేనికని విమర్శిస్తున్నారు. 'తెలుగువారు దేశంలో భాగం కాదా? ఎందుకని ప్రాంతాల మధ్య అడ్డుగోడ కడుతున్నారు?', 'తెలుగుప్రజలు భారతీయులు కాదా?' అని ప్రశ్నిస్తున్నారు. 'ఉత్తరాది, దక్షిణాది మధ్య విభేదాల గురించి చర్చే లేదు. కానీ మీలాంటివాళ్లు మాత్రం ఈ అంశాన్ని బాగా వాడుకుంటారు. నార్త్ జనాలు మీ సినిమాలకు ఎందుకు సపోర్ట్ చేస్తారో నాకిప్పటికీ అర్థం కాదు. మనమంతా భారతీయులం అని చెప్పే ధైర్యం లేని వాళ్లకు మద్దతు దేనికి?' అని హిందీ ఆడియన్స్ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు.పుట్టిన గడ్డ తర్వాతే ఏదైనా..ఈ ట్రోలింగ్ చూసిన తెలుగు సినీ ప్రియులు, అభిమానులు వారికి ధీటుగా రిప్లై ఇస్తున్నారు. పుట్టిన గడ్డ ఎవరికైనా తల్లితో సమానం. మొదటగా ప్రాంతం.., తర్వాతే దేశం వస్తుంది. అయినా రాజమౌళి తన ట్వీట్లో నార్త్, సౌత్ అని ఎక్కడా తేడా చూపించలేదు. తన మాతృభాషకు చెందిన వారికి అవార్డులు వస్తే సంతోషపడ్డాడంతే.. మీ హాఫ్ నాలెడ్జ్తో ఆయన్ను విమర్శించకండి అని బుద్ధి చెప్తున్నారు. రాజమౌళి ప్రస్తుతం మహేశ్బాబుతో సినిమా చేస్తున్నాడు. ఇందులో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్నట్లు తెలుస్తోంది.7 Padma Awards for Telugu people this time… 👏🏻👏🏻👏🏻👏🏻Heartiest congratulations to Nandamuri Balakrishna garu on being honored with the Padma Bhushan! Your journey in Indian cinema is truly commendable… Also, congratulations to all the other distinguished Telugu & other…— rajamouli ss (@ssrajamouli) January 25, 2025 చదవండి: క్యాన్సర్తో పోరాటం.. అన్నీ వదిలేసి నటికి సపర్యలు చేస్తున్న ప్రియుడు -
SSMB29 తొలి రోజే 1000 కోట్లు కొల్లగొడతాడా?
-
మహేశ్బాబు సినిమా కోసం 'ప్రియాంక చోప్రా' భారీ రెమ్యునరేషన్
మహేశ్బాబు(Mahesh Babu) - దర్శకధీరుడు రాజమౌళి SSMB29 భారీ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. అయితే, ఇందులో ప్రియాంక చోప్రా(Priyanka Chopra) కూడా నటిస్తున్నారు. ఆమె రెమ్యునరేషన్ గురించి నెట్టింట పెద్ద చర్చ నడుస్తుంది. ప్రియాంక చోప్రా సుమారు దశాబ్ధం పాటు బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా కొనసాగారు. అదే సమయంలో ఆమె హాలీవుడ్లో అవకాశాలు దక్కించుకుని పలు ప్రాజెక్ట్లలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా అక్కడ రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆమె అమెరికాలో స్థిరపడ్డారు. అయితే సుమారు పదేళ్ల తర్వాత ఒక ఇండియన్ (తెలుగు) సినిమాలో ప్రియాంక నటిస్తుండటం విశేషం. ఆమె ఎప్పుడో 2015 సమయంలో ఒప్పుకున్న 'ది స్కై ఈజ్ పింక్' చిత్రం 2019లో విడుదలైంది. బాలీవుడ్లో ఇదే ఆమె చివరి సినిమా.భారీ రెమ్యునరేషన్బాలీవుడ్కు మించిన రెమ్యునరేషన్లు తెలుగు చిత్ర పరిశ్రమ ఇస్తుంది. టాలీవుడ్లో ఇప్పటివరకు అత్యధిక పారితోషికం కల్కి సినిమా కోసం దీపికా పదుకోన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఆమె ఏకంగా సుమారు రూ. 20 కోట్లు తీసుకున్నట్లు అప్పట్లో భారీగా వార్తలు వచ్చాయి. అయితే, SSMB29 ప్రాజెక్ట్ కోసం ప్రియాంక చోప్రా ఏకంగా రూ.25 కోట్లు రెమ్యునరేషన్గా తీసుకుంటున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతుంది. కానీ, హాలీవుడ్ మీడియా మాత్రం సుమారు రూ. 40 కోట్లు వరకు ఉంటుందని కథనాలు ప్రచురించాయి. ఆమెకు అంత పెద్ద మొత్తంలో పారితోషికం ఇచ్చేందుకు నిర్మాత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.అంత మొత్తం ఇవ్వడానికి కారణం ఇదేప్రియాంక చోప్రా మార్కెట్ బాలీవుడ్లో భారీగానే ఉంది. చాలా గ్యాప్ తర్వాత ఆమె నటించిన సినిమా వస్తుండటంతో హిందీ బెల్ట్లో మంచి బిజినెస్ చేసే ఛాన్స్ ఉంది. ఆపై హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా ప్రియాంక అప్పీయరెన్స్ సినిమాకు ప్లస్ అవుతుంది. SSMB29 ప్రాజెక్ట్ను హాలీవుడ్ రేంజ్లో జక్కన్న ప్లాన్ చేశాడు. దీంతో సులువుగా అక్కడి మార్కెట్కు సినిమా రీచ్ అవుతుందని తెలుస్తోంది. ఈ లెక్కలన్నీ వేసుకునే ప్రియాంక చోప్రాకు భారీ మొత్తంలో ఆఫర్ చేసినట్లు టాక్. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా వస్తే.. అప్పుడు ఆమె రెమ్యునరేషన్ లెక్కలు మారిపోతాయి. ఏదేమైనా అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా ప్రియాంక చోప్రా రికార్డ్ క్రియేట్ చేశారని ఆమె అభిమానులు చెప్పుకుంటున్నారు.హాలీవుడ్లో ఫుల్ బిజీబాలీవుడ్లో ఎన్నో సూపర్హిట్ సినిమాలలో నటించిన ప్రియాంక 'క్వాంటికో' అనే టెలివిజన్ సిరీస్తో హాలీవుడ్ చిత్ర పరిశ్రమకు దగ్గరయ్యారు. ఆ తర్వాత బేవాచ్, ఏ కిడ్ లైక్ జాక్,లవ్ అగైన్,టైగర్, వుయ్ కెన్ బీ హీరోస్, ది వైట్ టైగర్ తదితర చిత్రాలలో నటించి ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా పలు షోలకు హోస్ట్గా వ్యవహరించి అక్కడి వారిని మెప్పించారు. హాలీవుడ్కి చెందిన ప్రముఖ పాప్ సింగర్ నిక్ జోనాస్ని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెకు అదనపు గుర్తింపు లభించింది. -
సింహాన్ని లాక్ చేసిన రాజమౌళి.. స్పందించిన మహేశ్బాబు, ప్రియాంక
మహేశ్బాబు- ఎస్ఎస్ రాజమౌళి సినిమా పనులు ప్రారంభమయ్యాయి. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత భారీ ప్రాజెక్ట్గా ఈ మూవీపై అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్ శివారు ప్రాంతంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో 'SSMB 29' చిత్రాన్ని లాంచ్ చేశారు. చిత్ర యూనిట్తో పాటు మహేశ్బాబు(Mahesh Babu) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. కానీ, ఈ సినిమా కార్యక్రమానికి సంబంధించి చిత్ర యూనిట్ నుంచి ఆ సమయంలో ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. అయితే, తాజాగా జక్కన్న తన ఇన్స్టాగ్రామ్లో ఒక ఫోటో షేర్ చేసి అభిమానుల్లో జోష్ పెంచాడు.మహేశ్బాబు అభిమానుల దృష్టి అంతా SSMB29 సినిమాపైనే ఉంది. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రాజమౌళి( S. S. Rajamouli) ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఒక వీడియోను పంచుకున్నారు. ఒక సింహాన్ని లాక్ చేసినట్లు అందులో ఉంది. అంటే మహేశ్ను తన ప్రాజెక్ట్ కోసం లాక్ చేసినట్లు చెప్పేశాడు. జక్కన్న పోస్ట్కు కామెంట్ బాక్స్లో మహేశ్బాబు కూడా 'ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను..' అంటూ రెస్పాండ్ అయ్యాడు. ఆపై నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar) కూడా చప్పట్ల ఎమోజీతో చిత్ర యూనిట్కు ఆల్ ది బెస్ట్ చెప్పింది. అయితే, 'ఫైనల్లీ' అంటూ బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కామెంట్ బాక్స్లో రియాక్ట్ కావడం విశేషం. ఇలా జక్కన్న చేసిన పోస్ట్కు చాలామంది సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. జక్కన్న పాస్పోర్ట్ చూపిస్తూ సింహం ఫోటోతో పోజ్ ఇచ్చారు. దీంతో SSMB29 సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లేనని మహేశ్ అభిమానులు అనుకుంటున్నారు.'ఫైనల్లీ' తేల్చేసిన ప్రియాంక చోప్రాహీరోయిన్ ప్రియాంక చోప్రా ఇప్పటికే హైదరాబాద్లో అడుగుపెట్టారు. SSMB29 ప్రాజెక్ట్ కోసమే ఆమె ఇక్కడకు వచ్చినట్లు తేలిపోయింది. తాజాగా రాజమౌళి చేసిన పోస్ట్కు ఫైనల్లీ అంటూ ఆమె రెస్పాండ్ అయ్యారు. దీంతో మహేశ్బాబు- ఎస్ఎస్ రాజమౌళి సినిమాలో ప్రియాంక చోప్రానే హీరోయిన్ అని క్లారిటీ వచ్చేసింది. సింగర్, యాక్టర్ నిక్ జోనాస్తో పెళ్లి తర్వాత అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో స్థిరపడిన ప్రియాంక. చాలా రోజుల తర్వాత హైదరాబాద్లో అడుగుపెట్టారు. ఈ చిత్రంలో మహేశ్బాబుకి జోడీగా నటించే హీరోయిన్ల జాబితాలో ప్రియాంకా చోప్రా, కియారా అద్వానీ, ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. ఫైనల్గా ప్రియాంకా చోప్రాని కథానాయికగా ఫిక్స్ చేశారని పరోక్షంగా క్లారిటీ వచ్చేసింది. త్వరలో అధికారికంగా ప్రకటన రావచ్చు అని తెలుస్తోంది.‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజమౌళి.. ఇప్పుడు హాలీవుడ్ రేంజ్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ చూడని సరికొత్త ప్రపంచాన్ని ఈ చిత్రంలో రాజమౌళి ఆవిష్కరించబోతున్నారని రచయిత విజయేంద్రప్రసాద్ ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథ రెండు భాగాలుగా రానుంది. తొలి భాగాన్ని 2027లో విడుదల చేస్తారని ప్రచారంలో ఉంది. ఈ ప్రాజెక్ట్లో హాలీవుడ్ నటీనటులతో పాటు టెక్నీషియన్స్ కూడా ఇందులో భాగం కానున్నారు. View this post on Instagram A post shared by SS Rajamouli (@ssrajamouli) -
లాస్ ఏంజెల్స్ టు హైదరాబాద్
ప్రముఖ హీరోయిన్ ప్రియాంక చోప్రా హైదరాబాద్లో అడుగుపెట్టారు. అందులో విషయం ఏముందీ అనుకోవచ్చు. సింగర్, యాక్టర్ నిక్ జోనాస్తో పెళ్లి తర్వాత అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో స్థిరపడ్డారు ప్రియాంక. ఇప్పుడు ఇలా హైదరాబాద్లో అడుగుపెట్టడానికి కారణం ఏంటి? అనేది హాట్ టాపిక్గా మారింది. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూ΄పొందనున్న సినిమా కోసమే ఆమె భాగ్యనగరానికి చేరుకున్నారని టాక్. ఈ చిత్రంలో మహేశ్బాబుకి జోడీగా నటించే హీరోయిన్ల జాబితాలో ప్రియాంకా చోప్రా, కియారా అద్వానీ, ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. ఫైనల్గా ప్రియాంకా చోప్రాని కథానాయికగా ఫిక్స్ చేశారని భోగట్టా. ప్రియాంకా చోప్రా లాస్ ఏంజెల్స్ నుంచి హైదరాబాద్కి చేరుకోవడంతో ఈ మూవీ చిత్రీకరణ కోసమే ఆమె వచ్చారనే రూమర్లు వినిపిస్తున్నాయి. మరి... ఈ వార్త ఎంతవరకూ నిజమో తెలియాల్సి ఉంది. -
దేశ సినీ చరిత్రలోనే మొదటిసారి.. ఆవిష్కరించిన రాజమౌళి
టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అన్నపూర్ణ స్టూడియోస్లో సందడి చేశారు. మనదేశంలోనే మొట్టమొదటిసారి ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన డాల్బీ పోస్ట్ ప్రొడక్షన్(Dolby Technology)ను ప్రారంభించారు. సినీ ఇండస్ట్రీలో ఇండియాలో ఇప్పటివరకు అందుబాటులో లేని డాల్బీ-సర్టిఫైడ్ పోస్ట్ ప్రొడక్షన్ ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకొచ్చారు. చిత్ర నిర్మాణంలో ఈ అత్యాధునిక సాంకేతికతను వినియోగించి ఆడియో, విజువల్ ఎఫెక్ట్స్ను ప్రపంచస్థాయి ప్రమాణాలతో సినిమాటిక్ అనుభూతిని కలిగించేలా సినిమాలను తెరకెక్కించనున్నారు. ఆడియన్స్కు సినిమాటిక్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ టెక్నాలజీని ఏర్పాటుచేశారు. అది కూడా మన హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో ప్రారంభించడం మరో విశేషం.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ.. 'ఆర్ఆర్ఆర్ సమయంలో డాల్బీ విజన్లో సినిమాను అప్ గ్రేడ్ చేయాలనుకున్నా. కానీ ఆ టెక్నాలజీ మనదగ్గర లేదు. దాని కోసం మేము జర్మనీ వరకు ప్రయాణించాల్సి వచ్చింది. ఇది నాకు కొంత వరకు నిరుత్సాహానికి గురిచేసింది. నా సొంత దేశంలో నా సినిమాని డాల్బీ విజన్లో చూడలేకపోయానని నిరాశకు గురయ్యా. కానీ ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్లో డాల్బీ విజన్ గ్రేడింగ్ సదుపాయాన్ని చూసి థ్రిల్ అయ్యా. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే నా నెక్ట్స్ మూవీ విడుదలయ్యే సమయానికి భారతదేశం అంతటా బహుళ డాల్బీ సినిమాలు ఉంటాయి. డాల్బీ విజన్లో సినిమా చూడటం పూర్తిగా ప్రత్యేకమైన అనుభవాన్ని ఇస్తుంది. ప్రతి ఫ్రేమ్లోని కథనాన్ని సరికొత్త స్థాయికి తీసుకువెళ్తుంది. ప్రేక్షకులు ఈ డాల్బీ సదుపాయాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నా" అని అన్నారు.అనంతరం నాగార్జున మాట్లాడుతూ..'వర్చువల్ ప్రొడక్షన్లో అగ్రగామిగా ఉండటం కోసం ఎల్లప్పుడు ముందుంటాం. దేశంలోనే మొట్టమొదటి డాల్బీ సర్టిఫైడ్ పోస్ట్ప్రొడక్షన్ ఫెసిలిటీని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. భారతీయ సినిమాను వరల్డ్ మ్యాప్లో ఉంచేందుకు ప్రయత్నం చేస్తాం. అన్నపూర్ణ స్టూడియోస్ తన 50వ సంవత్సరాన్ని జరుపుకుంటున్న సందర్భంగా డాల్బీని ఏర్పాటు చేయడం విశేషం. అత్యాధునికి టెక్నాలజీతో నూతన ఆవిష్కరణలకు మరో ముందడుగు"అని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్ఆర్ఆర్కు సంబంధించిన స్పెషల్ ఫుటేజ్ను అన్నపూర్ణ స్టూడియోస్లో ప్రదర్శించారు.మహేశ్ బాబుతో రాజమౌళి..కాగా.. టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించనున్న చిత్రం త్వరలోనే పట్టాలెక్కనుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి డైరెక్షన్లో వస్తోన్న మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు తొలిసారిగా టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుతో జతకట్టనున్నారు మన జక్కన్న. ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్పై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈనెల చివరి వారంలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్లు తెలిపారు. జనవరి 2న హైదరాబాద్లోని రాజమౌళి ఆఫీస్లోనే చిత్రయూనిట్ సభ్యుల సమక్షంలో ఈ పూజా కార్యక్రమం జరగనుంది.హీరోయిన్పై చర్చ..కాగా.. మహేశ్బాబు - రాజమౌళి కాంబినేషన్ చిత్రంపై మరోవైపు రూమర్స్ భారీగా వస్తూనే ఉన్నాయి. వీరిద్దరి సినిమా తీస్తున్నట్లు ప్రకటన వచ్చిన సమయం నుంచి ఈ ప్రాజెక్టపై ప్రేక్షకులు అమితాసక్తిని చూపుతున్నారు. టైటిల్ వంటి తదితర వివరాల కోసం నెట్టింట ఆరా తీస్తున్నారు. SSMB 29 పేరుతో ఈ ప్రాజెక్ట్ పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కనుంది. ఇటీవల ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అనే అంశం సోషల్మీడియాలో ట్రెండింగ్ అయింది. -
మహేశ్బాబు- రాజమౌళి భారీ ప్రాజెక్ట్ ప్రారంభం
మహేశ్బాబు- ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కబోతున్న అత్యంత భారీ ప్రాజెక్ట్ సినిమా ప్రారంభమైంది . గురువారం హైదరాబాద్ శివారు ప్రాంతంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో అధికారికంగా 'SSMB 29' చిత్రాన్ని లాంచ్ చేశారు. చిత్ర యూనిట్తో పాటు మహేశ్బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కానీ, ఈ సినిమా కార్యక్రమానికి సంబంధించి చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు.‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజమౌళి.. ఇప్పుడు హాలీవుడ్ రేంజ్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ చూడని సరికొత్త ప్రపంచాన్ని ఈ చిత్రంలో రాజమౌళి ఆవిష్కరించబోతున్నారని రచయిత విజయేంద్రప్రసాద్ ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథ రెండు భాగాలుగా రానుంది. తొలి భాగాన్ని 2027లో విడుదల చేస్తారని ప్రచారంలో ఉంది. ఈ ప్రాజెక్ట్లో హాలీవుడ్ నటీనటులతో పాటు టెక్నీషియన్స్ కూడా ఇందులో భాగం కానున్నారు. అయితే, హీరోయిన్ ప్రియాంక చోప్రా నటించనున్నట్లు ఒక వార్త భారీగా వైరల్ అయింది.ఈ సినిమాలో మహేశ్ సరికొత్తగా కనిపించనున్నారు. ఆ పాత్ర కోసం చాలా రోజులుగా ఆయన కసరత్తులు కూడా చేస్తున్నారు. ఈ సమ్మర్లో చిత్రీకరణ కూడా రాజమౌళి ప్రారంభించనున్నారు. అందుకోసం ఆయన ఇప్పటికే పలు లొకేషన్స్ కూడా సెర్చ్ చేసిన విషయం తెలిసిందే. ఒడిశాతో పాటు ఆఫ్రికా వంటి అడవుల్లో ఆయన పర్యటించారు. దుర్గా ఆర్ట్స్పై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. -
గేమ్ ఛేంజర్ ట్రైలర్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా గేమ్ ఛేంజర్ రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ మూవీ ట్రైలర్ డేట్, ముహుర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. ట్రైలర్ జనవరి 1న విడుదల చేస్తామని ఇటీవల విజయవాడలో దిల్ రాజు ప్రకటించారు. కానీ ఒక రోజు ఆలస్యంగా రెండో తేదీకి మారింది. హైదరాబాద్లోనే గేమ్ ఛేంజర్ ట్రైలర్ను రిలీజ్ చేస్తున్నారు. అయితే మెగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఆయన చేతుల మీదుగానే గేమ్ ఛేంజర్ ట్రైలర్ను విడుదల చేయనున్నారు. గురువారం సాయంత్రం 05:04 గంటలకు గేమ్ ఛేంజర్ ట్రైలర్ విడుదల కానుంది.(ఇది చదవండి: గేమ్ ఛేంజర్ కటౌట్ వరల్డ్ రికార్డ్.. ట్రైలర్ డేట్ ప్రకటించిన దిల్ రాజు)256 అడుగుల రామ్ చరణ్ కటౌట్..ఇటీవల ఏపీలో రామ్ చరణ్ భారీ కటౌట్ను ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు. విజయవాడలో దాదాపు 256 అడుగులతో ఏర్పాటు చేసిన కటౌట్ను నిర్మాత దిల్ రాజు ఆవిష్కరించారు. ఈ భారీ కటౌట్కు వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కింది. ఈ సందర్భంగా దిల్ రాజుకు అవార్డ్ను అందజేశారు. కాగా.. రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో ఈ కటౌట్ను సిద్ధం చేశారు. ఈ భారీ కటౌట్కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోనూ చోటు దక్కింది.కాగా.. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలో కోలీవుడ్ సూపర్ స్టార్ ఎస్జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. Drum roll, please 🥁The one and only @ssrajamouli is making a spectacular entry at the #GameChangerTrailer launch on January 2nd! 😎💥See you tomorrow at 5:04 PM!#GameChanger#GameChangerOnJAN10 🚁Global Star @AlwaysRamCharan @shankarshanmugh @advani_kiara @yoursanjali… pic.twitter.com/sdrTfzxLMi— Sri Venkateswara Creations (@SVC_official) January 1, 2025 -
క్రేజీ కాంబో.. రాజమౌళి- మహేశ్ బాబు మూవీ అప్డేట్ వచ్చేసింది!
టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించనున్న చిత్రం త్వరలోనే పట్టాలెక్కనుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి డైరెక్షన్లో వస్తోన్న మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు తొలిసారిగా టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుతో జతకట్టనున్నారు మన జక్కన్న. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్పై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాన్ని జనవరి 2న నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. న్యూ ఇయర్ వేళ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈనెల చివరి వారంలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్లు తెలిపారు. హైదరాబాద్లోని రాజమౌళి ఆఫీస్లోనే చిత్రయూనిట్ సభ్యుల సమక్షంలో ఈ పూజా కార్యక్రమం జరగనుంది.కాగా.. మహేశ్బాబు - రాజమౌళి కాంబినేషన్ చిత్రంపై మరోవైపు రూమర్స్ భారీగా వస్తూనే ఉన్నాయి. వీరిద్దరి సినిమా తీస్తున్నట్లు ప్రకటన వచ్చిన సమయం నుంచి ఈ ప్రాజెక్టపై ప్రేక్షకులు అమితాసక్తిని చూపుతున్నారు. టైటిల్ వంటి తదితర వివరాల కోసం నెట్టింట ఆరా తీస్తున్నారు. SSMB 29 పేరుతో ఈ ప్రాజెక్ట్ పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కనుంది. ఇటీవల ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అనే అంశం సోషల్మీడియాలో ట్రెండింగ్ అయింది.హీరోయిన్గా ప్రియాంక చోప్రా..?ఫుల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ జనవరి 2025 నుంచి ప్రారంభం కానుంది. అయితే, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ క్రమంలో హీరోయిన్ను ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్కు బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా అయితే ఆ పాత్రకు న్యాయం చేయగలదని చిత్ర యూనిట్ భావించిందట. ఈ కథలో హీరోతో పాటు హీరోయిన్ పాత్రకు కూడా ఎక్కువ ప్రాధాన్యం ఉందని టాక్. అందుకే ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో ఎక్కువగా విదేశీ నటులు కనిపించనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఆమె పలు హాలీవుడ్ చిత్రాలలో కూడా నటించిన విషయం తెలిసిందే. ప్రియాంకా చోప్రాను డైరెక్టర్ రాజమౌళి పలుమార్లు కలిసినట్లు బాలీవుడ్ మీడియా కూడా వెల్లడించింది. ఈ సినిమాలో నటించేందుకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే, ఇండోనేషియా నటి 'చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్' ఈ చిత్రంలో నటిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. చెల్సియా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రాజమౌళిని ఫాలో అవుతుండడంతో ఆ వార్తలు నిజమేనని నమ్మారు. మరి ఆమె పాత్ర ఈ చిత్రంలో ఏ మేరకు ఉంటుందో తెలియాల్సి ఉంది. -
సీక్రెట్స్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ బై రాజమౌళి
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో ఆర్ఆర్ఆర్ – బిహైండ్ అండ్ బియాండ్ ఒకటి. ఈ డాక్యుమెంటరీ గురించి తెలుసుకుందాం.తన ఉనికిని తెలిపేందుకు ఓ గదిలో నలుగురు ముందు చప్పట్లు కొడితే ఆ నలుగురికి తన విషయం తెలియవచ్చు. కానీ అదే ఉనికి ప్రపంచానికి తెలియాలంటే సరిగ్గా రాజమౌళిలా ఆలోచించాలి. భారతదేశానికి ఒకప్పుడు సినిమా ప్రమోషన్ను ఓ వినూత్న పంథాలో పరిచయం చేసిన బాలీవుడ్ దిగ్గజం అమిర్ ఖాన్ కూడా తాను ఈ విషయంలో రాజమౌళినే ఫాలో అవుతాననడం దీనికి ఓ నిదర్శనం. చరిత్ర అనేది రాజమౌళి ముందు ఉన్నది తరువాత ఉంటుంది, కానీ ఆ చరిత్రలో రాజమౌళికి ఓ చెరగని పేజీ ఉంటుందనేది మాత్రం నిర్వివాదాంశం.తెలుగు సినిమా వైభవాన్ని ఎన్నో అంతర్జాతీయ వేదికలపైన నిలిపిన శిల్పి రాజమౌళి. మరీ ముఖ్యంగా తెలుగు సినిమాకి ఆస్కారమే లేదన్న ఆస్కార్ పురస్కారాన్ని అద్భుతంగా అందించిన అత్యున్నత దర్శకులు రాజమౌళి. తన సినిమా అంటేనే ఓ సంచలనం. మరి... ఆ సంచలనం వెనకున్న సీక్రెట్ తెలుసుకోవాలని ప్రతి దర్శకుడితో పాటు సామాన్య ప్రేక్షకుడికి కూడా ఆసక్తి ఉంటుంది. ఆ కోవలోనే రాజమౌళి తీసిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి సంబంధించిన తన కష్టాన్ని ఓ చక్కటి డాక్యుమెంటరీ రూపంలో ‘ఆర్ఆర్ఆర్ – బిహైండ్ అండ్ బియాండ్’ పేరిట నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంచారు.దాదాపు రెండున్నర గంటల పై నిడివి ఉన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను నాలుగేళ్ల పాటు తీశారు. ఈ డాక్యుమెంటరీలో ఆ సినిమా మొత్తాన్ని ఎలా తీశారో రాజమౌళి వ్యాఖ్యానంతో పాటు సినిమాలోని నటీనటులు టెక్నీషియన్్స కూడా వివరిస్తూ చూపించడం ఎంతో బాగుంది. తన ఈ ‘ఆర్ఆర్ఆర్’ ప్రయాణానికి సంబంధించి ఎన్నో తెలియని, చూడని అద్భుత విషయాలను ప్రేక్షకులకు అందంగా అందించారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి... ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన ఫుటేజ్ కొన్ని గంటల రూపంలో ఉంటే దానిని ఎడిట్ చేసి, గంటన్నర నిడివితో అందించారట. ఈ సమాజమనేది ఓ సృష్టి.ప్రతిరోజూ మన మనుగడ ఈ సృష్టికి అనుగుణంగానే ఉంటుంది. ఓ రకంగా సినిమా అన్నది కూడా ఓ సృష్టే. ఓ దర్శకుడి ఆలోచనకు ప్రతిరూపమే సినిమా అన్న ఓ అద్భుత సృష్టి, కానీ ఈ సినిమా సృష్టిలో ఎంతోమంది కష్టం ఉంటుంది. మరి... అటువంటి సినిమాను ఏ విధంగా రూపొందించారో ఆ రహస్యాలు మీరు కూడా తెలుసుకోవాలంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న ‘ఆర్ఆర్ఆర్ – బిహైండ్ అండ్ బియాండ్’ని చూసేయండి. వర్త్ టు వాచ్ అండ్ ప్రిజర్వ్ ద డాక్యుమెంటరీ ఫర్ ది ఫ్యూచర్ కిడ్స్. – ఇంటూరు హరికృష్ణ -
మహేశ్బాబు - రాజమౌళి సినిమాలో స్టార్ హీరోయిన్
మహేశ్బాబు - రాజమౌళి కాంబినేషన్ చిత్రంపై రూమర్స్ భారీగా వస్తూనే ఉన్నాయి. వారిద్దరూ కలిసి సినిమా తీస్తున్నట్లు ప్రకటన వచ్చిన సమయం నుంచి ఈ ప్రాజెక్టపై ప్రేక్షకులు అమితాసక్తిని చూపుతున్నారు. టైటిల్ వంటి తదితర వివరాల కోసం నెట్టింట ఆరా తీస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అనే అంశం సోషల్మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.SSMB 29 పేరుతో ఈ ప్రాజెక్ట్ పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కనుంది. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ 2025 మార్చి నుంచి ప్రారంభం కానుంది. అయితే, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ను ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్కు బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా అయితే ఆ పాత్రకు న్యాయం చేయగలదని చిత్ర యూనిట్ భావించిందట. ఈ కథలో హీరోతో పాటు హీరోయిన్ పాత్రకు కూడా ఎక్కువ ప్రాధాన్యం ఉందని టాక్. అందుకే ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆమె పలు హాలీవుడ్ చిత్రాలలో కూడా నటించిన విషయం తెలిసిందే. ప్రియాంకా చోప్రాను డైరెక్టర్ రాజమౌళి పలుమార్లు కలిసినట్లు బాలీవుడ్ మీడియా కూడా వెల్లడించింది. ఈ సినిమాలో నటించేందుకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే, ఇండోనేషియా నటి 'చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్' ఈ చిత్రంలో నటిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. చెల్సియా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రాజమౌళిని ఫాలో అవుతుండడంతో ఆ వార్తలు నిజమేనని నమ్మారు. మరి ఆమె పాత్ర ఈ చిత్రంలో ఏ మేరకు ఉంటుందో తెలియాల్సి ఉంది.గ్లోబల్ లెవెల్లో భారీ బడ్జెట్తో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తి అయినట్లు తెలుస్తోంది. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో ఎక్కువగా విదేశీ నటులు కనిపించనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దుర్గా ఆర్ట్స్పై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. -
ఓటీటీలోకి వచ్చేసిన 'ఆర్ఆర్ఆర్' డాక్యుమెంటరీ
ఆర్ఆర్ఆర్.. టాలీవుడ్ కీర్తిని ఆస్కార్ రేంజ్కు ఈ చిత్రం తీసుకెళ్లింది. ఈ సినిమాకు సంబంధించి తెరవెనుక జరిగిన ఆసక్తికర విషయాలను 'ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్' పేరుతో థియేటర్స్లో విడుదల చేశారు. ఇప్పుడు ఓటీటీలో కూడా రిలీజ్ చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని మూడు గంటల పాటు చూసి అందరూ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఆ సినిమా వెనక దాగి ఉన్న మూడేళ్ల కష్టాన్ని చూపించాలని మేకర్స్ అనుకున్నారు.ఎన్టీఆర్, రామ్చరణ్ నటించిన ఈ చిత్రానికి ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించారు. 2022లో విడుదలైన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించారు. పీరియాడిక్ యాక్షన్ చిత్రంగా హిట్ కొట్టిన ఈ చిత్రంలో అలియాభట్, ఓలివియా మోరిస్, అజయ్ దేవ్గణ్, శ్రియ, అలీసన్ డూడీ, దివంగత నటుడు రే స్టీవెన్ సన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. 'ఆర్ఆర్ఆర్- బిహైండ్ అండ్ బియాండ్' పేరుతో డాక్యుమెంటరీని సిద్ధం చేశారు రాజమౌళి. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలుపెట్టిన సమయం నుంచి 'ఆస్కార్' అందుకునే వరకూ జరిగిన ఆసక్తికర సంఘటనలను ప్రేక్షకులకు పరిచయం చేశారు. డిసెంబరు 20వ తేదీ నుంచి ఎంపిక చేసిన మల్టీప్లెక్స్ స్క్రీన్లలో మాత్రమే దీనిని విడుదల చేశారు. అయితే, ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో విడుదల చేశారు. ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ జక్కన్నకు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు. డిసెంబర్ 27 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతన్న 'ఆర్ఆర్ఆర్- బిహైండ్ అండ్ బియాండ్' డాక్యుమెంటరీని మీరూ చూసేయండి. దీని రన్టైమ్ 1 గంట 38 నిమిషాలు ఉంది. ఇప్పటివరకూ బయటకు రాని ఆసక్తికర విషయాలను ఇందులో పంచుకున్నారు. -
రాజమౌళికి ఛాలెంజ్ విసిరే సినిమాతో రాబోతున్న డైరెక్టర్ అట్లీ..
-
వారం రోజుల్లోనే ఓటీటీకి ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ
దర్శకధీరుడు తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ 'ఆర్ఆర్ఆర్'. ఈ మూవీకి సంబంధించిన డాక్యుమెంటరీ చిత్రం ఈనెల 20న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్ అనే పేరుతో ఈ డాక్యుమెంటరీ చిత్రం తెరకెక్కించారు. ఆర్ఆర్ఆర్ మూవీ జర్నీ గురించి ఈ మూవీలో చూపించారు. తాజాగా ఈ డాక్యుమెంటరీ మూవీ ఓటీటీ రిలీజ్ తేదీని రివీల్ చేసింది చిత్రబృందం. ఈనెల 27 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు.కాగా.. 2022లో వచ్చిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా పలు రికార్డులు సృష్టించింది. ఈ సినిమాతో టాలీవుడ్ పేరు వరల్డ్ వైడ్గా మార్మోగింది. ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ దక్కించుకుంది. మరోవైపు రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుతో సినిమా చేయనున్నారు. ఆ మూవీ పనులతో ఆయన బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాదిలో సెట్స్పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.Behind the scenes, beyond the legacy. Watch RRR: Behind and Beyond, an exclusive peek into the making of SS Rajamouli’s magnum opus on Netflix, out 27 December!#RRRBehindAndBeyondOnNetflix pic.twitter.com/Py9pyL7Nws— Netflix India South (@Netflix_INSouth) December 23, 2024 -
ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ చిత్రం.. ట్రైలర్ వచ్చేసింది!
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్. ఈ మూవీ ఆస్కార్ అవార్డ్ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ను సాధించింది. ఇటీవల ఈ మూవీకి సంబంధించి డాక్యుమెంటరీని రూపొందిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్ అనే పేరుతో డాక్యుమెంటరీ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు.తాజాగా ఈ డాక్యుమెంటరీ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే ఆర్ఆర్ఆర్ షూటింగ్ సమయంలో జరిగిన సన్నివేశాలతో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ డాక్యుమెంటరీని డిసెంబర్ 20న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.కాగా.. 2022లో వచ్చిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా పలు రికార్డులు సృష్టించింది. ఈ సినిమాతో టాలీవుడ్ పేరు వరల్డ్ వైడ్గా మార్మోగింది. ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ దక్కించుకుంది. మరోవైపు రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుతో సినిమా చేయనున్నారు. ఆ మూవీ పనులతో ఆయన బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాదిలో సెట్స్పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.Hear and watch out… From the first clap on the sets to the standing ovation at the Oscars stage, #RRRBehindAndBeyond brings it all to you. 🔥🌊❤️#RRRMovie In select cinemas, 20th Dec. pic.twitter.com/EfJLwFixFx— RRR Movie (@RRRMovie) December 17, 2024 -
రాజమౌళి-మహేశ్ మూవీలో ఇంటర్నేషనల్ బ్యూటీ!
బాలీవుడ్ హీరోయిన్, మాజీ మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రా, హీరో మహేశ్బాబుకి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్నగర్ వర్గాలు. మహేశ్బాబు హీరోగా రాజమౌళి ఓ సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ‘ఎస్ఎస్ఎమ్బి 29’ అనే వర్కింగ్ టైటిల్తో ఈ చిత్రం రూపొంనుంది. ఈ సినిమా కోసం పొడవాటి జుట్టు, గుబురు గడ్డం, మీసాలతో సరికొత్త లుక్లోకి మారిపోయారు మహేశ్బాబు. దుర్గా ఆర్ట్స్పై కేఎల్ నారాయణ నిర్మించనున్న ఈ సినిమా 2025లో ప్రారంభం కానుంది. దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో రెండు భాగాలుగా రూపొందనున్న ఈ సినిమాలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ ఈ మూవీని అనువదించనున్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమాకి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఈ సినిమాలో మహేశ్బాబు సిక్స్ప్యాక్లో కనిపిస్తారని టాక్. ఇదిలా ఉంటే... ఈ చిత్రంలో మహేశ్బాబుకి జోడీగా నటించే హీరోయిన్ల జాబితాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా ప్రియాంకా చోప్రా కథానాయికగా నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి. ప్రముఖ సింగర్, యాక్టర్ నిక్ జోనాస్తో వివాహం తర్వాత అమెరికాలో స్థిరపడ్డ ప్రియాంక కేవలం హాలీవుడ్ చిత్రాలపైనే దృష్టి పెట్టారు. అయితే ‘సిటాడెల్ సీజన్– 1’లో నటించిన ఆమె సీజన్ 2లో కూడా నటిస్తున్నారు. ఇక అబ్దుల్ మాజిద్ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటించిన తమిళ సినిమా ‘తమిళన్’ (2002) మూవీతో హీరోయిన్గా పరిచయమైన ప్రియాంక చోప్రా తర్వాత దక్షిణాది సినిమాల్లో నటించకుండా కేవలం బాలీవుడ్కే పరిమితమయ్యారు. అయితే రామ్చరణ్కి జోడీగా ‘జంజీర్’ (2013) చిత్రంలో నటించినప్పటికీ అది స్ట్రైట్ బాలీవుడ్ మూవీ. ఒకవేళ ఆమె మహేశ్బాబు–రాజమౌళి కాంబో చిత్రంలో నటిస్తారన్న వార్త నిజమైతే అప్పుడు చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత దక్షిణాదిలో ప్రియాంకా చోప్రా నటించినట్లు అవుతుంది. -
బాహుబలి సెంటిమెంట్ తో మహేష్, రాజమౌళి సినిమా..
-
స్టెప్పులతో ఇరగదీసిన రాజమౌళి, వీడియో వైరల్
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు, హీరో శ్రీసింహ పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు మురళీ మోహన్ మనవరాలు రాగ మాగంటితో శ్రీసింహ కొత్త జీవితం ప్రారంభించనున్నాడు. వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో భాగంగా సంగీత్ వేడుక నిర్వహించారు. అన్న కుమారుడి పెళ్లిలో దర్శకధీరుడు రాజమౌళి డ్యాన్స్తో ఇరగదీశాడు.మాస్ డ్యాన్స్మాస్ మహారాజ- పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలోని లంచ్కొస్తావా.. మంచ్కొస్తావా.. పాటకు స్టెప్పులేశాడు. స్టేజీపై భార్యతో కలిసి రాజమౌళి మాస్ స్టెప్పులు వేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.సినిమాశ్రీసింహ విషయానికి వస్తే.. ఇతడు 'యమదొంగ' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించాడు. తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్ తదితర సినిమాల్లో హీరోగా యాక్ట్ చేశాడు. 'మత్తు వదలరా' సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. #SSRajamouli Garu 🕺👌 pic.twitter.com/WaU66KvHDe— TalkEnti (@thetalkenti) December 14, 2024చదవండి: రూ.1 కోటి ప్రశ్నకు కరెక్ట్ గెస్.. కానీ రూ.50 లక్షలే గెలిచింది! -
తన వన్ సైడ్ ప్రేమకథ బయటపెట్టిన రాజమౌళి
డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి పేరు చెప్పగానే 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్', 'మగధీర' లాంటి అద్భుతమైన సినిమాలే గుర్తొస్తాయి. రాజమౌళి ఫ్యామిలీ గురించి చాలావరకు ప్రేక్షకులకు తెలుసు. ఇప్పటివరకు చాలా ఇంటర్వ్యూల్లో పాల్గొన్నాడు. కానీ ఇప్పుడు రానా టాక్ షోలో పాల్గొని.. తన ఇంటర్మీడియట్ ప్రేమకథని బయటపెట్టాడు.'ద రానా దగ్గుబాటి షో' పేరుతో నటుడు రానా ఓ టాక్ షోని హోస్ట్ చేస్తున్నాడు. అమెజాన్ ప్రైమ్లో ప్రతి వీకెండ్ ఒక్కో ఎపిసోడ్ రిలీజ్ చేస్తున్నారు. ఇదివరకే నాని, సిద్ధు జొన్నలగడ్డ-శ్రీలీల, నాగచైతన్య తదితరులు పాల్గొన్న ఎపిసోడ్స్ స్ట్రీమింగ్లోకి వచ్చాయి. తాజాగా రాజమౌళి-రాంగోపాల్ వర్మతో మాట్లాడిన ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. ఇందులో భాగంగానే రాజమౌళి తన లవ్ స్టోరీ బయటపెట్టాడు.(ఇదీ చదవండి: ఇంటికొచ్చేసిన అల్లు అర్జున్.. మీడియాతో ఏమన్నాడంటే?)'ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఓ అమ్మాయి ఉండేది. ఆమె అంటే ఇష్టముండేది. కానీ మాట్లాడాలంటే భయం. మా క్లాసులో అబ్బాయిలందరికీ తెలుసు, నేను ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నానని. నన్ను ఈ విషయమై ఏడిపించేవారు. మొత్తం ఏడాదిలో ఒకేఒక్కసారి ఆమెతో మాట్లాడాను. చాలా కష్టం మీద మాట్లాడాను. ట్యూషన్ ఫీజ్ కట్టావా? అని అడిగాను' అని రాజమౌళి చెప్పాడు. దీంతో రానా పగలబడి నవ్వాడు. ఈ సంభాషణ అంతా చూసి చాలామంది 90స్ కుర్రాళ్లు తమని తాము రాజమౌళి మాటల్లో చూసుకుంటున్నారు.చివరగా 'ఆర్ఆర్ఆర్' మూవీతో ప్రేక్షకుల్ని అలరించిన రాజమౌళి.. మహేశ్ బాబుతో కొత్త సినిమా చేయబోతున్నారు. చాన్నాళ్లుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. వచ్చే ఏడాది వేసవి నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటివరకు టైమ్ ఉండటంతో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇలా ఇంటర్వ్యూల్లో కనిపిస్తున్నాడు. (ఇదీ చదవండి: కావాలనే జైల్లో ఉంచారు.. పోలీసులపై కేసు పెడతాం: బన్నీ లాయర్) -
పుష్ప-2 మూవీ వీక్షించిన దర్శకధీరుడు.. ఏ థియేటర్లో చూశాడంటే?
డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన పుష్పరాజ్ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతున్నాడు. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.829 కోట్ల వసూళ్లతో సినీ చరిత్రలో సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. ఈ ఊపు చూస్తుంటే ఐదు రోజుల్లోనే రూ.1000 కోట్లు సాధించేలా కనిపిస్తోంది. మరోవైపు నార్త్లోనూ పుష్ప-2 హవా కొనసాగుతోంది. తొలి రోజు నుంచే హిందీలో వరుస రికార్డులతో దూసుకెళ్తోంది పుష్ప-2. కేవలం హిందీలోనే నాలుగు రోజుల్లో రూ.339 నెట్ వసూళ్లు సాధించింది. దీంతో బాక్సాఫీస్ వద్ద తిరుగులేని రికార్డ్స్ సృష్టిస్తోంది.అయితే తాజాగా ఈ మూవీ దర్శకధరుడు ఎస్ఎస్ రాజమౌళి వీక్షించారు. హైదరాబాద్లోని ఓ థియేటర్కు వెళ్లిన సినిమా నుంచి బయటికి వస్తోన్న వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియోను ఓ నెటిజన్ ట్విటర్లో షేర్ చేశారు. అది కాస్తా వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. వీడియో చూస్తే బాలనగర్లోని విమల్ థియేటర్లో పుష్ప-2 వీక్షించినట్లు తెలుస్తోంది.కాగా.. రాజమౌళి ప్రస్తుతం ప్రిన్స్ మహేశ్ బాబుతో ఓ సినిమాను తెరకెక్కించనున్నారు. అమెజాన్ అడవులో నేపథ్యంలో అడ్వంచర్ చిత్రంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ సిద్ధ కాగా.. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది. ఈ మూవీ కోసం ఇప్పటికే లోకేషన్స్ వేటలో ఉన్నారు టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి. Director rajamouli sir watched #Pushpa2 🔥@alluarjun #Pushpa2TheRule pic.twitter.com/qlzzp8IEHn— AlluBabloo Mithun (@allubabloo18) December 9, 2024 -
రాజమౌళి మూవీపై డాక్యుమెంటరీ.. విడుదలపై అధికారిక ప్రకటన!
దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేశారు. ఆర్ఆర్ఆర్ మూవీతో ఆస్కార్ వేదికపై సగర్వంగా తెలుగు సినిమాను నిలిపారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం ఆస్కార్ అవార్డ్ను సాధించింది. మన సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది.ఆర్ఆర్ఆర్ ఘనవిజయంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి డాక్యుమెంటరీని రూపొందిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్ అనే పేరుతో డాక్యుమెంటరీ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు దర్శకుడు రాజమౌళితో కూడిన పోస్టర్ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. అయితే రిలీజ్ తేదీని మాత్రం వెల్లడించలేదు.కాగా.. 2022లో వచ్చిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా పలు రికార్డులు సృష్టించింది. ఈ సినిమాతో టాలీవుడ్ పేరు వరల్డ్ వైడ్గా మార్మోగింది. ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ దక్కించుకుంది. మరోవైపు రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుతో సినిమా చేయనున్నారు. ఆ మూవీ పనులతో ఆయన బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాదిలో సెట్స్పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. View this post on Instagram A post shared by RRR Movie (@rrrmovie) -
సడన్ గా గడ్డం తీసేసిన మహేష్ బాబు.. షాక్ లో రాజమౌళి..?
-
పుష్ప 2 ట్రైలర్పై దర్శకధీరుడు 'రాజమౌళి' కామెంట్స్
గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎక్కడ చూసిన కూడా ఇప్పుడు పుష్పగాడి రూల్ నడుస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్తో ప్రతి సినిమా అభిమాని అల్లు అర్జున్ గురించే చర్చించుకుంటున్నారు. పట్నాలో జరిగిన ట్రైలర్ ఈవెంట్కు కోసం ఆయన ఫ్యాన్స్భారీగా తరలి వచ్చారు. దీంతో బీహార్ షేర్ అంటూ బన్నీని ప్రశంసిస్తున్నారు. అయితే, ట్రైలర్ను చూసిన స్టార్ డైరెక్టర్ రాజమౌళి పుష్ప యూనిట్ను అభినందించారు.పుష్ప ట్రైలర్పై చాలామంది సినిమా ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో రాజమౌళి చేసిన ట్వీట్ బన్నీ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతుంది. 'పట్నాలో పుష్ప వైల్డ్ఫైర్ మొదలైంది. అదీ దేశవ్యాప్తంగా వ్యాపిస్తుంది. డిసెంబర్ 5న విస్పోటనం చెందుతుంది. పార్టీ కోసం ఎదురుచూస్తూ ఉండలేకపోతున్నాం పుష్ప' అంటూ ఆయన పేర్కొన్నారు. అయితే, అల్లు అర్జున్ కూడా జక్కన్నకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తప్పకుండా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుంది. సినిమా విడుదలకు ముందు పుష్పరాజ్ పలు రికార్డ్స్ సొంతం చేసుకుంటున్నాడు. ప్రీసేల్ బిజినెస్లో సత్తా చాటిన పుష్ప ఇప్పటికే సుమారు రూ. 1000 కోట్ల వ్యాపారం చేసిందని టాక్ వినిపిస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా 40 మిలియన్ల వ్యూస్తో రికార్డ్ క్రియేట్ చేసింది. దక్షిణ భారతదేశంలో అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న చిత్రంగా పుష్ప నిలిచింది. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా 11,500 స్క్రీన్స్లలో ఈ చిత్రం విడుదల కానుంది. -
మురళీమోహన్ మనవరాలితో కీరవాణి కొడుకు పెళ్లి...ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
కీరవాణి ఇంట్లో పెళ్లి సందడి.. ప్రీ వెడ్డింగ్ ఫొటో వైరల్
టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కొడుకు, హీరో శ్రీ సింహా పెళ్లికి సిద్ధమయ్యాడు. సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు మురళీమోహన్ మనవరాలు రాగ మాగంటితో కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్లోని గోల్కోండ రిసార్ట్స్ లో ఆదివారం రాత్రి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.(ఇదీ చదవండి: ఆ విషయంలో నన్ను క్షమించండి.. అల్లు అర్జున్ రిక్వెస్ట్)మురళీ మోహన్కు కూతురు, కొడుకు ఉన్నారు. కూతురు విదేశాల్లో సెటిలైంది. కుమారుడు రామ్ మోహన్.. ఈయన వ్యాపారాలను చూసుకుంటున్నారు. రామ్ మోహన్- రూపల కుమార్తెనే 'రాగ'. విదేశాల్లో బిజినెస్లో మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రస్తుతం రాగ కూడా తన కుటుంబానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలే చూసుకుంటోంది.శ్రీసింహ విషయానికి వస్తే 'యమదొంగ' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడు. 'మత్తు వదలరా' రెండు చిత్రాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్ తదితర సినిమాల్లోనూ హీరోగా నటించాడు. కీరవాణి పెద్దబ్బాయి కాలభైరవకు ఇంకా పెళ్లి కాలేదు. ఈలోపే చిన్నబ్బాయికి పెళ్లి జరగనుంది. దీంతో ఇదేమైనా ప్రేమ పెళ్లి అని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: నాగచైతన్య-శోభిత పెళ్లి కార్డ్ ఇదే.. డేట్ ఫిక్స్) 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
SSMB 29: మహేశ్కి జోడీగా హాలీవుడ్ భామ.. ఎవరీ నవోమీ?
మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న చిత్రం ‘ఎస్ఎస్ఎమ్బి 29’ (వర్కింగ్ టైటిల్). ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్లో తెరకెక్కనుంది. అందుకే ఈ చిత్రంలో నటించే యాక్టర్స్పై ప్రత్యేక దృష్టి పెట్టారు రాజమౌళి. భారతదేశ నటీనటులే కాకుండా హాలీవుడ్కు చెందిన వారిని కూడా ఈ ప్రాజెక్టులోకి తీసుకోనున్నారాయన. అందులో భాగంగా మహేశ్బాబుకి జోడీగా హాలీవుడ్ నటి నవోమీ స్కాట్ని ఎంపిక చేసుకోనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. నవోమీకి భారత మూలాలుగతంలో ‘ఎస్ఎస్ఎమ్బి 29’ హీరోయిన్ల జాబితాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్, ఇండోనేషియాకు చెందిన చెల్సియా ఇస్లాన్ పేర్లు వినిపించాయి. తాజాగా భారత మూలాలున్న నవోమీ స్కాట్ని ఎంపిక చేయనున్నారని భోగట్టా. ఇంగ్లాండులో పుట్టారు నవోమి. భారత సంతతికి చెందిన నవోమి తల్లి ఉషా స్కాట్ గుజరాత్ నుంచి ఇంగ్లాండుకు వలస వెళ్లారట. ‘ది మార్షియన్, అల్లాద్దీన్, ఛార్లీస్ ఏంజెల్స్, స్మైల్, విజర్డ్స్’ వంటి పలు సినిమాల్లో నటించిన నవోమీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. షూటింగ్ ఎప్పుడంటే..?‘ఎస్ఎస్ఎమ్బి 29’లో నటించే విషయంపై ఆమెతో రాజమౌళి చర్చలు కూడా జరిపారని ఫిల్మ్నగర్ సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి... మహేశ్బాబుకి జోడీగా నవోమీ స్కాట్ ఖరారు అయినట్టేనా? అంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మించనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభం కానుందని టాక్. -
రాముడిగా మహేశ్బాబు?
మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నారు మహేశ్బాబు. మరోవైపు ఈ సినిమా చిత్రీకరణను వీలైనంత త్వరగా మొదలుపెట్టాలని దర్శకుడు రాజమౌళి లొకేషన్స్ వేట ప్రారంభించారు. త్వరలోనే కొన్ని లొకేషన్స్ను ఫైనలైజ్ చేయనున్నారాయన. ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందనుందని చిత్రసంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి, కథా రచయిత విజయేంద్రప్రసాద్ ఇప్పటికే పేర్కొన్నారు.అయితే ఈ సినిమా నేపథ్యం గురించి మాత్రం ఎప్పటికప్పుడు కొత్త ఊహాగానాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. ఈ సినిమా కథనం ఓ నిధి అన్వేషణ బ్యాక్డ్రాప్లో ఉంటుందన్న వార్తలు వినిపించాయి. తాజాగా ఈ చిత్రకథలో రామాయణం ఇతిహాసం ప్రస్తావన ఉంటుందని ఫిల్మ్నగర్ భోగట్టా. అంతేకాదు... కొన్ని సీన్స్లో రాముడిగా మహేశ్బాబు కనిపిస్తారని, వారణాసి బ్యాక్డ్రాప్లో వచ్చే సన్నివేశాలు సినిమాలో కీలకంగా ఉంటాయని, ఈ సీన్స్ కోసం హైదరాబాద్లోనే వారణాసిని తలపించే సెట్ను రెడీ చేస్తున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ అంశాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ఇక ఈ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది ప్రారంభంలో ఆరంభం అవుతుందని సమాచారం. -
సత్యదేవ్కి అన్యాయం? 'ఆర్ఆర్ఆర్'లో 16 నిమిషాల సీన్స్ కట్
సత్యదేవ్.. నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, హీరోగా మాత్రం నిలదొక్కుకోలేకపోతున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన ఇతడు.. చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీలోనూ విలనిజం చేసి ఆకట్టుకున్నాడు. అయితే 'ఆర్ఆర్ఆర్' లాంటి క్రేజీ పాన్ ఇండియా మూవీలోనూ ఇతడు నటించాడు. కానీ ఆ సీన్లన్నీ లేపేశారు. ఆ విషయాన్ని మొహమాటపడుతూనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.'ఆర్ఆర్ఆర్' కోసం సత్యదేవ్.. దాదాపు 10 రోజుల పాట పనిచేశాడు. కానీ చివరకొచ్చేసరికి ఇతడికి సంబంధించి దాదాపు 16 నిమిషాలు సీన్లని ఎడిటింగ్లో తీసేశారు. ఆ టీమ్పై ఉన్న గౌరవంతోనే ఇప్పటివరకు బయటకు చెప్పలేదని.. కాకపోతే ఆ పదిరోజుల వర్క్ చేయడం మాత్రం మర్చిపోలేని అనుభూతి అని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: తల్లిని కావాలని ఇప్పటికీ ఉంది: సమంత)ఎడిటింగ్ చేస్తే చేశారు కానీ కనీసం 'ఆర్ఆర్ఆర్' టైటిల్ కార్డ్స్లోనైనా సత్యదేవ్ పేరు వేసి ఉండాల్సింది. కానీ ఈ సినిమాలో ఎక్కడా కూడా సత్యదేవ్ పేరు కనిపించదు. ఇతడు చెప్పుకోవడానికి పెద్దగా ఇష్టపడట్లేదు గానీ ఈ విషయంలో మాత్రం అన్యాయం జరిగిందనే చెప్పొచ్చు.సత్యదేవ్ లేటెస్ట్ మూవీ 'జీబ్రా'. నవంబర్ 22న థియేటర్లలోకి రానుంది. 'పుష్ప'లో జాలిరెడ్డిగా కనిపించిన కన్నడ ధనంజయ.. ఇందులో కీలక పాత్ర పోషించాడు. చాన్నాళ్లుగా హీరోగా సరైన హిట్ కోసం చూస్తున్న సత్యదేవ్కి ఈ సినిమాతోనైనా అదృష్టం కలిసొస్తుందేమో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ థ్రిల్లర్.. తెలుగులోనూ) -
'కంగువ' నిర్మాత ఫోన్ వాల్ పేపర్గా రాజమౌళి ఫొటో
తమిళ స్టార్ హీరో సూర్య లేటెస్ట్ మూవీ 'కంగువ'. నవంబర్ 14న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో శుక్రవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి రాజమౌళి అతిథిగా వచ్చారు. కాకపోతే రాజమౌళిపై తనకు, తన నిర్మాత జ్ఞానవేల్ రాజాకు ఎంత ఇష్టముందో అనేది చెప్పకనే చెప్పారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: 'బ్లడీ బెగ్గర్' సినిమా రివ్యూ)'కంగువ' టీమ్కి కోసం వచ్చిన రాజమౌళి అంతా మాట్లాడిన తర్వాత సూర్య మైక్ అందుకున్నాడు. తాను ఎక్కాల్సిన ట్రైన్ మిస్ అయ్యానని, కాబట్టి సిగ్గు లేకుండా చెబుతున్నాను అదే స్టేషన్లో ఉన్నాను త్వరగానే ట్రైన్ ఎక్కడానికి ప్రయత్నిస్తున్నా అని రాజమౌళితో సినిమా చేయాలని ఉందని సూర్య తన మనసులో మాటని బయటపెట్టాడు.మీ 'బాహుబలి' పేరు పలకడానికి కూడా మాకు అర్హత ఉందో లేదో తెలీదు. మీరు వేసిన దారిలోనే మేం మీ వెనుక నడుస్తూ వస్తున్నాం. మీరు మా నిర్మాత జ్ఞానవేల్ రాజాకి షేక్ హ్యాండ్ ఇస్తే అదే మాకు పెద్ద ఆస్కార్ అని సూర్య చెప్పాడు. జ్ఞానవేల్ రాజా తనకు పరిచయమైనప్పటి నుంచి మీ ఫొటోనే ఫోన్ వాల్ పేపర్గా పెట్టుకున్నాడనే ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. దీంతో జ్ఞానవేల్ రాజా స్టేజీపైకి వచ్చి తన ఫోన్లోని రాజమౌళి ఫోటో చూపించడంతో పాటు రాజమౌళి కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది. (ఇదీ చదవండి: 'దేవర'తో పాటు ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 15 సినిమాలు)"In our mobile phones we keep Family photos as wallpaper, but Gnanavel has your photo as wallpaper. You have paved the way for #Kanguva. It will be like an Oscars If you shake hands with Gnanavel"- #Suriyapic.twitter.com/fJ7GKri4mT— AmuthaBharathi (@CinemaWithAB) November 7, 2024 -
కంగువని థియేటర్స్లోనే చూడాలి: ఎస్ఎస్ రాజమౌళి
‘‘కంగువ’ టీమ్ పడిన కష్టం మేకింగ్ వీడియోలో తెలుస్తోంది. సినిమా రిలీజ్ అయ్యాక ఈ కష్టానికి విజయం రూపంలో ప్రతిఫలం దక్కుతుందని నమ్ముతున్నాను. ‘కంగువ’ లాంటి సినిమాను థియేటర్స్లోనే చూడాలి. అప్పుడే ఆ సినిమాటిక్ అనుభూతిని ΄పొందుతారు’’ అని డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. సూర్య హీరోగా శివ దర్శకత్వం వహించిన చిత్రం ‘కంగువ’. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ‘కంగువ’ ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సినిమాను నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తున్నారు. గురువారం హైదరాబాద్లో నిర్వహించిన ‘కంగువ’ ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి మాట్లాడుతూ–‘‘తెలుగు సినిమాను తెలుగుకే పరిమితం చేయకుండా మిగతా ్రపాంతాలకు తీసుకెళ్లాలని, అలాగే పాన్ ఇండియా మూవీస్ చేసేందుకు నాకు స్ఫూర్తినిచ్చింది సూర్యనే. ‘గజినీ’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల దగ్గరకు చేర్చడానికి తను చేసిన ప్రయత్నాన్ని కేస్ స్టడీగా నా నిర్మాతలు, హీరోలకు చెప్పేవాణ్ణి. నేను, తను గతంలో ఓ సినిమా చేయాలనుకున్నాం.. కానీ కుదరలేదు. తనతో సినిమా చేసే అవకాశం నేను మిస్ అయ్యాను’’ అని చెప్పారు. ‘‘కంగువ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తుంటే ఇది సక్సెస్ సెలబ్రేషన్స్లా ఉంది’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు.‘‘ఈ సినిమా విజువల్స్, కంటెంట్ చూస్తుంటే అద్భుతంగా ఉంది. ‘కంగువ’ ఘన విజయం సాధించాలి’’ అని నిర్మాతలు సురేష్ బాబు, ‘దిల్’ రాజు తెలిపారు. ‘‘వెయ్యేళ్ల కిందటి కథలో ఐదు తెగల మధ్య అనుబంధాలు, ప్రేమలు, ప్రతీకారం, పోరాటం వంటివన్నీ ‘కంగువ’లో చూపించాం’’ అన్నారు శివ. ‘‘కంగువ’ వంటి అద్భుతమైన సినిమాని థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయాలి’’ అని కేఈ జ్ఞానవేల్ రాజా చెప్పారు. సూర్య మాట్లాడుతూ– ‘‘రాజమౌళిగారి ఏ సినిమాతోనూ మా ‘కంగువ’ని పోల్చలేం. ఆయనతో సినిమా చేసే అవకాశం మిస్ చేసుకున్నాను.కానీ, ఇప్పటికీ ఆ అవకాశం కోసం వేచి చూస్తున్నాను. ‘కంగువ’ నాకు మర్చిపోలేని అనుభూతి ఇచ్చింది. ఈ చిత్రం కోసం రెండేళ్లు కష్టపడ్డాను. ఎవర్ గ్రీన్ సినిమాగా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుందని నమ్ముతున్నాను’’ అని తెలిపారు. ఈ వేడుకలో డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ, కెమెరామేన్ వెట్రి పళనిస్వామి, రైటర్ రాకేందు మౌళి, డిస్ట్రిబ్యూటర్ అభినేష్, మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ శశి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వివేక్ కూఛిబొట్ల తదితరులు మాట్లాడారు. -
ఆర్ఆర్ఆర్కు అరుదైన గౌరవం
‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు అరుదైన గౌరవం లభించింది. దాదాపు 150 సంవత్సరాల చరిత్ర కలిగిన లండన్లోని ఐకానిక్ రాయల్ ఆల్బర్ట్ సినిమా హాల్లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ప్రదర్శితం కానుంది. వచ్చే ఏడాది మే 11న ఈ మూవీ స్క్రీనింగ్ ఉంటుందని ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ ప్రకటించింది. అలాగే ఈ కార్యక్రమంలో రాయల్ ఫిల్ హార్మోనిక్ ఆర్కెస్ట్రాతో ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి లైవ్ కన్సర్ట్ ఇవ్వనున్నారు.కాగా ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా 2022 మార్చి 25న విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచింది. 95వ ఆస్కార్ అవార్డ్స్లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో (నాటు నాటు పాటకు గాను) ఎమ్ఎమ్ కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్ ఆస్కార్ అవార్డులు అందుకున్న సంగతి తెలిసిందే. పలు అంతర్జాతీయ, జాతీయ అవార్డులు కూడా లభించాయి. కాగా ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి: ది కన్క్లూజన్’ సినిమా ఐకానిక్ రాయల్ ఆల్బర్ట్ హాల్లో 2019లో ప్రదర్శితమైన విషయం తెలిసిందే. -
లొకేషన్ వేటలో రాజమౌళి..!
కెన్యాలో లొకేషన్ వేట ఆరంభించారు రాజమౌళి. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ ఆఫ్రికన్ అడ్వెంచరస్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. జనవరిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందని తెలిసింది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసిన రాజమౌళి లొకేషన్స్ను ఫైనలైజ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం కెన్యాలోని అంబోసెలి నేషనల్ పార్క్లో రాజమౌళి ఉన్నారు. కెన్యా, ఆఫ్రికా లొకేషన్స్లో కొన్ని లొకేషన్స్ని ఎంపిక చేసి, తొలి షెడ్యూల్ని అక్కడే ఆరంభిస్తారని సమాచారం. ఇక ఈ సినిమాకు ‘మహారాజా’, ‘మహారాజ్’ అనే టైటిల్స్ను అనుకుంటున్నారని, 18వ శతాబ్దం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని, ఓ నిధి అన్వేషణతో ఈ సినిమా ఉంటుందనీ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. -
అడవుల్లో రాజమౌళి హంటింగ్.. ఆ సినిమా కోసమేనా?
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం వేకేషన్లో చిల్ అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత గ్యాప్ ఎక్కువగా రావడంతో ఆఫ్రికాలో ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం కెన్యాలోని అడవుల్లో వన్య ప్రాణలను చూస్తూ సేద తీరుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ ప్రాంతంలో సినిమా షూటింగ్ లోకేషన్స్ కోసమే రాజమౌళి వెళ్లినట్లు తెలుస్తోంది. అడవుల్లో తిరుగుతున్న ఫోటోను తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు దర్శకధీరుడు. (ఇది చదవండి: ఆ సమయంలో అవార్డ్ తీసుకోవడం కరెక్ట్ కాదనిపించింది: మెగాస్టార్)మరోవైపు ప్రిన్స్ మహేశ్బాబుతో తన తదుపరి చిత్రం తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధమైంది. ఈ సినిమాను ఎస్ఎస్ఎంబీ29 వర్కింగ్ టైటిల్తో రూపొందించనున్నారు. ఈ మూవీని ఫుల్ యాక్షన్ అడ్వెంచరస్ కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో కథ ఉంటుందని ఇప్పటికే హింట్ కూడా ఇచ్చారు. అందువల్లే ఆఫ్రికాలోని దట్టమైన అడవుల లోకేషన్స్ కోసమే రాజమౌళి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాదిలో ప్రారంభించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. #TFNReels: Maverick Director @ssrajamouli is currently scouting locations in Kenya, Africa for #SSMB29!!🌎🔥#MaheshBabu #SSRajamouli #TeluguFilmNagar pic.twitter.com/ABq6DxfVOg— Telugu FilmNagar (@telugufilmnagar) October 29, 2024 View this post on Instagram A post shared by SS Rajamouli (@ssrajamouli) -
బాహుబలి 3 కి రంగం సిద్ధం..!
-
ఏఐలో శిక్షణ తీసుకుంటున్న రాజమౌళి
-
ఏఐలో శిక్షణ తీసుకుంటున్న రాజమౌళి?
సాధారణంగా దర్శకుడు రాజమౌళితో చేసే చిత్రాల కోసం హీరోలు ప్రత్యేక శిక్షణ తీసుకుంటుంటారు. కానీ ప్రస్తుతం రాజమౌళియే శిక్షణ తీసుకుంటున్నారట. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)లో ట్రైనింగ్ తీసుకుంటున్నారట. ఇటీవలి కాలంలో ఏఐని సినిమా ఇండస్ట్రీ కథ మేరకు వినియోగించుకుంటోంది. ఆల్రెడీ కొంతమంది ఫిల్మ్ మేకర్స్ ఏఐని వారి సినిమాల్లో ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి కూడా ఫిల్మ్ మేకింగ్లో ఏఐ తెచ్చిన మార్పులను గురించి నేర్చుకోవడానికి ప్రత్యేకమైన క్లాసులు తీసుకుంటున్నారని సమాచారం. ఈ క్లాసుల కోసం ఆయన విదేశాల్లోని ఓ ప్రముఖ స్టూడియోతో అసోసియేట్ అయ్యారని భోగట్టా. ఇక మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా తెరకెక్కనుంది. ఈ చిత్రం కోసం మహేశ్బాబు ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నారు. ఈ సినిమా కోసమే రాజమౌళి ఏఐను స్టడీ చేస్తున్నారని తెలుస్తోంది. భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో చిత్రీకరణ మొదలుపెట్టనున్నట్లుగా ఈ చిత్ర కథారచయిత విజయేంద్రప్రసాద్ ఇటీవల వెల్లడించారు. అలాగే ఈ సినిమాకు కావాల్సిన లొకేషన్స్ అన్వేషణలో కార్తికేయ (రాజమౌళి తనయుడు) ఉన్నారని తెలిసింది. ఇక ఈ చిత్రం ఓ నిధి అన్వేషణ నేపథ్యంలో 18వ శతాబ్దంలో ఉంటుందని, రెండు భాగాలుగా విడుదలవుతుందని, ‘మహా రాజా’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారనే ప్రచారాలు జరుగుతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ను మించి..! ‘ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) సినిమాలోని ఇంట్రవెల్ సీన్లో లెక్కలేనన్ని జంతువులు కనిపిస్తాయి. కాగా మహేశ్బాబుతో తాను చేయనున్న సినిమాలో ‘ఆర్ఆర్ఆర్’ కంటే ఎక్కువ యానిమల్స్ని ప్రేక్షకులు చూస్తారని ఇటీవల రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. -
రెండో భాగం కూడా..?
హీరో మహేశ్బాబు, డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్లో సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ చిత్రం ఒకటి కాదు రెండు భాగాలుగా రూపొందనుందనే న్యూస్ నెట్టింట వైరల్గా మారింది.‘బాహుబలి’ సినిమా తరహాలోనే ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ని కూడా రెండు భాగాలుగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట రాజమౌళి. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే యాక్షన్ అడ్వెంచరస్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ మూవీ ప్రీప్రోడక్షన్ పనుల్లో బిజీబిజీగా ఉంది. ఈ సినిమా కోసం పొడవాటి హెయిర్ స్టైల్, గెడ్డం, కండలు తిరిగిన బాడీ పెంచే పనిలో ఉన్నారు మహేశ్బాబు.కాగా కథకు ఉన్నప్రాధాన్యం దృష్ట్యా ఒకే భాగంలో చెప్పడం సాధ్యం కాదని, అందుకే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. అలాగే సీక్వెల్స్ వస్తాయనే ఊహాగానాలూ ఉన్నాయి. ఈ వార్తలపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. జనవరిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందని చిత్ర కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. -
రాజమౌళి బాహుబలి-3 .. కంగువా నిర్మాత ఆసక్తికర కామెంట్స్!
దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన సూపర్ హిట్ సినిమాలు బాహుబలి, బాహుబలి-2. ఈ సినిమాలతో తెలుగు ఖ్యాతి ప్రపంచస్థాయికి చేరింది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించాయి. దీంతో పార్ట్-3 కోసం టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే బాహుబలి-3 గురించి కోలీవుడ్ నిర్మాత ఆసక్తికర కామెంట్స్ చేశారు. సూర్య భారీ యాక్షన్ చిత్రం కంగువా ప్రమోషన్స్లో భాగంగా బాహుబలి పార్ట్-3 గురించి నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా మాట్లాడారు. కంగువా సీక్వెన్స్ల మధ్య గ్యాప్ను సమర్థిస్తూ ఈ ప్రస్తావన తీసుకొచ్చారు.కేఈ జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ..'గత వారం బాహుబలి మేకర్స్తో చర్చించా. పార్ట్- 3 కోసం ప్లాన్ రూపొందించడంలో బిజీగా ఉన్నారు. దాని కంటే ముందు మరో రెండు సినిమాలు ఉన్నాయి. ఆ తర్వాతే కల్కి- 2, సలార్- 2 రిలీజ్ అవుతాయని అన్నారు. దీంతో బాహుబలి-3ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.(ఇది చదవండి: పెళ్లైన 12 ఏళ్లకు గుడ్న్యూస్ చెప్పిన స్టార్ హీరోయిన్)కాగా.. బాహుబలి రెండు పార్ట్లకు తమిళంలో నిర్మాతగా కేఈ జ్ఞానవేల్ రాజా వ్యవహరించారు. గతంలో బాహుబలి-3 గురించి ఎస్ఎస్ రాజమౌళి కూడా హింట్ ఇచ్చారు, కచ్చితంగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం రాజమౌళి మహేశ్బాబుతో సినిమా చేయనున్నారు. వీరి కాంబోలో వస్తోన్న మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సిని తర్వాతే బాహుబలి-3 మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. -
దిగ్గజ రతన్ టాటాకు సినీ ప్రముఖుల నివాళి
మన దేశం మరో దిగ్గజాన్ని కోల్పోయింది. దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా.. బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన ఇకలేరు అనే విషయాన్ని ఏ ఒక్కరూ తట్టుకోలేకపోతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. టాలీవుడ్ నుంచి చిరంజీవి, రాజమౌళి, నానితో పాటు బాలీవుడ్ వాళ్లు కూడా తమ బాధని ఆయన చేసి సేవల్ని గుర్తుచేసుకుంటున్నారు.భారతీయ సినీ ప్రముఖుల ట్వీట్స్It’s a sad day for all Indians. For generations together there is not a single Indian whose life hasn’t been touched by his services one way or the other. One of the greatest visionaries our country has ever seen, a truly legendary industrialist, a philanthropist… pic.twitter.com/YHBiX00dNv— Chiranjeevi Konidela (@KChiruTweets) October 10, 2024Legends are born, and they live forever. It’s hard to imagine a day without using a TATA product… Ratan Tata’s legacy is woven into everyday life. If anyone will stand the test of time alongside the Panchabhootas, it’s him. 🙏🏻Thank you Sir for everything you’ve done for India…— rajamouli ss (@ssrajamouli) October 10, 2024End of an era. But the legacy is forever. Farewell sir 🙏🏼#RatanTata— Nani (@NameisNani) October 10, 2024India’s most valuable man, not necessarily for his vast wealth, but for his values.. largest being Integrity !! Never a show off but always the star ⭐️ The life #RatanTata ji led will always be an inspiration🙏 pic.twitter.com/yqbNTGWrT9— Randeep Hooda (@RandeepHooda) October 9, 2024Deeply saddened by the demise of Shri #RatanTata , a true icon of Indian industry. His remarkable vision, leadership, and compassion have inspired generations. As we bid farewell, his invaluable contributions to nation-building and philanthropy will be remembered forever. pic.twitter.com/bnpzPV4yax— Bobby (@dirbobby) October 10, 2024Deepest condolences for the 'Bharat Ratna' in true sense, finest human being, philanthropist business tycoon our very own #RatanTata is no more. His contributions to society/nation are enormous. Thoughts & prayers are with the family & friends in their hour of grief for their… pic.twitter.com/0g13H5QiOG— Shatrughan Sinha (@ShatruganSinha) October 10, 2024An icon. A legend. Thank you for inspiring us sir. You will be remembered forever 🙏🏻#RatanTata pic.twitter.com/1t7tBYuW4k— Anjali (@yoursanjali) October 10, 2024A inspiration to many of us🙏🏻 You will be greatly missed sir😇#RatanTata pic.twitter.com/XPIt6LVsHG— Nayanthara✨ (@NayantharaU) October 9, 2024Sad to hear that #RatanTata is no more. A legendary leader, visionary & philanthropist passes on, leaving behind a legacy of excellence & compassion. My deepest condolences to the Tata group & family. May his legacy continue to inspire us. #RIPRatanTataSir pic.twitter.com/snmejOwnjN— Sudheer Babu (@isudheerbabu) October 10, 2024It is with immense sorrow that we say goodbye to one of the most visionary leaders of our time, Ratan Tata. His extraordinary contributions to business, philanthropy, and society will leave a lasting legacy. May his soul rest in eternal peace.#RatanTata pic.twitter.com/JjCl8ZFiMa— Varun Tej Konidela (@IAmVarunTej) October 10, 2024Shri #RatanTata ji 🙏🏻You will be remembered for Ever sir..Thank You for the Inspiration 🙏🏻❤️A True Legend.. A True Icon 🙏🏻 pic.twitter.com/AVUkZmnGvB— DEVI SRI PRASAD (@ThisIsDSP) October 9, 2024असा माणूस पुन्हा होणे नाही. Deeply saddened to know that Shri #RatanTata ji is no more. Condolences to the family and loved ones. Rest In Glory Sir. 🙏🏽 pic.twitter.com/ldThYxUwJz— Riteish Deshmukh (@Riteishd) October 9, 2024The Icon of leadership, philanthropy, and ethics!! His legacy will continue to inspire generations. India has lost a giant today. #RIPRatanTata #RatanTata pic.twitter.com/c6qaZ75ykh— Rana Daggubati (@RanaDaggubati) October 9, 2024India bows in silence tonight. #RatanTata 🙏🏻🙏🏻 pic.twitter.com/hD3ACoB3iJ— DVV Entertainment (@DVVMovies) October 9, 2024A man who inspired and touched many lives.. Thank you #RatanTata sir 🙏🏿🙏🏿🙏🏿 will miss you RIP 💔💔💔💔 pic.twitter.com/ngAtEau9MR— Prakash Raj (@prakashraaj) October 10, 2024One Sun.One Moon.One Ratan Tata.The eternal. 🙏🏻🙏🏻#RatanTata pic.twitter.com/Kah9kGgnzQ— Sri Venkateswara Creations (@SVC_official) October 9, 2024The Titan and true icon, #RatanTata garu passing on . It's truly saddening.Your impact on me and the rest of the world will never be forgotten. History will remember you. Your words of wisdom have inspired and touched me deeply, Thank you for inspiring us with your humility… pic.twitter.com/0V8wImPeCE— Sai Dharam Tej (@IamSaiDharamTej) October 9, 2024Om Shanti.. 🥺😢#RatanTata https://t.co/Y3LeM7204f— Shirley Setia (@ShirleySetia) October 9, 2024 -
గెట్ రెడీ.. ఇట్స్ త్రీడీ.. !
ఇప్పుడంటే త్రీడీ ప్రింటింగ్ సాంకేతికత గురించి అందరికీ తెలిసింది. ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని అందరికీ అవగాహన వచ్చింది. కానీ 8 ఏళ్ల క్రితం త్రీడీ ప్రింటింగ్ గురించి ఎవరికీ తెలియదనే చెప్పొచ్చు. కానీ 21 ఏళ్ల కుర్రాడు త్రీడీ ప్రింటింగ్లో భవిష్యత్తు ఉందని గుర్తించాడు. త్రీడీ ప్రింటింగ్లో ఏదైనా వినూత్నంగా చేయాలని ఆలోచించాడు. ఆ ఆలోచనకు పదును పెట్టాడు. ఓ స్టార్టప్ కూడా స్థాపించాడు. ఓ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి కంపెనీ స్థాపించాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఎన్నో అవమానాలు.. ఎన్నో భయాలు.. వాటన్నింటినీ దాటుకుని ముందడుగు వేశాడు.. ఇప్పుడు ఏకంగా హైదరాబాద్లోని త్రీడీ ప్రింటింగ్ కంపెనీల్లో ఒకటిగా నిలిచి.. తన సత్తా చాటుకున్నాడు. అతడి పేరే.. క్రవీంతర్ కమల్.. అతని సక్సెస్ స్టోరీ గురించి మరిన్ని విశేషాలు..మేకర్ గ్లోబల్ పేరుతో 2016లో త్రీడీ ప్రింటర్స్ తయారుచేసే చిన్న స్టార్టప్ ఏర్పాటు చేశాడు. ఇప్పుడు సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా నలుగురికీ ఆదర్శంగా నిలుస్తుండటమే కాకుండా.. పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు. ఒకప్పుడు అసలు భవిష్యత్తు ఉంటుందా లేదా అని అనుమానం వ్యక్తం చేసిన వారికి ఇప్పుడు త్రీడీ ప్రింటింగ్తోనే భవిష్యత్తు ఉంది అని నిరూపిస్తూ కమల్ ముందుకు సాగుతున్నాడు. మొక్కవోని ధైర్యంతో.. కంపెనీ స్థాపించిన సమయంలో త్రీడీ ప్రింటింగ్పై డెలాయిట్, టాటా ఏరోస్పేస్ వంటి కంపెనీల వద్దకు వెళ్లి అవగాహన కలి్పంచేవాడినని కమల్ గుర్తుచేసుకున్నాడు. ఆ తర్వాత త్రీడీ ప్రింటింగ్ మెషీన్లను సొంతంగా తయారు చేసి, కంపెనీలకు విక్రయించేవాడినని చెప్పుకొచ్చాడు. త్రీడీ ప్రింటింగ్ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిన తర్వాత వాటిని తయారుచేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు మేకర్ గ్లోబల్కు క్లయింట్స్గా మారారు. వారికి కావాల్సిన త్రీడీ ప్రింటింగ్ ఉత్పత్తులను వీరి దగ్గరి నుంచే చేయించుకోవడం మొదలు పెట్టారు. ఎన్నో సినిమాలకు సాయం.. త్రీడీ ప్రింటింగ్లో రోజువారీ ఉపయోగించే ఎన్నో వస్తువులు, ఉత్పత్తులను మేకర్ గ్లోబల్ తయారుచేస్తోంది. హైదరాబాద్లోని స్కైరూట్ కంపెనీకి రాకాట్ మోడల్స్ను త్రీడీ ప్రింటింగ్లో రూపొందించి ఇచ్చామని కమల్ పేర్కొన్నాడు. అది చాలా గర్వకారణంగా ఉందని చెప్పాడు. ఇక, ఎన్నో సినిమాల ఆర్ట్ డైరెక్టర్లకు కావాల్సిన వస్తువులను సులువుగా తయారు చేసి ఇస్తుంటామని, ఏటా కనీసం నాలుగు సినిమాలకు పనిచేస్తుంటామని వివరించాడు. ఇక, ఆర్ఆర్ఆర్, హనుమాన్, ఆపరేషన్ వాలెంటైన్, పుష్ప వంటి సినిమాలకు అవసరమైన వస్తువులను నటీనటులకు ఇబ్బంది కాకుండా తేలికగా ఉండేలా తయారు చేసి ఇచ్చామని చెబుతున్నారు. అప్పటి నుంచే ఆసక్తి.. తమిళనాడులోని తిరుచి్చలో జన్మించిన కమల్.. చెన్నైలోని లయోలా కాలేజీలో 2015లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. కాలేజీ రోజుల్లోనే ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్లో భాగంగా పారిస్లోని తులుజ్లో ఏరోస్పేస్ హబ్లో నెల రోజుల పాటు ఉండే అవకాశం కమల్కు వచి్చంది. అక్కడే తొలిసారి త్రీడీ ప్రింటింగ్తో ఉన్న లాభాల గురించి తెలుసుకున్నా డు. అక్కడి నుంచి తిరిగి వచ్చాక.. డిజైనింగ్పై ఇష్టంతో హైదరాబాద్లోని ఓ కంపెనీలో చేరాడు. కానీ ఉద్యోగం చేయడం కన్నా సొంతంగా ఎదగాలని, నలుగురికీ ఉపాధి కలి ్పంచాలని ఆలోచన చేశాడు. అప్పుడే త్రీడీ ప్రింటింగ్ గురించి వచ్చిన ఆలోచనతో వెంటనే మేకర్ గ్లోబల్ స్టార్టప్ స్థాపించాడు. ఇప్పుడు ఏటా రెండున్నర కోట్ల టర్నోవర్తో ముందుకు వెళ్తున్నాడు. భవిష్యత్తులో సంస్థను మరింత విస్తరించడమే లక్ష్యంగా శ్రమిస్తున్నానని చెబుతున్నాడు. -
బ్రాండ్ అంబాసిడర్గా రాజమౌళి.. రూ.8,500 కోట్లు టార్గెట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం సోనీ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.8,500 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా చేసుకుంది. 2023–24లో కంపెనీ రూ.6,353 కోట్లు సాధించింది. ఎక్స్పీరియా స్మార్ట్ఫోన్స్, వయో ల్యాప్టాప్స్ విభాగాలతో కలిపి 2014–15లో సోనీ ఇండియా రూ.11,000 కోట్ల ఆదాయం సముపార్జించింది.సంస్థకు అతి పెద్ద మార్కెట్ల పరంగా యూఎస్, చైనా, జపాన్ తర్వాత నాల్గవ స్థానంలో భారత్ నిలిచింది. స్మార్ట్ టీవీ, ఆడియో, డిజిటల్ ఇమేజింగ్ ఉత్పత్తులు ప్రస్తుత వృద్ధిని నడిపిస్తున్నాయని సోనీ ఇండియా ఎండీ సునీల్ నయ్యర్ తెలిపారు. వృద్ధి ఇలాగే కొనసాగితే భారత ర్యాంకు మరింత మెరుగుపడుతుందని చెప్పారు. సగటు విక్రయ ధరను పెంచే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు వెల్లడించారు.ప్రీమియం ఉత్పత్తుల వైపు మార్కెట్ మళ్లుతున్న నేపథ్యంలో సోనీ ఇండియాకు ఈ అంశం కలిసి వస్తుందన్నారు. చిత్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి చేతుల మీదుగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత 2024 బ్రావియా 9, 8, 7, 3 సిరీస్ను సోమవారమిక్కడ విడుదల చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు.ఈ సిరీస్కు బ్రాండ్ అంబాసిడర్గా రాజమౌళి వ్యవహరిస్తారని కంపెనీ ప్రకటించింది. స్మార్ట్ టీవీల విభాగంలో 20% విలువ వృద్ధి ఆశిస్తున్నట్టు తెలిపారు. 55 అంగుళాలు ఆపైన విభాగంలో ఆధిపత్యం కొనసాగిస్తున్నామని అన్నారు. 75 అంగుళాలు ఆపైన సెగ్మెంట్లో 50% పైన వృద్ధి సాధిస్తున్నామని వివరించారు. టీవీల వ్యాపారంలో మార్కెటింగ్పైన రూ.300 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు పేర్కొన్నారు. రూ.15,000లకుపైగా ఖరీదు చేసే సౌండ్బార్స్ విభాగంలో 53% వాటాతో అగ్రస్థానంలో ఉన్నట్టు తెలిపారు. -
దేవర దండయాత్ర.. రాజమౌళి కు చెక్ పెట్టిన ఎన్టీఆర్
-
'దేవర'తో రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అయిందా?
టాలీవుడ్లో ఫేమస్ సెంటిమెంట్ ఒకటుంది. స్టార్ డైరెక్టర్ రాజమౌళితో పనిచేసిన తర్వాత ఎలాంటి హీరోకైనా సరే నెక్స్ట్ మూవీ డిజాస్టర్ అవుతుంది. రామ్ చరణ్, ప్రభాస్, రవితేజ.. ఇలా ఏ హీరో కూడా దీని బారి నుంచి తప్పించుకోలేకపోయారు. అలాంటిది 'దేవర' మూవీతో ఎన్టీఆర్ దీన్ని బ్రేక్ చేస్తాడా లేదా? అని గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ఒకటే చర్చ. మరి 'దేవర' రిలీజైపోయింది. ప్రేక్షకులు ఏమంటున్నారు? రాజమౌళి కొడుకు దీనిపై ఏం ట్వీట్ చేశాడు?(ఇదీ చదవండి: 'దేవర' చూస్తూ ఎన్టీఆర్ అభిమాని మృతి)'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ హీరోగా చేసిన సినిమా 'దేవర'. కొరటాల శివ దర్శకుడు. ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్టైనర్గా దీన్ని తెరకెక్కించారు. తాజాగా థియేటర్లలోకి వచ్చింది. అయితే రిలీజ్కి ముందు మరీ ఎక్కువ అంచనాలు ఏర్పడటం వల్లనో ఏమో గానీ మిశ్రమ స్పందన వస్తోంది. చాలా బాగుందని అనట్లేదు. అలా అని పూర్తిగా బాగోలేదని కూడా చెప్పట్లేదు. రెండు మూడు రోజులు ఆగితే ఫెర్ఫెక్ట్ టాక్ బయటపడుతుంది. ఒకవేళ యావరేజ్ వచ్చినా సరే వసూళ్లు రావడంతో పాటు సెంటిమెంట్ కూడా బ్రేక్ అయినట్లే.ఇక రాజమౌళి కొడుకు కార్తికేయ అయితే ఎన్టీఆర్ ఈ సెంటిమెంట్ని బ్రేక్ చేసేశాడని ట్వీట్ వేశాడు. '23 ఏళ్ల క్రితం ఎవరితోనైతే ఈ సెంటిమెంట్ మొదలైందో మళ్లీ అతడే దీన్ని బ్రేక్ చేశాడు. అతడిని చూస్తూ పెరిగాను. ఇప్పుడు తెలుగు సినిమాలో అతడు చేస్తున్న అద్భుతాల్ని కళ్లారా చూస్తున్నాను. అస్సలు మాటలు రావట్లేదు. అభిమానులకు ఒకటే చెబుతున్నా. 'దేవర' రూపంలో మనందరికీ సెలబ్రేట్ చేసుకునే అతిపెద్ద గిఫ్ట్ ఇచ్చాడు. ఇక నుంచి సినిమానే మాట్లాడుతుంది. ఆల్ హైల్ ద టైగర్' అని రాసుకొచ్చాడు.(ఇదీ చదవండి: ‘దేవర’ మూవీ రివ్యూ) -
మహేశ్ బాబు విరాళం.. డిస్కషన్ మాత్రం వాటి గురించి
హీరో మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా ప్రిపరేషన్లో ఉన్నాడు. ప్రీ ప్రొడక్షన్ నడుస్తోంది. మూవీలోని తన పాత్ర కోసం మహేశ్ లుక్ మొత్తం మార్చే పనిలో బిజీగా ఉన్నాడు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వరద బాధితుల సహాయంగా రూ.50 లక్షల విరాళం అందజేశాడు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్ అందించాడు. ఏఎంబీ తరఫున మరో రూ.10 లక్షలు కూడా విరాళమిచ్చాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ నాలుగు డోంట్ మిస్)మహేశ్ విరాళం ఇచ్చాడు. అయితే డబ్బులు సాయం చేశాడు అనే విషయం కంటే అతడు లుక్ హైలెట్ అవుతోంది. జూలపాల జట్టు, గుబురు గడ్డంలో మహేశ్ సరికొత్తగా కనిపిస్తున్నాడు. ఇన్నాళ్లు మహేశ్ ప్రయోగాలు చేయలేదు, మాస్గా కనిపించలేదు అని ఫ్యాన్స్ తెగ బాధపడ్డారు. ఇప్పుడు డిఫరెంట్గా కనిపిస్తున్న మహేశ్ని చూసి ఫిదా అయిపోతున్నారు.దాదాపు నాలుగేళ్ల క్రితం మహేశ్తో సినిమా ఉంటుందని రాజమౌళి ప్రకటించారు. ఈయన తీసిన 'ఆర్ఆర్ఆర్' వచ్చి కూడా రెండేళ్లకు పైనే అయిపోయింది. అలాంటిది ఓ అప్డేట్ కూడా రాలేదు. ఇప్పట్లో వస్తాదనే గ్యారంటీ కూడా లేదు. కానీ వచ్చే ఏడాది షూటింగ్ మొదలవ్వొచ్చని అంటున్నారు. మరి వీటన్నింటిపై క్లారిటీ రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: 'కల్కి' సినిమాపై గరికపాటి విమర్శలు.. ఏమన్నారంటే?) -
అటు ప్రభాస్.. ఇటు మహేశ్.. కరీనాకి డబుల్ చాన్స్!
హీరో ప్రభాస్, హీరోయిన్ కరీనా కపూర్ జోడీ కట్టనున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు ప్రభాస్. ప్రస్తుతం ‘స్పిరిట్’ సినిమాకు చెందిన ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో ‘స్పిరిట్’ సినిమాను సెట్స్పైకి తీసుకెళ్లాలనుకుంటున్నారట. (చదవండి: ప్రేమకథ బయటపెట్టిన సోనియా.. బూతులందుకున్న పృథ్వి)ఈ లోపు ఈ సినిమాకు చెందిన నటీనటుల ఎంపికపై సందీప్ రెడ్డి దృష్టి పెట్టారట. ఈ క్రమంలోనే హీరోయిన్ పాత్ర కోసం కరీనా కపూర్ను సంప్రదించారని సమాచారం. అంతేకాదు... కరీనా భర్త, నటుడు సైఫ్ అలీఖాన్ కూడా ‘స్పిరిట్’ చిత్రంలో కనిపిస్తారని, సైఫ్ది విలన్ పాత్ర అని బాలీవుడ్ భోగట్టా. (చదవండి: సూపర్స్టార్ కాళ్లకు నమస్కరించిన ఐశ్వర్య కూతురు..!)మరోవైపు మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివర్లో చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారట రాజమౌళి. ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం కరీనాను సంప్రదించారనే ప్రచారం టాలీవుడ్లో వినిపిస్తోంది. మరి... ప్రభాస్ ‘స్పిరిట్’కు కరీనా ఫైనల్ అవుతారా? మహేశ్బాబు చిత్రంలోనూ నటిస్తారా? లేదా ఈ రెండు భారీ చిత్రాల్లో భాగమయ్యేలా డబుల్ చాన్స్ దక్కించుకుంటారా? అనేది చూడాలి. -
పద్దెనిమిదో శతాబ్దం నేపథ్యంలో...
గుబురు గడ్డం, లాంగ్ హెయిర్ స్టయిల్తో మహేశ్బాబు కొత్త లుక్లోకి మారిన విషయం ఈ మధ్య కాలంలో ఆయన ఫొటోలు స్పష్టం చేశాయి. ఈ లుక్ రాజమౌళి దర్శకత్వంలో హీరోగా నటించనున్న సినిమా కోసమేనని తెలిసిందే. ఇక ఈ సినిమా ఎప్పుడు ఆరంభమవుతుంది? అంటే డిసెంబర్లో అని సమాచారం. తాజాగా ఈ చిత్రం నేపథ్యం గురించి ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది.18వ శతాబ్దం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని, ఆ కాలానికి తగ్గట్టుగా హైదరాబాద్లో ప్రత్యేక సెట్లు వేయిస్తున్నారని భోగట్టా. ఈ చిత్రంలో దాదాపు రెండువందల మంది జూనియర్ ఆర్టిస్టులు ఉంటారని, వారంతా ఓ గిరిజన తెగకు సంబంధించినవారనీ టాక్. ఇప్పటికే ఈపాత్రలకు సంబంధించిన నటీనటులను ఎంపిక చేసి, శిక్షణ ఇస్తున్నారట. ఈ నెలాఖరుకి ప్రధాన తారాగణంతో వర్క్ షాప్స్ మొదలుపెట్టి డిసెంబర్లో షూటింగ్ ఆరంభించాలని అనుకుంటున్నారని సమాచారం. -
థియేటర్లో సినిమా వీక్షించిన రాజమౌళి.. వీడియో వైరల్!
శ్రీ సింహా, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం మత్తువదలరా- 2. ఈ చిత్రంలో కమెడియన్ సత్య కీలక పాత్ర పోషించారు. 2019లో వచ్చిన మత్తువదలరా చిత్రానికి కొనసాగింపుగా ఈ మూవీని తెరకెక్కించారు. రీతేష్ రానా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇవాళ థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్కు ఆడియన్స్న నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. అంతేకాకుండా దర్శకధీరుడు రాజమౌళి, ప్రభాస్ ట్రైలర్ బాగుందని అభినందించారు.ఇవాళ థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రీమియర్ షోకు సైతం రాజమౌళి హాజరయ్యారు. థియేటర్లలో అందరితో కలిసి చిత్రాన్ని వీక్షించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. అంతకుముందు మత్తువదలరా-2 ప్రమోషన్లలోనూ రాజమౌళి పాల్గొన్నారు. మూవీ టీంతో కలిసి సరదా స్కిట్ కూడా చేశారు. ప్రమోషన్లలో భాగంగా మహేశ్ బాబుతో తెరకెక్కించబోయే మూవీ అప్డేట్ గురించి ఆరాతీయగా.. పెద్దకర్రతో రాజమౌళి కొట్టబోయారు. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరలైన సంగతి తెలిసిందే.(ఇది చదవండి: మత్తు వదలరా-2 ట్విటర్ రివ్యూ.. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే?)కాగా.. రాజమౌళి తన తదుపరి చిత్రం మహేశ్బాబుతో తెరకెక్కించనున్నారు. యాక్షన్ అడ్వెంచరస్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా సిద్ధమైంది. ప్రస్తుతం ఈ మూవీ పనులతో రాజమౌళి బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాదిలో షూటింగ్ ప్రారంభించే అవకాశముంది. ఈ సినిమా కోసమే మహేశ్ బాబు సరికొత్త లుక్లో కనిపించనున్నారు. #TFNExclusive: Maverick director @ssrajamouli enjoys the #MathuVadalara2 premiere in Hyderabad!🤩#SSRajamouli #MV2 #TeluguFilmNagar pic.twitter.com/pCArTLDGhH— Telugu FilmNagar (@telugufilmnagar) September 13, 2024 -
#SSMB29 : పూనకాలు లోడింగ్.. మహేష్ బాబు నయా లుక్ చూశారా? (చిత్రాలు)
-
పెద్దకర్రతో కొట్టబోయిన రాజమౌళి.. ఎందుకో తెలుసా?
టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం మహేశ్బాబుతో సినిమాను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ను విజయేంద్రప్రసాద్ అందించారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ వారంలో టాలీవుడ్ మూవీ మత్తువదలరా 2 విడుదల కానుంది. ఈ చిత్రంలో శ్రీసింహా హీరోగా నటించారు. ప్రస్తుతం చిత్రబృందం సినిమా ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే దర్శకుడు రాజమౌళిని కలిసి కాస్తా భిన్నంగా ప్రమోషన్స్ చేశారు. ఇందులో భాగంగా రాజమౌళి వద్దకు వెళ్లిన మత్తువదలరా టీమ్ ఎస్ఎస్ఎంబీ29 గురించి అప్డేట్ అడిగారు. దీంతో కోపానికి గురైన రాజమౌళి పెద్ద కర్ర చేతపట్టుకుని.. అప్డేట్ కావాలా అంటూ వారిని కొట్టేందుకు యత్నించారు. అయితే ఇదంతా కేవలం సరదాగా చేశారు. మత్తువదలరా-2 ప్రమోషన్స్ కోసం ఇలా వెరైటీగా ట్రై చేశారు. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరలవుతోంది. ఇది చూసిన టాలీవుడ్ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.(ఇది చదవండి: మత్తువదలరాని ఫ్రాంచైజీలా కొనసాగిస్తాం: శ్రీ సింహా)కాగా.. శ్రీ సింహా, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం మత్తువదలరా 2. ఈ మూవీని రీతేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కించారు. 2019లో వచ్చిన మత్తువదలరా-2 చిత్రానికి కొనసాగింపుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ప్రభాస్, రాజమౌళి చిత్రబృందాన్ని అభినందించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 13న థియేటర్లలో సందడి చేయనుంది. SSR - MB Update Emina ?@ssrajamouli :- Ikkada Karra undali ra Update kavali ante Update #MathuVadalara2 pic.twitter.com/uHgUFCoClT— Milagro Movies (@MilagroMovies) September 11, 2024 -
ఈగ సీక్వెల్.. నానితో పనిలేదన్న రాజమౌళి!
రాజమౌళి దర్శకత్వంలో నాని, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఈగ’. 2012లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పాటు పలు అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ రావాలని సినీ ప్రియులతో పాటు హీరో నాని కూడా కోరుకుంటున్నాడు. తాజాగా ఈ మూవీ సీక్వెల్ గురించి నాని మాట్లాడారు. రాజమౌళి ఫిక్స్ అయితే ఈ సీక్వెల్ కచ్చితంగా వస్తుందని.. చిన్న ఈగతో మరోసారి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని అన్నారు. అయితే ఇప్పట్లో ఈ సీక్వెల్ ఆలోచన రాజమౌళికి లేదని చెబుతూ.. వారిద్దరి మధ్య ఈగ2పై జరిగిన సరదా సంభాషణను పంచుకున్నాడు.ఓ సారి రాజమౌళితో ఈగ సీక్వెల్ గురించి మాట్లాడాను. సీక్వెల్ పనులు ఎప్పుడు మొదలుపెడదామని అడిగాను. అప్పుడు దానికి ఆయన ‘మేము ఈగ 2 చేసినా..నీతో పనిలేదు.మాకు ఈగ ఉంటే చాలు. అదే సీక్వెల్లో తిరిగి వస్తుంది’ అని చెప్పారు. ఒక చిన్న ఈగతో సినిమా తీయాలని ఆలోచన రావడమే గొప్ప విషయం. రాజమౌళి ధైర్యాన్ని ప్రతి ఒక్కరు మెచ్చుకోవాల్సిందే. ఒకవేళ ఆయన ఈగ 2 చేస్తే.. అది కచ్చితంగా మరో అద్భుతమైన విజయం సాధిస్తుంది. ప్రస్తుతం ఆయనకు అయితే సీక్వెల్ చేయాలని ఆలోచన లేదు. కానీ ఏదో ఒకరోజు కచ్చితంగా ఈగ 2 గురించి ఆలోచించి..మంచి కథతో సీక్వెల్ తీస్తాడని అనుకుంటున్నాను’ అన్నారు. నాని ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మహేశ్-రాజమౌళి సినిమా: టైటిల్ ఇదేనా? ఆ పోస్ట్ అర్థం ఏంటి?
మహేశ్ బాబు-రాజమౌళి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు కానీ.. ఈ సినిమాపై రోజు ఏదో ఒక పుకారు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. మొన్నటికి వరకు ఈ సినిమాలో నటించబోయే నటీనటులు గురించి రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఏకంగా ఈ సినిమా టైటిల్పైనే ఓ రూమర్ వచ్చింది. దానికి విజువల్ డెవలప్మెంట్ ఆర్టిస్ట్ టీపీ విజయన్ ఇన్స్టాలో చేసిన ఓ పోస్టే కారణం. (చదవండి: ‘వన్స్ మోర్’ అంటున్న ఫ్యాన్స్.. పాత సినిమాలే సరికొత్తగా!)తాజాగా విజయన్ తన ఇన్స్టా స్టోరీలో బంగారు వర్ణంలో ఉన్న గద్ద రెక్కల ఫోటోని షేర్ చేస్తూ దానికి #SSMB29, #SSMB29DIARIES హ్యాష్ ట్యాగ్లను జత చేశాడు. దీంతో ఇది కచ్చితంగా మహేశ్-రాజమౌళి సినిమా అప్డేటే అని, ఈ చిత్రానికి ‘గరుడ’ అని టైటిల్ పెట్టారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. (చదవండి: స్త్రీ-2 దెబ్బకు బాక్సాఫీస్ షేక్.. బద్దలవుతున్న రికార్డులు!)ఈ టైటిల్ని రాజమౌళి చాలా రోజుల కిందటే ప్రకటించాడు. ‘బాహుబలి’ తర్వాత ‘గరుడ’ అనే సినిమా చేస్తానని గతంలోనే ప్రకటించాడు. కానీ ఆ సినిమా రిలీజ్ తర్వాత గరుడ గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఇప్పుడు మహేశ్తో తీయబోయే సినిమాకు ఈ టైటిల్నే పెట్టారంటూ ప్రచారం జరుగుతోంది. ఇందులో మహేశ్ని సరికొత్త అవతారంలో చూపించబోతున్నాడట. ఇప్పటికే మహేశ్ తన లుక్ని మార్చేశాడు. సినిమా కోసం జట్టు, గడ్డాన్ని పెంచేశాడు. ప్రస్తుతం రాజమౌళి ప్రీ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉన్నాడు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. -
మహేష్, రాజమౌళి మూవీ టైటిల్ ఇదే..?
-
దర్శకధీరుడిపై డాక్యుమెంటరీ చిత్రం.. రామ్ చరణ్ పోస్ట్ వైరల్
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబుతో జతకట్టనున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే కథ సిద్ధం కాగా.. షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి తీయబోయే చిత్రం కావడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆసక్తి నెలకొంది.అయితే ఇటీవల రాజమౌళి గురించి ఓ డాక్యుమెంటరీ చిత్రం వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ రూపొందించిన మోడరన్ మాస్టర్స్ పేరుతో ఈ డాక్యుమెంటరీని రిలీజ్ చేశారు. ఇందులో ఆయన డైరెక్షన్, ఆర్ఆర్ఆర్, బాహుబలి సినిమాల కోసం చేసిన హార్డ్ వర్క్ను చూపించారు. మొత్తంగా రాజమౌళి జీవిత విశేషాలను డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకులను ముందుకు తీసుకొచ్చారు. తాజాగా ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్పై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పందించారు. ఆయన కథ చెప్పేవిధానం, డెడికేషన్ అద్భుతమంటూ కొనియాడారు. ఇలాంటి డాక్యుమెంటరీ రూపొందించడం రాజమౌళికి దక్కిన సరైన గౌరవమని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. ఈ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీని అనుపమా చోప్రా సమర్పణలో అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, ఫిల్మీ కంపానియన్ సంయుక్తంగా నిర్మించారు. రాఘవ్ ఖన్నా దర్శకత్వం వహించగా.. తన్వీ అజింక్యా సహ దర్శకులుగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుచోంది. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
పిలక, గడ్డంతో సూపర్ స్టార్.. మహేశ్ న్యూలుక్ ఫోటోలు వైరల్
టాలీవుడ్లో అందగాడు అని పేరు చెప్పగానే అందరికి గుర్తొచ్చే ఒకే ఒక పేరు మహేశ్ బాబు. ఆయనకు పెళ్లి అయి..ఇద్దరు పిల్లలు ఉన్నా..ఇప్పటికీ చాలా మంది అమ్మాయిలకు మహేశ్ డ్రీమ్ బాయ్గానే ఉంటాడు. యాభైకి చేరువవుతున్నా 25 ఏళ్ల యువకుడిగానే కనిపిస్తాడు. అంతటి అందగాడిని తెరపై రఫ్గా చూపించే పనిలో పడ్డాడు రాజమౌళి. (చదవండి: నెలలోనే ఇ'స్మార్ట్'గా తయారయ్యాడు.. కాకపోతే!)ప్రస్తుతం మహేశ్.. రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా షూటింగ్ ప్రారంభం కాలేదు కానీ..మహేశ్ మాత్రం చాలా కాలంగా తన ఫోకస్ అంతా ఈ సినిమాపైనే పెట్టాడు. ఈ మూవీ కోసం మహేశ్ సరికొత్తగా మేకోవర్ అవుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తన జట్టును, గడ్డాన్ని పెంచుకున్నాడు.(చదవండి: ఓటీటీల్లోనే 12 బెస్ట్ హారర్ మూవీస్.. మీరు చూశారా?)ఇటీవల జరిగిన ముకేశ్ అంబానీ కొడుకు పెళ్లి వేడుకలో లైట్ గడ్డంతో కనిపించి షాకిచ్చాడు మహేశ్. మహేశ్ లుక్ చూసి అంతా ఫిదా అయ్యారు. ఇక తాజాగా మహేశ్ సంబంధించిన న్యూ లుక్ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. అందులో మహేశ్ టీషర్ట్ ధరించి, ఫుల్ గడ్డం, పిలకతో మరింత హ్యాండమ్గా ఉన్నాడు. ఎప్పుడు క్లీన్ షేవ్తో కనిపించే మహేశ్..ఇలా ఫుల్ గడ్డంతో దర్శనం ఇవ్వడం ఫ్యాన్స్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. హాలీవుడ్ హీరోలా ఉన్నాడంటూ కామెంట్ చేస్తున్నారు. Beard + pony tail looks 👌💥😎 Superstar #MaheshBabu Papped at Jaipur @urstrulyMahesh#ssmb29 pic.twitter.com/38lSomVjbV— ARTISTRYBUZZ (@ArtistryBuzz) August 11, 2024 -
OTT: రాజమౌళి ‘మోడ్రన్ మాస్టర్స్’ రివ్యూ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న వాటిలో ప్రముఖ దర్శకుడు రాజమౌళిపై రూపొందిన ‘మోడ్రన్ మాస్టర్స్’ డాక్యుమెంటరీ ఒకటి. ఈ డాక్యుమెంటరీ గురించి తెలుసుకుందాం.నెట్ ఫ్లిక్స్ వేదికగా ఇటీవల విడుదలైన డాక్యుమెంటరీ ‘మోడ్రన్ మాస్టర్స్: ఎస్.ఎస్. రాజమౌళి’. నెట్ ఫ్లిక్స్ అనేది అమెరికా దేశపు ప్రముఖ ఓటీటీ సంస్థ. అమెరికా ఎంటర్టైన్మెంట్ మార్కెట్లో దాదాపు 25 శాతం కలిగి, భారతదేశంలో దాదాపు 12 కోట్లకు పైగా సబ్స్క్రైబర్స్ కలిగిన నెట్ ఫ్లిక్స్ ఓ తెలుగు దర్శకుడి మీద డాక్యుమెంటరీ విడుదల చేయడం ఇదే తొలిసారి.దాదాపు గంటా 54 నిమిషాల నిడివితో ప్రముఖ వ్యాఖ్యాత అనుపమా చోప్రా నిర్మించిన డాక్యుమెంటరీ ‘మోడ్రన్ మాస్టర్స్: ఎస్.ఎస్. రాజమౌళి’. రాఘవ్ కన్నా, తన్వి దర్శకులు. ‘నేను నా కథకు బానిసను. నా ఆడియన్స్ విషయంలో అత్యాశపరుణ్ణి. నా కథను చూడ్డానికి ఎక్కువమంది ఆడియన్స్ కావాలి’... ఇలా తన అభిలాషను ఈ డాక్యుమెంటరీలో వెలిబుచ్చారు రాజమౌళి. తెలుగు చిత్రపరిశ్రమలో దర్శకుడు రాజమౌళి ఓ సంచలనం. ‘స్టూడెంట్ నెం.1’ చిత్రం నుండి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వరకు దర్శకుడిగా రాజమౌళి ప్రయాణంతో పాటు ప్రముఖుల విశ్లేషణలతో ఉంటుందీ డాక్యుమెంటరీ. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్చరణ్, రానా, కీరవాణిలు రాజమౌళితో తమ అనుబంధాన్ని ఈ డాక్యుమెంటరీలో పంచుకున్నారు. ‘‘రాజమౌళికి కావాలనుకున్నట్టుగా మనం ఇమిడిపోతే ఆయనే మనలను తనకు తగ్గట్టుగా మలుచుకుంటాడు’’ అని చెప్పారు ఎన్టీఆర్. ‘‘రాజమౌళికి సినిమా అంటే పిచ్చి. సీన్ ఎవరైనా వివరిస్తారు. కాని ఆ సీన్లో ముందు ఆయన నటించి తరువాత మనతో చేయిస్తాడు. అందుకే రాజమౌళితో చేయడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని ప్రభాస్ తెలిపారు. వీరితో పాటు రాజమౌళి కుటుంబ సభ్యులు ఆయనతో తమ అనుభవాలు పంచుకున్నారు. తన సినిమాలలో హీరోలు ఆయుధాలని, దర్శకుడు ఆయుధాలను వదిలే సాధనం అని రాజమౌళి చెబుతూ... ‘‘తనకు రాముడు కన్నా రావణుడు ఇష్టమని, అందుకే తన చిత్రాలలో ప్రతినాయకుడు ప్రత్యేకంగా కనిపించేలా చూసుకుంటాను’’ అని వివరించారు. చిన్న పిల్లాడు అడుగులు వేసేటప్పుడు తడబడతాడు. అప్పుడు తల్లిదండ్రులుప్రోత్సహించి మరో రెండు అడుగులు వేయిస్తే కొన్ని రోజులయ్యాక పరిగెడతాడు. ఆ కోవలోనే విజయం కోసం కృషి, పట్టుదల,ప్రోత్సాహంతో ఎంతో సాధన చేయాలి. ఈ విషయాన్ని డాక్యుమెంటరీలో లోతుగా వివరించారు రాజమౌళి. డాక్యుమెంటరీ మొత్తంలో చిన్న లోపం ఏంటంటే తెలుగులో దీనికి డబ్బింగ్ వేరొకరితో చెప్పించడం. అందుకే ఇంగ్లీషులో చూడడం శ్రేయస్కరం. – ఇంటూరు హరికృష్ణ -
రాజమౌళి డాక్యుమెంటరీ.. ఆర్ఆర్ఆర్ డిలీటెడ్ సీన్ చూశారా?
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించారు. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్కు ఆస్కార్ అవార్డ్ సైతం దక్కింది. అయితే తాజాగా రాజమౌళిపై మోడరన్ మాస్టర్స్ పేరుతో నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ రూపొందించింది. ఇందులో మొదటి నుంచి సినీ ఇండస్ట్రీలో ఆయన ప్రయాణాన్ని ఆవిష్కరించారు. అయితే ఈ నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన ఓ సీన్ తెగ వైరలవుతోంది. ఇందులో రామ్ చరణ్ ఎడ్లబండిపై నిలబడి ఉన్న సన్నివేశం చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ఈ సీన్ ఆర్ఆర్ఆర్ సినిమాలో లేదు.. షూటింగ్కు సంబంధించిన ఈ క్లిప్ను మోడరన్ మాస్టర్స్ డాకుమెంటరీలో చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.కాగా.. రాజమౌళి త్వరలోనే మహేష్ బాబుతో మూవీ చేయనున్నారు. ఇప్పటికే కథ సిద్ధం కాగా.. ఇంకా టైటిల్ ప్రకటించలేదు. ఈ మూవీని యాక్షన్-అడ్వెంచర్ చిత్రంగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం డిసెంబర్లో రిలీజ్ కానుంది. '@AlwaysRamCharan Deleted scene from @RRRMovie pic.twitter.com/Qj7ZQ4Wn3u— ChaRan (@SSCharan_always) August 2, 2024 -
ఈ వీకెండ్ ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు రిలీజ్
ఈ శుక్రవారం థియేటర్లలోకి తెలుగుతో పాటు డబ్బింగ్ సినిమాలు కలిపి 11 వరకు రిలీజ్ కానున్నాయి. కాకపోతే వీటిలో దేనిపైనా పెద్దగా బజ్ లేదు. మరోవైపు ఓటీటీలో మాత్రం ఏకంగా 25 మూవీస్ & వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో పలు తెలుగు చిత్రాలు ఉన్నాయి. అలానే డబ్బింగ్ మూవీస్ కూడా కొన్ని ఆసక్తి రేపుతున్నాయి.(ఇదీ చదవండి: టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట విషాదం)ఓవరాల్ లిస్టులో చూసుకుంటే రక్షణ, తెప్పసముద్రం సినిమాలతో పాటు మోడ్రన్ మాస్టర్స్ రాజమౌళి డాక్యుమెంటరీ, బృందా సిరీస్.. అలానే కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్, డ్యూన్ 2 లాంటి డబ్బింగ్ చిత్రాల్ని ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. దిగువన జాబితాలో స్ట్రీమింగ్ అని ఉన్నవన్నీ కూడా గురువారం రిలీజైనవి.. మిగతావన్నీ కూడా శుక్రవారం ఓటీటీల్లోకి రాబోతున్నాయని అర్థం.ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ జాబితా (ఆగస్టు 02)ఆహారైల్ - తమిళ మూవీతెప్ప సముద్రం - తెలుగు సినిమా (ఆగస్టు 03)రక్షణ - తెలుగు సినిమా (స్ట్రీమింగ్)అమెజాన్ ప్రైమ్తుజ్ పే మైన్ ఫిదా సీజన్ 2 - హిందీ సిరీస్బ్యాట్ మ్యాన్: క్యాప్డ్ క్రూసేడర్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)హాట్స్టార్కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ - తెలుగు డబ్బింగ్ సినిమానెట్ఫ్లిక్స్మోడ్రన్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి - తెలుగు డాక్యుమెంటరీసేవింగ్ బికినీ బాటమ్ - ఇంగ్లీష్ సినిమాజో రోగన్ - ఇంగ్లీష్ కామెడీ ఈవెంట్ (ఆగస్టు 03)బ్రేకింగ్ అండ్ రీఎంటరింగ్ - మాండరిన్ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్)ఫ్రమ్ మీ టూ యూ కిమీ ని తొడోకే సీజన్ 3 - జపనీస్ సిరీస్ (స్ట్రీమింగ్)షుమిక్కోగురాషీ - జపనీస్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)ఏ గుడ్ గర్ల్ గైడ్ టూ మర్డర్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)బోర్డర్ లెస్ ఫాగ్ - ఇండోనేసియన్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)లవ్ ఈజ్ బ్లైండ్ మెక్సికో - స్పానిష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)మ్యాన్ లఫెర్ట్ టెమో - స్పానిష్ సినిమా (స్ట్రీమింగ్)అన్ స్టెబుల్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) సోనీ లివ్బృందా - తెలుగు డబ్బింగ్ సిరీస్జియో సినిమాటరోట్ - ఇంగ్లీష్ మూవీ (ఆగస్టు 03)దస్ జూన్ కీ రాత్ - హిందీ సిరీస్ (ఆగస్టు 04)డ్యూన్ పార్ట్ 2 - తెలుగు డబ్బింగ్ సినిమా (స్ట్రీమింగ్)గుహ్డ్ చడీ - హిందీ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)బుక్ మై షోద బైక్ రైడర్స్ - ఇంగ్లీష్ సినిమారీస్టోర్ పాయింట్ - తెలుగు డబ్బింగ్ మూవీలయన్స్ గేట్ ప్లేస్లీపింగ్ డాగ్స్ - ఇంగ్లీష్ సినిమా(ఇదీ చదవండి: రూపాయి రెమ్యునరేషన్ తీసుకోని 'మహారాజ' విజయ్ సేతుపతి.. ఎందుకంటే?) -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 20 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్
మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో 'శివం భజే', 'తిరగబడరా సామీ', 'ఉషా పరిణయం', 'బడ్డీ' సినిమా రిలీజ్ అవుతున్నాయి. వీటిలో ఏ ఒక్క దానిపై పెద్దగా బజ్ లేదు. మరోవైపు ఓటీటీల్లో మాత్రం 20 వరకు కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. ఓవరాల్ లిస్టులో నాలుగు మాత్రం ఉన్నంతలో చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి.(ఇదీ చదవండి: హీరో మహేశ్ బాబు మేనమామ, ప్రముఖ నిర్మాత కన్నుమూత)ఓటీటీ మూవీస్ విషయానికొస్తే.. రాజమౌళి జీవితంపై తీసిన డాక్యుమెంటరీ 'మోడ్రన్ మాస్టర్స్', త్రిష 'బృందా' సిరీస్తోపాటు కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్, డ్యూన్ పార్ట్ 2 లాంటి తెలుగు డబ్బింగ్ చిత్రాలు కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. వీటితోపాటు మరికొన్ని హిందీ, ఇంగ్లీష్ చిత్రాలు ఉన్నాయి. మరి ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ కానుందనేది దిగువన లిస్ట్ చూసేద్దాం.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జూలై 29 నుంచి ఆగస్టు 4 వరకు)నెట్ఫ్లిక్స్ఏ గుడ్ గర్ల్ గైడ్ టూ మర్డర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 01బోర్డర్ లెస్ ఫాగ్ (ఇండోనేసియన్ మూవీ) - ఆగస్టు 01లవ్ ఈజ్ బ్లైండ్ మెక్సికో (స్పానిష్ సిరీస్) - ఆగస్టు 01మ్యాన్ లఫెర్ట్ టెమో (స్పానిష్ సినిమా) - ఆగస్టు 01అన్ స్టెబుల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 01మోడ్రన్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి (తెలుగు డాక్యుమెంటరీ) - ఆగస్టు 02సేవింగ్ బికినీ బాటమ్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 02జో రోగన్ (ఇంగ్లీష్ కామెడీ ఈవెంట్) - ఆగస్టు 03అమెజాన్ ప్రైమ్ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్: ద రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 29బ్యాట్ మ్యాన్: క్యాప్డ్ క్రూసేడర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 01హాట్స్టార్ఫ్యుచరమా సీజన్ 12 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 29నో వే ఔట్ (కొరియన్ సిరీస్) - జూలై 31కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 02బుక్ మై షోద బైక్ రైడర్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 02జియో సినిమాడ్యూన్ పార్ట్ 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 01గుహ్డ్ చడీ (హిందీ మూవీ) - ఆగస్టు 01టరోట్ (ఇంగ్లీష్ ఫిల్మ్) - ఆగస్టు 03దస్ జూన్ కీ రాత్ (హిందీ సిరీస్) - ఆగస్టు 04సోనీ లివ్బృందా (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఆగస్టు 02ఆపిల్ ప్లస్ టీవీఉమెన్ ఇన్ బ్లూ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 31(ఇదీ చదవండి: 'హాట్ స్పాట్' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
మహేశ్బాబు గోల్డ్?
హీరో మహేశ్బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లోని సినిమా అంతర్జాతీయ స్థాయిలో రూపొందనున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా ప్రతి అప్డేట్ ప్రపంచవ్యాప్త సినీ ప్రేమికులకు ఆసక్తికరంగా అనిపిస్తోంది. తాజాగా ఈ సినిమాకు ‘గోల్డ్’ అనే టైటిల్ను మేకర్స్ పరిశీలిస్తున్నారనే టాక్ ఫిల్మ్నగర్లో బలంగా వినిపిస్తోంది. గతంలో ‘మహారాజా’, ‘మహారాజ్’ వంటి పేర్లు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. లేటెస్ట్గా ‘గోల్డ్’ టైటిల్ వినిపిస్తోంది.ఆఫ్రికన్ ఫారెస్ట్ అడ్వెంచరస్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ సినిమా ప్రధాన కథాంశం ఓ నిధి వేట అనే వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాకు ‘గోల్డ్’ అనే టైటిల్ని పరిశీలిస్తున్నారనే వార్త రావడంతో నిధి నేపథ్యం కాబట్టి ఈ టైటల్నే ఖరారు చేస్తారనే చర్చ జరుగుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ను రచయిత విజయేంద్ర ప్రసాద్ పూర్తి చేశారని, హైదరాబాద్లో సెట్ వర్క్ జరుగుతోందని, జర్మనీలో కొంత చిత్రీకరణను ప్లాన్ చేశారని తెలుస్తోంది. షూటింగ్ను ఈ ఏడాదిలోనే ప్రారంభించాలనుకుంటున్నారు మేకర్స్. -
పాపం టాలీవుడ్ స్టార్ హీరోలు.. కలలో కూడా ఊహించి ఉండరు
కొన్నింటి గురించి మనం కలలో కూడా ఊహించం. అలాంటివి రియాలిటీలో జరిగినప్పుడు ఇదెక్కడి దరిద్రం బాబోయే అని మనలో మనమే తిట్టుకుంటాం. ఇప్పుడేం జరిగిందని అనుకుంటున్నారా! ప్రముఖ దర్శకుడు రాజమౌళి జీవితంపై నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తీసింది. 'మోడ్రన్ మాస్టర్స్' పేరిట ఆగస్టు 2 న దీన్ని రిలీజ్ చేయనుంది. తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: రెమ్యునరేషన్ తగ్గించుకున్న ప్రభాస్.. ఎందుకో తెలుసా?)ఇక్కడివరకు బాగానే ఉంది. సోమవారం ఉదయం రిలీజ్ చేసిన ట్రైలర్కి పర్లేదనిపించే రెస్పాన్స్ వచ్చింది. రాజమౌళి జీవితంలోని ఎవరికీ తెలియని విషయాల్ని ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, జేమ్స్ కామెరూన్ లాంటి సెలబ్రిటీలు షేర్ చేసుకోవడం బాగానే ఉంది. అయితే మెయిన్ ట్రైలర్ రిలీజ్ చేసిన కాసేపటి తర్వాత ప్రాంతీయ భాషల ట్రైలర్స్ కూడా రిలీజ్ చేశారు.తెలుగు ట్రైలర్ విషయానికొచ్చేసరికి ప్రధాన పాత్రధారి రాజమౌళి సహా డాక్యుమెంటరీలో కనిపించిన ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్లకు వేరే వాళ్లు ఎవరో డబ్బింగ్ చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. దీనిపై విమర్శలు వస్తున్నాయి. ఇన్నికోట్లు ఖర్చు పెట్టి తీశారు. ఇంకాస్త ఎఫర్ట్ పెట్టి, తెలుగు వరకైనా సరే హీరోలతో డబ్బింగ్ చెప్పించి ఉంటే సరిపోయేది! పైపెచ్చు ఈ ట్రైలర్ చూస్తుంటే డిస్కవరీ ఛానెల్లోని డబ్బింగ్లా అనిపించింది.(ఇదీ చదవండి: 'ఆర్ఆర్ఆర్' రికార్డ్ కూడా బ్రేక్ చేసిన 'కల్కి') -
మోడ్రన్ మాస్టర్స్
‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలతో తెలుగు సినిమా కీర్తి పతాకాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఎగురవేశారు దర్శక ధీరుడు రాజమౌళి. తెలుగు చిత్ర పరిశ్రమకి తొలి ఆస్కార్(ఆర్ఆర్ఆర్ మూవీ) అవార్డు తీసుకొచ్చిన ఘనత కూడా ఆయనదే. అలాంటి ప్రతిభావంతుడైన రాజమౌళి జీవిత విశేషాలతో ‘మోడ్రన్ మాస్టర్స్’ అనే పేరుతో ఓ డాక్యుమెంటరీ రూపొందించింది ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్. ఇందులో రాజమౌళి సినీ ప్రయాణాన్ని చూపించనున్నారు. ఆగస్టు 2 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్న ఈ డాక్యుమెంటరీ ట్రైలర్ని విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ సినీ ప్రముఖులు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్చరణ్, కరణ్ జోహార్, జేమ్స్ కామెరూన్ , కీరవాణి, రమా రాజమౌళి వంటి వారు రాజమౌళిపై తమ అభిప్రాయాలతో పాటు పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు.‘మోడ్రన్ మాస్టర్స్’ ట్రైలర్కి అనూహ్యమైన స్పందన వస్తోందంటే రాజమౌళి లైఫ్ స్టోరీ తెలుసుకోవాలనే క్యూరియాసిటీ సినీ అభిమానుల్లో ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. ఇదిలా ఉంటే మహేశ్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కించనున్న సినిమా త్వరలో సెట్స్పైకి వెళ్లనుంది. -
రాజమౌళి ఓ పిచ్చోడు.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ప్రముఖ దర్శకుడు రాజమౌళి.. జీవిత విశేషాలతో డాక్యుమెంటరీ తీశారు. దీన్ని 'మోడ్రన్ మాస్టర్స్' పేరుతో ఆగస్టు 2 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. కొన్నిరోజుల క్రితం ఈ విషయాన్ని ప్రకటించారు. ఇప్పుడు డాక్యుమెంటరీ ఎలా ఉండబోతుందో చెప్పే ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్తోపాటు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పడం విశేషం.(ఇదీ చదవండి: ఓటీటీలో భారతీయుడు 2.. అంచనాలు తప్పడంతో మార్పులు)ఇది డాక్యుమెంటరీ కాబట్టి సినిమా స్టైల్లో ఉండదు. రాజమౌళి కెరీర్ ఎలా ఎప్పుడు ప్రారంభమైందనేది విజువల్స్ రూపంలో చూపిస్తారు. అలానే జక్కన్నతో పనిచేసిన అనుభవాన్ని ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్ చెప్పడం ఆసక్తికరంగా అనిపిస్తోంది. అయితే ఇది డాక్యుమెంటరీ కాబట్టి అందరికీ నచ్చకపోవచ్చు. రాజమౌళి లైఫ్ స్టోరీ తెలుసుకోవాలనుకుంటే మాత్రం దీన్ని చూడండి.(ఇదీ చదవండి: ఉపాసనపై టాలీవుడ్ కమెడియన్ ప్రశంసలు.. ఎందుకంటే?) -
ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ -2023.. ఉత్తమ చిత్రాలు ఏవో తెలుసా?
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్బస్టర్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డును దక్కించుకున్న సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాటకు ఆస్కార్ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ మరో ఘనతను దక్కించుకుంది. ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్- 2023లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఇవాళ ప్రకటించిన 68వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి, ఉత్తమ యాక్టర్స్గా ఎన్టీఆర్, రామ్చరణ్ సంయుక్తంగా ఆవార్డ్ అందుకోనున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల విజేతలను కూడా ప్రకటించారు. ఏయే సినిమాకు అవార్డులు దక్కాయో ఫుల్ లిస్ట్ చూసేయండి.68వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్-2023 విజేతలు వీళ్లే..తెలుగు..ఉత్తమ చిత్రం- ఆర్ఆర్ఆర్ఉత్తమ దర్శకుడు- ఎస్ఎస్ రాజమౌళిఉత్తమ నటుడు- రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్(ఆర్ఆర్ఆర్)ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) - సీతారామం (హను రాఘవపూడి)ఉత్తమ నటుడు (క్రిటిక్స్) - దుల్కర్ సల్మాన్ఉత్తమ నటి - మృణాళ్ ఠాకూర్ (సీతారామం)ఉత్తమ నటి (క్రిటిక్స్) -సాయి పల్లవి( విరాట్ పర్వం)ఉత్తమ సహాయ నటుడు - రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్)ఉత్తమ సహాయ నటి - నందితాదాస్ (విరాట్ పర్వం)ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ - ఎం.ఎం.కీరవాణి (ఆర్ఆర్ఆర్)ఉత్తమ సాహిత్యం - సిరివెన్నెల సీతారామశాస్త్రి (సీతారామం)ఉత్తమ నేపథ్య గాయకుడు - కాలభైరవ (కొమురం భీముడో.. ఆర్ఆర్ఆర్)ఉత్తమ నేపథ్య గాయని - చిన్మయి శ్రీపాద (ఓ ప్రేమ -సీతారామం)ఉత్తమ కొరియోగ్రఫీ -ప్రేమ్ రక్షిత్ (నాటు నాటు.. ఆర్ఆర్ఆర్)బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ - సాబు శిరిల్ (ఆర్ఆర్ఆర్)తమిళంఉత్తమ చిత్రం - పొన్నియిన్ సెల్వన్- 1ఉత్తమ నటుడు- కమల్ హసన్ (విక్రమ్)ఉత్తమ నటి- సాయి పల్లవి (గార్గి)ఉత్తమ దర్శకుడు- మణి రత్నం (పొన్నియిన్ సెల్వన్ -1)ఉత్తమ సంగీత దర్శకుడు- ఏఆర్ రెహమాన్ (పొన్నియన్ సెల్వన్- 1)ఉత్తమ సహాయ నటుడు -(మేల్) కాళి వెంకట్ఉత్తమ సహాయ నటి - ఊర్వశిఉత్తమ చిత్రం క్రిటిక్స్- కదైసి వ్యవసాయిఉత్తమ యాక్టర్ క్రిటిక్స్ - ధనుష్ (తిరు), మాధవన్(రాకెట్రీ)ఉత్తమ నటి క్రిటిక్స్- నిత్యా మీనన్ (తిరు)ఉత్తమ గేయ రచయిత- తమిరైఉత్తమ గాయకుడు- సంతోష్ నారాయణ్ (తిరు)ఉత్తమ గాయని - అంతనా నందిఉత్తమ తొలి చిత్ర నటుడు- ప్రదీప్ రంగనాథ్ఉత్తమ తొలి చిత్ర నటి - అదితి శంకర్ (విరుమన్)ఉత్తమ సినిమాటోగ్రఫీ- సెంథిల్, రవి వర్మన్ కన్నడఉత్తమ చిత్రం -కాంతారఉత్తమ నటుడు- రిషబ్ షెట్టి (కాంతార)ఉత్తమ నటి - చైత్ర జే అచార్ఉత్తమ దర్శకుడు - కిరణ్ రాజ్ (777 ఛార్లీ)ఉత్తమ సహాయ నటుడు- అచ్యుత్ కుమార్ఉత్తమ సహాయ నటి - మంగళఉత్తమ సంగీత దర్శకుడు - అజనీష్ఉత్తమ గేయ రచయిత - నాగేంద్ర ప్రసాద్ఉత్తమ గాయకుడు - సాయి విగ్నేశ్ఉత్తమ గాయని- సునిధి చౌహాన్ఉత్తమ చిత్రం (క్రిటిక్స్)- ధరణి మండలఉత్తమ నటుడు క్రిటిక్స్- నవీన్ శంకర్ఉత్తమ నటి క్రిటిక్స్- సప్తమి గౌడమలయాళంఉత్తమ చిత్రం- నా తన్ కేస్ కోడుఉత్తమ నటుడు- కుంచకో బోబన్ ( నా థన్ కేస్ కోడు)ఉత్తమ నటి - దర్షన రాజేంద్రన్ (జయజయజయజయహే)ఉత్తమ దర్శకుడు- రతీస్ బాలకృష్ణన్ (నా థన్ కేస్ కోడు)ఉత్తమ సహాయ నటుడు- ఇంద్రాన్స్ (ఉడల్)ఉత్తమ సహాయ నటి -పార్వతి తిరువోతు (ఫుజు)ఉత్తమ సంగీత దర్శకుడు- కైలాష్ మీనన్ (వాషి)ఉత్తమ గేయ రచయిత- అరుణ్ అలత్ (హృదయం)ఉత్తమ ప్లేబాక్ సింగర్ - ఉన్ని మీనన్ (భీష్మ పర్వం)ఉత్తమ ప్లేబాక్ సింగర్ - మృదుల వారియర్ (పాథోన్పథం నోట్టండు)ఉత్తమ ఫిలిం (క్రిటిక్స్)- అరిఇప్పుఉత్తమ నటుడు (క్రిటిక్స్)- అలెన్సియర్ లే లోపెజ్ (అప్పన్)ఉత్తమ నటి (క్రిటిక్స్) -రేవతి (భూతకాలం) -
మహేశ్ ద్విపాత్రాభినయం.. విలన్గా కూడా..?
మహేశ్బాబు విలన్ పాత్రలో కనిపిస్తే ఎలా ఉంటారు? అనే చర్చ జరుగుతోంది. ఈ చర్చకు కారణం లేకపోలేదు. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేశ్ రెండు పాత్రల్లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఒకటి హీరో పాత్ర అన్నది కన్ఫార్మ్. రెండోది విలన్ అని సమాచారం. కాగా విలన్ పాత్రకు మలయాళ నటుడు పృథ్వీరాజ్ని అనుకున్నారనే వార్త వచ్చింది.ఆ తర్వాత విక్రమ్ పేరు వినిపించింది. అయితే ఈ రెండు పాత్రలనూ మహేశ్బాబుతోనే చేయించాలని రాజమౌళి అనుకుంటున్నారట. ఆఫ్రికాలోని అమేజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో మహేశ్ కొత్త లుక్లో కనిపించనున్నారు. ఈ మధ్య కండలు తిరిగిన దేహం, కాస్త లెంగ్తీ హెయిర్, గడ్డంతో కొత్తగా కనిపిస్తున్నారు మహేశ్. రాజమౌళి సినిమా కోసమే ఇలా మేకోవర్ అయ్యారని సమాచారం.త్వరలో ఈ చిత్రం షూటింగ్ని ఆరంభించాలని అనుకుంటున్నారు. మరి... ఈ సినిమాలో మహేశ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారా? అదే నిజమైతే హీరో... విలన్గానా? లేక రెండు పాజిటివ్ క్యారెక్టర్సా? అనేది తెలియాల్సి ఉంది. -
హీరో మహేశ్ బాబుకి యాక్టింగ్ క్లాసులు.. కొత్తగా ఆ విషయాల్లో?
సూపర్ స్టార్ మహేశ్ బాబుకి యాక్టింగ్ మళ్లీ కొత్తగా యాక్టింగ్ క్లాసులా? ఎందుకు ఏమైందని అనుకుంటున్నారా? ఈ మధ్య వెకేషన్ ముగించుకుని ఇంటికొచ్చేసిన మహేశ్.. ప్రస్తుతం రాజమౌళి మూవీకి జరుగుతున్న ప్రీ ప్రొడక్షన్లో బిజీ అయిపోయాడు. ఈ క్రమంలోనే మహేశ్ కొత్తగా కొన్ని విషయాల్లో మారేందుకు రెడీ అయిపోతున్నాడనే న్యూస్ బయటకొచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సుధీర్ బాబు యాక్షన్ మూవీ... స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్)ఈ సంక్రాంతికి 'గుంటూరు కారం'తో ప్రేక్షకుల ముందుకొచ్చిన మహేశ్... రాజమౌళితో కలిసి ఇప్పుడు పనిచేయబోతున్నాడు. స్క్రిప్ట్ లాక్ అయిపోయింది. దీంతో ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్, ఇతరత్రా వర్క్ అంతా జరుగుతోంది. ఇందులో భాగంగానే మూవీలో మహేశ్ బాబు పాత్ర యాస, యాక్టింగ్ విషయంలో నాజర్ మెలకువలు నేర్పిస్తున్నారట. అంటే రాజమౌళి ప్రాజెక్ట్ కోసం సరికొత్త మహేశ్ని చూడబోతున్నమాట.ఇదిలా ఉండగా త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి SSMB 29 గురించి రాజమౌళి చెప్పబోతున్నారు. గతంలో ఓసారి మాట్లాడుతూ 'గ్లోబ్ట్రాటింగ్' స్టోరీగా ఉండబోతుందని చెప్పారు. ఇప్పటికే బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ఇంటర్నేషనల్ వైడ్ ఫేమ్ తెచ్చుకున్న రాజమౌళి.. మహేశ్తో ఏం ప్లాన్ చేస్తున్నారో తెలియాలంటే మరికొన్నేళ్లు ఆగాల్సిందే.(ఇదీ చదవండి: 'హనుమాన్' దర్శకుడికి చేదు అనుభవం.. ఏం జరిగిందంటే?) -
రాజమౌళి పై నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ... స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?
-
మోడ్రన్ మాస్టర్
ప్రముఖ దర్శకుడు రాజమౌళి బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ ‘మోడ్రన్ మాస్టర్స్: రాజమౌళి’ పేరిట నెట్ఫ్లిక్స్లో ఆగస్టు 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ‘ఎక్స్’ వేదికగా నెట్ఫ్లిక్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ‘‘ఒక వ్యక్తి... ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు. అంతులేని ఆశయం.ఈ దిగ్గజ దర్శకుడు ఇంత గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డారు? అనే అంశాలతో ఈ ‘మోడ్రన్ మాస్టర్స్’ రూపొందింది’’ అంటూ రాజమౌళి బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీని ఉద్దేశించి నెట్ఫ్లిక్స్ ‘ఎక్స్’లో పేర్కొంది. రాజమౌళి జీవిత విశేషాలు, ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’ చిత్రాల మేకింగ్ గురించిన ఆసక్తికర సన్నివేశాలు ఈ డాక్యుమెంటరీలో ఉంటాయని తెలుస్తోంది.అంతేకాదు... ప్రభాస్, ఎన్టీఆర్, రామ్చరణ్, రానా వంటి స్టార్స్ రాజమౌళి గురించి ఏం అబిప్రాయపడుతున్నారు? అనే సంగతులు కూడా ఈ ‘మోడ్రన్ మాస్టర్స్: రాజమౌళి’లో ఉంటాయట. ఈ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీని అనుపమా చోప్రా సమర్పణలో అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, ఫిల్మీ కంపానియన్ నిర్మించగా రాఘవ్ ఖన్నా దర్శకత్వం వహించారని, తన్వీ అజింక్యా సహ దర్శకులుగా వ్యవహరించారని తెలుస్తోంది. -
డైరెక్టర్ రాజమౌళి జీవితంపై మూవీ.. ఓటీటీలో నేరుగా రిలీజ్
రాజమౌళి.. పాన్ ఇండియా లెవల్లో ఓ సెన్సేషన్. తెలుగులో సాధారణ దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి.. 'ఆర్ఆర్ఆర్'తో ఆస్కార్ సాధించే రేంజ్ వరకు ఎదిగిపోయాడు. 'బాహుబలి'తో వరల్డ్ వైడ్ గుర్తింపు సంపాదించిన ఈ దర్శకుడు.. ప్రస్తుతం మహేశ్ బాబుతో ఓ మూవీ చేస్తున్నాడు. ఇది ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉంది. కాబట్టి రావడానికి ఎంత లేదన్న మరో 3-4 ఏళ్లయినా పడుతుంది. మరోవైపు రాజమౌళి బయోపిక్ లాంటి డాక్యుమెంటరీ ఒకటి ఓటీటీలోకి వచ్చేయబోతుంది.(ఇదీ చదవండి: 'బేబి' డైరెక్టర్కి షాకింగ్ ఎక్స్పీరియెన్స్.. పాపం అలా అనేసరికి!)తెలుగు దర్శకుల్లో రాజమౌళి రూటు సెపరేటు. చేసిన ప్రతి సినిమాతో తన రేంజ్ పెంచుకోవడమే కాకుండా హిట్స్, బ్లాక్ బస్టర్స్ కొట్టాడు. 'బాహుబలి'తో పాన్ ఇండియా మార్కెట్ షేక్ చేసిన ఇతడు.. వేల కోట్లు కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూపించాడు. 'ఆర్ఆర్ఆర్'తో అంతర్జాతీయ స్థాయిలో తన పేరు మార్మోగిపోయేలా చేశాడు. ఈ క్రమంలోనే ఇతడి జీవితంలో కొన్ని విషయాలతో 'మోడ్రన్ మాస్టర్స్' అనే డాక్యుమెంటరీ తీశారు.ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్లో ఆగస్టు 2 నుంచి ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కానుంది. ఇందులో భాగంగా భారతీయ, అంతర్జాతీయ సినిమాపై రాజమౌళి ప్రభావం ఎలా ఉందనేది చూపించబోతున్నాడు. అలానే జక్కన్న గురించి హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్, జో రూసో, ప్రభాస్, రానా, జూ.ఎన్టీఆర్ తమ పాయింట్ ఆఫ్ వ్యూని చెబుతారు. అయితే ఇది బయోపిక్లా ఉంటుందా? కేవలం రాజమౌళి గురించి ఎలివేషన్స్ ఉంటాయా? అనేది చూడాలి.(ఇదీ చదవండి: పొరపాట్లు ఒప్పుకొన్న 'కల్కి' డైరెక్టర్.. ఆ మూడు విషయాల్లో!) -
SSMB29: మహేశ్- రాజమౌళి సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్!
మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ను శరవేగంగా చేస్తున్నారు రాజమౌళి. సెప్టెంబరులో ఈ సినిమాని సెట్స్కి తీసుకెళ్లాలన్నది రాజమౌళి ముందున్న ప్రస్తుత టార్గెట్ అట. ఇందులో భాగంగానే హైదరాబాద్లో కొన్ని రోజుల క్రితమే ఈ చిత్రానికి చెందిన సెట్ వర్క్ను ఆరంభించారని తెలిసింది. జస్ట్ ఒక్క సెట్ కాదు... పలు రకాల సెట్స్ను డిజైన్ చేయిస్తున్నారట రాజమౌళి. వీటిలో ఆఫీస్ సెట్ కూడా ఉందని, ఎక్కువ శాతం షూటింగ్ ఈ సెట్లో జరుగుతుందని భోగట్టా. ప్రస్తుతం తయారు చేయిస్తున్న సెట్స్లో ఏదో ఒక సెట్లో తొలి షెడ్యూల్ని ఆరంభిస్తారట. ప్రస్తుతం ఈ సినిమాకు చెందిన నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారు రాజమౌళి. ఈ క్రమంలోనే ఈ సినిమాలోని విలన్ పాత్రకు మలయాళ నటుడు– దర్శక–నిర్మాత పృథ్వీరాజ్ సుకుమారన్ను తీసుకున్నారనే టాక్ ప్రచారంలోకి వచ్చింది. -
మహేష్ – రాజమౌళి మూవీ: విలన్గా స్టార్ హీరో!
సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందకు ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. భారీ బడ్జెట్తో యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్గా తెరెకెక్కుతున్న ఈ సినిమా కోసం మహేశ్ బాబు చాలా కష్టపడుతున్నాడు. తన లుక్ను కూడా మార్చుకున్నాడు. పాత్రకు తగ్గట్లుగా బాడీని బిల్డ్ చేసుకుంటున్నాడు. త్వరలోనే సెట్స్పైకి అడుగుపెట్టనున్నారు.(చదవండి: టాలీవుడ్లో హాలీవుడ్ భామ.. 'నిన్ను వదలను' అంటోన్న బ్యూటీ!)ఇప్పటికే స్క్రిప్ట్ మొత్తం పూర్తి అయింది. ప్రస్తుతం నటీనటుల ఎంపికపై దృష్టిపెట్టాడు రాజమౌళి. ఈ చిత్రం కోసం అంతర్జాతీయ నటీనటులను, టెక్నీషియన్లను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మహేశ్కు జోడీగా ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ నటిస్తున్నట్లు ఆ మధ్య ఓ పుకారు బయటకు వచ్చింది. అయితే చిత్రబృందం మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక తాజాగా ఈ సినిమా విలన్ గురించి ఇంట్రెస్టింగ్ గాసిప్ ఒకటి బయటకు వచ్చింది. మహేశ్ను ఢీ కొట్టే విలన్ పాత్రలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ను ఎంపిక చేశారట. ఈ విషయానన్ని జక్కన్న గోప్యంగా ఉంచినప్పటకీ..లీకుల వీరులు బయటకు వదిలేశారు. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన పృథ్విరాజ్.. ‘సలార్’తో పాన్ ఇండియా నటుడయ్యాడు. ఆ చిత్రంలో పృథ్విరాజ్ ప్రభాస్తో పోటీ పడి నటించాడు. తన సినిమాలోని విలన్ పాత్రకు పృథ్వీరాజ్ బాగా సెట్ అవుతాడని జక్కన్న భావిస్తున్నాడట. ఇక రాజమౌళి సినిమాలో నటించే అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు? పృథ్విరాజ్ వెంటనే ఓకే చెప్పేశాడట. అన్ని సెట్ అయితే.. మహేశ్ బాబును ఢీకొట్టే విలన్గా పృథ్విరాజ్ను చూడొచ్చు. -
వరల్డ్ కప్ విక్టరీ.. టీమిండియాకు టాలీవుడ్ తారల విషెస్!
టీ20 వరల్డ్ కప్లో టీమిండియా ఘనవిజయం సాధించింది. 2007 తర్వాత పొట్టి ఫార్మాట్లో మరోసారి జగజ్జేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో సౌతాఫ్రికాను ఓడించి ప్రపంచకప్ను ముద్దాడింది. దీంతో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. వరల్డ్ కప్ గెలిచిన వేళ టాలీవుడ్ సినీతారలు సైతం మన జట్టుకు అభినందనలు తెలిపారు.దర్శకధీరుడు రాజమౌళి విన్నింగ్ మూమెంట్ ఫోటోను ట్విటర్లో పంచుకున్నారు. కోచ్ రాహుల్ ద్రావిడ్ను హత్తుకున్న ఫోటోను పోస్ట్ చేశారు. ఈ అద్భుతమైన విజయాన్ని గుర్తుండిపోయేలా చేసిన టీమిండియాకు, రోహిత్ శర్మకు నా ప్రత్యేక అభినందనలు అంటూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా అభినందలు తెలిపారు.🥹🥹🥹 pic.twitter.com/UMojgkRs2U— rajamouli ss (@ssrajamouli) June 29, 2024 Incredible win for Team India! 🇮🇳 Well done, team! Hurrah for @Jaspritbumrah93 👍🏼 and outstanding performances by @imVkohli and @hardikpandya7 ! Kudos to our captain @ImRo45 and all the people behind the scenes for making this win so memorable.#TeamIndia #T20WorldCup #INDvSA…— Ram Charan (@AlwaysRamCharan) June 29, 2024పొట్టి ప్రపంచకప్ గెలిచిన వేళ సూపర్ స్టార్ మహేశ్బాబు టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు. 'ఈ రోజు మనదే.. హీరోస్-ఇన్-బ్లూ.. కొత్త ప్రపంచ ఛాంపియన్స్.. సూర్యకుమార్ క్యాచ్ చరిత్రలో నిలిచిపోతుంది. ఈ చారిత్రాత్మక విజయం పట్ల చాలా గర్వంగా ఉంది. జై హింద్' అంటూ పోస్ట్ చేశారు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు నా అభినందనలు అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. Congratulations to the Indian Cricket team on winning the T20 World Cup 🇮🇳— Allu Arjun (@alluarjun) June 29, 2024 It's ours!! 🏆 The Heroes-in-Blue are the new 'World Champions'! Take a bow #TeamIndia for your relentless efforts on the field today! @surya_14kumar, your catch will be etched in history… what a stunner 😍😍😍 Super proud of this historic win. Jai Hind! 🇮🇳 #T20WorldCup… pic.twitter.com/7EI1oQ2ngw— Mahesh Babu (@urstrulyMahesh) June 29, 2024 -
కల్కి మూవీపై రాజమౌళి రివ్యూ.. ఆయన ఏమన్నారంటే?
ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఏడీ అభిమానుల భారీ అంచనాల మధ్య ఇవాళ రిలీజైంది. ఉదయాన్నే బెనిఫిట్ షో నుంచే ఫ్యాన్స్ సందడి మొదలైంది. మొదటి షో నుంచే కల్కికి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. మహానటి తర్వాత నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సినిమా కావడంతో భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే తొలి రోజే సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమాపై దర్శకధీరుడు రాజమౌళి తన రివ్యూను ప్రకటించారు. ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.రాజమౌళి తన ట్వీట్లో రాస్తూ..' కల్కి మూవీ ప్రపంచం నిర్మాణాన్ని ఇష్టపడ్డా. అద్భుతమైన సెట్టింగ్లతో ఇది నన్ను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లింది. డార్లింగ్ తన టైమింగ్, టాలెంట్తో చంపేశాడు. అమితాబ్ జీ, కమల్ సర్, దీపిక నుంచి ఫుల్ సపోర్ట్ దొరికింది. అయితే సినిమా చివరి 30 నిమిషాలు నన్ను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. తమ ప్లాన్ను అమలు చేయడంలో వందశాతం ప్రయత్నం సక్సెస్ సాధించారు. నాగి, అలాగే మొత్తం వైజయంతి టీమ్కు అభినందనలు' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్, దీపికా పదుకొణె, దిశాపటానీ కీలకపాత్రలు పోషించారు. Loved the world-building of #Kalki2898AD… It transported me into various realms with its incredible settings.Darling just killed it with his timing and ease… Great support from Amitabh ji, Kamal sir, and Deepika.The last 30 minutes of the film took me to a whole new world.…— rajamouli ss (@ssrajamouli) June 27, 2024 -
'కల్కి' గెస్ట్ రోల్స్లో మరో ఐదుగురు.. ఎవరూ ఊహించని పేర్లు
ప్రభాస్- నాగ్ అశ్విన్ 'కల్కి 2898 ఏడీ' చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. భారీ బడ్జెట్తో ఎనలేని తారాగాణంతో వైజయంతీ మూవీస్ బ్యానర్లో ఈ చిత్రాన్ని అశ్వనీదత్ నిర్మించారు. ఇప్పటికే భైరవగా థియేటర్స్లో దుమ్మురేపుతున్నాడు ప్రభాస్. ఈ సినిమా కోసం భవిష్యత్ కాశీ, కాంప్లెక్స్, శంబల అనే మూడు ప్రపంచాల్ని దర్శకుడు నాగ్ అశ్విన్ అద్బుతంగా క్రియేట్ చేశాడు. ఆ మూడు ప్రపంచాల నేపథ్యంలోనే ఈ కథ సాగుతుంది. అందుకు అనుగుణంగానే ఈ మూవీలో భారీ అగ్ర తారాగణం ఉంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, శోభన,దిశా పటాని, కీర్తి సురేష్ వాయిస్ ఇలా ఎన్నో ప్రత్యేకతలు కల్కిలో ఉన్నాయి.కల్కి చిత్రాన్ని ఇప్పటికే చాలామంది ప్రేక్షకులు చూశారు. ఈ మూవీలో గెస్ట్ రోల్స్లో మరికొందరు పోషించారు. ఇప్పుడు వారందరి పేర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ మూవీలో ఉన్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే, కల్కిలో మృణాళ్ ఠాకూర్, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, కె.వి. అనుదీప్తో పాటు ఫరియా అబ్దుల్లా కూడా ఉన్నారు. వీరందరూ కూడా గెస్ట్ రోల్స్ కనిపించినా కథకు తగ్గట్లు ఉండటం విశేషం. -
రాజమౌళి దంపతులకు ఆస్కార్ నుంచి ఆహ్వానం..
ఆస్కార్.. ఎంతోమంది కలలు గనే ఈ అవార్డు గతేడాది ఇండియన్ సినిమాను వరించింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీలో నాటు నాటు పాటకు ఉత్తమ ఒరిజినల్ విభాగంలో అకాడమీ పురస్కారం లభించింది. అంతేగాక ఈ సినిమా టీమ్ సభ్యులైన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి, చంద్రబోస్, సెంథిల్, సాబు శిరిల్ గతేడాది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (ఏమ్పీఏఎస్) లో సభ్యత్వం సాధించారు.ఇప్పుడు ఆ జాబితాలో రాజమౌళి దంపతులు చేరారు. దర్శకత్వ కేటగిరీలో జక్కన్న, కాస్ట్యూమ్ డిజైనర్ లిస్టులో ఆయన భార్య రమా రాజమౌళి అకాడమీలో చేరేందుకు ఆహ్వానం అందుకున్నారు. ఈ ఏడాది అకాడమీ.. 57 దేశాల నుంచి 487 మంది సభ్యులకు ఆహ్వానం పంపింది. వీరిలో భారత్ నుంచి రాజమౌళి దంపతులతో పాటు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, బాలీవుడ్ నటి షబానా అజ్మీ, సినిమాటోగ్రాఫర్ రవి వర్మ, దర్శకనిర్మాత రీమా దాస్, నిర్మాత రితేశ్ సిద్వానీ తదితరులు ఉన్నారు. సినిమాల విషయానికొస్తే.. రాజమౌళి ప్రస్తుతం మహేశ్బాబుతో ఓ సినిమా(#SSMB29) చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నారు. View this post on Instagram A post shared by The Academy (@theacademy) చదవండి: ప్రియుడితో పెళ్లి.. ట్రోలర్స్కు కౌంటరిచ్చిన హీరోయిన్! -
ఎట్టకేలకు రాజమౌళి-మహేశ్ మూవీ అప్డేట్.. బయటపెట్టిన కీరవాణి
'ఆర్ఆర్ఆర్' రిలీజై రెండేళ్లయింది. అప్పటి నుంచి రాజమౌళి మహేశ్ సినిమా మీదే పనిచేస్తున్నారు. అదిగో ఇదిగో అంటున్నారు. కానీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనేది మాత్రం చెప్పట్లేదు. మే చివరన కృష్ణ జయంతి సందర్భంగా ఏదైనా అప్డేట్ వస్తుందనుకుంటే.. అస్సలు సౌండ్ చేయలేదు. దీంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయిపోతున్నారు. ఇలాంటి టైంలో ఈ ప్రాజెక్ట్ గురించి కీరవాణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఏం జరుగుతుందో చెప్పేశారు.(ఇదీ చదవండి: మహేశ్ బాబు కొడుకు మొదలుపెట్టేశాడు.. లండన్లో నాటకం)'మహేశ్-రాజమౌళి సినిమా స్టోరీ లాక్ అయిపోయింది. నేను ఇంకా మ్యూజిక్ వర్క్ ప్రారంభించలేదు. కొన్ని టెస్ట్ షూట్స్ చేస్తున్నారు. జూలై లేదా ఆగస్టులో నా పని మొదలుపెడతాను' అని కీరవాణి చెప్పుకొచ్చారు. దీనిబట్టి చూస్తే ఇప్పుడు టెస్ట్ షూట్ చేస్తున్నారంటే షూటింగ్ మొదలయ్యేసరికి ఈ ఏడాది చివర లేదంటే వచ్చే ఏడాది అయిపోవచ్చు.రాజమౌళి సినిమా అంటే ఫెర్ఫెక్ట్ ఉండాలి. అదీ కాక 'ఆర్ఆర్ఆర్'కి ఆస్కార్ వచ్చింది కాబట్టి.. ఇప్పుడు చేయబోయే మూవీపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉంటాయి. దీంతో కచ్చితంగా పూర్తవడానికి నాలుగైదేళ్లు పట్టేస్తుందేమో? ఇదిలా ఉండగా ఈ సినిమా స్టోరీ విషయంలో గతంలో రకరకాల రూమర్స్ వచ్చాయి. ఏదైనా అప్డేట్ వస్తే గానీ అసలేం జరుగుతుందనేది క్లారిటీ రాదు. చూడాలి మరి ఇప్పుడు టెస్ట్ షూట్ చేస్తున్నారంటే ఆగస్టులో మహేశ్ పుట్టినరోజు నాటికైనా అప్డేట్ ఇస్తారా లేదా అనేది చూడాలి.(ఇదీ చదవండి: తెలంగాణలో 'కల్కి' టికెట్ ధరలు పెంపు.. ఒక్కొక్కటి ఏకంగా?) -
రాజమౌళిగారు నాకు జీవితం ఇచ్చారు: దేవ్ గిల్
‘‘నా స్వస్థలం పుణే. ముంబైలో ఉన్న నన్ను ‘మగధీర’ మూవీ కోసం రాజమౌళిగారు హైదరాబాద్కి తీసుకొచ్చి, నాకు జీవితం ఇచ్చారు. రాజమౌళి, రమా రాజమౌళిగార్ల వల్లే ఈ రోజు ‘అహో విక్రమార్క’లో హీరోగా నటించి, నిర్మించగలిగాను. ఇందుకు నాకు ఆనందంగా ఉంది’’ అని దేవ్ గిల్ అన్నారు. ‘మగధీర’ చిత్రంలో రామ్చరణ్కి ప్రతినాయకుడిగా నటించిన దేవ్ గిల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఆయన హీరోగా పేట త్రికోటి దర్శకత్వం వహించిన చిత్రం ‘అహో విక్రమార్క’. దేవ్ గిల్ ప్రొడక్షన్స్పై దేవ్ గిల్ భార్య ఆర్తి ఈ మూవీ నిర్మించారు. ఈ సినిమా టీజర్ను హైదరాబాద్లో రిలీజ్ చేశారు. దేవ్ గిల్ మాట్లాడుతూ– ‘‘మగధీర’ నుంచి తెలుగు ప్రేక్షకులు నాపై ప్రేమను కురిపిస్తూనే ఉన్నారు. నన్ను ఇంతవరకు విలన్గా చూశారు. ‘అహో విక్రమార్క’తో హీరోగా మీ అందరికీ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను’’ అన్నారు. ‘‘మా ్ర΄÷డక్షన్ నుంచి వస్తున్న మొదటి చిత్రం ఇది. ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది... ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు ఆర్తి. పేట త్రికోటి మాట్లాడుతూ– ‘‘దేవ్ గిల్కి ΄ోలీస్ కథ సరి΄ోతుందని భావించి, ఈ సినిమా తీశాం. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా చిత్రీకరించాం’’ అన్నారు. ‘‘త్రికోటి, దేవ్ గిల్గార్లతో పని చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు హీరోయిన్ చిత్రా శుక్లా. నటులు యువరాజ్, ప్రవీణ్ మాట్లాడారు. -
రాజమౌళి సినిమాను త్రిష తిరస్కరించిందా.. కారణం ఆ హీరోనేనా..?
సౌత్ ఇండియాలో 25 ఏళ్లుగా స్టార్ హీరోయిన్ గుర్తింపును త్రిష కొనసాగిస్తుంది. మోడలింగ్ నుంచి హీరోయిన్గా 'జోడి' (తమిళ్) సినిమాతో 1999లో ఎంట్రీ ఇచ్చింది. అందులో హీరోయిన్ సిమ్రన్కు స్నేహితురాలిగా మెప్పించింది. ఈ సినిమాతో కోలీవుడ్, టాలీవుడ్లో అందరి దృష్టిని ఆకర్షించింది. 'నీ మనసు నాకు తెలుసు' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఆమె దగ్గరైంది. తెలుగులో స్టార్ హీరోలతో నటించిన త్రిషకు కొన్నేళ్ల తర్వాత అవకాశాలు తగ్గాయి. మళ్లీ ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చి భారీ అవకాశాలను దక్కించుకుంటుంది.డైరెక్టర్ రాజమౌళి సినిమాను త్రిష కాదన్నట్లు కోలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. వరుస హిట్లతో టాప్ డైరెక్టర్గా కొనసాగుతున్న రాజమౌళి.. 2009లో 'మగధీర' చిత్రం తర్వాత 'మర్యాద రామన్న' తెరకెక్కించారు. 2010లో విడుదలైన ఈ చిత్రంలో సునీల్ ప్రధాన పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో హీరోయిన్గా నటించే ఛాన్స్ను మొదట త్రిషకు రాజమౌళి ఆఫర్ చేశారట. అప్పటికే త్రిష స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగుతుంది. దీంతో కమెడియన్గా కొనసాగిన సునీల్తో నటించడం వల్ల తన మార్కెట్ పడిపోతుందని సున్నితంగా తిరస్కరించిందట. అయితే, ఆ సినిమాలో హీరోయిన్గా నటించిన సలోని పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. దీంతో వచ్చిన అవకాశాన్ని కాదని పెద్ద తప్పు చేశానే అని ఆలోచనలో త్రిష పడిపోయిందట. ఇదే విషయం ఇప్పుడు కోలీవుడ్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. -
మహేష్ బాబును మార్చేస్తున్న రాజమౌళి..
-
SSMB 29: మహేశ్ బాబుకి జోడీగా ఆ బాలీవుడ్ బ్యూటీ?
ఆర్ఆర్ఆర్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తన తదుపరి సినిమా మహేశ్బాబు చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇది. పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. మహేశ్బాబు లుక్ని కూడా మార్చేశాడు. ఈ సినిమా కోసం మహేశ్ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు. లాంగ్ హెయిర్తో హాలీవుడ్ హీరోలా మహేశ్ కనిపించబోతున్నాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా..త్వరలోనే సెట్స్పైకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ గాసిప్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో మహేశ్ సరసన ఓ బాలీవుడ్ భామ నటించబోతుందట. ఆమె ఎవరో కాదు.. దివంగత నటి శ్రీదేవి ముద్దుల తనయ, అందాల తార జాన్వీ కపూర్. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న ఈ బ్యూటీ..ఇప్పుడు దక్షిణాది చిత్రాలపై ఫోకస్ పెట్టింది. దేవర చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. అలాగే రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా జాన్వీనే హీరోయిన్. ఇక ఇప్పుడు మహేశ్-రాజమౌళి చిత్రంలో నటించనుందని తెలుస్తోంది. మహేశ్కు జోడీగా జాన్వీ బాగా సెట్ అవుతుందని జక్కన్న భావిస్తున్నాడట. అందుకే ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి నిజంగానే మహేశ్ సరసన నటించే అవకాశం జాన్వీకి వచ్చిందా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది. -
రాజమౌళి నెక్స్ట్ మూవీలో హనుమంతుడు?
రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబుతో సినిమా చేస్తున్నాడు. చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే ఈ మూవీలో హీరోయిన్ ఆమె, కీలక పాత్ర చేసేది ఆ నటుడు అని పలు రూమర్స్ అయితే వినిపించాయి. అధికారిక ప్రకటన వచ్చేంతవరకు ఓ నిర్ణయానికి రాలేం. కానీ రీసెంట్గా 'ఆదిపురుష్' నటుడు రాజమౌళిని కలవడం చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: 'పుష్ప' విలన్కి అరుదైన వ్యాధి.. దీని వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే?)'ఆదిపురుష్'లో హనుమంతుడిగా చేసిన దేవ్దత్తా నాగే.. స్వతహాగా మరాఠీ నటుడు. కానీ ఇతడిని డైరెక్టర్ ఓం రౌత్ సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. 'జై మల్హార్' లాంటి సీరియల్లో తన అద్భుత నటనతో దేవ్దత్తా ఆకట్టుకున్నాడు. పలు సినిమాలు కూడా చేశారు. తెలుగులో ప్రస్తుతం 'దేవకినందన వాసుదేవ' అనే ఓ మూవీలో చేస్తున్నాడు.ఇకపోతే రెండు మూడు రోజుల క్రితం హైదరాబాద్లో రాజమౌళిని దేవ్ దత్తా నాగే కలిశాడు. ఫొటో తీసుకుని తన ఆనందాన్ని ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఈ ఫొటో బయటకు రావడం లేటు.. రాజమౌళి మూవీలో ఇతడు నటిస్తున్నాడని అంటున్నారు. బహుశా ఇది కూడా నిజమే అయ్యిండొచ్చు. కానీ ఇప్పుడే ఎందుకని చెప్పట్లేదేమో? ఒకవేళ దేవ్దత్తాని సినిమా కోసం తీసుకుంటే మాత్రం మంచి ఆప్షనే అవుతుంది.(ఇదీ చదవండి: ఆనంద్, నువ్వు నా ఫ్యామిలీ రా.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్) View this post on Instagram A post shared by Devdatta Gajanan Nage (@devdatta.g.nage) -
భారత టాలెంట్ సరిహద్దులు దాటుతోంది: రాజమౌళి
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి వారిపై ప్రశంసలు కురిపించారు. ఫ్రాన్స్లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్-2024లో బెస్ట్ షార్ట్ ఫిల్మ్గా ఇండియాకు చెందిన చిత్రం ఎంపిక కావడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 'సన్ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్ టు నో' చిత్రబృందాన్ని అభినందించారు. ఈ మేరకు తన ట్విటర్ ద్వారా వారికి శుభాకాంక్షలు తెలిపారు.రాజమౌళి తన ట్వీట్లో రాస్తూ..'భారతీయ ప్రతిభ సరిహద్దులను దాటుతోంది. ఇది వినడానికి చాలా సంతోషంగా ఉంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్- 2024లో ఉత్తమ షార్ట్ ఫిల్మ్గా లా సినీఫ్ అవార్డును గెలుచుకున్న సందర్భంగా ‘సన్ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ ఒన్స్ టు నో’ రూపొందించిన యువతకు ఇవే నా వందనాలు' అంటూ పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఈ షార్ట్ ఫిల్మ్ తీసిన చిదానంద నాయక్ను ట్యాగ్ చేశారు.కాగా.. చిదానంద తెరకెక్కించిన సన్ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్ టు నో షార్ట్ ఫిల్మ్ కేన్స్లో అరుదైన ఘనత సాధించింది. వివిధ భాషలకు చెందిన 17 చిత్రాలతో పోటీ పడి తొలి స్థానంలో నిలిచింది. 16 నిమిషాలు ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్ను ఓ కన్నడ జానపద కథ ఆధారంగా రూపొందించారు. వృద్ధురాలి కోడిని ఎవరో దొంగలించడం.. దానిని కనుగొనడం కోసం ఆమె పడే తపనను ఈ చిత్రంలో చూపించారు. ఇప్పుడీ షార్ట్ ఫిల్మ్ హాలీవుడ్తో పోటీ పడి మొదటి బహుమతి గెలుచుకోవడంపై చిత్ర బృందం హర్షం వ్యక్తం చేసింది. Indian talent breaching boundaries… Happy to hear that @Chidanandasnaik’s ‘Sunflowers Were the First Ones to Know’ has won the La Cinef Award for Best Short Film at Cannes 2024!Kudos to the youngsters 👏🏻👏🏻— rajamouli ss (@ssrajamouli) May 24, 2024 -
అది ఫేక్ న్యూస్.. రూమర్స్పై మహేశ్-రాజమౌళి మూవీ నిర్మాత క్లారిటీ
'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' దర్శకుడు రాజమౌళి.. నెక్స్ట్ మూవీ మహేశ్ బాబుతో తీయనున్నాడు. ఇప్పటికే దీని గురించి అందరికీ తెలుసు. కాకపోతే ఎప్పుడు మొదలవుతుందనేది ఇంకా సస్పెన్స్. మరోవైపు ఈ మూవీ మొదలవడానికి ముందే బోలెడన్ని రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడు వాటిలో ఒక దానిపై నిర్మాతలే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏంటది?(ఇదీ చదవండి: వారంలోపే ఓటీటీలోకి వచ్చేసిన 'కృష్ణమ్మ' సినిమా)మహేశ్తో మూవీ ఉంటుందని చాన్నాళ్ల క్రితమే రాజమౌళి బయటపెట్టాడు. ప్రస్తుతం ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మాత్రమే నడుస్తోంది. కానీ హీరోయిన్లు, ఇతర నటీనటుల గురించి బోలెడన్ని రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఇండోనేసియా నటిని హీరోయిన్ గా తీసుకున్నారని, ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె కూడా నటించబోతుందని అన్నారు. అలానే నాగార్జున కీలక పాత్ర చేయబోతున్నాడని కూడా టాక్ వినిపించింది.అయితే పైన వచ్చిన రూమర్స్ వేటికి స్పందించని నిర్మాణ సంస్థ.. వీరేన్ స్వామి అనే క్యాస్టింగ్ డైరెక్టర్ తమతో కలిసి పనిచేయట్లేదని క్లారిటీ ఇచ్చింది. అసలు ఈ రూమర్స్ ఎప్పుడొచ్చాయా అని నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మిగతా విషయాల కంటే పర్టిక్యూలర్గా ఈ విషయం కోసం ఎందుకు నోట్ రిలీజ్ చేసిందనేది మాత్రం అర్థం కాలేదు. చేస్తే చేశారు గానీ అలానే మూవీ ఎప్పుడు మొదలవుతుందో అనే అప్డేట్ ఇస్తే కాస్త ఫ్యాన్స్ అయిన ఖుషీ అయ్యేవారు!(ఇదీ చదవండి: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్) -
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
దర్శకధీరుడు రాజమౌళి మరోసారి బాహుబలిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే ఈసారి బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ అంటూ యానిమేషన్ సిరీస్ను పరిచయం చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ యానిమేషన్ సిరీస్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు రాజమౌళి. ఈఈసందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. 'బాహుబలిని ముందుకుతీసుకెళ్లే బాధ్యతను మరొకరికి అప్పగించడం కఠినమైన నిర్ణయం. ఆ సినిమా తీసేటప్పుడే అనేక మార్గాల్లో బాహుబలిని ఆవిష్కరించాలనుకున్నాం. సరైన సమయంలో సరైన వ్యక్తులు, టీమ్ మాకు లభించింది. యానిమేషన్ సిరీస్పై వాళ్లు పంచుకున్న ఆలోచనలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది కేవలం పిల్లలనే కాదు.. అందరినీ అలరించేలా తీయొచ్చని తెలిపారు. ఈ ఫార్మాట్లో సిరీస్ చేయాలనుకున్నప్పుడు మరోసారి ‘బాహుబలి సినిమాను సమీక్షించాం. పాత్రలు, వాటి మధ్య సంఘర్షణ ఇలా అనేక అంశాలు పరిశీలించాం. ఆ పాత్రలపై నాకున్న ప్రేమను వాళ్లు అర్థం చేసుకున్నారు. కథతో పాటు పాత్రలు చాలా చక్కగా క్రియేట్ చేశారు. అది చూసి నాకు సంతోషంగా కలిగింది.' అని అన్నారు.థియేటర్లో బాహుబలి చిత్రాన్ని చూసింది కేవలం 10 కోట్ల మంది మాత్రమేనని రాజమౌళి అన్నారు. అంటే మిగిలిన కోట్ల జనాభా ఏదో ఒక మాధ్యమం ద్వారా చూసి ఉంటారని తెలిపారు. కథలు చూసే విధానం ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది.. అందరూ రెగ్యులర్ సినిమాలు మాత్రమే చూడరు. కేవలం యానిమేషన్ చిత్రాలు మాత్రమే చూసేవాళ్లు కూడా ఉంటారు. ఆ ఆలోచనతోనే బాహుబలి ఈ మాధ్యమం ద్వారా తీసుకొస్తున్నాం. సినిమా తీయాలంటే చాలా విషయాలు ఆలోచించాలి. డైలాగ్స్, ఫైట్స్, పాటలు ఇలా ఆలోచలన్నీ దాని చుట్టూనే ఉంటాయి. కానీ, యానిమేషన్లో అది వర్కవుట్ కాదు. సీజన్లు చూసే కొద్దీ మీరు యానిమేషన్ సిరీస్కు కనెక్ట్ అవుతారన అన్నారు.యానిమేషన్ సినిమా చేయాలనే ఆలోచన ఏమైనా ఉందా? అని ఈ సమావేశంలో రాజమౌళిని ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ.. యానిమేషన్ సినిమా చేయాలని ఎప్పటి నుంచో తనకు ఆలోచన ఉందని.. ఎప్పుడో ఒకసారి జరుగుతుందన్నారు. నేను సినిమాలు చేస్తూ నేర్చుకుంటూనే ఉంటానని.. దీని వల్ల రానున్న సినిమాల్లో కొత్త విషయాలు చేసేందుకు ఉపయోగపడతాయని తెలిపారు. ఈగ సినిమాలో కొంత భాగం యానిమేషన్ ఉందని వెల్లడించారు. భవిష్యత్లో చేసే అవకాశం వచ్చినప్పుడు ఈ సిరీస్ ద్వారా నేర్చుకున్న అంశాలు నాకు కచ్చితంగా ఉపయోగపడతాయన్నారు. కాగా.. రాజమౌళి తన తదుపరి చిత్రం ప్రిన్స్ మహేశ్బాబుతో తెరకెక్కించనున్నారు. బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేషన్ సిరీస్ డిస్నీప్లస్ మే 17న డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది -
RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
పాన్ ఇండియా స్టార్స్ ఎన్టీఆర్, రామ్చరణ్ పోటీపడి నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ కల్పిత కథతో రూపుదిద్దుకున్న 'ఆర్ఆర్ఆర్' 2022 మార్చి 25న విడుదలైంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమురం భీమ్గా తారక్ నటించి మెప్పించారు. హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్ కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. రూ. 550 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్.. ప్రపంచవ్యాప్తంగా రూ. 1200 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.తెలుగు, హిందీలో రీ-రిలీజ్ తారక్- చరణ్ ఫ్యాన్స్కు పండుగలాంటి సినిమా ఆర్ఆర్ఆర్. సినిమా విడుదల సమయంలో థియేటర్లు అన్నీ నిండిపోయాయి. విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ విజయకేతనం ఎగరేసి, రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది. సినిమా వచ్చి రెండేళ్లు దాటింది. అయినా కూడా ఈ సినిమాపై క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకే ఇప్పుడు ఈ సినిమాను రీ-రిలీజ్ చేస్తున్నారు. మే 10న మరోసారి ఆర్ఆర్ఆర్ విడుదల కానుందని అధికారిక ప్రకటన వచ్చేసింది. అయితే, 2డీ, 3డీ ఫార్మాట్లతో పాటు 4K వర్షన్తో స్పెషల్గా వస్తుండటంతో అభిమానులు కాస్త ఆసక్తిగా ఉన్నారు. దీంతో ప్రేక్షకులు మరోసారి థియేటర్కు వచ్చి ఆ అనుభవాన్ని పంచుకోనున్నారు.ఆర్ఆర్ఆర్ ఖాతాలో లెక్కలేనన్ని ఆవార్డులు వచ్చి చేరాయి. అన్నింటికంటే ముఖ్యమైనది ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును కూడా ఆర్ఆర్ఆర్ సొంతం చేసుకుంది. ఇందులోని 'నాటునాటు' పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ దక్కింది. ఈ అవార్డు దక్కించుకున్న తొలి భారతీయ ఫీచర్ సినిమాగా ఆర్ఆర్ఆర్ రికార్డ్ క్రియేట్ చేసింది. RRR RE RELEASE on 10th May 🔥💥 @AlwaysRamCharan #RRRMoviepic.twitter.com/8eaIfLjw14— Navya (@HoneYNavya_) May 6, 2024 -
ఇచ్చిన మాట కోసం హాలీవుడ్ ఆఫర్ వదులుకున్న రాజమౌళి!
బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు ఆయనతో సినిమా అంటే హాలీవుడ్ హీరోలు కూడా రెడీ అంటారు. కానీ జక్కన్న మాత్రం తెలుగు హీరోలతో పాన్ ఇండియా సినిమా చేసి హిట్ కొడుతున్నాడు. అంతేకాదు తన సినిమాలను నిర్మించే అవకాశం టాలీవుడ్ ప్రొడ్యుసర్లకే ఇస్తున్నాడు. కెరీర్ తొలినాళ్లలో తనతో సినిమా చేయాలని ఒప్పందం కుదుర్చుకున్న నిర్మాతలకే అవకాశం ఇస్తున్నాడు. తాజాగా మహేశ్ బాబుతో చేయబోయే సినిమా విషయంలో కూడా రాజమౌళి ఇచ్చిన మాటకే కట్టుబడి ఉన్నాడు. పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నిర్మాణ బాధ్యలతను ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణకు అప్పగించాడు. 15 ఏళ్ల క్రితం తనకు ఇచ్చిన మాటను రాజమౌళి- మహేశ్ బాబు నిలబెట్టుకున్నారని నారాయణ అన్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్లో సినిమా చేయాలని 15 ఏళ్ల క్రితమే నిర్ణయం తీసుకున్నాం. అప్పుడే నా బ్యానర్(దుర్గా ఆర్ట్స్)లో సినిమా చేయాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ఇప్పుడు మహేశ్, రాజమౌళి ఇద్దరి స్థాయి పెరిగిపోయింది. వీళ్లతో సినిమా చేయడానికి చాలా మంది నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. అయినా ఇచ్చిన మాటకు కట్టుబడి నాతో సినిమా చేస్తున్నారు. నేను చెప్పకపోయినా.. ‘దుర్గా ఆర్ట్స్ బ్యానర్’లో సినిమా చేస్తున్నామని వాళ్లే ప్రకటించారు. అందుకు వాళ్లకి కృతజ్ఞుడిని. రాజమౌళికి హాలీవుడ్ ఆఫర్లు కూడా వచ్చాయి. వాటిని రిజెక్ట్ చేసి మరీ నాతో సినిమా చేయడం సంతోషంగా ఉంది. రెండు నెలల నుంచి ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో షూటింగ్ప్రారంభం అవుతుంది. బడ్జెట్ఎంత అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. కానీ సినిమా కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను’ అన్నారు. -
నా బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్లో వారిద్దరే ఉన్నారు.. ఎన్టీఆర్ లేడు: రాజమౌళి
ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో సత్యదేవ్, అతీరా రాజ్ జంటగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వంలో అరుణాచల క్రియేషన్స్పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మించిన ఈ చిత్రం మే 10న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించింది. అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.ఈ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతుండగా.. పరిశ్రమలో మీకున్న ముఖ్య స్నేహితులు ఎవరనీ యాంకర్ ప్రశ్నించగా.. ఆ సమయంలో తారక్ పేరు చెబుతాడని ప్రేక్షకులు భావించి అందరూ ఎన్టీఆర్ అంటూ కేకలు వేశారు. కానీ, రాజమౌళి మాత్రం అందుకు విభిన్నంగా ఇలా సమాధానం చెప్పాడు. 'టాలీవుడ్లో నాకు ఇద్దరు అత్యంత ముఖ్యమైన స్నేహితులు ఉన్నారు. ప్రముఖ నిర్మాతలు శోభు యార్లగడ్డ, సాయి కొర్రపాటి. వారితో బాహుబలి, ఈగ వంటి చిత్రాలను నిర్మించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం. స్నేహితుడు కాదు. తారక్తో నా మొదటి సినిమా 'స్టూడెంట్ నెం.1' ఛాన్స్ రావడానికి కారణం రచయిత పృథ్వీతేజ. అని ఆయన గుర్తుచేసుకున్నారు. స్టూడెంట్ నెం.1 తర్వాత తారక్- జక్కన్న కాంబినేషన్లో సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్ చిత్రాలు వచ్చాయి. అన్నీ కూడా సూపర్ హిట్ సాధించాయి.‘కృష్ణమ్మ’ సినిమా గురించి రాజమౌళి మాట్లాడుతూ.. సినిమా టైటిల్ నాతో పాటు అందర్నీ ఆకర్షించిందంటే కారణం కొరటాల శివగారు సమర్పించడమే. ఆయన సమర్పిస్తున్న తొలి సినిమాతోనే పెద్ద విజయం అందుకోవాలని కోరుకుంటున్నాను. ఈ మూవీ టీజర్, ట్రైలర్ చూస్తే సినిమాని కచ్చితంగా థియేటర్లోనే చూడాలనిపించేలా తీశాడు గోపాలకృష్ణ. కాలభైరవని చూస్తుంటే గర్వంగా ఉంది. ‘కృష్ణమ్మ’ టీమ్కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ఈ చిత్రం మే 10న విడుదల కానుంది. -
ఆయన్ను ముసుగేసి కొడితే రూ.10 వేలిస్తా: రాజమౌళి
టాలీవుడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కృష్ణమ్మ. అతీరా రాజ్ హీరోయిన్గా నటించిన ఈ మూవీకి వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించాడు. మే 10న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్కు కొరటాల శివ, అనిల్ రావిపూడి, రాజమౌళి, గోపీచంద్ మలినేని ముఖ్య అతిథులుగా విచ్చేశారు.ముసుగేసి గుద్దితే..ఈ కార్యక్రమంలో జక్కన్న మాట్లాడుతూ చిత్ర యూనిట్ను మెచ్చుకున్నాడు. టైటిల్, టీజర్, ట్రైలర్ అన్నీ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించాడు. సత్యదేవ్కు స్టార్డమ్ తెచ్చే సినిమా కృష్ణమ్మ అవ్వాలని కోరాడు. చివర్లో అనిల్ రావిపూడి వెనకాల కెమెరా పట్టుకుని తిరుగుతూ అతడి మీద ముసుగేసి గుద్దితే వారికి రూ.10 వేలు ఇస్తానని బంపరాఫర్ ఇచ్చాడు.రాజమౌళిని ఇరికించేసిన డైరెక్టర్అనిల్ రావిపూడి మీద ఈ రేంజులో ఫైరవడానికి కారణం లేకపోలేదు. అతడు స్టేజీపైకి వచ్చీరావడంతోనే దేవర అప్డేట్ చెప్పాలని కొరటాల శివను, మహేశ్బాబుతో చేస్తున్న మూవీ జానర్ ఏంటి? కథేంటి? అని రాజమౌళిని ఇరికించేశాడు. అందుకే జక్కన్న ఇలా తనదైన స్టైల్లో నాలుగు కొట్టమని కౌంటర్ వేశాడు. ఇది విని షాకైన అనిల్ రావిపూడి.. పది వేలంటే నిజంగానే కొట్టేస్తారు.. దయచేసి ప్రైజ్మనీ తగ్గించండి అని కోరాడు. వీరిద్దరి స్పీచ్లు ప్రస్తుతం వైరల్గా మారాయి.చదవండి: రోజుకు 12 గంటలు పని చేయించుకున్నారు.. డబ్బులివ్వకుండా వేధిస్తున్నారు! -
‘కృష్ణమ్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
కృష్ణమ్మతో సత్యదేవ్ స్టార్ అవుతాడు: రాజమౌళి
‘‘చిన్న చిన్న హావభావాలతో అన్ని రకాల నటనని చూపించగల నటుల్లో సత్యదేవ్ కూడా ఒకడు. తను మంచి నటుడు అని ఇటు ఇండస్ట్రీకి అటు ప్రేక్షకులకు తెలుసు. కానీ, ఒక్క సినిమా సడెన్గా స్టార్ని చేస్తుంది.. నాకు తెలిసి ‘కృష్ణమ్మ’ మూవీ తనని స్టార్ చేస్తుందనుకుంటున్నాను’’ అని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. సత్యదేవ్, అతీరా రాజ్ జంటగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. వీవీ గోపాలకృష్ణ దర్శకుడు. డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్టై¯Œ మెంట్స్ విడుదల చేస్తున్నాయి. హైదరాబాద్లో నిర్వహించిన ‘కృష్ణమ్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి మాట్లాడుతూ– ‘‘కృష్ణమ్మ’ టైటిల్ నాతో పాటు అందర్నీ ఆకర్షించిందంటే కారణం కొరటాల శివగారు సమర్పించడమే. ఆయన సమర్పిస్తున్న తొలి సినిమాతోనే పెద్ద విజయం అందుకోవాలని కోరుకుంటున్నాను. ఈ మూవీ టీజర్, ట్రైలర్ చూస్తే సినిమాని కచ్చితంగా థియేటర్లోనే చూడాలనిపించేలా తీశాడు గోపాలకృష్ణ. కాలభైరవని చూస్తుంటే గర్వంగా ఉంది. ‘కృష్ణమ్మ’ టీమ్కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. కొరటాల శివ మాట్లాడుతూ– ‘‘గోపాల్ చెప్పిన ‘కృష్ణమ్మ’ కథ నచ్చడంతో నేను కూడా భాగస్వామ్యం అవుతానని అడిగాను.. అంతే కానీ, ఈ కథలో నేను కల్పించుకోలేదు. నేను చూసిన మంచి నటుల్లో సత్యదేవ్ ఒకడు.. మంచి ప్రతిభ ఉంది. ఈ మూవీతో తన కెరీర్ మరో మెట్టు పైకి ఎక్కుతుందని నమ్ముతున్నాను. అలాగే నిర్మాత కృష్ణగారికి పెద్ద విజయం రావాలి’’ అన్నారు. ‘‘కొరటాల శివగారు తీసే సినిమాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే. ఆయన సమర్పిస్తున్న ‘కృష్ణమ్మ’ కూడా అద్భుతంగా ఉంటుంది’’ అన్నారు గోపీచంద్ మలినేని.‘‘సత్యదేవ్ హీరోగా బిజీగా ఉన్నా ‘సరిలేరు నీకెవ్వరు’లో ఓ చిన్న పాత్ర చేశాడు.. ఎందుకంటే సినిమా అంటే అంత గౌరవం. ఈ వేసవిలో ‘కృష్ణమ్మ’ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు అనిల్ రావిపూడి. సత్యదేవ్ మాట్లాడుతూ– ‘‘రాజమౌళి, కొరటాల శివ, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడిగార్లు ఉన్న ఈ వేదికపై నేను మాట్లాడటం ప్రపంచంలోనే ఖరీదైన వేదికగా భావిస్తున్నాను. ‘కృష్ణమ్మ’ విడుదల తర్వాత నేను బయట ఎక్కడ కనిపించినా ప్రేక్షకులు ఈ మూవీ గురించే నాతో మాట్లాడతారు.. అందుకు నాదీ గ్యారంటీ. క్రికెట్కి సచిన్ టెండూల్కర్గారు ఎలాగో.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి రాజమౌళి సార్ అలాగే. తెలుగు సినిమాని (ఆర్ఆర్ఆర్) అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి.. ఆస్కార్ తీసుకొచ్చారు’’ అన్నారు. వీవీ గోపాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘కృష్ణమ్మ’ కథ నచ్చడంతో మమ్మల్ని ్ర΄ోత్సహించిన కొరటాలశివగారికి థ్యాంక్స్. మా ట్రైలర్ నచ్చిన వారు మూవీని థియేటర్లో చూడండి’’అన్నారు. -
త్వరలోనే బాహుబలి ట్రైలర్.. రాజమౌళి పోస్ట్ వైరల్!
తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకధీరుడు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ అవార్డును సాధించారు. అంతకుముందే బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించారు. ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన బాహుబలి తెలుగు సినిమా కీర్తిని మరింత పెంచింది. రెండు భాగాలుగా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.అయితే తాజాగా రాజమౌళి చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరలవుతోంది. బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరుతో యానిమేటేడ్ సిరీస్ వస్తోందంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో బాహుబలిని చిత్రాన్ని యానిమేటేడ్ వర్షన్లో తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన ట్రైలర్ను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు.కాగా.. బాహుబలి చిత్రాన్ని వివిధ రూపాల్లో తీసుకువచ్చే అవకాశం లేకపోలేదని రాజమౌళి గతంలో చాలాసార్లు ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబు హీరోగా యాక్షన్ అడ్వెంచర్ సినిమాని తెరకెక్కించబోతున్నారు. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది.When the people of Mahishmati chant his name, no force in the universe can stop him from returning.Baahubali: Crown of Blood, an animated series trailer, arrives soon! pic.twitter.com/fDJ5FZy6ld— rajamouli ss (@ssrajamouli) April 30, 2024 -
రాజమౌళి దర్శకత్వంలో వార్నర్...నవ్వులు పూయిస్తున్న వీడియో
-
రాజమౌళి దర్శకత్వంలో వార్నర్.. నవ్వులు పూయిస్తున్న వీడియో
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కి యాక్టింగ్ అంటే పిచ్చి. లాక్డౌన్ సమయంలో ఎన్నో టిక్టాక్ వీడియోలు చేసి అలరించాడు. అల్లు అర్జున్, ప్రభాస్, మహేశ్బాబుతో పాటు పలువురు టాలీవుడ్ హీరోల పాటలకు స్టైప్పులేస్తూ దక్షిణాది సీనీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. బాహుబలిలో ప్రభాస్, మహర్షిలో మహేశ్బాబు, దర్బార్లో రజినీకాంత్కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను రీఫేస్ చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే.. అవి వైరల్ అయ్యేవి. తాజాగా ఈ స్టార్ క్రికెటర్ ఓ యాడ్లో నటించాడు. ఆ ప్రకటనలో దర్శకధీరుడు రాజమౌళి నటించడం మరో విశేషం. నవ్వులు పూయిస్తున్న యాడ్ ప్రముఖ పేమెంట్స్ యాప్ క్రెడ్ (CRED) ఓ ఫన్నీ యాడ్ రూపొందించింది. ఇందులో రాజమౌళి దర్శకుడిగా, వార్నర్ హీరోగా నటించారు. ‘మ్యాచ్ టికెట్లపై డిస్కౌంట్ కావాలంటే ఏం చేయాలి’ అంటూ రాజమౌళి వార్నర్కి ఫోన్చేసి అడుగుతాడు. దానికి వార్నర్ బదులిస్తూ.. ‘రాజా సర్.. మీ దగ్గర క్రెడ్ యూపీఐ ఉంటే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది' అంటాడు. మరి నార్మల్ యూపీఐ అయితే అని రాజమౌళి అడుగుతాడు. అలా అయితే డిస్కౌంట్ కోసం నాకు మీరో ఫేవర్ చేయాలని వార్నర్ కోరతాడు. తనతో ఓ సినిమా చేయమని అడుగుతాడు. ఒకవేళ తన సినిమాల్లో నిజంగానే వార్నర్ నటిస్తే ఎలా ఉండేదో రాజమౌళి ఊహించుకుంటాడు. సెట్స్లో వార్నర్ చేసే అల్లరి, వేసే స్టెప్పలు, డైగాల్స్ ..ఇవన్నీ ఊహించుకొని భయపడిపోయినట్లు యాడ్లో చూపించారు. మధ్యలో ‘ఆస్కార్ వేదికగా కలుద్దాం’ అని వార్నర్ అన్నప్పుడు రాజమౌళి చూసే చూపు నవ్వులు పూయిస్తుంది. కొన్ని సార్లు ఫేవర్ కూడా మార్కెట్ రిస్క్కి లోబడి ఉంటాయంటూ క్రెడ్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ వీడియోని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో అటు సినీ ప్రియులతో పాటు ఇటు క్రికెట్ అభిమానులను అలరిస్తోంది. Favours are subject to market risk. pic.twitter.com/QSPToEGYzg — CRED (@CRED_club) April 12, 2024 -
స్టెప్పులతో అదరగొట్టిన రాజమౌళి.. వీడియో వైరల్!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఇటీవలే జపాన్లో సందడి చేసి తిరిగొచ్చారు. ఆర్ఆర్ఆర్ సక్సెస్ను ఇప్పటికీ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాతో తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేశారు. ప్రస్తుతం మహేశ్బాబుతో సినిమా తీసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ రాజమౌళి తనలోని మరో టాలెంట్ను బయటకు తీస్తుంటారు. ఫ్యామిలీతో కలిసి ఎక్కడికెళ్లినా ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే ఇటీవలే ఓ పెళ్లిలో సతీమణి రమతో కలిసి డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన రిహార్సల్ వీడియో నెట్టింట వైరల్గా మారింది. 'అందమైన ప్రేమరాణి చేయి తలిగితే' అనే పాటకు అంటూ స్టెప్పులు ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు దర్శకధీరుడు. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. SS Rajamouli Dance 👌 pic.twitter.com/hkdfxPWq1Q — Christopher Kanagaraj (@Chrissuccess) April 11, 2024 -
జక్కన్నలో ఈ యాంగిల్ కూడా ఉందా? వీడియో వైరల్
ఫ్లాపులే తెలియని వీరుడు.. బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసే ధీరుడు.. తెలుగు సినిమాను ప్రపంచస్థాయిలో నిలబెట్టిన పరాక్రమవంతుడు.. ఎస్ఎస్ రాజమౌళి. ఈయన సినిమా లేటుగా తీస్తాడుమో కానీ అందరూ ఆశ్చర్యపోయే రీతిలో తెరకెక్కిస్తాడు. అందుకే జక్కన్న ప్రపంచవ్యాప్తంగా పాపులర్. ప్రస్తుతం ఇతడు మహేశ్బాబుతో ఓ సినిమా చేస్తున్నాడు.అందమైన ప్రేమరాణి..ఇదిలా ఉంటే తాజాగా ఓ ఫంక్షన్లో జక్కన్న తన భార్య రమా రాజమౌళితో కలిసి స్టెప్పులేశాడు. అందమైన ప్రేమరాణి చేయి తగిలితే.. సత్తురేకు కూడా స్వర్ణమేలే అన్న పాటకు చిందేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు.. జక్కన్నలో ఈ టాలెంట్ కూడా ఉందా? అని కామెంట్లు చేస్తున్నారు.సినిమా విషయానికి వస్తేమహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా(#SSMB29) తెరకెక్కతున్న సంగతి తెలిసిందే. ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాను కేఎల్ నారాయణ నిర్మించనున్నారు. ఈ సినిమా కథను రచయిత విజయేంద్ర ప్రసాద్ పూర్తి చేశారు. ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ కూడా పూర్తి కావొచ్చాయట. వేసవి తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. Director @SSRajamouli and his wife groove to the beats of Beautiful melody, setting the party on fire at a family function💥💥💥👌👌👌#SsRajamouli #SSMB29 #Party #RRR #TeluguFilmNagar #Tollywood #Bollywood #Hollywood #TFI pic.twitter.com/UynuQCDCOx— YDR (@dharmaraju225g1) April 1, 2024 చదవండి: వచ్చి ఇక్కడ పడుండు అని అరిచారు.. అన్నం కూడా తినబుద్ధి కాలే! -
జక్కన్నలో ఈ యాంగిల్ కూడా ఉందా? వీడియో వైరల్
ఫ్లాపులే తెలియని వీరుడు.. బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసే ధీరుడు.. తెలుగు సినిమాను ప్రపంచస్థాయిలో నిలబెట్టిన పరాక్రమవంతుడు.. ఎస్ఎస్ రాజమౌళి. ఈయన సినిమా లేటుగా తీస్తాడుమో కానీ అందరూ ఆశ్చర్యపోయే రీతిలో తెరకెక్కిస్తాడు. అందుకే జక్కన్న ప్రపంచవ్యాప్తంగా పాపులర్. ప్రస్తుతం ఇతడు మహేశ్బాబుతో ఓ సినిమా చేస్తున్నాడు. అందమైన ప్రేమరాణి.. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఫంక్షన్లో జక్కన్న తన భార్య రమా రాజమౌళితో కలిసి స్టెప్పులేశాడు. అందమైన ప్రేమరాణి చేయి తగిలితే.. సత్తురేకు కూడా స్వర్ణమేలే అన్న పాటకు చిందేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు.. జక్కన్నలో ఈ టాలెంట్ కూడా ఉందా? అని కామెంట్లు చేస్తున్నారు. సినిమా విషయానికి వస్తే మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా(#SSMB29) తెరకెక్కతున్న సంగతి తెలిసిందే. ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాను కేఎల్ నారాయణ నిర్మించనున్నారు. ఈ సినిమా కథను రచయిత విజయేంద్ర ప్రసాద్ పూర్తి చేశారు. ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ కూడా పూర్తి కావొచ్చాయట. వేసవి తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. Director @SSRajamouli and his wife groove to the beats of Beautiful melody, setting the party on fire at a family function💥💥💥👌👌👌#SsRajamouli #SSMB29 #Party #RRR #TeluguFilmNagar #Tollywood #Bollywood #Hollywood #TFI pic.twitter.com/UynuQCDCOx — YDR (@dharmaraju225g1) April 1, 2024 చదవండి: వచ్చి ఇక్కడ పడుండు అని అరిచారు.. అన్నం కూడా తినబుద్ధి కాలే! -
మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది: రాజమౌళి
దర్శకధీరుడు ప్రస్తుతం జపాన్లో బిజీగా ఉన్నారు. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాను జపాన్లోనూ రిలీజ్ చేశారు. గతేడాది ఆస్కార్ అవార్డ్ దక్కించుకున్న ఈ చిత్రాన్ని జపాన్లో 100 ఏళ్లనాటి పురాతన మ్యూజికల్ థియేటర్లో ప్రదర్శించారు. ఈ విషయాన్ని రాజమౌళి ట్విటర్ ద్వారా పంచుకున్నారు. రాజమౌళి ట్విటర్లో రాస్తూ.. 'ఆర్ఆర్ఆర్ సినిమాను 110 ఏళ్ల నాటి తకరాజుకా సంస్థ నిర్వహించే మ్యూజికల్ థియేటర్లో ప్రదర్శించడం విశేషం. ఆర్ఆర్ఆర్ చిత్రంలాగే ఈ మ్యూజికల్ షోపై కూడా ప్రేమ చూపిన జపనీస్ ఆడియన్స్కు ధన్యవాదాలు. మీ రెస్పాన్స్ చూస్తే మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఈ షోలో మీ శక్తి, ప్రతిభ నన్ను ఆశ్చర్యపరిచాయి. ఈ ఈవెంట్లో భాగమైన అమ్మాయిలను అభినందించకుండా ఉండలేకపోతున్నా' అని రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజన్స్ దర్శకధీరుడి అభినందిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం రాజమౌళి.. మహేశ్బాబుతో సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే కథను అందించారు. యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో రానున్న ఈ సినిమాకు మహారాజ్ అనే టైటిల్ పెట్టాలనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ హీరోయిన్గా.. హాలీవుడ్ ప్రముఖ నటుడు క్రిస్ హెమ్స్వర్త్ కీలకపాత్ర పోషించనున్నారని కూడా టాక్ నడుస్తోంది. Its an honour that our RRR has been adapted as a musical by the 110 year old Takarazuka company. Thank you Japanese audience for embracing the Broadway play of RRR just like the film itself. Overwhelmed by your response... Can't appreciate all the girls enough for your energy,… pic.twitter.com/QbfLPmsJxC — rajamouli ss (@ssrajamouli) March 22, 2024 -
మహేష్కు సరైన విలన్ను సెలెక్ట్ చేసిన రాజమౌళి
-
రాజమౌళి తనయుడి ట్వీట్.. నెటిజన్స్ ఆగ్రహం!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి కుటుంబం ప్రస్తుతం జపాన్లో ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన సూపర్ హిట్ సినిమా 'ఆర్ఆర్ఆర్' స్క్రీనింగ్ కోసం వారు అక్కడికి వెళ్లిన విషయం తెలిసిందే. కానీ అక్కడ స్వల్ప భూకంపం వచ్చిందని ఆయన కుమారుడు కార్తికేయ తన ఎక్స్ ఖాతాలో ఫోస్ట్ చేశాడు. జపాన్లో ఒక భారీ బిల్డింగ్ 28వ ఫ్లోర్లో ఉన్నామని ఎందుకో బిల్డింగ్ కదులుతున్నటుగా అనిపించిందని కార్తికేయ రాసుకొచ్చాడు. కానీ కొంత సమయం తర్వాత అది భూకంపం వల్ల అలా జరిగినట్లు తెలిసి చాలా భయపడ్డానని ఆయన తెలిపాడు. మొదటిసారిగా భూకంపం ద్వారా కలిగే అనుభూతిని పొందానని రాసుకొచ్చారు. మండిపడ్డ నెటిజన్స్.. అయితే ఇది చూసిన నెటిజన్స్ ఎస్ఎస్ కార్తికేయ తీరుపై మండిపడుతున్నారు. భూకంపం అంటే అదేమైనా జోక్ అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. మరో నెటిజన్ రాస్తూ భూకంపం అనేది నీ బకెట్ లిస్ట్లో ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సెన్సిటివ్ విషయాన్ని ఫన్నీగా ట్వీట్ చేయడంపై కార్తికేయపై మండిపడుతున్నారు. అలాగే ఇండియా బోర్డర్కు వెళ్లి బాంబుల మోత కూడా ఆస్వాదించు అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు. ఏదేమైనా కార్తికేయ భూకంపంపై చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలోను ఊపేస్తోంది. Felt a freaking earthquake in Japan just now!!! Was on the 28th floor and slowly the ground started to move and took us a while to realise it was an earthquake. I was just about to panic but all the Japanese around did not budge as if it just started to rain!! 😅😅😅😅😅… pic.twitter.com/7rXhrWSx3D — S S Karthikeya (@ssk1122) March 21, 2024 Experiencing an Earthquake is in your bucket list ? Weird — RAVI SANKAR GARIMELLA (@ravis_g239) March 21, 2024 Experience an earthquake box ticked. ✅ --> WTF 😒 😒 — KK (@krishjlk) March 21, 2024 Pls go to Indian border and EXPERIENCE A BOMB BLAST also ... Tick it bro — KK (@krishjlk) March 21, 2024 -
జపాన్లో భూకంపం.. రాజమౌళి కుటుంబానికి తప్పిన ప్రమాదం
ఇండియన్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి కుటుంబం మొత్తం జపాన్లో ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన సూపర్ హిట్ సినిమా 'ఆర్ఆర్ఆర్' స్క్రీనింగ్ కోసం వారు అక్కడికి వెళ్లిన విషయం తెలిసిందే. కానీ అక్కడ స్వల్ప భూకంపం వచ్చిందని ఆయన కుమారుడు కార్తికేయ తన ఎక్స్ పేజీలో తెలిపాడు. ఈ మేరకు రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ పెట్టిన లేటెస్ట్ పోస్ట్ ఒకటి అభిమానులను షాక్కు గురి చేసింది. జపాన్లో ఒక భారీ బిల్డింగ్ 28వ ఫ్లోర్లో ఉన్నామని ఎందుకో బిల్డింగ్ కదులుతున్నటుగా అనిపించిందని ఆయన చెప్పాడు. కానీ కొంత సమయం తర్వాత అది భూకంపం వల్ల అలా జరిగినట్లు తెలిసి చాలా భయపడ్డానని ఆయన తెలిపాడు. మొదటిసారిగా భూకంపం ద్వారా కలిగే అనుభూతిని చెందానని ఆయన పేర్కొన్నాడు. భూకంపం సమయంలో తన స్మార్ట్ వాచ్లో వచ్చిన వార్నింగ్ని ఫోటో తీసి ఆయన షేర్ చేశాడు. దీనితో నెటిజన్స్ రాజమౌళి అండ్ ఫ్యామిలీ సేఫ్ గా ఉండాలని కోరుకుంటూ ఇండియాకి తిరిగి రావాలని కార్తికేయ పోస్ట్లో తెలియజేస్తున్నారు. దీని తీవ్రత 5.3గా నమోదయిందని అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. తూర్పు జపాన్లోని దక్షిణ ఇబారకి ప్రిఫెక్చర్లో 46 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. కానీ ప్రాణనష్టం గురించి ఎలాంటి వివరాలను జపాన్ ప్రకటించ లేదు. ఈ ఏడాది ప్రారంభంలో కూడా నూతన సంవత్సరాది వేళ అందరూ సంబరాల్లో మునిగి ఉన్న సమయంలో జపాన్ను భారీ భూకంపం కుదిపివేసింది. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంతో జపాన్ పశ్చిమ తీర ప్రాంత రాష్ట్రాలు వణికిపోయాయి. సుమారు 60 మంది మృతి చెందారు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. ఆ సమయంలో రాజమౌళి కూడా రియాక్ట్ అయ్యారు. తమ హృదయాల్లో జపాన్కు ప్రత్యేక స్థానం ఉందని చెప్పిన ఆయన భూకంపం బారిన పడిన ప్రతి ఒక్కరికీ సానుభూతి ప్రకటించారు. Felt a freaking earthquake in Japan just now!!! Was on the 28th floor and slowly the ground started to move and took us a while to realise it was an earthquake. I was just about to panic but all the Japanese around did not budge as if it just started to rain!! 😅😅😅😅😅… pic.twitter.com/7rXhrWSx3D — S S Karthikeya (@ssk1122) March 21, 2024 -
రైటింగ్ పూర్తి చేశాం
మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా (‘ఎస్ఎస్ఎమ్బీ 29’ వర్కింగ్ టైటిల్) తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కేఎల్ నారాయణ ఈ సినిమా నిర్మాత. కాగా ‘రౌద్రం.. రణం.. రుధిరం’(ఆర్ఆర్ఆర్) స్క్రీనింగ్లో భాగంగా రాజమౌళి జపాన్ వెళ్లారు. అక్కడ మహేశ్బాబుతో తాను చేయనున్న మూవీ గురించి మాట్లాడారు రాజమౌళి. ‘‘ఎస్ఎస్ఎమ్బీ 29’ మూవీకి సంబంధించిన రైటింగ్ పూర్తి చేశాం. ప్రీ విజువలైజేషన్ చేస్తూ, ప్రీ ప్రోడక్షన్ ప్రాసెస్లో ఉన్నాం. నటీనటుల పరంగా ఇప్పట వరకు మహేశ్బాబు ఒక్కరే ఖరారయ్యారు. మీలో (జపాన్ ప్రేక్షకులను ఉద్దేశిస్తూ..) చాలా మందికి మహేశ్ తెలుసు.. హ్యాండ్సమ్గా ఉంటాడు. త్వరగా ఈ సినిమాను పూర్తి చేస్తామనే అనుకుంటున్నాం. ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ విడుదల సమయంలో మహేశ్బాబును నేను ఇక్కడికి (జపాన్) తీసుకుని వస్తాను. మరింత మందికి పరిచయం చేస్తాను’’ అన్నారు రాజమౌళి. విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన ఈ సినిమాకు ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వేసవి తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. ఈ సంగతి ఇలా ఉంచితే... ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా డీవీవీ దానయ్య నిర్మించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం 2022 మార్చి 25న విడుదలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 21 అక్టోబరు 2022న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను జపాన్లో విడుదల చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. -
'రాజమౌళి ఆర్ఆర్ఆర్.. ఆమె చనిపోవాల్సింది.. కానీ'!
రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన పీరియాడిక్ చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్గా నిలిచింది. 2022లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అంతే కాకుండా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్కు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ దక్కింది. తాజాగా జపాన్లో ఈ మూవీని విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్కు జోడీగా బ్రిటిష్ యువతి జెన్నీ పాత్రలో ఓలివియా మోరిస్ నటించింది. ఈ సినిమాలో వీరిద్దరి కాంబినేషన్లో మరిన్నీ సీన్స్ ఉన్నాయని రాజమౌళి తెలిపారు. కానీ సినిమా నిడివి పెరగడంతో ఎడిటింగ్లో తీసేయాల్సి వచ్చిందని వెల్లడించారు. రాజమౌళి మాట్లాడుతూ..'ఎన్టీఆర్(భీమ్)ను జైలులో పెట్టిన తర్వాత జెన్నీ (ఓలివియా మోరిస్) అతడిని కలుస్తుంది. జైలు నుంచి తప్పించడానికి భీమ్కు సాయం చేయాలనుకుంటుంది. ఆమె అంకుల్ గవర్నర్ స్కాట్ గదిలోకి రహస్యంగా వెళ్లి.. అక్కడ ఉన్న ప్లాన్స్ను దొంగిలించి భీమ్కు అందజేస్తుంది. అక్కడి నుంచి వస్తుండగానే.. స్కాట్ భార్య ఆమెను చూస్తుంది. జెన్నీ బూట్లకు మట్టి ఉండటంతో అనుమానం వచ్చి.. విషయాన్ని స్కాట్కు చెబుతుంది. ఆ తర్వాత భీమ్ తప్పించుకుంటాడు.' అని తెలిపారు. ఆ తర్వాత రామ్ను జైల్లో పెడతాడు స్కాట్. ఈ విషయం తెలుసుకున్న భీమ్ తిరిగి వచ్చి రామ్ను కాపాడి జైలు నుంచి బయటకు తెస్తాడు. వాళ్లిద్దరూ బ్రిటిష్ సైన్యాన్ని చంపుకుంటూ పోయే క్రమంలో జెన్నీని పావుగా వాడుకుని వాళ్లను పట్టుకోవాలని స్కాట్ ప్లాన్. లొంగిపోకపోతే.. జెన్నీని చంపేస్తానని వాళ్లను స్కాట్ బెదిరిస్తాడు. దీంతో వారు లొంగిపోయే క్రమంలోనే జెన్నీ మోసం చేసిందన్న కోపంతో ఆమెను స్కాట్ చంపేస్తాడు. ఆర్ఆర్ఆర్ ఒరిజినల్ వర్షన్లో జెన్నీ చనిపోతుంది. కానీ ఈ విషాదంతో కూడిన కథను తీయాలని నాకు అనిపించలేదు. దీంతో మొత్తం మార్చేశాం. జెన్నీ బతికిపోయింది. మీరు హ్యాపీగా సినిమా చూశారంటూ' పేర్కొన్నారు. ప్రస్తుతం రాజమౌళి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీని ప్రకారం భీమ్, జెన్నీలకు అదనంగా ట్రాక్స్ రాసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమా నిడివి మూడు గంటలు దాటిపోవడంతో ఆ సీన్స్ తొలగించారు. కాగా. రాజమౌళి తన నెక్ట్స్ మూవీ ప్రిన్స్ మహేశ్ బాబుతో తెరకెక్కించనున్నారు. -
మహేశ్ బాబును ఇక్కడికి తీసుకొస్తాను: రాజమౌళి
మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో రానున్న బిగ్ ప్రాజెక్ట్ త్వరలో పట్టాలెక్కనుంది. తాజాగా ఇదే విషయాన్ని జక్కన్న తెలిపారు. దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం జపాన్లో ఉన్న రాజమౌళి SSMB29 సినిమాకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడమే కాకుండా ఆస్కార్ అవార్డుతో RRR గుర్తింపు తెచ్చుకుంది. తెలుగువారికి ఎంతో గర్వకారణంగా ఈ చిత్రం నిలిచింది. తాజాగా జపాన్లో ఈ మూవీ స్క్రీనింగ్కు రాజమౌళి హజరయ్యారు. అక్కడ మన జక్కన్న క్రేజ్ మామూలగా లేదు. ఆయనపై ఎనలేని అభిమానాన్ని అక్కడి ప్రజలు చూపించారు. ఈ క్రమంలో తన తర్వాతి ప్రాజెక్ట్ అయిన SSMB29 గురించి ఆయన మాట్లాడారు. 'మహేశ్ బాబుతో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి నటీనటుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. SSMB29 ప్రాజెక్ట్కు సంబంధించి కేవలం హీరోను మాత్రమే లాక్ చేశాం. ఈ క్రేజీ ప్రాజెక్ట్లో హీరో మహేశ్ బాబు.. ఆయన తెలుగు వారు.. చాలా అందంగా ఉంటారు. బహుషా మీలో చాలామందికి ఆయన గురించి తెలిసే ఉంటుంది. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి జపాన్లో కూడా రిలీజ్ చేస్తాం.. ఆ సమయంలో మహేశ్ బాబుని కూడా ఇక్కడికి తీసుకొని వస్తాను.' అని జపాన్లో జక్కన్న వ్యాఖ్యానించారు. దీంతో మహేశ్ ఫ్యాన్స్ ఆయన మాటలను సోషల్ మీడియా ద్వారా తెగ షేర్ చేస్తున్నారు. SSR about #SSMB29 We've finished writing and are now in pre-production. Only the, protagonist SuperStar @urstrulyMahesh , is confirmed and he's incredibly handsome. Hoping to expedite the filming process and have him join us for promotion during the release #MBSSR pic.twitter.com/JZAx3oP6cu — Mahesh Babu Trends ™ (@MaheshFanTrends) March 19, 2024 -
ఆ దేశంలో రాజమౌళి క్రేజే వేరు.. ఏకంగా 83 ఏళ్ల వృద్ధురాలు!
రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ చిత్రం ఆస్కార్ అవార్డ్ దక్కించుకుంది. నాటునాటు అనే సాంగ్కు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ దక్కింది. అంతే కాకుండా ఈ సినిమాను విదేశాల్లోనూ రిలీజ్ చేశారు. ముఖ్యంగా ఇండియన్ సినిమాలకు ఆదరణ ఉన్న దేశాల్లో జపాన్ ఒకటి. జపాన్ అభిమానుల కోసం ఆర్ఆర్ఆర్ సినిమాను ఏకంగా జపనీస్లోనూ రిలీజ్ చేశారు. అక్కడ రాజమౌళి సినిమాకు పెద్దఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఇటీవల జపాన్ వెళ్లిన రాజమౌళికి ఓ మహిళ అభిమాని అరుదైన కానుక అందజేశారు. దాదాపు 83 ఏళ్ల వద్ధురాలు దర్శకధీరుడు రాజమౌళికి బహుమతులను అందజేసింది. ఈ విషయాన్ని రాజమౌళి తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. రాజమౌళి ట్విటర్లో రాస్తూ..'జపాన్లో ఓరిగామి క్రేన్లను తయారు చేస్తారు. వారికిష్టమైన వారి ఆరోగ్యం కోసం బహుమతిగా ఇస్తారు. ఈ 83 ఏళ్ల వృద్ధురాలు మమ్మల్ని ఆశీర్వదించడానికి అలాంటివీ 1000 తయారు చేసింది. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ సినిమా ఆమెను సంతోషపెట్టింది. ఆమె ఇప్పుడే బహుమతి పంపింది. చలిలో బయట వేచి ఉంది. కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ తిరిగి ఇవ్వలేం. అది గ్రేట్ అంతే.' అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. రాజమౌళి తన తదుపరి చిత్రం మహేశ్ బాబుతో చేయనున్నారు. In Japan, they make origami cranes &gift them to their loved ones for good luck& health. This 83yr old woman made 1000 of them to bless us because RRR made her happy. She just sent the gift and was waiting outside in the cold.🥹 Some gestures can never be repaid. Just grateful🙏🏽 pic.twitter.com/UTGks2djDw — rajamouli ss (@ssrajamouli) March 18, 2024 -
రాజమౌళి-మహేశ్ మూవీ నుంచి క్రేజీ అప్ డేట్
మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాను కేఎల్ నారాయణ నిర్మిస్తారు. ఈ సినిమా కథను ఆల్రెడీ రచయిత విజయేంద్ర ప్రసాద్ పూర్తి చేశారు. ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ పూర్తి కావొచ్చాయట. కాగా ఈ సినిమా ప్రారంభోత్సవం ఈ ఉగాదికి జరుగుతుందనే టాక్ ఫిల్మ్నగర్లో వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెట్ వర్క్ హైదరాబాద్ శివార్లలోని ప్రాంతాల్లో మొదలైందని, మే కల్లా ఈ భారీ సెట్ వర్క్ పూర్తయ్యేలా టీమ్ టార్గెట్గా పెట్టుకున్నారని ఫిల్మ్నగర్ భోగట్టా. జూన్ చివర్లో లేదా జూలై మొదటివారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యేలా రాజమౌళి అండ్ కో సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాకు ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించనున్నారు. -
మహేశ్ బాబు సినిమా కోసం రాజమౌళి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో రానున్న బిగ్ ప్రాజెక్ట్ త్వరలో పట్టాలెక్కనుంది. ఈ సినిమా గురించి ఇప్పటికే పలు వార్తలు సోషల్మీడియాలో తెగ వైరల్ అవుతూనే ఉన్నాయి. SSMB29 పేరుతో ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలా ఈ సినిమాకు సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. SSMB29 ప్రాజెక్ట్ కోసం హాలీవుడ్ నటీనటులు కూడా భాగస్వామ్యం కానున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు కావాల్సినంత హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమాలో నటిస్తున్న వారికి రెమ్యునరేషన్ ఎంత ఇస్తున్నారు. వంటి అంశాల గురించి సోషల్మీడియాలో తెగ చర్చలు చేస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం డైరెక్టర్ రాజమౌళి తీసుకునే రెమ్యునరేషన్ గురించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సినిమా కోసం రాజమౌళి ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట. ఈ ప్రాజెక్ట్కు బదులుగా సినిమాలో వాటా తీసుకోబోతున్నారని ప్రచారం నడుస్తోంది. రాజమౌళి సినిమా కలెక్షన్స్ అంటే వందల కోట్ల కలెక్షన్స్ రాబట్టడం ఖాయం. ఈ లెక్కన సినిమాలో నటించే వారికంటే కూడా ఆయనకే ఎక్కువ రెమ్యునరేషన్ అందే ఛాన్స్ ఉంది. మహేశ్ బాబు కూడా సినిమా కోసం భారీ మొత్తంలో అందుకుంటున్నట్లు టాక్.. రెమ్యునరేషన్తో పాటు సినిమాకు వచ్చే లాభాల్లో ఆయన కొంత వాటా తీసుకునే ఛాన్స్ ఉంది అని తెలుస్తోంది. -
రాజమౌళి సలహా.. పద్ధతి మార్చుకున్నా: స్టార్ హీరోయిన్
హీరోయిన్ అలియా భట్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పలు హిందీ మూవీస్ చేసిన ఈమె.. 'ఆర్ఆర్ఆర్'లోనూ ఓ పాత్ర చేసి ఆకట్టుకుంది. అయితే ఈ మూవీ చేస్తున్న టైంలోనే అలియా-రాజమౌళికి గొడవైందని ఏవేవో అన్నారు. అయితే వాటిలో నిజానిజాలు పక్కనబెడితే.. తనకు రాజమౌళి ఇచ్చిన సలహాని ఇప్పటికీ పాటిస్తున్నానని అలియా చెప్పుకొచ్చింది. అలా తన పద్ధతి పూర్తిగా మారిపోయిందని పేర్కొంది. (ఇదీ చదవండి: బాధతో ఆ విషయం ఒప్పుకొంటున్నా: డైరెక్టర్ రాజమౌళి) 'సినిమాలని ఎంచుకునే విషయంలో మొదటి నుంచి ఒత్తిడికి గురవుతూ ఉండేదాన్ని. అదే విషయం రాజమౌళికి చెప్పాను. 'ఏది చేసినా సరే ప్రేమతో చేయండి. అప్పుడు సినిమా ఫలితం ఎలా ఉన్నా సరే ప్రేక్షకులు మీ యాక్టింగ్ని మెచ్చుకుంటారు. మీకు కనెక్ట్ అవుతారు. ఈ ప్రపంచంలోనే ప్రేమతో చేసే పనికి మించిన గొప్పది ఏదీ లేదు' అని ఆయన చెప్పారు. అప్పటి నుంచి నేను అదే పాటిస్తున్నాను' 'ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నా దగ్గరకు వచ్చిన ప్రతి కథకు ఓకే చెప్పేసేదాన్ని. నిజం చెప్పాలంటే నాకు సహనం తక్కువ. ఇప్పుడు ఆ పద్ధతి మారింది. ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు ఎంత కష్టమైనా పాత్రనైనా సరే ఓకే చెప్పాలని డిసైడ్ అయ్యాను' అని అలియా భట్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె హిందీలో 'జిగ్రా' అనే సినిమా చేస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరు 27న ఇది థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: మహేశ్ -రాజమౌళి సినిమా కథేంటో చెప్పేసిన విజయేంద్ర ప్రసాద్) -
రాజమౌళి మెచ్చిన నటి మమితా బైజు గురించి ఈ విషయాలు తెలుసా?
-
బాధతో ఆ విషయం ఒప్పుకొంటున్నా: డైరెక్టర్ రాజమౌళి
పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి.. 'ప్రేమలు' అనే డబ్బింగ్ సినిమాను తెగ పొగిడేశారు. ఇందులో యాక్టర్స్ ఒక్కొక్కరి గురించి డీటైల్డ్గా మాట్లాడారు. ఈ క్రమంలోనే మలయాళ యాక్టర్స్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పారు. ఓ విషయంలో మాత్రం చాలా బాధపడుతున్నానని అన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: 'ప్రేమలు' హీరోయిన్ కొత్త సినిమా.. రిలీజ్కి రెడీ) 'కొంచెం జెలసీ, బాధతో ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ గొప్ప యాక్టర్స్ని ఇస్తూ ఉంటుంది. అక్కడ నటించే వాళ్లంతా చాలా బాగా నటిస్తారు. అలానే ఈ సినిమాలో చేసిన నస్లెన్, మమిత, శ్యామ్ మోహన్, సంగీత ప్రతాప్.. తమ యాక్టింగ్తో అదరగొట్టేశారు. మేం యాక్షన్ సీన్స్తో చాలా కష్టపడుతుంటాం. కానీ వీళ్లు చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్తో థియేటర్లలో విజిల్స్ అందుకుంటున్నారు. హీరోయిన్ మమిత అయితే.. 'గీతాంజలి'లో గిరిజ, ఆ తర్వాత వచ్చిన సాయిపల్లవిని గుర్తు చేసింది' అని రాజమౌళి అన్నారు. ఈ సినిమాని తెలుగులో ఎంత తన కొడుకు కార్తికేయ రిలీజ్ చేసినా సరే రాజమౌళి నుంచి ఈ రేంజు ప్రశంసలు వస్తాయని మాత్రం 'ప్రేమలు' టీమ్ ఊహించి ఉండరు. అలానే రాజమౌళి కామెంట్స్తో మలయాళ యాక్టర్స్ కూడా గాల్లో తేలుతూ ఉంటారేమో. అయితే యాక్టింగ్ పరంగా మలయాళీస్ బెస్ట్ అయి ఉండొచ్చు కానీ ఆడియెన్స్ పరంగా తెలుగోళ్లని కొట్టేవాళ్లు ప్రపంచంలోనే లేరని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: మూడు ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 'లవర్' మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
Premalu Movie: ‘ప్రేమలు’ సినిమా సక్సెస్మీట్ (ఫొటోలు)
-
ప్రేమలు చూసి నవ్వుతూనే ఉన్నాను: రాజమౌళి
‘‘సాధారణంగా నేను ప్రేమకథలు, రొమాంటిక్ కామెడీ చిత్రాలను ఇష్టపడను. నాదంతా యాక్షన్, ఫైట్స్ స్టైల్. మలయాళ ‘ప్రేమలు’ సినిమా బాగుంది.. తెలుగులో రిలీజ్ చేస్తున్నాన ంటూ మా అబ్బాయి కార్తికేయ చెప్పడంతో.. ఏదో ఉత్సాహపడుతున్నాడులే అనుకున్నాను. సినిమాకి వెళ్లాక తొలి పదిహేను నిమిషాల తర్వాతి నుంచి చివరి వరకూ నవ్వుతూనే ఉన్నాను’’ అన్నారు ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. నస్లేన్ కె. గఫూర్, మమిత బైజు, శ్యామ్ మోహన్ , మాథ్యూ థామస్ కీలక పాత్రల్లో గిరీష్ ఏడీ దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రేమలు’. మలయాళంలో హిట్గా నిలిచిన ఈ మూవీని ఎస్ఎస్ కార్తికేయ ఈ నెల 8న తెలుగులో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంగళవారం సక్సెస్మీట్కి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ– ‘‘ప్రేమలు’ మూవీకి డైలాగులను అద్భుతంగా రాశాడు ఆదిత్య. కొంచెం అసూయ, కొంచెం బాధతో ఈ మాటను ఒప్పుకోవాలి. మలయాళ నటీనటులందరూ చాలా బాగా యాక్ట్ చేస్తారు. ‘ప్రేమలు’లోని నటీనటులు అద్భుతంగా నటించారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న సంగీతదర్శకుడు ఎంఎం కీరవాణి, దర్శకులు అనిల్ రావిపూడి, అనుదీప్ కూడా మాట్లాడారు. -
మహేష్ నయా లుక్..రాజమౌళి మూవీ కోసమేనా (ఫొటోలు)
-
విశ్వక్ సేన్ ‘గామి’పై రాజమౌళి ప్రశంసలు
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'గామి'. విద్యాధర్ కాగిత ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. మార్చి 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. పలువురు సినీ ప్రముఖులు ట్రైలర్పై ప్రశంసలు కురిపించారు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి కూడా ఇన్స్టా వేదికగా ‘గామి’ చిత్రంపై తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. (చదవండి: వారి కోసం చాలా మంచి పనులు చేశారు.. సీఎం జగన్పై హీరోయిన్ పూనమ్ కౌర్ ప్రశంసలు) ‘కఠోరమైన కృషి ఉంటే అసాధ్యమైన కలలు సాకారమవుతాయి. ‘గామి’ గురించి దర్శకుడు, నిర్మాత ఎంత కష్టపడ్డారో నాతో చెప్పినప్పుడు ఈ మాట గుర్తొచ్చింది. ఇందులోని విజువల్స్ చూస్తే నాలుగేళ్ల నుంచి వాళ్లు ఎంత కష్టపడ్డారో అర్థమైంది’ అని తన ఇన్స్టా స్టోరీలో ఓ పోస్ట్ పెట్టాడు రాజమౌళి. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. అంతకుముందు ప్రభాస్, నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా, ఇంకా పలువురు సెలబ్రిటీలు టీమ్పై ప్రశంసలు కురిపించారు. (చదవండి: ఆత్మహత్య చేసుకోబోతున్నా.. నా చావుకు కారణం అతనే, నటి వీడియో వైరల్) గామి విషయానికొస్తే.. చిన్న సినిమాగా ప్రారంభమైన ఈ మూవీ ఇప్పుడు పెద్ద చిత్రంగా రిలీజ్ అవుతోంది. దాదాపు ఐదేళ్ల పాటు ఈ సినిమాని షూటింగ్ చేశారు. విశ్వక్ తన తొలి సినిమా రిలీజ్ కాకముందే ఈ కథను ఓకే చెప్పేశాడు. ఇందులో ఆయన అఘోరాగా కనిపించబోతున్నాడు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ మూవీకి ‘ఏ’ సర్టిఫికేట్ జారీ చేసింది. -
ఆ మూడు సినిమాలే నా కెరీర్ని మలుపు తిప్పాయి: మహేశ్ బాబు
సూపర్స్టార్ మహేశ్ బాబు మరో ఐదేళ్ల బయట ఎక్కడా కనిపించడు. గత కొన్నాళ్ల నుంచి సోషల్ మీడియాలో ఈ మాట తెగ వినిపిస్తోంది. ఎందుకంటే త్వరలో రాజమౌళితో మూవీ చేయబోతున్నాడు కాబట్టి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్కి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అందుకే తగ్గట్లే మహేశ్.. షూటింగ్ కి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్, రాజమౌళితో మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నన్ను ప్రభావితం చేసి నా కెరీర్ని మలుపు తిప్పిన సినిమాలు మురారి,పోకిరి,శ్రీమంతుడు. ఈ మూవీస్.. నన్ను ప్రేక్షకులకు బాగా దగ్గర చేశాయి. ఈ మూడింటిలానే ఆడియెన్స్కి నచ్చేలా, నైతిక అంశాలు ఉండేలాంటి కథల్ని ఎంపిక చేసకుంటూ వస్తున్నాను. అయితే ఇన్నేళ్ల ప్రయాణంలో సినిమా సక్సెస్ కావడంపై నా ఆలోచన విధాం కూడా మారింది. ఓ మూవీ హిట్ కావడానికి బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంత ముఖ్యమో.. ఆ సినిమా ప్రేక్షకులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది కూడా అంతే ముఖ్యం' (ఇదీ చదవండి: అంబానీ ప్రీ వెడ్డింగ్లో చరణ్ని అవమానించిన షారుక్.. షాకింగ్ పోస్ట్) 'సినిమాలో కనిపించే ప్రతి పాత్రకు నెగిటివ్ ఛాయలు ఉంటాయి. కాబట్టి ప్రతి పాత్ర ఏదో ఓ నైతిక విషయాన్ని అంతర్లీనంగా చెబుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే నేను ఓ సినిమాని అంగీకరించిన తర్వాత ఆ పాత్రకు లొంగిపోతాతను. దర్శకుడు చెప్పినట్లు ఆ పాత్ర చేసుకుంటూ వెళ్లిపోతాను. ఆ పాత్రకు గ్రే షేడ్స్ ఉన్నప్పటికీ.. ప్రస్తుత జనరేషన్ ప్రేక్షకులు.. ఏది తప్పో ఒప్పో గుర్తించేంత పరిణతి సాధించారని అనుకుంటున్నారు. అలానే రాజమౌళి సర్తో మూవీ ప్రీ ప్రొడక్షన్ మంచిగా సాగుతోంది. షూటింగ్లో పాల్గొనేందుకు నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా' అని మహేశ్ చెప్పుకొచ్చాడు. ఈ సంక్రాంతికి 'గుంటూరు కారం'తో వచ్చిన మహేశ్.. యాక్టింగ్ పరంగా ఆకట్టుకున్నాడు. కానీ సినిమా పూర్తిగా తేలిపోయింది. ఏ దశలోనూ అలరించలేకపోయింది. దీంతో మహేశ్ ఫ్యాన్స్ అందరూ కూడా రాజమౌళితో మూవీపైనే గట్టిగా ఆశలు పెట్టుకున్నారు. జంగిల్ అడ్వంచర్ స్టోరీతో తీస్తున్న ఈ మూవీ కోసం మహేశ్ దాదాపు మూడేళ్ల కేటాయించినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: డైరెక్ట్గా ఓటీటీలోకి స్టార్ హీరోయిన్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడే) -
ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో రాజమౌళి దంపతులు!
టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దంపతులు ఆలయంలో పూజలు నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారిలోని శ్రీ అమృతేశ్వరా ఆలయంలో నిర్వహించిన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి ప్రాజెక్ట్ కోసం టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తదుపరి చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. దీంతో వీరిద్దరి కాంబోపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. SSMB29గా తెరకెక్కించనున్న ఈ మూవీ కోసం మహేశ్ బాబు జిమ్లో కసరత్తులు ప్రారంభించారు. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. ఈ ఏడాదిలో షూటింగ్ ప్రారంభం అవుతుందని గతంలో రాజమౌళి ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ చిత్రం కోసం హాలీవుడ్ నటీనటులను రాజమౌళి తీసుకొస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇండోనేషియా నటి అయిన చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్తో పాటు థోర్ సినిమాతో పాపులర్ అయిన క్రిస్ హెమ్స్వర్త్ SSMB29 ప్రాజెక్ట్లో భాగం కానున్నారని టాక్ వినిపించింది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'మహారాజా' అనే టైటిల్ను ఖరారు చేసినట్లు ఇండస్ట్రీలో ఒక వార్త అప్పట్లో తెగ వైరలైంది. Legendary Director @ssrajamouli garu at #SreeAmrutheswaraTemple in Bellary for the Prana Prathishta ceremony.@SriAmruteshwara @VaaraahiCC @SaiKorrapati_ pic.twitter.com/IH2wEYI6IM — Vaaraahi Chalana Chitram (@VaaraahiCC) February 29, 2024 -
బాహుబలిలో నన్ను ఎందుకు తీసుకున్నారో..?
-
SSMB29 స్టోరీ రివీల్.. రాజమౌళి గట్స్ కి హ్యాట్సాఫ్..!
-
మహేశ్ సినిమాకి అతిథిగా...?
ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో దర్శకుడు రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే. పైగా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు (‘నాటు నాటు..’ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు) కూడా సాధించడంతో హాలీవుడ్ ప్రముఖుల దృష్టిలో పడ్డారు రాజమౌళి. ‘టైటానిక్, అవతార్’లాంటి అద్భుత చిత్రాల సృష్టికర్త జేమ్స్ కామెరూన్ అయితే ‘ఆర్ఆర్ఆర్’ని, రాజమౌళి మేకింగ్ని ప్రశంసించారు కూడా. రాజమౌళిలోని మేకర్ అంటే కామెరూన్కి మంచి అభిమానం ఏర్పడిందని ఆయన మాటలు స్పష్టం చేశాయి. ఆ అభిమానంతోనే రాజమౌళి ఆహ్వానానికి కామెరూన్ పచ్చజెండా ఊపారని టాక్. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ భారీ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రపంచ దేశాల్లోని పలు భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. బడ్జెట్ రూ. వెయ్యి కోట్లు అని భోగట్టా. ఇంత భారీ చిత్రం కాబట్టేప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కామెరూన్ని ఆహ్వానించారని టాక్. ఇప్పటికే ప్రీప్రోడక్షన్ పనులు దాదాపు పూర్తి కావచ్చిన నేపథ్యంలో త్వరలో సినిమాని ఆరంభించాలనుకుంటున్నారట. సో.. వార్తల్లో ఉన్న ప్రకారం కామెరూన్ని రాజమౌళి ఆహ్వానించారా లేదా అనేది త్వరలోనే తెలిసిపోతుంది. -
సెట్స్ పైకి రాజమౌళి - మహేష్ బాబు
-
మహారాజా?
మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ భారీ బడ్జెట్ ఫిల్మ్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్ర కోసం ఇండోనేషియా బ్యూటీ చెల్సియా ఇస్లాన్, దీపికా పదుకోన్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఫారెస్ట్ అడ్వెంచరస్ ఫిల్మ్గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘మహారాజా’, ‘మహారాజ్’, ‘చక్రవర్తి’ అనే టైటిల్స్ను పరిశీలిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. మరి.. ఫైనల్గా ఈ టైటిల్స్లో ఏదో ఒకటి ఫిక్స్ అవుతుందా? లేక మరొక టైటిల్ను మేకర్స్ ఖరారు చేస్తారా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. ఇక విజయేంద్రప్రసాద్ కథ అందించిన ఈ చిత్రానికి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతదర్శకుడు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది వేసవిలో ఆరంభమవుతుందని టాక్. -
రాజమౌళి- మహేశ్ సినిమా టైటిల్ ఇదేనా..?
టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు- రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న SSMB29 మరొకొద్ది రోజుల్లో సెట్స్పైకి వెళ్లనుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన కీలక వివరాలు గోప్యంగా ఉన్నప్పటికీ. కొన్ని సోషల్మీడియాలో వైరల్ అవుతుంటాయి. మహేష్ బాబును కొత్త అవతార్లో చూడాలని అభిమానులు భావిస్తున్నారు. అందుకు తగ్గట్లు తన పాత్ర కోసం కఠినమైన శిక్షణను మహేశ్ పొందుతున్నాడు. ఈ చిత్రం కోసం హాలీవుడ్ నటీనటులను రాజమౌళి తీసుకొస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇండోనేషియా నటి అయిన చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్తో పాటు థోర్ సినిమాతో పాపులర్ అయిన క్రిస్ హెమ్స్వర్త్ SSMB29 ప్రాజెక్ట్లో భాగం కానున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా మహేశ్ -రాజమౌళి సినిమాకు టైటిల్ ఫిక్స్ అయిందని వార్తలు వస్తున్నాయి. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'మహారాజా' అనే టైటిల్ను ఖరారు చేసినట్లు ఇండస్ట్రీలో ఒక వార్త వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఈ బిగ్ ప్రాజెక్ట్ను SSRMB అని రాజమౌళి సెట్ చేశారట. ఇలా మహేశ్ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే అనేక రూమర్స్తో ఎప్పుడూ ట్రెండింగ్లో ఉండటం విశేషం. SSMB29 రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ లాక్ చేయబడిందని ఈ ఏడాదిలో షూటింగ్ ప్రారంభం అవుతుందని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్తో యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్గా తెరెకెక్కుతున్న ఈ సినిమా కోసం మహేశ్ బాబు చాలా కష్టపడ్డాడు. జంగిల్ అడ్వెంచర్ ఫిలిం కావడంతో ఈ సినిమాను ఆఫ్రికా అడవుల్లో కూడా చిత్రీకరించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా కోసం ఆయన రెమ్యునరేషన్ తీసుకోకుండా ప్రాజెక్ట్లో భాగస్వామిగా ఉండబోతున్నారని సమాచారం. -
మహేశ్ సరసన ఇండోనేషియా బ్యూటీ
హీరో మహేశ్బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో అంతర్జాతీయ స్థాయిలో ఓ భారీ బడ్జెట్ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇండోనేషియా బ్యూటీ చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ ఓ హీరోయిన్గా నటిస్తారనే వార్త కొన్ని రోజులుగా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్త నిజమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో రాజమౌళిని ఫాలో అవుతున్నారు చెల్సియా. అలాగే మహేశ్బాబు– రాజమౌళి సినిమాల అప్డేట్స్ను ఇన్స్టాలో చెల్సియా ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తోంది. దాంతో మహేశ్కు జోడీగా చెల్సియా ఆల్మోస్ట్ కన్ఫార్మ్ అంటున్నారు ఫిల్మ్నగర్ వాసులు. కేఎల్ నారాయణ నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది వేసవిలో ప్రారంభం కానుందట. -
మహేశ్ సినిమా కోసం హాలీవుడ్ను దింపుతున్న జక్కన్న
టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు- రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న SSMB29 మరొకొద్ది రోజుల్లో సెట్స్పైకి వెళ్లనుంది. ఈ సినిమా కోసం కఠోరమైన శిక్షణ పొందుతున్నాడు మహేశ్. ఈ చిత్రానికి సంబంధించిన కీలక వివరాలు గోప్యంగా ఉన్నప్పటికీ.. ఈ చిత్రం కోసం అంతర్జాతీయ నటిని ఎంపిక చేసినట్లు పుకార్లు వస్తున్నాయి. మహేశ్ ప్రాజెక్ట్లోకి థోర్ ఆస్ట్రేలియాకు చెందిన 'క్రిస్ హెమ్స్వర్త్' SSMB29 ప్రాజెక్ట్లో భాగం కానున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ చిత్రాలలో ఆయన చాలా పాపులర్ యాక్టర్. ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల జాబితాలో ఆయన 31వ స్థానంలో ఉన్నారని ఫోర్బ్స్ గతంలో ప్రకటించింది.2011లో 'థోర్' చిత్రం ద్వారా ఆయనకు భారత్లో కూడా విపరీతమైన క్రేజ్ దక్కింది. ఆ తర్వాత ఎవెంజర్స్ ఫ్రాంచైజీస్, ట్రాన్స్ఫార్మర్స్ ,ఎక్స్ట్రాక్సన్,MIB వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. అలాంటి హీరోను SSMB29 ప్రాజెక్ట్లోకి రాజమౌళి తీసుకురానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఇదే నిజం అయితే మహేశ్ సినిమా హాలీవుడ్లో దుమ్మురేపడం ఖాయం అని చెప్పవచ్చు. SSMB29లో ఇండోనేషియా నటి? ఎస్ఎస్ రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. బాహుబలి ఫ్రాంచైజీతో పాటు RRR వరకు బ్యాక్-టు-బ్యాక్ హిట్లు కొట్టాడు. ఆర్ఆర్ఆర్ కోసం విదేశీ నటీనటులను ఆయన ఎంచుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మహేశ్కు జోడీగా ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని నిశితంగా పరిశీలిస్తే.. ఇన్స్టాగ్రామ్లో రాజమౌళిని ఆమె ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది. దీంతో ఆమె SSMB29 లో కీలక పాత్ర పోషిస్తుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే చెల్సియా ఇన్స్టాగ్రామ్లో మహేష్ బాబును అనుసరించడం లేదని గమనించాలి.కానీ బాలీవుడ్ హీరోయిన్లు అయిన దిశా పటానీ, దీపికా పదుకొణ్లను ఆమె ఫాలో అవుతుంది. SSMB29 రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ లాక్ చేయబడిందని ఈ ఏడాదిలో షూటింగ్ ప్రారంభం అవుతుందని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్తో యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్గా తెరెకెక్కుతున్న ఈ సినిమా కోసం మహేశ్ బాబు చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా కోసం ఆయన రెమ్యునరేషన్ తీసుకోకుండా ప్రాజెక్ట్లో భాగస్వామిగా ఉండబోతున్నారని సమాచారం. View this post on Instagram A post shared by Chelsea Elizabeth Islan (@chelseaislan) -
దర్శకధీరుడిపై మరోసారి ప్రశంసలు.. హాలీవుడ్ దిగ్గజం ఏమన్నారంటే?
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పారు. అంతే కాదు.. ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డ్ను గెలిచి మన గొప్పదనాన్ని మరింత పెంచారు. గతేడాది లాస్ ఎంజిల్స్ వేదికగా జరిగిన ఆస్కార్ వేడుకల్లో ఆర్ఆర్ఆర్ చిత్రానికి అవార్డ్ దక్కింది. ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాటకు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డ్ లభించింది. ఆస్కార్ అవార్డ్ రావడంతో తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. అదే సమయంలో హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ సైతం రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు. 2023లో జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల కార్యక్రమంలో కామెరూన్ను రాజమౌళి కలిశాడు. ఆ సమయంలో ఆర్ఆర్ఆర్ మూవీ గురించి అతడు ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. మూవీ అద్భుతంగా ఉందని కొనియాడారు. (ఇది చదవండి: 'మా నాన్నకు అలాంటి అవసరం లేదు'.. సూపర్ స్టార్ కూతురు ఆసక్తికర కామెంట్స్!) తాజాగా ఓ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న హాలీవుడ్ దిగ్గజం మరోసారి రాజమౌళిని పొగిడారు. ఈవెంట్లో ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఆర్ఆర్ఆర్ మూవీ అద్భుతంగా తెరకెక్కించారని.. ఇండియన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా తన ముద్ర వేయడం చాలా బాగుందన్నారు. కామెరూన్ మాట్లాడుతూ.. 'నిజంగా చాలా నిజాయతీగా అనిపించి ఈ విషయాన్ని చెప్పాను. అది చాలా అద్భుతమైన సినిమాగా అనిపించింది. ఇండియన్ సినిమా ప్రపంచ వేదిక స్థాయికి చేరడం చాలా గొప్పగా విషయం' అని అన్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను ఆర్ఆర్ఆర్ టీం తన ట్విటర్ ద్వారా పంచుకుంది. 'మీ అమూల్యమైన మాటలు ఎల్లప్పుడూ ఉత్తమంగా ఉండటానికి మాకు స్ఫూర్తినిస్తాయి. భారతీయ సినిమా అన్ని సరిహద్దులను బద్దలు కొట్టి మరింత ఎత్తుకు ఎదుగుతుందని మేము గట్టిగా నమ్ముతున్నాము.' అంటూ ట్వీట్ చేసింది. కాగా.. రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబుతో సినిమా తీసేందుకు రెడీ అవుతున్నారు. James Cameron.. 🤗 Your precious words always inspire us to strive better and be the best. We strongly believe Indian cinema is going to break all boundaries and grow to its fullest. ❤️ #RRRMovie pic.twitter.com/pzHjGQNZnC — RRR Movie (@RRRMovie) February 7, 2024 -
బ్యాక్ టు హోమ్
మహేశ్బాబు జర్మనీ నుంచి హైదరాబాద్ తిరిగొచ్చారు. హీరో మహేశ్బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాను కేఎల్ నారాయణ నిర్మించనున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఫిట్నెస్ ట్రైనింగ్, ఓ వర్క్షాప్లో భాగంగా మహేశ్ బాబు ఇటీవల జర్మనీ వెళ్లవారు. ఈ ఫిట్నెస్ ట్రైనింగ్ను పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్లోని స్వగృహానికి చేరుకున్నారాయన. కాగా ఈ సినిమాలో హీరో నాగార్జున ఓ కీలక పాత్రలో నటిస్తారనే ప్రచారం సాగుతోంది. వేసవిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమయ్యేలా రాజమౌళి ప్లాన్ చేశారని ఫిల్మ్నగర్ భోగట్టా. ఈ మూవీ గురించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.