breaking news
state commercial tax department
-
ఆత్మ‘హత్య’ ప్రకంపనలు!
ఐఏఎస్ రవి మృతిపై అట్టుడుకుతున్న కర్ణాటక ముమ్మాటికీ ఆత్మహత్య కాదంటున్న కుటుంబీకులు సీబీఐ విచారణకు డిమాండ్.. లేదంటే ఆత్మహత్య చేసుకుంటాం కేసు అప్పగించిన మరుసటిరోజే సీఐడీ అధికారిని మార్చిన రాష్ట్రం బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో ఐఏఎస్ అధికారి రవి అనుమానాస్పద మృతి ప్రకంపనలు సృష్టిస్తోంది. నిజాయితీ గల అధికారిని పొట్టనబెట్టుకున్నారని ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండగా.. రవిది ముమ్మాటికీ ఆత్మహత్య కాదని ఆయన కుటుంబీకులు స్పష్టంచేస్తున్నారు. రవి మృతిపై సీబీఐతో విచారణ జరిపించాల్సిందేనని, లేదంటే తామంతా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. అటు రాష్ట్ర అసెంబ్లీ వరుసగా రెండోరోజు కూడా దద్దరిల్లిపోయింది. రవి మరణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని విపక్షాలు పట్టుబట్టాయి. బుధవారం రవి తల్లిదండ్రులు గౌరమ్మ, కరియప్ప, సోదరుడు రమేశ్, సోదరి భారతి, మామ హనుమంతరాయప్ప అసెంబ్లీ ముందు ధర్నాకు దిగారు. ‘మాకు న్యాయం కావాలి. నా కొడుకు ఆత్మహత్య చేసుకోలేదు. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడికి నేను జన్మనివ్వలేదు. రవి ధైర్యవంతుడు. ఈ దేశం ముద్దుబిడ్డ’ అంటూ తల్లి గౌరమ్మ కన్నీరుమున్నీరయ్యారు. రవి మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని, లేదంటే మూకుమ్మడిగా ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. రవిది హత్యగా అనుమానిస్తున్నామని, దీని వెనుక రాజకీయ కారణాలు ఉండొచ్చని రమేశ్ అన్నారు. రవి మామ హనుమంతరాయప్ప మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఎస్ఏ నారాయణ స్వామిపై అనుమానం వ్యక్తంచేశారు. ‘ఆ ఎమ్మెల్యే ప్రభుత్వ భూమిని ఓ కంపెనీకి అమ్మారు. తర్వాత ప్రభుత్వం దాన్ని వెనక్కు తీసుకుంది. ఈ గొడవ హైకోర్టు వరకు కూడా వెళ్లింది’ అని చెప్పారు. రెండోరోజూ దద్దరిల్లిన అసెంబ్లీ.. రవి మృతిపై సీబీఐ విచారణ జరిపించాలన్న తమ డిమాండ్పై ప్రతిపక్షాలు పట్టువీడడం లేదు. మంగళవారం రాత్రంతా శాసనసభలోనే ధర్నా చేసిన ప్రతిపక్ష సభ్యులు.. బుధవారం సభ మొదలు కాగానే బీజేపీ, జేడీఎస్ వెల్లోకి దూసుకెళ్లి దుమారం సృష్టించారు. దీంతో సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. ఆ తర్వాత కూడా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సభను స్పీకర్ గురువారానికి వాయిదా వేశారు. ఇది సీబీఐకి ఇవ్వాల్సిన కేసు కాదని సీఎం సిద్ధరామయ్య అసెంబ్లీ బయట విలేకరులతో పేర్కొన్నారు. అనంతరం ఆయన రవి కుటుంబీకులను ఓదార్చారు. సీఐడీతో నిష్పాక్షికంగా దర్యాప్తు చేయిస్తానని హామీనిచ్చారు. అయితే కుటుంబీకులు వినకపోవడంతో.. సీబీఐ దర్యాప్తుపై నాలుగైదు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని హామీనిచ్చారు. కాగా, తనపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్యే నారాయణ స్వామి కొట్టిపడేశారు. తనకు ఏ కంపెనీతో సంబంధం లేదని, ఎవరినీ బెదిరించలేదన్నారు. కాగా, రవి మృతి కేసును సీఐడీకి అప్పగించిన మరుసటి రోజే ప్రభుత్వం ఆ విభాగం ఐజీపీ ప్రణబ్ మొహంతిని మార్చేసింది. ఆయనను కర్ణాటక లోకాయుక్త ఐజీపీగా నియమించింది. సీఐడీ ఐజీపీగా సీహెచ్ ప్రతాప్రెడ్డిని నియమించింది. ఈ మార్పులు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆన్లైన్ పిటిషన్పై ఐఏఎస్ల సంతకాలు రవి మృతిపై సీబీఐ విచారణ చేపట్టాలంటూ ఉత్తిష్ట భారత అనే ఎన్జీఓ చేపట్టిన ‘ఆన్లైన్ పిటిషన్’పై కర్ణాటకలోని పలువురు ఐఏఎస్లు సంతకాలు చేశారు. ఈ సంతకాలను ప్రధాని మోదీకి పంపనున్నారు. పలువురు ఐఏఎస్లతోపాటు 13.58 లక్షల మంది పౌరులు సంతకాలు చేసినట్టు సదరు సంస్థ తెలిపింది. మాఫియాకు హడల్ కలెక్టర్ డీకే రవి.. ఈ పేరు వింటే కోలార్ జిల్లాల్లో ఇసుక, భూమాఫియాలకు హడల్! కర్ణాటక కేడర్ 2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన రవి.. కోలార్ జిల్లా కలెక్టర్గా పనిచేసిన రోజుల్లో మాఫియా దందాలపై ఉక్కుపాదం మోపారు. ఎక్కడ గొడవ జరిగినా ప్రత్యక్షమై పేదల పక్షం వహించేవారు. ఎవరి ఒత్తిళ్లు, బెదిరింపులకు లొంగకుండా నిజాయితీగా విధులు నిర్వర్తించే అధికారిగా గుర్తింపు పొందారు. సెలవు రోజుల్లో.. సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసే పేద యువకులకు శిక్షణ ఇచ్చేవారు. ఆయన మృతి చెందారని తెలియగానే జిల్లాలో ప్రజలు స్కూళ్లు, కాలేజీలు మూసివేసి స్వచ్ఛందంగా బంద్ పాటించడం గమనార్హం. పెద్ద తలకాయలపై గురి నేపథ్యంలో.. కోలార్ జిల్లా నుంచి బెంగళూరు వాణిజ్య పన్నుల శాఖకు అడిషనల్ కమిషనర్గా వచ్చిన తర్వాతా రవి తన పంథాలోనే సాగారు. పన్ను ఎగవేతదారులకు చుక్కలు చూపించారు. బెంగళూరులో పన్నులు ఎగవేస్తున్న బడా సంస్థలపై గురిపెట్టిన నేపథ్యంలోనే రవి మరణించడం అనుమానాలకు తావిస్తోంది. నగరంలోని కొందరు పెద్ద డెవలపర్లపై ఉక్కుపాదం మోపేందుకు రవి సిద్ధమయ్యారని ఆర్టీఐ కార్యకర్త గణేశ్ కౌండిని తెలిపారు. అక్టోబర్లో వాణిజ్య పన్నుల శాఖకు వచ్చాక రవి పన్నులు ఎగవేసినహౌసింగ్ సొసైటీల నుంచి రూ.400 కోట్లు వసూలు చేశారని తెలిపారు. ‘గత గురువారం, శుక్రవారం రవితో ఫోన్లో మాట్లాడా. బెంగళూరులో పన్నులు ఎగవేసిన కొందరు బడా డెవలపర్లపై ఆయన దృష్టి సారించారు. అందుకు సంబంధించి కొన్ని ఆధారాలు అందించేందుకు నేనూ సిద్ధమయ్యా. ఈలోపే ఈ ఘటన చోటుచేసుకుంది’ అని చెప్పారు. దర్యాప్తు మొదలుకాక ముందే రవిది ఆత్మహత్య అని ప్రభుత్వం చెప్పడాన్ని గణేశ్ తప్పుపట్టారు. సీబీఐ విచారణ కావాలి రవి మృతిపై సీబీఐ దర్యాప్తు జరగాల్సిందేనని కేంద్ర న్యాయ మంత్రి సదానంద గౌడ డిమాండ్ చేశారు. ఈ మేరకు కర్ణాటక బీజేపీ ఎంపీలతో కలసి బుధవారం కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్కు విజ్ఞప్తి చేశారు. రవిది ఆత్మహత్యగా చిత్రీకరించి కేసును మూసేయాలని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని విలేకరులతో అన్నారు. సీఎంతో మాట్లాడి నివేదిక తెప్పించుకుంటానని రాజ్నాథ్ హామీ ఇచ్చినట్లు బెంగళూరు ఎంపీ, కేంద్రమంత్రి అనంత్ కుమార్ చెప్పారు. -
ఉభయ సభలను కుదిపేసిన 'రవి'
బెంగళూరు: అత్యంత ప్రతిభావంత ఐఏఎస్ అధికారిగా పేరుగడించిన రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ అదనపు కమిషనర్ డీ.కే రవి మరణం ఉభయ సభల్లో ప్రతిధ్వనించింది. ఆయన మరణానికి సంబంధించిన నిజాలు వెలికి తీయడానికి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని విపక్షాలు పట్టుబడ్డాయి. అయితే సీఐడీ దర్యాప్తునకు మాత్రం అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం చేసిన ప్రకటన పట్ల ఉభయ సభల సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సభా కార్యక్రమాలను ని ర్వహించడానికి వీలుకాక పోవడంతో స్పీకర్ కాగోడు తిమ్మ ప్ప, మండలి అధ్యక్షుడు శంకరమూర్తి సభలను నేటి (బుధవారం)కి వాయిదా వేశారు. అయితే సీబీఐ దర్యాప్తునకు అంగీకరించేంత వరకూ సభల నుంచి బ యటకు వెళ్లేదిలేదని ఉభయసభల్లోని విపక్ష సభ్యులు భీష్మించారు. మంగళవారం రాత్రి పొద్దుపోయేవరకూ అటు శాసనసభలో, ఇటు విధాన పరిషత్లో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ప్రతిపక్ష సభ్యులు నిరసనకు దిగారు. ముమ్మాటికీ హత్యే.. శాసనసభలో మంగళవారం సభా కార్యక్రమాలు మొదలైన వెంటనే విపక్షనాయకుడు జగదీష్శెట్టర్, స్పీకర్ కా గోడు తిమ్మప్ప అనుమతితో చర్చను ప్రారంభిస్తూ ‘ ఐ ఏఎస్ అధికారి అయిన డీ.కే రవి ఆత్మహత్య చేసుకునేం త పిరికివారు కాదు. విధుల్లో ఆయన నిబద్దతే ఇందుకు సాక్షి. అందువల్ల ఇది ముమ్మాటికీ హత్యే. ఈ హత్య వెనుక ఎవరున్నారో ప్రజలకు తెలియడానికి సీబీఐతో దర్యాప్తు జరిపించాలి.’ అని పట్టుబట్టారు. జేడీఎస్ నా యకుడు వై.ఎస్.వి దత్తా మాట్లాడుతూ... దుబాయ్ నుంచి మూడు రోజుల ముందు డీ.కే రవికు భూ మా ఫియా నుంచి బెదిరింపు ఫోన్కాల్స్ వచ్చాయన్న సమాచారం ఉందన్నారు. డీ.కే రవి చనిపోయిన రోజు మధ్యాహ్నం ముగ్గురు అపరిచిత వ్యక్తులు ఆయన ఫ్లాట్కు వెళ్లారన్నారు. అయితే వారు ఎవరనే విషయంపై స్పష్ట త లేదన్నారు. ఇలాంటి విషయాలన్నీ బయటకు రావాలంటే సీబీఐ ద్వారానే దర్యాప్తు జరిపించాలని పేర్కొన్నారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కలుగజేసుకుని ‘మన రాష్ట్రంలో కూడా ప్రతిభావంత పోలీస్ అధికారులు ఉన్నారు. అందువల్ల డీ.కే రవి మరణానికి సంబంధించి సీఐడీ చేత దర్యాప్తు జరిపించనున్నాం.’ అని పేర్కొన్నారు. దీంతో అధికార విపక్షాల మ ధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. స్పీకర్ కాగోడు తిమ్మప్ప పలుమార్లు సభను వాయిదా వేసి అధికార ,విపక్షాలతో మాట్లాడి సమస్యను పరిష్కారించడానికి ప్రయత్నిం చినా ఆయన చర్చలు ఫలించలేదు. డి.కె.రవి అనుమానాస్పద మృతికి సంబంధించిన కేసును సీబీఐ దర్యాప్తునకు అప్పగించేంతవరకూ శాసనసభ నుంచి బయటకు వెళ్లేది లేదని బీజేపీతోపాటు జేడీఎస్ నాయకులు భీ ష్మించారు. ఎవరినో రక్షించేందుకు సీబీఐ బదులు సీఐడీ కి ఈ కేసును అప్పగించడానికి ప్రభుత్వం ఆరాటపడుతోందని తీవ్ర విమర్శనలు చేస్తూ అక్కడే నిరసనకు దిగారు. రాత్రి పొద్దుపోయే వరకూ శాసనసభలో విపక్షాల నిరసన కొనసాగింది. ఇదిలా ఉండగా కవరేజీ కోసం వెళ్లిన మీడియాను అక్కడి నుంచి మార్షల్ బయటకు పంపించేశారు. ఓ మంత్రి ఒత్తిడే కారణం.. శాసనమండలిలో కూడా డీ.కే రవి మరణానికి సంబంధించి చర్చ అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదానికి కారణమైంది. సభాకార్యక్రమాలు మొదలైన వెంటనే ఈశ్వరప్ప మాట్లాడుతూ...రాష్ట్రంలో నిజాయితీగా పని చేసే అధికారులకు రక్షణ లేదన్నారు. ఇందుకు డీ.కే రవి ఉదంతమే ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రజాపనుల శాఖ మంత్రి మహదేవప్ప కలుగజేసుకోవడానికి ప్రయత్నించగా ఈ ఉదంతంలో మీ హస్తం ఏమైనా ఉందా? అని ఈశ్వరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా పోస్ట్మార్టం నివేదికకు ముందే డీ.కే రవి మరణాన్ని ఆత్మహత్యగా పేర్కొన్న నగర కమిషనర్ ఎం.ఎన్ రెడ్డిని సస్పెండ్ చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ఎమ్మెల్సీ సోమణ్ణ మాట్లాడుతూ...‘వివిధ రకాల వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న సిద్ధరామయ్య మంత్రి మండలిలోని ఓ మంత్రి ప్రభుత్వానికి రూ.42 కోట్లను పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంది. ఈ విషయం పై నివేదిక తయారు చేసిన డీ.కే రవి పై ఒత్తిడి తెచ్చిన ఆ మంత్రి తాను చెల్లించాల్సిన పన్నులను తగ్గిం చాలన్నారు. అయితే ఇందుకు రవి ఒప్పుకోక పోవడం తో ఇతర మార్గాల ద్వారా పన్నులను రూ.40 లక్షలుగా చూపించి ఆమేరకు చెల్లించారు. ఈ విషయంలో డీ.కే ర వికి బెదిరింపులు కూడా వచ్చాయి. ఈ విషయమై నిజా లు తేలాలంటే సీబీఐచేత దర్యాప్తు జరిపించాలి’ అని పేర్కొన్నారు. అక్కడే ఉన్న కే.జే జార్జ్ మాట్లాడుతూ... ‘వ్యక్తిగత కారణాలే డీ.కే రవి మరణానికి కారణమని ప్ర స్తుతం మా వద్ద ఆధారాలు ఉన్నాయి. సీఐడీ ద్వారా ద ర్యాప్తు జరిపించి పది రోజుల్లో ప్రాథమిక నివేదికను ఆ ధారాలతో సహా ఉభయ సభలకు అందజేస్తాను.’ అని పేర్కొన్నారు. ఇందుకు విపక్ష సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిం ది. సభను పలుమార్లు వాయిదా వేసి సభ్యుల మధ్య సంధానానికి ప్రయత్నించినా చర్చలు సఫలీకృతం కాకపోవడంతో అధ్యక్షుడు శంకరమూర్తి సైతం మండలిని బుధవారానికి వాయిదా వేశారు. దీంతో విధానపరిషత్లోని విపక్ష సభ్యులు సైతం నిరసనకు దిగారు.