ఒడిశా ప్రమాద ఘటనలో నలుగురి అరెస్ట్
భువనేశ్వర్: భువనేశ్వర్లోని ఎస్యూఎం ఆస్పత్రిలో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి సూపరింటెండెంట్ సహా నలుగురిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మరో నలుగురిని ఘటనకు బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేసినట్లు ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది. బాధితుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం అందిస్తామని యాజమాన్యం తెలిపింది. ప్రమాదంలో ఇప్పటిదాకా 22మంది చనిపోయినట్లు తెలిసింది. పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఒడిశా ముఖ్యమంత్రి న వీన్ పట్నాయక్, కేంద్ర మంత్రి ధ ర్మేంద్ర ప్రధాన్ తదితరులు పరామర్శించారు.